Monday, December 31

సూక్తులు - మహాత్ముని బంగారు పలుకులు

ఆత్మార్పణకు,స్వచ్చతకు నిలయం కానప్పుడు స్త్రీకి విలువ లేదు.హక్కులకు వాస్తవమైన మూలాధారం-కర్తవ్య నిర్వహణం.మనం మన కర్తవ్య నిర్వహణ చేసినట్లయితే హక్కులు పొందేందుకు ఎంతో దూరంలో ఉండము.మన విధులు నిర్వర్తించకుండా హక్కుల కోసం పరుగెత్తినట్లయితే అవి మనల్ని దాటి పోతాయి.మనం ఎంతగా వాటిని వెంబడిస్తే అవి అంత త్వరితంగా ఎగిరిపోతాయి.
మీరు పుస్తకాలు పఠించవచ్చు.కానీ అవి మిమ్మల్ని ఎక్కువ దూరం తీసుకెళ్ళలేవు.మీలోని ఉత్తమత్వాన్ని బయటికి తేవటమే నిజమైన విద్య అనిపించుకుంటుంది.మానవత్వం అనే పుస్తకం కంటే వేరొక ఉత్తమ గ్రంధం ఏమి ఉంటుంది.ప్రపంచం ఆధిపత్యం వహించిన పటిష్టవంతమైన శక్తి-ప్రేమ.మరియు అది వినయం గల కల్పనా రూపము.ప్రేమ ఎక్కడ ఉంటుందో,దేవుడు కూడా అక్కడే ఉంటాడు. [ఇంకా... ]

చిన్నపిల్లల కోసం - మంచి అలవాట్లు

మనిషికి మాటే అలంకారం.
మాట వెండి, మౌనం బంగారం.
గురువుల మాట వినాలి.
పరనింద పనికిరాదు.
తొందరపడి ఏ పనీ చేయరాదు.
ఆటలాడుచోట, అలుక పూనరాదు.
మంచిని మించిన గుణం లేదు.
ఆడిన మాట తప్పరాదు.
పెద్దలను గౌరవించాలి. [ఇంకా... ]

మీకు తెలుసా - వింత అలవాట్లు

పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి అంటారు. అంటే ఒకరి గుణం మరొకరికి ఉండదు. ఒకరికి నచ్చిన వంటకం మరొకరికి నచ్చదు. మరి కొందరిలో ఏదో ఓ వింత గుణం కనిపిస్తుంది. అది ఎదుటి వారికి విచిత్రంగా అనిపిస్తుంటుంది. అయినా వారు తమ అలవాట్లు మానుకోడానికి ఏమాత్రం ఇష్టపడరు. కొందరికి మాట్లాడుతూ అనవసరంగా నవ్వడం, మరికొందరికి ఊరికే ఉమ్ముతుండడం అలవాట్లుగా ఉంటే మరికొందరికి ఊరికే జుట్టు సవరించుకొవడంలాంటి అలవాట్లు ఉంటాయి. ఇంతవరకైతే పరవాలేదు. ఈ అలవాట్లు విపరీత ధోరణికొస్తేనే ప్రమాదం. [ఇంకా... ]

Saturday, December 29

మీకు తెలుసా - ఫొటోగ్రఫీ

ఆంగ్లంలో ఫొటోగ్రఫీ అనే మాటకు 'వెలుతురుతో రాయడం' అనే రెండు గ్రీకు పదాలు మూలమయ్యాయి. చాయా చిత్రానికి రెండు ప్రక్రియలు ఉన్నాయి. మొదటిది ప్రతిబింబాన్ని ఉత్పన్నం చేయడం, రెండవ ప్రక్రియలో ప్రతిబింబాన్ని నమోదు చేయడం. ఈ మొదటి ప్రక్రియ అనేక శతాబ్దాలకు ముందే అంటే ఈ చాయా చిత్ర గ్రహణాన్ని కనుగొనడానికి పూర్వమే మానవాళికి తెలిసింది. 1000, 1267 సం. ప్రాంతంలో అరబ్, ఖగోళ శాస్త్రవేత్తలు సూర్య గ్రహణాన్ని చూడడానికి కెమెరా ఆబ్‌స్క్యూరా అనే విచిత్రమైన ప్రభావాన్ని వాడుకున్నారు. నెమ్మదిగా ఈ కెమెరా ఆబ్‌స్క్యూరా సహాయంతో విభిన్న రీతులలో చిత్రలేఖకులు ప్రతిబింబాన్ని కల్పించుకోసాగారు. కాంతి సూక్ష్మగ్రాహక ద్రవ్యాలు కూడా ఫొటోగ్రఫీని కనుగొనడానికి ముఖ్యాధారమయ్యాయి. [ఇంకా... ]

నీతి కథలు - దేశసేవ

శౌరికి చిన్నతనం నుంచి దేశసేవ చేయాలని కోరిక, వాడు కూడలి దగ్గర పిల్లలకు దేశసేవ ఉపన్యాసాలు ఇచ్చేవాడు. 'స్వయంగా సంపాదించే మార్గం చూసుకో! నాతో పొలం పనులకు రా!' అంటూ వాడిని కోప్పడేవాడు తండ్రి.. అయితే శౌరికి తండ్రి స్వార్థపరుడిలా కనిపించాడు. ప్రతివాడు దేశం గురించి కూడా ఆలోచించాలి! స్వార్థం మానుకోవాలి! అనేవాడు. కొందరు ఊరి పెద్దలు 'ఇక్కడి మూర్ఖులకు నీ ఉపన్యాసాలు అర్థంకావు'. రాజధానికి వెళ్ళి రాజుగారిని కలుసుకో! అక్కడ నీ శ్రమకి గుర్తింపు లభిస్తుంది! అన్నారు. [ఇంకా... ]

పర్యాటకం - పవిత్ర త్రివేణి సంగమం ప్రయాగ

నదీ నగరికతకు పెట్టింది పేరు భారతదేశం."నది" అంటేనే భారతీయుల్లో ఒక గొప్ప భక్తిభావం ఉంది. అలాంటిది మూడు నదులు సంగమించే త్రివేణి సంగమానికి ఉండే పవిత్రత గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మరీ ముఖ్యంగా వేల సంవత్సరాల చరిత్ర కలిగిన నగరాలు, అధ్యాత్మిక క్షేత్రాలలో అలాంటి విశిష్ట వేడుకలు వచ్చినప్పుడు ఇంక లక్షలాది మంది ఆనందానికి అవధులు ఉండవు. పరమ పవిత్రమైన ప్రయాగ పేరు చెబితే తనువు, మనసు పులకించిపో తాయి. [ఇంకా... ]

Friday, December 28

అందరికోసం - హాస్య సంపద

మాష్టారు: వెయ్యిలోనుండి ఒకటి తీస్తే ఎంత సుశీలా ?
సుశీల:'మూడు సున్నాలు సార్'.

డాక్టర్:
మావారికి పిచ్చికుక్క కరిచింది. మీరు వెంటనే రావాలి.
ఆంది తాయారు కంగారుగా.
మీరేం గాభరా పడకండి నేవచ్చేదాకా మంచం మీదే
పడుకోబెట్టండి అన్నాడు డాక్టర్.
చీ--చీ-- పిచ్చికుక్కని మంచం మీదెలా పడుకోబెడతాం ఆంది తాయారు. [ఇంకా... ]

వ్యక్తిత్వ వికాసం - సంకల్ప శక్తి

ఒట్టు పెట్టటంలోనూ, క్షణమైనా గడవకముందే ఆ ఒట్టును తీసి గట్టుమీద పెట్టడం లోనూ మనం గొప్ప ప్రావిణ్యాన్ని సాధిచాం!! ఒట్టు పెట్టటం సులభమే కానీ దానిని నిలబెట్టుకోవడం చాలా కష్టం. భీష్ముడికి ఉన్నటువంటి సంకల్పశక్తి మనకు కావాలి. ఆయని జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిఙ్ఞ చేసి, దానిని శ్రద్దతో ఆచరించి చూపాడు. బలహీనమైన మనస్సు ఉండేవాల్లు ఏదోవక సాకు చెప్పడానికి చూస్తారు. మనస్సు చంచలమైనది, స్వాభావికంగా అశాంతిగా ఉంటుంది. ఎప్పుడూ ఊగిసలాడుతూ క్షణానికి ఒక ఆలోచన చేస్తుంది.  [ఇంకా... ]

మీకు తెలుసా - చీర కథ

చీర అంటే వస్త్రము. వాడుకలో స్త్రీలు మాత్రం కట్టుకునే బట్టకు పర్యాయపదంగా చీర వాడబడుతూంది. చరిత్రకు పూర్వం ఇండస్ వేలీ ప్రాతపు స్త్రీలు ప్రత్తి నూలుతో నేయబడిన బట్టలు ధరించేవారు. ప్రత్తి మరియు పట్టుబట్టల గురించి వేదాలలోను, రామాయణ, మహాభారత కథలలోనూ కూడా చెప్పబడింది. చంద్రగుప్తుని కాలంలో పాటలీపుత్రానికి వచ్చిన గ్రీకు రాయబారి మెగస్తనీసు భారత స్త్రీలు ధరించిన వస్త్రాలను గురించి "బంగారు జరీతో విలువైన రాళ్ళు పొదగబడినవి" అని వ్రాశాడు. ప్రాచీన కాలపు చిత్రాలలోను, రాతి విగ్రహాలలోను పలచని చీర మడతలు సూచించబడ్డాయి. [ఇంకా... ]

Thursday, December 27

మీకు తెలుసా - కలంకారీ అద్దకాలు

ఆంధ్ర ప్రదేశ్‌లోని ముఖ్యమైన పరిశ్రమలలో అద్దక పరిశ్రమ చాలా పురాతనమైనది. రాష్ట్రమంతటా వివిధ సాంకేతిక విధానాలను ఉపయోగించి స్థానిక సంప్రదాయానుగుణంగా ఇండిగో ప్రాసెస్ లేక రేసిస్టు స్టైల్, మార్డెంట్ లేక డైడ్ స్టైల్, మొదట చెప్పిన టై అండ్ డై స్టైల్ అని మూడు రకాలుగా ఉంది. గుడారాలకు ఉపయోగించే గుడ్డలపై లైనింగులు, గుమ్మాలకు, కిటికీలకు తెరలు, కిషన్ కవరింగులు మొదలైన వాటిపై అద్దకానికి మార్డెంట్ లేక డైడ్ స్టైల్ ఉపయోగిస్తారు. ఇండిగో రేసిస్ట్ స్టైల్‌నే కలంకారీ అద్దకం అంటారు. కలంకారీ అద్దకాలలో అందమైన అద్దకపు చీరలు, పడక దుప్పట్లు, కర్టెన్లు, బల్లగుడ్డలు అనేక అందమైన డిజైన్లలో లభిస్తున్నాయి. [ఇంకా... ]

సాహిత్యం - ప్రాచీన విద్య

ఆధునిక విద్యాలయాలు ఉన్నత చదువులకంటే ఉన్నతోద్యాగాల దిశగా మాత్రమే విద్య బోధిస్తున్న విషయం తేటతెల్లమైనదే. ముఖ్యంగా టెక్నికల్ విద్య ఈనాడు చూపిస్తున్న ప్రభావానికి ప్రభావితం కాని విద్యార్ధి లేడు. టెక్నికల్ విద్య మాత్రమే తెలివైన విద్య అనే భావన విద్యా వ్యవస్థలో వేళ్ళూనుకుపోవడంతో విద్యార్ధులు ఆ విద్యపట్ల ఎక్కువ మక్కువ చూపుతున్నారు. తల్లితండ్రులు కూడా తమ బిడ్డలను ఈ విద్యలపట్లే ఆసక్తి పెరిగేట్లు చిన్నతనంనుంచే బోధిస్తున్నారు. టెక్నికల్ విద్య ద్వారా విదేశాల్లో ఉద్యోగాలు తెచ్చుకోవచ్చనే ఆశ వారిని ఈ విద్యపట్ల ఆసక్తిని పెంపొందింపజేస్తోంది. [ఇంకా... ]

పిల్లల ఆటలు - గెస్ ది లాస్ట్ నెంబర్

ఎంతమంది ఆడవచ్చు : ఆరుగురు.
కావలసిన వస్తువు : న్యూస్ పేపర్లు (ఇంగ్లీషు).
పోటి సమయం : అవసరాన్ని బట్టి.
ఆటగాళ్ల వయస్సు : 6 నుండి 8 సం|| రాల మధ్య .
పిల్లలు దూరం నుంచి వాహనాలను చూసి దాని రిజిస్ట్రేషన్ నంబర్ చివర అంకె సరి సంఖ్యో, బేసి సంఖ్యో చెప్పగలగాలి.  [ఇంకా... ]

Wednesday, December 26

సాహిత్యం - తిట్టు కవిత్వం

లలిత కళలలో అత్యంత విశిష్టమైనది కవిత్వం. ఇది అనేక విధాలుగా రంజింపజేస్తుంది. ఆశుకవిత్వం, చిత్ర కవిత్వం, మధుర కవిత్వం, విస్తర కవిత్వం, శాస్త్ర కవిత్వం, తిట్టు కవిత్వం అను అనేక రూపాల్లో కవిత్వం చెప్పబడుతున్నది. వీటిలో తిట్టు కవిత్వం యొక్క స్థానం ప్రత్యేకమైనది. ఆదికవి వాల్మీకి వాక్కు నుంచి ఆవిర్భవించిన మొట్టమొదటి కవిత్వం తిట్టు కవిత్వం కవిత్వమంటే ఆశ్చర్యం కలగకమానదు.

"మానిషాద ప్రతిష్ఠాం త్వ, మగమ శ్శాశ్వతీ స్సమా:
యత్క్రౌచ మిథునా దేక, మవధీ: కామ మోహితం"  [ఇంకా... ]

నీతి కథలు - అనుభవించని ఐశ్వర్యం

కనకయ్య వొట్టి లోభి, ఎంతో ఐశ్వర్యం వుంది. అయినా తను తినేవాడు గాదు, ఒకరికి పెట్టేవాడు కాదు. కనకయ్య పీనాసి అని అందరికీ తెలుసు. అయినా ఊరిలోని వారు - ఏ కొంచెమైనా సహాయం చేయక పోతాడా? అని తరచుగా అతని వద్దకు వచ్చేవారు. సహాయం చేయమని కోరేవారు. కాని కనకయ్య వాళ్ళకు, ఏవేవో సాకులు చెప్పి పంపించేసే వాడు. గడ్డి పరక అంత సాయం కూడా చేసేవాడు గాదు.  [ఇంకా...]

సంస్కృతి, సంప్రదాయాలు - పురాణాలు & ఇతిహాసాలు

"పురాపినవం పురాణం" అన్నారు. అంటే ఎంత ప్రాచీనమైనదైనా కొత్తగా అనిపిస్తుందని దీని భావన. పురాణాలలో భారతీయ ఆత్మ ఉందంటారు. వేద ధర్మాలను ప్రచారం చేయడానికే పురాణాలు వెలువడ్డాయి.
రాణాలు ప్రాచీన విజ్ఞాన సంపుటాలు. ప్రప్రంచం పుట్టుక దగ్గర్నుంచి ప్రపంచంలో మానవుడు నడుచుకోవలసిన విధానందాకా ఎన్నెన్నో విషయాలను పురాణాలు మనకు వివరిస్తాయి. చరిత్ర, భౌగోళికం, పౌర విజ్ఞానం...ఒక్కటేమిటి? ప్రపంచంలో ఎన్ని విభాగాల విజ్ఞానముందో అన్నీ పురాణాలలో కనిపిస్తాయి. ఇక కథలైతే...భారతీయ సాహిత్యంలోని ప్రాచీన గ్రంధాలన్నిటికీ పురాణ గాధలే ఆధారం. [ఇంకా... ]

Monday, December 24

నాటికలు - కిడ్నాప్

{తెర తీయగానే విశాలమైన హాల్ ఉంటుంది. హాల్ మధ్యలో 4 కుర్చీలు, వాటి ముందు ఒక టీపాయ్, దాని మీద కొన్ని పత్రికలు, న్యూస్ పేపర్లు ఉంటాయి. రూంకి ఒక మూల స్టూల్ మీద మంచి నీళ్ళ కూజా ఉంటుంది. హాలుకి కుడి, ఎడమ ద్వారాలుంటాయిధ్ : (కుడి వైపు ద్వారం నుండి నీరసంగా ప్రవేశిస్తాడు. అతని మొహం అలసటగా, బాధగా ఉంటుంది. నీరసంగా వచ్చి ఒక చెయిర్‌లో కూర్చుంటాడు. జేబులోనుంచి కర్చీఫ్ తీసి మొహం తుడుచుకుంటాడు. సెల్ ఫోన్ తీసి ఏదో నంబర్ నొక్కుతాడు.) ఏంటీ, కనిపించలేదా? వాళ్ళ ఇంటికి రాలేదా? ఆ..ఆ.. సరే! సరే! (ఫోన్ జేబులో పెట్టుకుని బాధగా తల పట్టుకుంటాడు) [ఇంకా... ]

వంటలు - నిమ్మ ఉప్పుతో షర్బత్

కావలసిన వస్తువులు:
నిమ్మ ఉప్పు, పంచదార - 2 కప్పులు.
నీరు - 3/4 కప్పు.
మిఠాయి రంగు - 1 స్పూను.
ఎస్సెన్సు (ఏవైన) - 1 స్పూను.

తయారు చేసే విధానం:
ముందుగా 2 కప్పుల పంచదారకు ముప్పావు కప్పు నీరు పోసి తీగ పాకం పట్టాలి. టీ స్పూను నిమ్మ ఉప్పు వేరే గిన్నెలో నీళ్ళు కలిపి, లేతపాకంలో పోసి రెండు మూడు సార్లు కలియబెట్టి దించాలి.  [ఇంకా... ]

సాహిత్యం - నీతి పద్యాలు

తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు
తవిలి మృగ తృష్ణ లో నీరు త్రావ వచ్చు
తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు
చేరి మూర్ఖుని మనసు రంజింపరాదు!

చెలిమియు, పగయును, తెలివియు
కలకయు, ధర్మంబు, పాపగతియును, పెంపున్
తులువతనంబును వచ్చును
పలుకుబడిన కాన, పొసగ పలుకగ వలయున్! [ఇంకా... ]

Saturday, December 22

వంటలు - కొబ్బరి పాయసం

కావలసిన వస్తువులు:
కొబ్బరికాయ - ఒకటి.
బియ్యం - ఒక కప్పు.
పంచదార లేదా బెల్లం తురుము - రెండు కప్పులు.
యాలకులు - పది.
జీడిపప్పు - పది.
కిస్‌మిస్ - పది.
నెయ్యి - రెండు స్పూన్లు.

తయారు చేసే విధానం :
బియ్యం కడిగి నాలుగు గంటలు నానబెట్టాలి. తరవాత కొబ్బరితో కలిపి మెత్తగా పలుచగా దోసెల పిండిలా రుబ్బాలి. [ఇంకా... ]

నీతి కథలు - పిశాచాలు చేసిన సహాయము

అనగనగా అవంతీపురం సమీపములో గల గ్రామములో ఒక ముసలి అవ్వ, మనుమడు ఉన్నారు. అవ్వ అమాయకురాలు. ఇరుగు పొరుగు అవ్వకి మాయమాటలు చెప్పి ఉప్పు, పప్పు తీసుకువెళ్ళేవారు. అవ్వను సుఖపెడదామంటే అవ్వచేసే పనికి మనుమడికి కోపం వచ్చేది. పై పెచ్చు గుట్టుగా సంసారము చేయాలని తెలియదు అనేది. ఒక రోజున అవ్వ ఇల్లు ఊడుస్తూ ఉంటే చిన్న తాళము చెవి దొరికింది. అది తన మనుమడి పెట్టెదని తీసి పెట్టె తాళము తీసి పెట్టెలోపల డబ్బు చూసి అందరిని పిలిచి చెప్పింది. [ఇంకా... ]

వంటలు - క్యాప్సికమ్ బజ్జి

కావలసిన వస్తువులు:
కాప్సికమ్ - అర కేజి.
నూనె - పావు కేజి.
శనగపిండి - పావు కేజి.
మిరప్పొడి - ఒక స్పూను.
జీలకర్ర - ఒక స్పూను.
వంటసోడా - చిటికెడు.
ఉప్పు - తగినంత.

తయారు చేసే విధానం :
కాప్సికమ్‌లను కడిగిన తర్వాత చాకు తీసుకుని ఒక్కొక్క దాన్ని నాలుగైదు ముక్కలుగా నిలువుగా తరుక్కోవాలి.  [ఇంకా... ]

పొడుపు కథలు - అ నుంచి అః వరకు

అంతులేని చెట్టుకు అరవై కొమ్మలు, కొమ్మ కొమ్మకు కోటిపువ్వులు, అన్ని పువ్వుల్లో రెండేకాయలు?
ఆకాశం, చుక్కలు, సూర్యుడు
అందరాని వస్త్రంపై అన్నీ వడియాలు
నక్షత్రాలు
అంద చందాల వాడు రోజుకో ఆకారం చివరికి నిరాకారం లేదా నిండు సున్న
చందమామ
అక్కడిక్కడబండి, అంతరాలబండి మద్దూరి సంతలో మాయమైన బండి.
సూర్యుడు
అక్కాచెల్లెలి అనుబంధం - ఇరుగూ పొరుగూ సంబంధం దగ్గర వున్నా చేరువ కాలేరు.
కళ్ళు [ఇంకా... ]

Friday, December 21

వంటలు - ఎగ్ పరోటా

కావలసిన వస్తువులు:
గుడ్లు - 2.
ఉల్లిపాయ సన్నగా తరిగినది - 1.
టమోటా - 1.
పరోటా - 2.
మిర్చిపొడి - సరిపడినంత.
ఉప్పు - సరిపడినంత.
జీరా - సరిపడినంత.
మిరియాల పొడి - అర టీ స్పూను.
ధనియాల పొడి - అర టీ స్పూను.
పసుపు - పావు టీ స్పూను.
రిఫైండ్ ఆయిల్ - సరిపడినంత.
కొత్తిమీర తురుము - 1 రెమ్మ.

తయారు చేసే విధానం:
కడాయిలో నూనె వేడి చేసి జీరా, ఉల్లిపాయలు, టమోటాలు వరుసగా వేసి వేగనివ్వాలి.  [ ఇంకా...]

వంటలు - పొట్లకాయ పెరుగుపచ్చడి

కావలసిన వస్తువులు:
పొట్లకాయ (మీడియం సైజు) - 1.
పెరుగు - 100 గ్రా.
పచ్చిమిర్చి - 7.
కందిపప్పు - 1 టీ స్పూను.
మినపప్పు - 1 టీ స్పూను.
చింతపండు - కొద్దిగా.
ఉప్పు - సరిపడినంత.
పసుపు - అర టీ స్పూను.
జీలకర్ర - అర టీ స్పూను.
వెల్లుల్లి - 4 రెమ్మలు.
రిఫైండ్ ఆయిల్ - కొద్దిగా.
పోపు దినుసులు - కొద్దిగా.

తయారు చేసే విధానం :
పచ్చిమిర్చి, కందిపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిలను కళాయిలో దోరగా వేయించి చింతపండుతో సహా మిక్సీ వేయాలి.  [ ఇంకా...]

నీతి కథలు - తగని గర్వం

చీమలు దూరని చిట్టడవిలో ఓ సింహం ఉంటూ ఉండేది. సహజంగానే బలపరాక్రమాలున్న జంతువు. మంటకు గాలి తోడైనట్లు సింహానికి అంతులేని అహంకారము ఉంది. అడవిలో బ్రతికే తదితర మృగాలన్నిటి చేతా అడ్డమైన చాకిరీ చేయించేది. సింహం ఆడిందే ఆట, పాడిందే పాట. ఇలా ఉండగా చిట్టడవికి చెప్పలేనంత కరువొచ్చింది. ఆ కరువుకి తట్టుకోలేక మృగాలన్నీ తలో దోవా పారిపోయాయి. మృగాలకి రాజయితే మాత్రం సింహానికి తిండితిప్పలు ఎక్కడివి? బెట్టుగా అక్కడే కొన్నాళ్ళ పాటు నీల్గుతూ ఉంది. కాని, అది ఆఖరికి కాకులు దూరని కారడవికి ప్రయాణమై వెళ్ళింది.  [ ఇంకా...]

పర్యాటకం - సెవెన్ వండర్స్ - గ్రేట్ వాల్ ఆఫ్ చైనా

ప్రపంచ వ్యాప్తంగా శుభదినంగా భావించిన 07-07-07 నాడు ఏడు ప్రపంచ వింతలను అనధికారికంగా ప్రకటించారు. ఓటింగ్ ద్వారా జరిగిన ఎంపికలో పాతవాటిలో ఉన్న మన 'వాహ్ తాజ్ 'తో పాటు 'గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ', రోమన్ కలోసియంకు మళ్ళీ స్థానం దక్కింది. ఈ కొత్త ఏడు వింతలు ఇలా ఉన్నాయి.
గ్రేట్ వాల్ ఆఫ్ చైనా
పెట్రా(జోర్డాన్)
ద స్టాట్యూ ఆఫ్ క్రైస్ట్ రిడీమర్(బ్రెజిల్)   [ ఇంకా...]

Thursday, November 29

మీకు తెలుసా - గడ్డం - గత వైభవం

ప్రాచీన కాలపు బాబిలోన్‌లో గడ్డాలకు గొప్ప గౌరవం ఉండేది. నిజం చెప్పాలంటే అన్ని ప్రమాణాలూ గడ్డం సాక్షిగా జరిగేవి. మనిషి గడ్డాన్ని పట్టుకోవడం అన్నది క్రీ.పూ. 2వ సహస్రాబ్దిలో సన్నిహిత స్నేహానికి గుర్తుగా పరిగణింపబడేది. గడ్డాన్ని పట్టుకొని లాగడం అన్నది మొరటైన పనిగా మాత్రం కాదు అతి అవమానకరమైన పనిగా గుర్తింపబడేది. కొంతమంది గడ్డాన్ని వివేకపు చిహ్నంగా పరిగణిస్తారు. ప్రాచీన కాలపు ఈజిప్టువారి సంఘంలో గడ్డం ఒక హోదాను సూచించేది. గడ్డం ఎంత పొడవుగా ఉంటే వారు అంత గొప్ప హోదాకలవారిగా గుర్తింపబడేవారు.  [ ఇంకా...]

Wednesday, November 28

నీతి కథలు - తగిన శాస్తి

అనగనగా ఒక పెద్ద అడవి వుండేది. ఆ అడవిలో ఒక గుర్రం, గేదె వుండేవి. అవి పక్క పక్కనే మేస్తుండేవి. ఒకే సెలయేటిలో నీళ్ళూ కూడా తాగేవి. కానీ వాటికి ఏనాడు పడేదికాదు. ఎప్పుడూ పోట్లాడుకునేవి. . నేను గొప్పంటే నేను గొప్పని బడాయిలు పోయేవి. ఎప్పటిలానే ఒక రోజు ఆ రెండూ పోట్లాడుకున్నాయి. కోపం ఆపుకోలేని గేదె తన కొమ్ములతో గుర్రాన్ని బాగా పొడిచింది.  [ ఇంకా...]

ఆహార పోషణ - చక్కెర వ్యాధి-చేదు నిజాలు

ఎబెర్స్ పేపిరస్ (ఈజిప్టు, 1500 బి.సి.)లో చక్కెర వ్యాధి అనే మాట వాడబడింది. మన దేశపు సుప్రసిద్ధ వైద్యుడు శుశ్రుతుడు క్రీ.పూ. 400లో ఈ వ్యాధిని తేనె మూత్రంగా అభివర్ణించాడు. క్రీ.శ. ఆరంభమైన మొదటి శతాభ్దంలోనే ఈ వ్యాధి రోం, చైనా, జపాను భాషా గ్రంధాలలో నమోదై ఉంది. డయాబెటిస్ అన్న పదాన్ని తొలుత గ్రీకులు వాడారు. ఈ పదం నీళ్ళ ద్వారా విసర్జనం అన్న అర్ధాన్ని ఇస్తుంది. మూత్రాన్ని వేడిచేసి పరీక్షించి, ఆవిరి చేసి డాక్టర్ విల్లిస్ 1674లో అందులో జిగటలాంటి పదార్ధం ఉందని కనుగొన్నాడు. ఆ ఉన్న వస్తువు చక్కెరే. కానీ అప్పట్లో ఇంగ్లాండు వారికి చక్కెర విషయం తెలియదు.  [ ఇంకా...]

విజ్ఞానం - కల్తీలను కనిపెట్టండి

ఆహార వస్తువులను కల్తీ చేయడం నేరం. కల్తీ పదార్ధాలు ఆరోగ్యానికి హాని చేస్తాయి. ఖనిజ తైలంతో కల్తీ చేసిన ఆవ నూనును ఉపయోగించిన వ్యక్తికి కంటిదృష్టి పోవచ్చు లేక గుండె జబ్బు రావచ్చు. సున్నితమైన రంపపు పొట్టుతో కల్తీ చేసిన మిరపకాయల పొడి తిన్న వారికి ఆరోగ్యం చెడిపోతుంది. [ ఇంకా...]

నాటికలు - తెలుగు నాటక రంగం చరిత్ర

కావ్యాంత నాటకం" అన్నాడు మహాకవి కాళిదాసు. అంటే అన్ని కావ్య ప్రక్రియలలోనూ చివరిగా స్పర్శించవలసిన అంకం నాటకమని అర్ధం. కవిత్వం, వ్యాసం, కథ... ఇలా అన్ని సాహిత్య ప్రక్రియలను స్పృశించిన తరువాత మాత్రమే నాటకాన్ని రచించాలని ఆయన తెలిపాడు. అప్పుడు మాత్రమే నాటక రచనకు నిండుదనం చేకూరుతుందని ఆయన భావన.  [ ఇంకా...]

Tuesday, November 27

వ్యక్తిత్వ వికాసం - కల్పనా శక్తి (క్రియేటివిటీ)ని పెంచడమెలా?

మంచి ఆలోచనలు, కల్పనలు కేవలం పిల్లలకూ, రచయితలకూ, కళాకారులకే సొంతం కాదు. నిజం చెప్పాలంటే ఆలోచన, కల్పన అన్నది ప్రతి ఒక్కరి మేధాసంపత్తిపై ఆధారపడివుంటుంది. ఈ కల్పనాశక్తిని మనం మనకు అనుకూలమైన విధంగా, లాభాన్ని తెచ్చేవిధంగా మలచుకోవచ్చు. తన కల్పనాశక్తి ఆధారంగా పేరుప్రఖ్యాతులు గడించిన సోమర్సెట్ మాం ఒకసారి "కల్పనాశక్తి కసరత్తువల్ల అధికమవుతుంది. అందరూ అనుకుల్లట్లు కాకుండా యువకులలోకంటే అనుభవజ్ఞులైన వారిలోనే శక్తివంతమైన కల్పనలు, ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి" అన్నాడు. [ ఇంకా...]

Monday, November 26

వంటలు - చిక్కుడుకాయ కూర

కావలసిన వస్తువులు:
చిక్కుడు కాయలు : 1/2 కిలో.
నూనె : 6 స్పూన్లు.
ఉప్పు, కారం, పసుపు : తగినంత.
శనగపప్పు : 1 స్పూను.
మినపప్పు : 1 స్పూను.
కొత్తిమీర : 1 కట్ట.
కరివేపాకు : 2 రెబ్బలు.
ఆవాలు : 1/2 స్పూను.
పచ్చిమిర్చి : 4.
జీలకర్ర : 1 స్పూను.

తయారుచేసే విధానం:
చిక్కుడు కాయలు కడిగి ఈనలు తీసివేసి ముక్కలు చేసి పెట్టుకోవాలి, పొయ్యి మీద గిన్నె పెట్టి తాలింపు వేసి ఈ చిక్కుడు ముక్కలు వేసి, కారం, ఉప్పు వేసి కొంచం నీళ్ళు పోసి మగ్గే వరకు ఉంచి దించాలి. [ ఇంకా...]

మీకు తెలుసా - నోబెల్ బహుమతి నేపథ్య కథ

స్వీడెన్‌కు చెందిన నోబెల్ బహుమతి గురించి ప్రపంచమంతటికీ తెలుసు. 1833లో స్టాక్‌హోంలో జన్మించి, 1896 డిసెంబెర్ 10న శాన్‌రెమోలో మరణించిన ఆల్ఫ్రెడ్ నోబెల్ వీలునామాను అనుసరించి "ది నోబెల్ ఫౌండేషన్" స్థాపించబడింది. 1895లో నవంబర్ 27న వ్రాసిన వీలునామా ద్వారా ఆల్ఫ్రెడ్ నోబెల్ తన యావదాస్తిని 30 మిలియన్ క్రోనార్‌లకు మించినది (19.40 క్రోనార్లకు ఒక స్టెర్లింగ్ సమానం) ఒక నిధికి చట్టపూర్వకంగా వ్రాసి ఇచ్చారు. ఈ నిధిపై వచ్చే వడ్డీని అంతకుముందు సంవత్సరాలలో మానవాళికి అత్యంత ఉపయోగకరమైన సేవలందించిన వారికి ప్రతి సంవత్సరం చెల్లించాలని ఆ శాసనంలో వ్రాశారు. [ ఇంకా...]

విజ్ఞానం - మనోదక్షతకు మార్గాలు

తమ శక్తి సామర్ధ్యాలను పెంపొందించుకునేందుకు క్రీడాకారులు నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. శారీరకంగా ఎంతో దృఢంగా తయారవుతూ మరిన్ని ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నారు. ప్రతి మనిషీ ఏ రంగంలో ఉనా మానసికంగా కూడా అటువంటి శక్తి సామర్ధ్యాలను సంపాదించుకోవచ్చు. మానసికి శక్తి సామర్ధ్యాలను విస్తృతపరుచుకుంటే సావధానత పెరుగుతుంది. దానివల్ల కష్టాలను ధైర్యంగా ఎదుర్కొనే చతురత ఏర్పడుతుంది. అంతేకాకుండా ఒక ఉన్నతిని సాధించవచ్చు. అనేకమైన లాభాలను పొందవచ్చు. [ ఇంకా...]

నాటికలు - బాబోయ్ కవి

అంజి: (బస్కీలు తీస్తూ) : 95, 96, 97, 98, 99, 100 ...(అని బస్కీలు తీసి, అక్కణ్ణుంచి లేచి, రూంకి ఒక మూల పడేసున్న స్కిప్పింగ్ రోప్‌ని తీసుకుని కాసేపు స్కిప్పింగ్ చేసి, తాడుని దూరంగా విసిరేసి, చైర్ మీద ఆరేసున్న టవల్‌ని తీసుకుని మొహం తుడుచుకుని, క్రింద చాప మీద పడుకున్న మూర్తిని నిద్ర లేపుతూ) మూర్తీ! లేరా! (తట్టి) రేయ్ మూర్తీ! నిద్ర లేవరా! టైం ఎనిమిది దాటింది లే! లే! [ ఇంకా...]

Saturday, November 24

నీతి కథలు - అబద్దం తెచ్చిన అనర్థం

జగన్నాధం, శారదాదేవి దంపతుల ఏకైక కుమారుడు వాసు. వాసు కొంటెకుర్రవాడు. అల్లరి చిల్లర పనులు చేస్తే స్కూలుకి డుమ్మాలు కొట్టేవాడు.తల్లిదండ్రులకు ఇవన్నీ తెలిసేవికావు. ఒకరోజు వాసు స్కూలుకి ఎగనామంబెట్టి ఒక సైకిలు అద్దెకు తీసుకొని తిరుగుతూ ఉన్నాడు. అనుకోకుండా సైకిలు ఒక రాయికి గుద్దుకొని సైకిలు కిందపడి వాసుకి సైకిలు బ్రేక్స్ గుచ్చుకొని రక్తం కారుతుంది. [ ఇంకా...]

అందరి కోసం - అంత్యాక్షరికి ఉపయోగపడే పల్లవులు

రామచిలకమ్మా కొమ్మల్లో దాగిపోకమ్మా వాన చినుకమ్మ మబ్బులో ఆగిపోకమ్మా
చెంతే ఉన్న సొంతం కాని పాలరాతి బొమ్మా ఏంచేయాలే జంటే ఉన్న బ్రహ్మచారి జన్మ
చెప్పమ్మా చిన్నారి, చూపమ్మా నాదారి రామచిలకమ్మా.
[ ఇంకా...]

వ్యక్తిత్వ వికాసం - మృత్యువుకు భయపడవద్దు

ఒక చెట్టునుంచి రాలే ఆకు మృత్యువుకి భయపడుతుందా? ఒక పక్షి మృత్యువుకు భయపడుతూ జీవిస్తుందని అనుకుంటున్నావా? మృత్యువు ఎప్పుడు వస్తే అప్పుడు దానిని అది కలుసుకుంటుంది. అంతేగాని మృత్యువును గురించి ఆందోళన చెందదు. కీటకాలను పట్టుకు తింటూ, గూళ్ళు నిర్మించుకుంటూ, పాటలు పాడుకుంటూ, నిశ్చింతగా జీవించడానికి కుతూహలపడుతుంది. [ ఇంకా...]

మీకు తెలుసా - దువ్వెన కథ

దువ్వెన జటిలమైన యంత్ర పరికరం కాకపోయినప్పటికీ అది ఏమిటో మనిషికి తెలియని రోజులు ఉండేవి. పురాతన ఈజిప్టులోని మనుషులు తమ కేశాలను మందు నీరు, తైలాలు, సుగంధ్ వస్తువులతో జాగ్రత్తగా సంస్కరించుకునేవారు. వారి జుట్టుని ఒక రకమైన ముళ్ళతో ఉన్న పుల్లలతోను, చేపల అస్థిపంజరాలతో దువ్వుకునేవారు. [ ఇంకా...]

Friday, November 23

పిల్లల ఆటల సూచిక - సెన్సిబుల్ గేమ్

ఎంతమంది ఆడవచ్చు : ఎంతమందైనా.
ఆడే స్థలం : గదిలో, ఆరుబయట ఆడవచ్చు.
కావలసిన వస్తువులు : కాఫీ పొడి, రెండు రకాల పళ్ళముక్కలు , టీ పొడి, మట్టి, సబ్బుబిళ్ళ, ఇంకు, నిమ్మ ఆకులు, ప్లాస్టిక్, చెక్క , ఈకలు, పెన్ను, ఏనుగు బొమ్మ, కళ్ళజోడు.
ఆటగాళ్ల వయస్సు : 6 సం రాల నుండి.
ఈ ఆట ఆడటానికి మనిషి కుండే సెన్సెస్-రుచి , వాసన, స్పర్శ లని ఉపయోగించాలి . ఆటలో పాల్గొనేవారి కళ్ళకి గంతలు కట్టాలి.
[ ఇంకా...]

ఆధ్యాత్మికం - సన్మార్గ జీవితం

మన మనస్సు, మాట, ప్రవర్తన నిష్కల్మషంగా ఉండాలంటే ఒకటే మార్గం. ఎప్పుడూ సదాలోచనలతో, సత్కార్యాలు చేస్తూండాలి. సమర్ధ రామదాసు, తులసీదాసు, అప్పయ్య దీక్షితారు, తాయుమానపర్, పట్టినత్తార్ మొదలైన భక్తులు, తేవారం మొదలైన వాటిని రచించిన అందరూ భగవంతుని భక్తులుగా ఉంటూ మనసులోగానీ, చేతల్లోగానీ, ప్రవర్తనలోగానీ ఏనాడూ ఎట్టి పాపం ఆచరించలేదు. [ ఇంకా...]

Thursday, November 22

స్త్రీల పాటలు - సీతాదేవి పెండ్లి పాట

సీతాకళ్యాణ మహోత్సవ సమయము చూతము రారెచెలీ
రాతి నాతిగ చేసి ఘోరాసుర వర్గమునెల్ల దునిమి
భూమిజచేకొని జనకసుత ప్రఖ్యాతిగ వరించినాడట ...సీతా...

బంగారు మంటపాంతరమున నవరత్న శృంగార పీఠమందు
రంగుగ చేమంతి విరుల రంగుదండలు కాంతివైనుప్పొంగి
తొంగిచూచుటకు రఘుపుంగవుండు వేంచేసి వేడిన ...సీతా... [ ఇంకా...]

వ్యక్తిత్వ వికాసం - వృద్ధ తరంగం - విశేషాలు

60 లేదా 60 సంవత్సరాలకు మించిన వ్యక్తులను ఐక్యరాజ్య సమితి జనాభా విభాగం వారు వయసుమళ్ళిన వారిగా భావిస్తున్నారు. ప్రపంచంలోని ప్రతి 10 మందిలో ఒక వ్యక్తి 60 లేదా అంతకు మించిన వయసు కలిగివున్నారు. 2050 నాటికి మన జనాభాలోని 27 శాతం, 80 లేక అంతకుమించిన వారితో కూడివుంటుంది. వయసు మళ్ళిన వారిలో అధిక సంఖ్యాకులు ఆడవారు. 80 అంతకు మించి వయసున్న వారికో ఆడవారి శాతం 65. [ ఇంకా...]

మీకు తెలుసా - స్టెతస్కోప్

వైద్యులు గుండె, ఊపిరితిత్తులు, ఉదరం లాంటి అవయవాల చప్పుడు విని పరీక్షించడానికి వాడే స్టెతస్కోప్ ఒక పరికరం. దానిని రెని థియోఫిల్ హయసింత్ లేనెక్ అనే ఫ్రెంచ్ వైద్యుడు 1819లో కనుగొన్నాడు. 1781 నుండి 1826 వరకు జీవించిన లేనెక్ ప్రతిభాశాలియైన కల్పనాచరుతుడే కాక అనుభవశాలియైన వైద్యుడు కూడా. 1816లో అతను ఒక యువతిని పరీక్షించసాగాడు. [ ఇంకా...]

Wednesday, November 21

మీకు తెలుసా - కాఫీ

కాఫీ మొక్క గింజల నుండి తయారుచేయబడే వేడి పానీయం. కాఫీ దాక్షిణాత్యులకు అత్యంత ప్రియమైన పానీయం. మొత్తం ప్రపంచంలో కాఫీని అతి ఎక్కువగా వాడే దేశాలలో ఒకటిగా మన దేశం గుర్తింపబడుతోంది. ప్రాధమికంగా ఇది పాశ్చాత్యుల పానీయం. గ్రీన్ కాఫీ అన్నది ఒక ప్రత్యేక రకము. దీన్ని చాలామంది అమెరికన్లు ఇష్టపడతారు. 13వ శతాబ్దంలో కాఫీ గింజల నుండీ రుచికరమైన పానీయాన్ని అరబ్బులు తొలిసారిగా తయారుచేశారు. [ ఇంకా...]

విజ్ఞానం - ప్రణాళిక

మన రోజువారీ కార్యకలాపాలలో ప్రణాళిక అన్నది చాలా ముఖ్యమైనది. దీనికి మొదటి స్థానం ఇవ్వాలి. మనం చాలా ముందుగానే ప్రణాళికను తయారుచేసుకోవాలి. ముఖ్యంగా మన కోరికలను, లక్ష్యాలను సాధించాలనుకున్నప్పుడు బాగా ముందుగానే ప్రణాళికను తయారుచేసుకోవాలి. మన భవిష్యత్తును తీర్చిదెద్దుకోవడానికి ప్రణాళిక అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. [ ఇంకా...]

Tuesday, November 20

ఆధ్యాత్మికం - గురునానక్

గొప్ప సంఘసంస్కర్తగా, మత గురువుగా ప్రసిద్ధిని పొందిన గురునానక్ 15వ శతాబ్దానికి చెందిన అతి విశిష్టమైన వ్యక్తి. ఇతడు పవిత్రతనూ, న్యాయాన్నీ, మంచితనం, భగవత్ ప్రేమలాంటి విషయాలను గురించి ప్రజలకు ఉపదేశం ఇచ్చాడు. లాహోర్ (ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్న నగరం)కు సమీపంలో ఉన్న తల్వండి రాయె భోయిలోని ఖత్రీల కుటుంబంలో గురునానక్ 1469 ఏప్రిల్ 15వ తారీఖున పౌర్ణమి రోజున జన్మించాడు. [ ఇంకా...]

విజ్ఞానం - వ్యక్తిత్వ వికాసం

వ్యక్తిత్వం మనిషికి ఆభరణం లాంటిది. వ్యక్తిత్వం లేకపోతే మనిషి ఇతరులపై ఆధారపడవలసి వుంటుంది. ఇతరులపై ఆధారపడ్డప్పుడు మనిషికి గౌరవం వుండదు. గౌరవం లేని వ్యక్తి జీవితం దుఃఖమయమవుతుంది. దుఃఖం మనిషిని జీవితాంతం మానసికంగాను, శారీరకంగానూ కృంగదీస్తుంది. అందువల్ల వ్యక్తిత్వానికి అంత ప్రాముఖ్యత వుంది మరి. ప్రతి మనిషి తనదంటూ ఒక విశిష్టమైన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలి. వ్యక్తిత్వం వల్లనే మానవుడు మహనీయుడు కాగలడు. [ ఇంకా...]

సంగీతం - ముత్తుస్వామి దీక్షితర్

కర్ణాతక సంగీతత్రయంలో ఒకరైన వాగ్గేయకారుడు ముత్తుస్వామి దీక్షితర్ 1775లో పుట్టాడు. రామ స్వామి దీక్షితర్, సుబ్బలక్ష్మి అంబాళ్ పుణ్యదంపతుల సంతానంగా వీరు పుట్టారు. భక్తిశ్రద్ధలుగల వ్యక్తి గుణగణాలను తన బాల్యంలోనే ఇతడు ప్రదర్శించాడు. తన తండ్రి వద్ద తెలుగు, సంస్కృతంతో పాటు శాస్త్రీయ సంగీతాన్ని కూడా ఈయన అభ్యసించాడు. [ ఇంకా...]

అందరికోసం - హాస్య సంపద

కొత్త కుక్క
రాము : ఓరే గోపీ మా యింటికి రారా.
మా కొత్త కుక్క పిల్లను చూద్దువుగాని
గోపి : అమ్మో! అది కరవదా?
రాము : ఆ విషయం తెలుసుకోవడానికే నిన్ను పిలుస్తున్నది.
గోపి : ????? [ ఇంకా
...]

సాహిత్యం - భాష - ఉత్పత్తి

మానవ జీవితం సుఖ దుఖాల సమ్మేళనం. తనలో సంఘర్షణలను రేకెత్తిస్తున్న భావాలను, తన కష్ట సుఖాలను సాటి మానవుడితో పంచుకోవడానికి ఆది మానవుడు సంజ్ఞలు (Gestures) చేసేవాడు. వాటి ద్వారా ఒకరినొకరు సమాచారాన్ని పరస్పరం వ్యక్తపరుచుకునేవారు. ముఖ వికాసం వలన సుఖాన్ని, ముఖ వికారం వలన దుఖాన్ని బహిర్గతం చేసుకునేవారు. అట్లేగాక కొన్ని ధ్వనుల ద్వారా కూడా అంతరంగాన్ని వెల్లడించుకునేవారు. అంటే అభిప్రాయాన్ని వ్యక్తపరచే ఒక సాధనం భాష అన్నమాట. [ ఇంకా...]

Monday, November 19

విజ్ఞానం - మన ఆంధ్రప్రదేశ్

భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఒక ప్రకాశవంతమగు అధ్యాయము. భారతదేశపు భాగ్యవిధాతగా, అన్నపూర్ణగా వాసికెక్కిన రాష్ట్రం మనది. ఎందరో మహానుభావుల త్యాగఫలంగా సంపాదించుకొన్న తొలిభాషా రాష్ట్రం మనది. అంతకు ముందు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కలిసి ఉండేది. క్రీ శే పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణంతో ఏర్పడ్డ మన రాష్ట్రం అనతి కాలంలోనే సర్వతోముఖాభివృద్ధి చెందింది. త్రిలింగ భూమిగా పేరు గాంచిన తెలుగునేలే నేటి ఆంధ్రప్రదేశ్‌గా రూపొంది విరాజిల్లుతోంది. [ ఇంకా...]

వంటలు - కట్‌లెట్

కావలసిన వస్తువులు:
ఉడికించి చితిపిన ఆలుగడ్డ - 2 కప్పులు.
పెసర మొలకలు - 1 కప్పు.
పచ్చిమిరపకాయలు - 2 (సన్నగా తరగాలి).
అల్లం - చిన్న ముక్క (సన్నగా తరగాలి).
గరం మసాలా - 1/2 చెంచా.
తరిగిన క్యారెట్ - 2 గరిటెలు.
బ్రెడ్డు - 2 స్లైసులు
నెయ్యి లేదా నూనె - వేయించడానికి సరిపడినంత.
ఉప్పు - తగినంత.

తయారు చేసే విధానం:
క్యారెట్ ఉడికించి సన్నగా ముక్కలు తరిగి కాస్త మెత్తగయ్యేలా చితపాలి. [ ఇంకా...]

వంటలు - అల్లం కొత్తిమీర వంకాయ కూర

కావలసిన వస్తువులు:
వంకాయలు - 10.
పచ్చిమిర్చి - 30 గ్రా.
అల్లం పేస్ట్ - 20 గ్రా.
ఉల్లిపాయలు (తరిగి) - తగినన్ని.
కొత్తిమీర - 2 కట్టలు.
జీరా - 10 గ్రా.
రిఫైండ్ ఆయిల్ - సరిపడినంత.

తయారుచేసే విధానం:
ముందుగా పచ్చిమిర్చి, అల్లం, జీరా, కొత్తిమీర మిశ్రమాన్ని రుబ్బి పేస్ట్ తయారుచేసుకోవాలి.
[ ఇంకా...]

నీతి కథలు -పులి మీసం

ఒక అడవి దగ్గరలో ఒక మహిళ ఉండేది. ఆవిడ పేరు ధర్మావతి. ఆమె వుంటున్న ఊరికి ఒక ఋషి వచ్చాడు. చాలామంది ఋషి వద్దకు వెళ్ళి సలహాలు పొదుతున్నారు. ఈ సంగతి ధర్మావతి కూడా విన్నది. ధర్మావతి కొన్ని కష్టాలు వున్నాయి. ఆ ఋషి దగ్గరకు వెళ్ళి సలహా తీసుకోవాలి. ఆయన దగ్గర కొన్ని శక్తులు కూడా వున్నాయి. పొరుగువారు చెప్పగా విన్నది. [ ఇంకా...]

పిల్లల పాటలు - ఆడుకుందాం రారండి

పిల్లల్లారా రారండి
పిడికెడు బియ్యం తెండి
ఆడుకుందాం రారండి
అట్టుముక్కలు తెండి [ ఇంకా
...]

Saturday, November 17

పిల్లల పాటలు - వేసవి సంబరాలు

సైకిల్ స్కూటీ సంబరము
ఆటో మోటార్ సంబరము
జీపులు బస్సుల సంబరము
చికుబుకు రైలు సంబరము
కోటల తోటల సంబరము
కొండలు కోనల సంబరము [ ఇంకా...]

వంటలు - మినప పొట్టుతో వడియాలు

కావలసిన వస్తువులు:
మినపప్పు - 1 కప్పు.
మినపొట్టు - 4 కప్పులు.
ఇంగువ - కొద్దిగా.(ఇష్టమైతేనే).
ఉప్పు - తగినంత.
పచ్చిమిరపకాయలు - పది.

తయారు చేసే విధానం :
ముందుగా మినపప్పుని మెత్తగా రుబ్బాలి. తరవాత పొట్టు, ఉప్పు, పచ్చిమిర్చి, ఇంగువ వేసి కొద్దిగా నీళ్లు పోసి రుబ్బాలి(మరీ మెత్తగా వద్దు). మినప వడియాల మాదిరిగానే ప్లాస్టిక్ కవర్‌మీద సరిపడా సైజులో పెట్టుకోవాలి. [ ఇంకా...]

వంటలు - మాల్‌పురా

కావలసిన వస్తువులు:
పేమిరవ్వ లేదా బొంబాయి రవ్వ - 1 కప్పు.
మైదా - 1 కప్పు.
పాలు - 4కప్పులు.
పంచదార - 1 1/2 కప్పులు.
మంచినీళ్లు - 1 కప్పు.
ఎసెన్స్ - 3చుక్కలు.
బాదం, పిస్తాపప్పు - కొద్దిగా.
నూనె - వేయించడానికి సరిపడా.

తయారు చేసే విధానం:
మైదా, బొంబాయి రవ్వల్ని బాగా కలిపి అందులో పాలు పోసి పూరీ పిండిలా కలపాలి. ఈ పిండిముద్దను ఫ్రిజ్‌లోగానీ తడిబట్ట కప్పిగానీ పది నిమిషాలు ఉంచాలి. [ ఇంకా...]

నీతి కథలు - ధర్మబుద్ధి

పూర్వము రంగాపురం అనే గ్రామములో ధర్మయ్య అనే ఆసామి కలడు. ఆయన భార్య సుమలత. వారిద్దరూ ధర్మబుద్ధిగలవారు. పాపభీతి, దైవభక్తిగలవారు. వారు వ్యాపారము లో బాగా సంపాయించటమేగాక దాన ధర్మాలు చేయటంలో కూడా కీర్తి ప్రతిష్ఠలు గడించారు. పేదలకు భోజనము పెట్టందే తినేవారుకాదు. ధర్మయ్య, సుమలత దంపతులకు ముగ్గురు కుమారులు కలిగి యుక్తవయసుకి వచ్చారు. [ ఇంకా...]

Friday, November 16

పిల్లల పాటలు - బడి గంట మోగింది

బడి గంటదిగో బడి గంటదిగో
గణగణమోగెను బడిగంటదిగో
పలకా బలపం చేతను పట్టి
పుస్తకాల సంచి మూపునబెట్టి
పరుగున పోవాలి బడికి
వడిగా పోవాలి బడికి [ ఇంకా
...]

నీతి కథలు - శ్రధ్ధ లోపించిన పూజ

ఒక ఊరిలో ఒక ధనికుడు నివసించుచుండెను. అతనికి ఆస్తిపాస్తులు కొల్లలుగా గలవు. వ్యాపారము, వ్యవసాయము రెండింటియందును అతడు ధనమును బాగుగా గడించి శ్రీమంతుడయ్యను.
రెండు మూడు పెద్ద భవనములు కూడ అతనికి కలవు. అతని ఇంటిలో ఎందరో పరిచారికులు, సేద్యగాళ్ళు, గుమస్తాలు పనిచేయుచుందురు. ఒకనాడా ధనికునకు సత్యనారాయణవ్రతము చేయవలెనని సంకల్పము కలిగినది. [ ఇంకా...]

కాలచక్రం - కాలగణనం

ప్రాచీన శాస్త్రవేత్తల కాలగణనం
1 క్రాంతి = 1 సెకెండులోని 34,000లో భాగం
1 త్రుటి = 1 సెకెండులో 300వ వంతు
1 త్రుటి = 1 లవము, లేశము
2 లవములు = 1 క్షణం
30 క్షణములు = 1 విపలం
60 విపలములు = 1 పలం
60 పలములు = 1 చడి (సుమారు 24 నిమిషాలు) [ ఇంకా
...]

Thursday, November 15

వంటలు - బ్రెడ్ పకోడి

కావలసిన వస్తువులు:
శనగపిండి - 1 కప్పు.
జొన్నపిండి - 1 కప్పు.
బఠాణీ పిండి - అర కప్పు.
మజ్జిగ - 1 కప్పు.
బ్రెడ్ - 6 స్లైసులు.
ఉల్లి (తురుము) - 3 పాయలు.
మిర్చి, అల్లం పేస్టు - 2 టీ స్పూనులు.
కొత్తిమీర - 1 కట్ట.
ఉప్పు - సరిపడినంత.
రిఫైండ్ ఆయిల్ - సరిపడినంత.

తయారు చేసే విధానం :
గిన్నెలో శనగపిండి, జొన్నపిండి, ఉల్లి తురుము, అల్లం, మిర్చి పేస్టు, బఠాణీ పిండి, ఉప్పుల మిశ్రమాన్ని సరిపడినన్ని నీళ్ళతో కలిపి జారుగా చేసుకోవాలి. [ ఇంకా
...]

వంటలు - స్వీట్ కార్న్ పుడ్డింగ్

కావలసిన వస్తువులు:
కండెన్స్‌డ్ మిల్క్ - 1/4 టిన్.
బేకింగ్ పౌడర్ - 1 స్పూను.
మైదా - 150 గ్రా.
సోడా బై కార్బనైటు - 1/4 స్పూను.
వెన్న - 5 స్పూన్లు.
పాలు - 1 కప్పు .
వెనీలా ఎస్సెన్సు - 1/2 స్పూను.
పసుపు మిఠాయిరంగు - 1/4 స్పూను.

తయారు చేసే విధానం:
ముందుగా వెన్న కరిగించి, కండెన్స్‌డ్ మిల్క్, ఎస్సెన్సు, పసుపు మిఠాయి రంగు కలిపి బాగా గిలక్కొట్టాలి. [ ఇంకా
...]

పిల్లల పాటలు - అందరం సోదరులం

మతమన్నది గాంధీజీ హితమైతే
మతమన్నది లోకానికి హితమైతే
హిందువులం ముస్లిములం
అందరమూ మానవులం అందరమూ సోదరులం [ ఇంకా
...]

Wednesday, November 14

పిల్లల పాటలు - బుజ్జి మేక

బుజ్జి మేక బుజ్జి మేక ఏడకెల్తివీ?
రాజు గారి తోటలోన మేత కెల్తినీ.
రాజు గారి తోటలోన ఏమి చూస్తివీ?
రాణి గారి పూలచెట్ల సొగసు చూస్తినీ!
పూలచెట్లు చూసి నీవు ఊరకుంటివా?
నోరూరగా పూల చెట్లు మేసివస్తినీ. [ ఇంకా
...]

Tuesday, November 13

వంటలు - మజ్జిగ పులుసు

కావలసిన వస్తువులు:
పెరుగు - 2 కప్పులు.
శనగ పిండి - 1 స్పూను.
ధనియాలు - 1/4 టీ స్పూను.
మెంతులు - 1/4 టీ స్పూను.
ఎండు మిర్చి - 6.
వెల్లుల్లి - 10 పాయలు.
ఆవాలు - 1/2 టీ స్పూను.
కరివేపాకు - 1 రెమ్మ.
పసుపు - 1/2 టీ స్పూను.
పచ్చి మిర్చి - 5.
ఉల్లిపాయ - సగం.
సొరకాయ, వంకాయ, క్యారట్, గుమ్మడి, బెండ - 100 గ్రా.
రెఫైండ్ ఆయిల్ - కొద్దిగా.

తయారు చేసే విధానం:
పెరుగును బాగా గిలకొట్టాలి. శనగపిండిని కొన్ని నీళ్ళతో కలిపి వరుసగా కలపాలి. [ ఇంకా
...]

పిల్లల పాటలు - వారాలు - బాలుడు

ఆదివారం పుట్టిన బాలుడు - అద్భుతంగా చదువుతాడు
సోమవారం పుట్టిన బాలుడు - సత్యమునే పలుకుతాడు
మంగళవారం పుట్టిన బాలుడు - మంచి పనులు చేస్తాడు
బుధవారం పుట్టిన బాలుడు - బుద్దిమంతుడై ఉంటాడు [ ఇంకా...]

నీతి కథలు - నిద్రమత్తు

ఒక గ్రామములో రాము, రవి అనే యువకులుండేవారు. రాము ఉదయాన్నేలేచి కాలకృత్యములు తీర్చుకొని పొలము వెళ్ళేవాడు. రవి మాత్రము ఆలస్యముగా నిద్రలేచి కాలకృత్యములు తీర్చుకొని పొలము వెళ్ళేవాడు. రాము ఎంత చెప్పినా రవి ఉదయము నిద్రలేచేవాడుకాడు. వీళ్ళకి తల్లిదండ్రులు లేకపోవడం వలన మేనమామ ఇంట్లో ఉంటున్నారు. మేనమామ భార్య రమ చాలా తెలివైనది. [ ఇంకా...]

Saturday, November 10

వంటలు - లైం షర్బత్

కావలసిన వస్తువులు:
నిమ్మరసం - 1 గ్లాసు.
పంచదార - 4 గ్లాసులు.
నీళ్ళు - 1/2 గ్లాసు.
ఉప్పు - 1 టీ స్పూన్.


తయరుచేసే విధానం:
ముందుగా మంచి రసం ఉన్న నిమ్మకాయాలు తీసుకొని, కడిగి, శుభ్రపరచి, రసం తీసి, గింజలు రాకుండా వడకట్టాలి. పంచదారలో అర గ్లాసు నీళ్ళు పోసి, తీగపాకం వచ్చేంతవరకు ఉడికనివ్వాలి. [ ఇంకా...]

వంటలు - ద్రాక్ష రసం

కావలసిన వస్తువులు:
ద్రాక్షపండ్లు - 1 కిలో.
నీళ్లు - 2 కప్పులు.
చక్కెర - తగినంత (సుమారుగా కప్పు).
బ్లాక్‌సాల్ట్ - అర టీ స్పూను.


తయారు చేసే విధానం :
కడిగిన ద్రాక్షపండ్లని మిక్సీలోగానీ జ్యూసర్‌లోగానీ వేసి నీళ్లు, చక్కెర పోసి గ్రైండ్ చేయాలి. [ ఇంకా...]

పిల్లల పాటలు - కోయిలొచ్చింది 

కోయిలొచ్చిందమ్మ
కోయి లొచ్చింది.
చలి వదలి పోగానే
సాగి వచ్చింది.
గున్న మామిడిపైని
కొలువు తీర్చింది. [ ఇంకా
...]

Thursday, November 8

వంటలు - క్యారెట్ జామ్

కావలసిన వస్తువులు:
క్యారెట్ - 250గ్రా.
పంచదార - 350 గ్రా.
నిమ్మరసం - 1 చెంచా.
నీళ్ళు - 1కప్పు.

తయారు చేసే విధానం :
క్యారెట్లను కడిగి, చెక్కుతీసుకుని తురుముకోవాలి. తురుముకు నీళ్ళు చేర్చి స్టౌమీద పెట్టి మెత్తగా ఉడికించాలి. ఉడికిన తురుముకు పంచదార చేర్చి నీళ్ళన్నీ ఇంకిపోయేవరకూ స్టౌమీద ఉంచాలి. [ ఇంకా...]

Wednesday, November 7

వంటలు - బ్లాక్ వండర్

కావలసిన వస్తువులు:
నేరేడు పండ్ల రసం - ఒక కప్పు.
రాగిపిండి - 1/2 కప్పు.
ఖర్జూరపళ్ళు - 6.
రోజ్ వాటర్ - 1 కప్పు.
ఫైవ్ స్టార్ చాక్లేట్ - 1.

తయారు చేసే విధానం:
ముందుగా నేరేడు పళ్ళను కడిగి నీటిలో వేసి పిసికి గింజలను తీసి ఒక కప్పు రసాన్ని తీసుకోవాలి. [ ఇంకా...]

వంటలు - బటర్ బర్ఫీ

కావలసిన వస్తువులు:
బటర్ - 3 కిలోలు.
చక్కెర - 2 కిలోలు.
అమూల్ మిల్క్ పౌడర్ - 1 కిలో.
గ్లూకోజ్ పౌడర్ - 100 గ్రా.
ఐస్‌క్రీం పౌడర్ - 1 టీ స్పూను.
మైదా - 100 గ్రా.

తయారు చేసే విధానం:
బటర్, మిల్క్ పౌడర్, మైదాలను మిశ్రమం చేసుకోవాలి. గిన్నెలో చక్కెరకు తగినన్ని నీళ్ళుపోసి సన్నని సెగపై తీగపాకం పట్టి బటర్, మైదా మిశ్రమాన్ని, ఐస్‌క్రీం పౌడర్, గ్లూకోజ్ పౌడర్ వరుసగా వేసి ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. [ ఇంకా
...]

పిల్లల పాటలు - చిట్టీ చిట్టీ చెల్లమ్మా

చిట్టీ చిట్టీ చెల్లెమ్మా!
పలకాబలపం తేవమ్మా!
అక్షరాలు నేర్వమ్మా
చదువు బాగా చదువమ్మా
తెలివిని బాగా పెంచమ్మా
ఇంటికి పేరు తేవమ్మా [ ఇంకా
...]

Tuesday, November 6

నీతి కథలు - నాన్నా పులి వచ్చే

ఒక ఊరిలో సోమయ్య అనే పల్లెటూరి రైతు ఉన్నాడు. అతనికి పొలం ఉంది. గొర్రెల మంద కూడా ఉంది. కూలీలతో ఒక రోజు మందని తోలుకొని వెళుతూ తన కొడుకు రంగడుని కూడా పొలానికి తీసుకుని వెళ్ళాడు.మందకి కొడుకుని కాపలా ఉండమని చెప్పాడు. సరే అన్నాడు రంగడు. 'ఇక్కడ అప్పుడప్పుడు పెద్ద పులి వస్తూ ఉంటుంది జాగ్రతా అని హెచ్చరించి, 'ఒక వేళ పులి వస్తే కేకలు వేయమని చెప్పి తాను పొలంలోని కూలీలతో పనులు చేయించటంలో నిమగ్నమయ్యాడు సోమయ్య. [ ఇంకా...]

వంటలు - మిల్క్ మైసూర్‌ పాక్

కావలసిన వస్తువులు:
చక్కెర - 1 కిలో.
నెయ్యి - 1 కిలో.
మిల్క్‌పౌడర్ (అమూల్) - 250 గ్రా.
మైదా - 250 గ్రా.
యాలుకల పొడి - 1 టీ స్పూను.
నీళ్లు - అర లీటరు.

తయారు చేసే విధానం:
మిల్క్ పౌడర్‌లో 150 గ్రాముల నెయ్యి వేసి మిశ్రమాన్ని కలిపి ఉంచుకోవాలి. వేరొక గిన్నెలో పంచదార, నీళ్లు కలిపి తీసుకుని సన్నని సెగపై తీగపాకం పట్టి మిల్క్ పౌడర్ ముద్ద, మైదా వరుసగా వేసి కలపాలి. [ ఇంకా...]

వంటలు - వెజిటబుల్ కట్‌లెట్

కావలసిన వస్తువులు:
క్యారెట్ (సన్నగా తరిగి) - 100 గ్రా.
బీన్స్ (సన్నగా తరిగి) - 100 గ్రా.
కాలిఫ్లవర్ (సన్నగా) - 100 గ్రా.
ఆలూ గుజ్జు - 200 గ్రా.
మిర్చిపొడి, ఉప్పు, ఉల్లిపాయలు - సరిపడినంత.
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - 5 గ్రా.
పసుపు - అర టీ స్పూను.
చాట్ మసాలా - 1 టీ స్పూను.
జీరా పొడి - అర టీ స్పూను.
బ్రెడ్‌ పౌడర్ - సరిపడినంత.
మైదా - 50 గ్రా.
గుడ్లు - 2.
రిఫైండ్ ఆయిల్ - సరిపడినంత.

తయారుచేసే విధానం:
కడాయిలో ఆయిల్ వేడిచేసి తరిగిన ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి దోరగా వేయించాలి. [ ఇంకా...]

పిల్లల పాటలు - బడిపిల్లలం

పిల్లలం బడిపిల్లలం
తెల్లని మల్లెలపూవులం
బాగుగ ఆటలు ఆడెదం
చక్కగా చదువులు చదివెదం [ ఇంకా
...]

Monday, November 5

నీతి కథలు - అతి పండితుడు

వారణాసిలో బ్రహ్మదత్తుడు రాజ్యపాలన చేస్తుంటే బోధిసత్వుడు వైశ్యకులంలో పుట్టాడు. అతనికి పండితుడని పేరు పెట్టారు. అతను పెద్దవాడయ్యాక మరో వర్తకుడితో కలిసి వ్యాపారం చెయ్యసాగారు. ఆ వ్యాపారి పేరు అతిపండితుడు. వాళ్ళిద్దరూ పై వూళ్ళు వెళ్ళి వ్యాపారం చేసి లాభంతో తిరిగి వచ్చారు. లాభం పంచుకునే సమయంలో ' నాకు రెండువంతులు రావాలి ' అన్నాడు అతి పండితుడు. [ ఇంకా...]

పిల్లల పాటలు - తెల్లవారక ముందె

తెల్లవారక ముందె నిదుర లేవాలి
తెల్లగా మీ పండ్లు తోము కోవాలి
చలియనక గిలియనక స్నానాలు చేయాలి
చలువ బట్టలు తీసి వేసుకోవాలి [ ఇంకా
...]

వంటలు - బూంది

కావలసిన వస్తువులు:
శనగపిండి - 1/2 కిలో.
వేరుశనగగింజలు - 1/4 కిలో.
కారం - తగినంత.
ఉప్పు - తగినంత.
కరివేపాకు - 2 కట్టలు.
నూనె - 1/2 కిలో.

తయారు చేసే విధానం:
శనగపిండిని జారుగా కలుపుకోవాలి. బాండీలో నూనెపోసి కాగిన తరువాత బూందీ గరిటతో బూంది దుయ్యాలి. [ ఇంకా...]

వంటలు - రవ్వ పుడ్డింగ్

కావలసిన వస్తువులు:
బొంబాయి రవ్వ - 1/2 కప్పు.
పాలు - ఒకటిన్నర కప్పు (1 1/2).
యాలుకలు - 4.
జీడిపప్పు, బాదం పప్పు, కిస్ మిస్.

తయారు చేసే విధానం:
ముందుగా పాలు ఒక గిన్నెలో పోసి బాగా మరగ బెట్టాలి. తీసుకున్న పాలు సగం వరకు వచ్చేటట్లు కాచాలి.
[ ఇంకా...]

Saturday, November 3

కాలచక్రం - క్యాలండర్ కథ

మానవ జీవితంలోని ప్రతి ముఖ్య ఘట్టానికీ ఓ కారణముంటుంది. అనేక ఘట్టాల ఆ సమాహారంలో లెక్కలేనన్ని వింతలు, విశేషాలు. కొన్ని వింతలు తాత్కాలికమైనవైతే, మరికొన్ని శాశ్వతమైనవి. శాశ్వతమైన ఆ వింతే .... మనిషి నిద్ర లేచినప్పటినుంచీ, పడుకునేవరకు, పుట్టిన నాటినుంచి, గిట్టే వరకు తోడు-నీడై, మార్గదర్శై, ఘడియ ఘడియకూ ఆధారభూతమైన కేలెండెర్ ఆవిష్కరణ. [ ఇంకా...]

సంస్కృతి - తప్పెట గుళ్ళు

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ప్రచారంలో ఉన్న జానపద కళారూపమిది. ఇది సంప్రదాయ నృత్యం.వర్షాలు పడక పశుగ్రాసం కష్టమైనప్పుడు దైవానుగ్రహంకోసం గొల్ల కులస్తులుఈ నృత్యం చేస్తారు. తప్పెటలను గుండెలకు వ్రేలాడగట్టుకుని వాటిని వాయిస్తూ నృత్యం చేస్తారు. ఇది జానపద సంగీత నాట్య దృశ్య రూపకం. [ ఇంకా...]

Friday, November 2

సాహిత్యం - జానపదగేయం

మానవుడు పుట్టిన పిదప పాడిన మొట్టమొదటి పాట జానపదమే. జనసామాన్యంలోనుంచి పుట్టుకొచ్చిన పాట కాబట్టి జనావళిలో ఆ పాటకు అధిక ప్రాధ్యానత ఉండడం సహజం. ఇతర ఏ సాహిత్యంతో పోల్చి చూసినా జానపద గేయమే జనం పాటగా వెలుగొందుతుంది. భాష పుట్టకముందునుంచి ఈ పాట ఉంది. జానపదం అంటే పల్లెటూరు. కావడానికి పల్లెటూరి పాటలైనా నాగరికత పూర్తిగా వెల్లివిరియని కాలంలోని ఆవాస ప్రాంతాలన్నీ జానపదాలే కాబట్టి ఈ సాహిత్యం నేడు సకల జన సాహిత్యమయ్యింది. [ ఇంకా...]

Wednesday, October 31

పండుగలు - ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం

"మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు" అంటూ తెలుగు నేలను తల్లిగా కీర్తించిన శంకరంబాడి సుందరాచారి, "చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా, గతమెంతో ఘనకీర్తి కలవోడా" అంటూ తెలుగు తేజాన్ని ఉద్వేగంతో గొంతెత్తిన వేములపల్లి శ్రీకృష్ణ, తెలుగు తల్లి సాంస్కృతిక దర్పాన్ని తమ రచనల ద్వారా తెలియజెప్పిన అనేక వేల యువ సాహితీ కుసుమాల కల్పవృక్షం ఆంధ్ర ప్రదేశ్. [ ఇంకా...]

పిల్లల ఆటలు - ఏడు పెంకులు

ఎంతమంది ఆడవచ్చు : 12 మంది ఆడవచ్చు.
ఈ ఆటలో రెండు గ్రూపులు ఉండాలి. ఒక్కో గ్రూప్ లో ఆరుగురు చొప్పున రెండు గ్రూపులలో పన్నెండు మంది ఆడాలి. ఇద్దరు లీడర్లు తమ రెండు గ్రూపులకు కావలసిన వారిని కోరుకుంటారు. తరువాత 7 పెంకులను నేల మీద ఒక దాని మీద ఒకటి పేరుస్తారు. అటు వైపు ఒక గ్రూపు, ఇటు వైపు ఒక గ్రూపు నిలబడతారు. అచ్చు వేసి ముందుగా నెగ్గిన వారు బంతితో ఆ ఏడు పెంకులను కొడతారు.
[ ఇంకా...]

వంటలు - మైదా కారా (మైదా చిప్స్)

కావలసిన వస్తువులు:
మైదా - 700 గ్రా.
జీలకర్ర - 20 గ్రా.
డాల్డా - 100 గ్రా.
సోడా - చిటికెడు.
ఉప్పు, మిర్చిపొడి - సరిపడినంత.
జీలకర్ర పొడి - సరిపడినంత.
కరివేపాకు - సరిపడినంత.
రిఫైండ్ ఆయిల్ - సరిపడినంత.
డాల్డా - 100 గ్రా.

తయారు చేసే విధానం :
గిన్నెలో మైదా, జీలకర్ర, ఉప్పు, సోడా, డాల్డా వరుసగా వేసి సరిపడినన్ని నీళ్లతో మిశ్రమాన్ని బాగా కలిపి పెద్ద సైజు వుండలు చేసుకోవాలి. [ ఇంకా
...]

భక్తి గీతాలు -పలుకే బంగారమాయెనా

పలుకే బంగారమాయెనా కోదండపాణి పలుకే
పలుకే బంగారమాయె పిలిచిన పలుకవేమి
కలలో నీనామస్మరణ మరువ చక్కని తండ్రి పలుకే
ఇరువుగ నిసుకలోన బొరలినయుడుత భక్తికి
కరుణించి ప్రోచితివని నెరనమ్మితి నిన్నే తండ్రి పలుకే [ ఇంకా
...]

పిల్లల పాటలు - తూ తూ తూనీగా

తూతూ తూతూ తూనీగా
ఎగురలేము నీలాగా.
నీవు తిరుగు తున్నావంటే
వాన మాకు వచ్చే మాటే.
నీ రెక్కల అమరికలోనే
నీ కబ్బును నేరుపు తానే. [ ఇంకా
...]

Tuesday, October 30

నీతి కథలు - మొక్కలకు నీళ్ళు తోడిన దొంగలు

ఒకసారి విజయనగర సామ్రాజ్యంలో భయంకరమైన కరువు వచ్చింది. వర్షాలు అస్సలు కురవలేదు. దానికి తోడు ఎండలేమో మండిపోయాయి. దాంతో బావులలోను, పంపుల్లోను నీళ్ళు ఎండిపోయాయి. ఎప్పుడూ నీటితో నిండుగా ఉండే బావులలో నీళ్ళు బాగా లోపలికి వెళ్ళిపొయాయి.
తెనాలి రామలింగడి ఇల్లు తుంగభద్రానది ఒడ్డున ఉన్న ఆయన ఇంట్లో కూడా బావిలో నీళ్ళు బాగా లోపలికి పోయాయి.
[ ఇంకా...]

ఆధ్యాత్మికం - ఆత్మ సౌందర్యము

సుందరమైన వస్తువు ఆనందమును గొల్పును, చక్కని పుష్పము జనులకు ఆహ్లాదమును గలుగజేయును. అట్లే సుంధర భవనము, సుందర చిత్రము, సుందర దేహము జనుల హృదయ సీమలందు ఆనందము యొక్క సంచారమునకు హేతుభూతములగుచున్నవి.
A Thing of beauty is a joy forever అను ఆంగ్లసూక్తి ఈ భావమునే స్పష్టీకరించుచున్నది. "సుందర పదార్ధము పరమానందమును గలిగజేయు" నని ఆ వాక్యముయొక్క అర్ధము.
[ ఇంకా...]

వంటలు - గోరుచిక్కుడుకాయ కూర

కావలసిన వస్తువులు:
గోరుచిక్కుడు ముక్కలు : 2 కప్పులు
తాజా పెరుగు : కప్పు (గిలకొట్టాలి)
ధనియాల పొడి : టేబుల్ స్పూను
కారం : 2 టీస్పూన్లు
సెనగపిండి : 2 టీస్పూన్లు
జీలకర్ర : టీస్పూను
ఆవాలు : అర టీస్పూను
ఇంగువ : పావు టీస్పూను
కరివేపాకు : 2 రెబ్బలు
నూనె : 2 టెబుల్ స్పూనులు
ఉప్పు : తగినంత

తయారుచేసే విధానం:
గోరుచిక్కుడు కాయలను ఈనెలుతీసి చిన్నముక్కలుగా కోయాలి. ముక్కలను కుక్కరులో రెండు వుజిల్స్ వచ్చేంతవరకు ఉడికించి నీళ్ళు వంచాలి. [ ఇంకా...]

సాహిత్యం - వాడుక బాష

ప్రజలు తమ నిత్య జీవితంలో మట్లాడుకునే భాష వాడుక భాష.
సనాతన భావాలను సమర్ధిస్తూ గ్రాంధిక భాషలో రచనలు చేయడమేగాక బిచ్చగాడితో సైతం గ్రాంధిక భాషలోనే మట్లాడేవారు కొక్కొండ వెంకటరత్నం (1842-1915)గారు. ఇంట్లో భార్యతో కూడా గ్రాంధికంలోనే సంభాషించేవారు.
వాడుక భాషలో గ్రంధ రచన సాగాలని గురజాడ పిలుపునిచ్చారు. [ ఇంకా...]

వంటలు - బంగాళదుంప చక్రాలు

కావలసిన పదార్థాలు :
పెద్దసైజు బంగాళదుంపలు - నాలుగు
నూనె లేదా నెయ్యి - వేయించడానికి సరిపడినంత
ఉడకబెట్టిన బఠాణీలు - రెండు కప్పులు ( మెత్తగా రుబ్బినవి )
సన్నగా తరిగిన అల్లం ముక్కలు - ఒక చెంచా
పచ్చిమిరపకాయలు - రెండు ( సన్నగా తరగాలి )
జీలకర్ర - ఒక చెంచా
నూనె - ఒక చెంచా
గరం మసాలా - సగంచెంచా
ఉప్పు - తగినంత

తయారుచేసేవిధానం:
మొదట బంగాళదుంపల పొట్టు తీసి అడ్డంగా రెండు సమభాగాలుగా కట్‌చేసు కోవాలి. [ ఇంకా...]

Monday, October 29

వంటలు - మామిడి హల్వా

కావలసినవి:
మామిడి పళ్ళరసం - 8 కప్పులు
చక్కెర - 1 కిలో
పాలు - 4 పైంట్ల
నెయ్యి - 1 కిలో
బాదంకాయల తునకలు - 1/2 కప్పు
ఎండు ద్రాక్ష - తగినన్ని

చేసే విధానం:
ఒక పెద్ద బాణలిలో మామిడిరసం, చక్కెర, పాలు వేడిచేయండి. మధ్యస్థమైన వేడిలో వీటిని బాగా కలియతిప్పుతూ ఉండండి. [ ఇంకా...]

వ్యక్తిత్వ వికాసం - సమస్యను మించిన పరిష్కారం

పూర్వం ఒక గొప్ప చక్రవర్తి రాజ్యం పాలిస్తూ ఉండేవాడు. ఆ చక్రవర్తికి సుప్రసిద్ధుడైన మంత్రి పుంగవుడు ఉండే వాడు. అతడు మంచి కుశాగ్రబుద్ది గల ప్రజ్ఞావంతుడు. సమర్ధుడు. రాజ్యపాలనకు సంబందించిన అన్ని విషయాలలోను ఎప్పటికప్పుడు చక్రవర్తికి తగిన సలహాలను ఇస్తుండేవాడు. దూరదృష్టితో వివేకవంతమైన ఆ సలహాలను చక్రవర్తి జవదాటకుండా పాటిస్తూ ఉండేవాడు. ఆ మంత్రిగారి సహాయం, సలహాలు లేకపోతే రాజ్యపాలన కుంటుపడిపోతుందనే అభిప్రాయం చక్రవర్తికి కలిగింది. [ ఇంకా...]

పండుగలు - కార్తీక మాసము

భగవంతునికి ఎక్కువ ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. ప్రతి ఏటా దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో భక్తులంతా నిత్యం శివ నామాన్ని స్మరిస్తూ ఉంటారు. పురాణ కాలంనుంచీ ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తూ కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది. [ ఇంకా...]

వ్యక్తిత్వ వికాసం - మనశ్శాంతి

మొదట మనస్సన నెట్టిదో విచారించిన తరువాత దాన్ని శాంతిపఱచు మార్గమునన్వేషింపవచ్చును. మనస్సనునది భగవదంశము. అది ప్రపంచవికారము నొందినపుడు మనస్సని, నిర్వికార స్థితినొందినపుడు ఆత్మయని పిలువబడును. సృష్టి స్థితిలయములు మనసులోనే యున్నవి. సుఖదు:ఖములు మంచి చెడ్డలు దానివల్లనే ఏర్పడుచున్నది. ఒక్క మాటలో చెప్పవలయునన్న సర్వము మనసే. [ ఇంకా...]

ఆధ్యాత్మికం - భాగవతం వింటే బాగవుతాం

శ్రీ కృష్ణాష్టకం
1.వసుదేవసుతం దేవం - కంసచాణూరమర్ధనం
దేవకీపరమానందం - కృష్ణం వందే జగద్గురుం.
2.అతసీపుష్పసంకాశ - హారనూ పురశోభితం
రత్నకంకణకేయూరం - కృష్ణం వందే జగద్గురుం. [ ఇంకా...]

Saturday, October 27

పండుగలు - మొహర్రం

కాలం తనపని తాను చేసుకుంటూ పోతూ ఉంటుంది. అది ఎవరికోసం ఆగదు.అంతులేని నిరంతర కాలప్రవాహంలో మలుపులే కానీ మజిలీలు లేవు.కాలగమనంలో ఎన్నో కేలండర్‌లు మారుతూనే ఉంటాయి.ఎన్నెన్నో సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉంటాయి.ఈ కాల ప్రవాహంలో నూతన సంవత్సరాలు వస్తూనే ఉంటాయి.కనుమరుగు అవుతూనే ఉంటాయి. [ ఇంకా...]

ఆహార పోషణ - పండ్లతో ఆరోగ్యం

  • ప్రతిరోజు కమలాపండు రసం తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
  • బొప్పాయి పండును క్రమతప్పకుండా ప్రతిరోజూ తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడాన్ని ఆరికడుతుంది.
  • జ్వరంవల్ల దాహం తీరికపోతే దానిమ్మరసం తాగితే మంచి ఫలితం ఉంటుంది.
  • మధుమేహవ్యాధిగ్రస్తులకు నేరేడుపండ్లు దివ్యౌషధంగా పనిచేస్తాయి. [ ఇంకా...]

మీకుతెలుసా - సున్నా కథ

మంకందరికీ సున్నా తెలుసు. ఇది ఒకటికన్నా ముందు వస్తుంది. ఈ సున్నాను కనుగొనడం గణితశాస్త్రం మొత్తం మీద విప్లవాత్మక మైన మార్పు తెచ్చింది. సున్నా అనే భావన బాబిలోనియాలాంటి పలు పురాతన నాగరికతలలో కనిపించినప్పటికీ, మనం ఇవాళ ఉపయోగిస్తున్న చిహ్నం ఆ తరువాతి కాలం వరకు కనుగొనబడినది.
మద్య ఆసియా-భారత దేశాల మధ్య వర్తక వాణిజ్యా సంబంధాలు మనదేశానికి 'సున్నా' ను పరిచయం చేశాయని కొందరు నిపుణులు భావిస్తున్నారు.
[ ఇంకా...]

ముఖ్యమైన ఘట్టాలు - అన్నప్రాసన

అన్నప్రాశమమంటే పుట్టిన శిశువుకు మొట్టమొదటిసరి అన్నం ముట్టించడం. ఈ సంస్కారం వలన శిశువుకు ఆయువు, ఆరోగ్యం, తేజస్సు వృద్ధి చెందుతాయి.
అన్నప్రాశన చేయు విధానం: పిల్లలకు ఆరు లేక ఎనిమిది లేక పది మాసములందైనను వర్షాంతమందైనను, శుక్లపక్షమునందు శుక్రుడు ఆకాశమందు పరిశుద్ధుడై ప్రకాశించుచున్నపుడు నవాన్నప్రాశనము చేయవలెనని ఋషులచే చెప్పబడింనది(ముహూర్త దర్పణం).
[ ఇంకా...]

Friday, October 26

వ్రతములు - శ్రీ వైభవ లక్ష్మి వ్రతము

క్షీర సముద్రరాజతనయా, శ్రీ లక్ష్మీ, హరివల్లభ, విద్యాలక్ష్మి, రమా, వైభవలక్ష్మీ, సాంప్రదాయినీ, శ్రీ చక్ర విలసిని, యోగమాత, ప్రకృతి స్వరూపిణీ, జగద్రక్షిణీ అని అనేక నామములతో విరాజిల్లుతున్న శ్రీలక్ష్మిదేవి యైక్క పూజాకధను తెలుసుకుందాము.
వేదములలో లక్ష్మిదేవి యెక్క స్తవన రూపమును అనుసరించి సూక్తములు వివరించబడినవి.లక్ష్మిదేవి యైక్క స్వరూపాన్ని అధర్వణవేదం చాలా చక్కగా తెలియజేయుచున్నది.అదే అధర్వణ వేదమునందు ఫలములను నిర్దేశించే లక్ష్మీ హృదయము ఉపదేశించ బడినది. [ ఇంకా
...]

ఆధ్యాత్మికం - దేహమే దేవాలయం

"దేహమే దేవాలయం జీవుడే దేవుడు" అనే వేద ప్రమాణానుసారం, సృష్టిలో ఉండే ప్రతి జీవి దేహం ఒక దేవాలయమే. ప్రతి జీవి కూడా పరబ్రహ్మమే. అయితే ఇక్కడ మానవులు మినహా ఇతర ప్రాణులకు ఈ విషయం అనుభవంలోకి రాలేదు ఎందుకంటే వాటికి పుట్టుకతోనే విచక్షణాజ్ఞానం లేకుండా పుడతాయి, అదే బలహీనతను ఆసరా చేసుకొని మానవుడు ఇతర జీవుల పట్ల తనకున్న విచక్షణా జ్ఞాన్ని ఉపయోగించుకొని తన స్వార్ధం కోసం తన వశంలోకి తెచ్చుకొని ప్రయోజనాన్ని పొందుతున్నాడు. [ ఇంకా...]

వ్యక్తిత్వ వికాసం - విజయానికి దశ సోపానాలు

"Struggle for the existence and survival & the fittest" అని చార్లెస్ డార్విన్ పేర్కొన్నట్లు ప్రస్తుతము ప్రపంచమంతా పోటీమయమైపోయినది. ఇది 'పులి-జింక ' ఉదంతం వలె ఉంటుంది. 'జింక ' వేగంగా పరిగెత్తటం నేర్చుకొంటేనే మనగల్గుతుంది. లేదా పులి నోటికి ఆహారమౌతుంది. అయితే 'పులి ' జింక కంటే వేగంగా పరిగెత్తటం నేర్చుకోవాలి. లేదా జింక నోటికందకుండా పారిపోతుంది. [ ఇంకా...]

ముఖ్యమైన ఘట్టాలు - ఉపనయనం

కుమారునికి తండ్రి ఉపనయనం చేస్తాడు. తండ్రి దేశాంతరమందుంటే తాత (తండ్రి యొక్క తండ్రి), అతను లేకుంటే తండ్రి సోదరులు వారుకూడా లేకపోతే వటుడి అన్న దానికి అధికారి అవుతాడు. ఒకవేళ అతను కూడా లేకపతే సగోత్రమునందు పుట్టినవారు చేయాల్సిఉంటుంది.

ఏ వయసులో చెయ్యాలి?
బ్రాహ్మణ కులంలో 8వ సంవత్సరాన, క్షత్రియులకు 11వ ఏడున, వైశ్యులకు 12వ ఏడున ఉపనయనం చేయాలి. బ్రాహ్మణులకు చైత్ర మరియు వైశాఖ మాసాలు, క్షత్రియులకు జ్యేష్ట, ఆషాఢ మాసాలూ, వైశ్యులకు ఆశ్వయుజ కార్తీక మాసాలు మంచిది. [ ఇంకా
...]

Thursday, October 25

ముఖ్యమైన ఘట్టాలు - యజ్ఞోపవీతం

'యజ్ఞ+ఉపవీత ' అను రెండుపదాలలో ఈ యజ్ఞోపవీతశబ్దం ఏర్పడుతుంది. యజ్ఞ = యజ్ఞార్థము- అనగా ఉత్తమ కర్మలాచరించుటకు చిహ్నంగా ధరింపబడు, ఉపవీతం = దారం. కనుక దీనిని యజ్ఞోపవీతమంటారు. "యజ్ఞో వై శ్రేష్ఠతమం కర్మ"- శ్రేష్ఠమైన (సత్) కర్మలన్నీ యజ్ఞపదంతో చెప్పబడుతాయి. కావున యజ్ఞోపవీత శబ్ధంలోని యజ్ఞ పదం మానవుడు పురుషార్థ సాధనకు చేయునుత్తమకర్మల కన్నింటికి బోధకంగా- సూచకంగా- ఉంటుంది. [ ఇంకా...]

అందరి కోసం - జానపదనృత్యాలు

అసంఖ్యాక జాతులతోనూ పతిస్థితులతోనూ కూడి ఉన్న భారతదేశం అనేక శతాబ్దాలుగా రకరకాల జానపద నృత్యాలకు నిలయంగా ఉంది. భారతదేశంలోని నేటి శాస్త్రీయ నృత్య విధానాలు చాలా కట్టుబాట్లకు లోబడి ఉండటంతోపాటు ఎంతో నాజూకుతనాన్ని చూపుతున్నది. ఆటవికుల గూడెములోనూ కర్షకుల కుటీరాలలోనూ నేటికి తమ పాటవాన్ని కోల్పోకుండా బ్రతికి ఉన్న సామాన్య ప్రజా నృత్యాలనుండి మన శాస్త్రీయ నృత్యాలు పుట్టాయి. [ ఇంకా...]

ఆధ్యాత్మికం - విఘ్నేశ్వరుడు

ఈ విధంగా విఘ్నేశ్వరుని సర్వకార్యాలకు విఘ్నములు తొలగిపోయి అనుకున్న కార్యము జయప్రదంగా నెరవేరవలెనని షోడశోపచారములతో పూజించి పూజా అక్షతలు శిరస్సున ధరిస్తారు.
గణపతి పుట్టుక అందరికీ తెలిసిందే, వివిధయుగాలలో 'గణపతి ' లీలను పరిసీలించినచో 'కృతయుగం' లో 'మహోత్కట వినాయక ' అనుపేరుతో ఉధ్భవించి దేవాంతక నరాంతక అను రాక్షసులను సం హరించెను. [ ఇంకా
...]

Wednesday, October 24

పండుగలు - మాఘ మాసము

మాఘ మాసం" ఎంతో విశిష్టమైనది. ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన తిథి "శుక్ల పక్ష చవితి" దీనిని "తిల చతుర్థి"అంటారు. దీన్నే "కుంద చతుర్థి" అని కూడా అంటారు. నువ్వులను తింటారు. నువ్వులతో లడ్లు చేసి పంచి పెడతారు. ఈ రోజున "డుంఢిరాజును" ఉద్దేశించి, నక్త వ్రతము పూజ చేస్తారు! డుంఢిని ఈ విధంగా పూజించడం వలన దేవతల చేత సైతం పూజలందుకుంటారని కాశీ ఖండములో తెలియజేశారు. [ ఇంకా...]

మీకుతెలుసా - ఫూల్స్ డే

ఒకప్పుడు ఫ్రాన్స్‌లో ఏప్రిల్ ఫస్ట్‌న కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునేవారు. 1582లో రాజైన చార్లెస్-9 కేలెండెర్‌ని మార్చేసి జనవరి 1న కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవాలని ఆదేశాలు జారీ చేశాడు. అయితే సమాచర వ్యవస్థ అంతగా వృద్ధి చెందని ఆ కాలంలో ఆ వార్త దేశంలోని ప్రజలందరికీ త్వరగా చేరలేదు. రాజధానికి దగ్గర్లోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే చేరింది. ఈలోగా మళ్ళీ కొత్త ఏడాది వచ్చేసింది. [ ఇంకా...]

అందరి కోసం - నాట్యం

నాట్య శబ్దము నృత్యమునకు పర్యాయపదము. భరతుని నాట్య శాస్త్రంలో నృత్యం అనే పదం లేదు. నృత్తము, నాట్యము అను పదములే కలవు. నృత్తము నాట్యముకంటే చాలా ప్రాచీనమైనది. ఈ రెండు కళలు వేర్వేరుగ జన్మించి, వేర్వేరుగ అభివృద్ధి చెందాయి. భరతుడే ప్రధమంగా నృత్తమును నాట్యంలో చేర్చాడు. కరణ-అంగహార సంపన్నమైనది నృత్తము. ఇది అర్ధాన్ని బోధించదు. కేవలం అవయవ విన్యాసములతో కూడి ఉండును. [ ఇంకా...]

సంగీతం - సామగానం

'వేదానాం సామవేదోస్మి ' అంటాడు కృష్ణ పరమాత్మ. భగవధ్గీత విభూతి యోగంలో. రుక్ వేదం- రుక్కులతో కూడినది. ఎవరైనా కంఠోపాఠం చేశారు అనడానికి 'రుక్కు పెట్టేశాడు ' అంటారు. రుగ్వేద అధ్యయనం చేసినప్పుడు అనేమాట ఈనాటికీ వాడుకలో ఉన్నది. రెండవది యజు: -యజుర్వేదము, యజు: అంటే యాగం యాగంచేసేటప్పుడు వల్లెవేసేదే యజుర్వేదం. పై రెండువేదాలకూ కృష్ణ పరమాత్మ ప్రాధాన్యం ఇవ్వలేదు. [ ఇంకా...]

Tuesday, October 23

హాస్య సంపద - జోక్స్

ఒక పేటకు చెందిన చర్చి అధికారి ఆ పేట గుండా నడిచి వెళ్ళ్తున్నాడు.దారిలో ఆ చర్చికి సంబంధించిన ఒక వ్యక్తి ఆ ఫాదరుకు కనపడ్డాడు. అతన్ని చూసి "ఏవయ్యా నీ జలుబు ఎలా వుంది?" అని అడిగాడు.
" చాలా మొండిగా వుంది ఫాదర్."
" నీ భార్య ఎలా వుంది?"
" ఆమె అట్లాగే వుంది " అని ఆ వ్యక్తి జవాబిచ్చాడు. [ ఇంకా
...]

పర్యాటకం - శైవక్షేత్రాలు

ప్రతి సంవత్సరం శివరాత్రి మహా పర్వదినం వచ్చిందంటే చాలు ఊరూర వెలసిన శివక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడిపోతాయి. వందలు, వేల సంఖ్యలో భక్తులు పొద్దంతా ఉపవాసాలు ఉండి, సాయంకాలం నుండి రాత్రిళ్లు పొద్దు పోయేదాకా ఈశ్వరుని ఆరాధనలలో మునిగిపోతారు. రాత్రంత జాగారం చేసే వారు మరెందరో. దేశవ్యాప్తంగా ఆ రోజు శైవ దేవాలయాలన్నీ ప్రత్యేక అర్చనలు, సేవలు, అభిషేకాలతో కన్నులపండువ చేస్తాయి. [ ఇంకా...]

Monday, October 22

ఆధ్యాత్మికం - వామనావతారం

సృష్టి, స్థితి, లయలకు కారకులు త్రిమూర్తులు. వీరు తమ భక్తులకు ఇచ్చు వరాలకు ఏదేని విపరీతాలు సంభవిస్తే, దాని వలన మానవాళికి హాని కలిగితే, తిరిగి వీరే ఏదో ఒక అవతారాన్ని ఎత్తి వారిని హతమార్చి సర్వమానవ సౌబ్రాత్రుత్వానికి మేలు చేస్తారు. అందులో భాగంగానే ఈ 'దశావతారాలు' అనగా పది అవతారములు. మొదటిది మత్స్యావతారం, రెండవది కూర్మావతారం, మూడవది వరాహావతారం, నాల్గవది నరశిం హావతారం, అయిదవది వామనావతారం, ఆరవది పరశురామావతారం, ఏడవది రామావతారం, ఎనిమిదవది కృష్ణావతారం, తొమ్మిదవది బుధ్ధావతారం, పదవది కల్కి అవతారం. [ ఇంకా...]

వంటలు - గోధుమరవ్వ గంజి

కావలసినవి పదార్థాలు:
సన్నటి గోధుమరవ్వ - ఒక గ్లాసు
పంచదార - ఆరు స్పూన్లు
పాలు - మూడు గ్లాసులు
యాలుకల పొడి - కొద్దిగా

తయారుచేసేవిధానం:
ఒక వంతు గోధుమరవ్వకు మూడు వంతు నీళ్ళు తీసుకొని ముందుగా నీళ్ళను బాగా మరిగించాలి. [ ఇంకా...]

వంటలు - శనగ గుగ్గిళ్ళు

కావలసినవి పదార్థాలు:
సెనగలు - అరకిలో
పోపుదినుసులు - సరిపడా
కొత్తిమీర - రెండు కట్టలు
కరివేపాకు - ఒక కట్ట
పచ్చి మిరపకాయలు - ఆరు, ఏడు
మంచి నూనె - కొద్దిగా
నిమ్మరసం - మూడు చెంచాలు
ఉప్పు - సరిపడా

తయారుచేసే విధానం:
అరకిలో సెనగలను శుభ్రం చేసి ఉదయమే నూళ్లలో నానబెట్టాలి.బాగా నానిన సెనగలను నీళ్లు లేకుండా చక్కగా వడకట్టాలి.
[ ఇంకా...]

వ్యాయామ శిక్షణ - మీరు-మీపాదాలు

మీపాదాలతో మీరెంత దూరం నడుస్తున్నారో తెలుసా? సుమారు 1,60,000కి.మీ.లకు పై బడిన దూరం భూతలం మీద, కొండలమీద, కోనలలో, మైదానాలలో,తోటలలో, పోలాలలో నడుస్తున్నారు. 26 ఎముకలతో, 33 కీళ్ళతో, 100కి పైన కండరాలతో మీ పాదం చాల సంక్లిషమై ఉంటుంది. పాదాలు అతి సున్నితమైనవి, నాజూకైనవి. [ ఇంకా...]

పిల్లల పాటలు - కెరటం

రంగురంగుల బొమ్మను
బాలలు ఆడే బొమ్మను
నాట్యము చేసే బొమ్మను
ఎరువు, తెలుపు బొమ్మను [ ఇంకా...]

Saturday, October 20

వంటలు - పెసరపప్పు గంజి

కావలసిన పదార్థాలు:
పెసరపప్పు - 2 గ్లాసులు
పంచదార - ఆరు స్పూన్లు
చిక్కటిపాలు - 4 గ్లాసులు
యాలుకల పొడి - కొద్దిగా

తయారుచేసే విధానం:
పెసరపప్పును కొంచెం నీటిలో బాగా ఉడికించాలి. పప్పు బాగా ఉడికిన తరువాత వేడి చేసిన పాలను పప్పులో పోసి ప్పప్పు, పాలు రెండు బాగా కలిసేలా కలియబెట్టాలి. [ ఇంకా...]

వ్యక్తిత్వ వికాసం - ఆత్మ గౌరవం

ఎవరైతే కష్టించి పని చేస్తారో, ఙ్ఞానవంతులో, తెలివి కలవారో, నైపుణ్యం కలవారో అటువంటి వారు అన్ని చోట్లా గౌరవింప బడతారని జగమెరిగిన సత్యం. అఙ్ఞానులు, అసమర్ధులు, సోమరిపోతులు, మందబుద్దులు ఎల్లప్పుడూ అవమానాల పాలవుతారు. ఎన్ని సార్లు అవమానించ బడినా, చీత్కరించబడినా, అనేక సార్లు హెచ్చరించబడినా, తాఖీదులందుకొన్నా, తమతప్పులకు చివాట్లు తిన్నా, చివరకు శిక్షించబడినా కూడా కొంతమంది తమకు తాము మెరుగు పరచుకోవడానికి ప్రయత్నించరు. అటువంటి వాళ్ళు బాధపడరు. [ ఇంకా...]

వంటలు - గుమ్మడి చట్నీ

కావలసినవి:
కందిపప్పు - ఒక కప్పు
ఎండుమిర్చి - ఐదు
గుమ్మడి తురుము - అర కప్పు
ధనియాలు, జీలకర్ర - రెండు స్పూన్లు
వెల్లుల్లి - ఒక రెబ్బ
చింతపండు - రెండు రెబ్బలు
నూనె - తగినంత
ఇంగువ, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు - తగినంత

తయారు చేసే విధానం:
ముందుగా ఒక గిన్నెలో కొంచెం నూనె వేడిచేసి కందిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి. మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర గుమ్మడి వేసి వేయించాలి.
[ ఇంకా...]

వంటలు - చురుమురి

కావలసిన పదార్థాలు:
మరమరాలు - 1/4 కిలో
క్యారట్ తురుము - 100 గ్రా
కీర తురుము - 100 గ్రా
ఉప్పు - తగినంత
కారప్పొడి - కొద్దిగా
కొత్తిమీర తురుము - కొద్దిగా
నిమ్మరసం - రెండుస్పూన్లు

తయారుచేసే విధానం:
మరమరాలను ఒక చిన్న గిన్నెలోకి తీసుకుని దానికి క్యారట్ తురుము, కీరా తురుము, ఉప్పు, కారప్పొడి, కొత్తిమీర తురుము వేసి చక్కగా కలిపి సన్నటి సెగ మీద రెండు, మూడు నిమిషాలు వేయించాలి.
[ ఇంకా...]

ఆధ్యాత్మికం - నిరంతర దైవ చింతన

జైన శాస్త్రములో ఒక చక్కనిగాధ కలదు. పూర్వము శ్రీ రామచంద్రుడు రావణ సంహారానంతరము పట్టాభిషేకము పూర్తి ఆయినపిదప ఆనందముగా రాజ్యమును పరిపాలించుచుండెను. యుద్దమున శ్రీరామునకు సాయమొనర్చిన పలువురు ఆ సమయమున శ్రీ రామచంద్రుని సమీపించి "మహాత్మా యుద్దకాలమున మేము తమకు ఆనేక విధముల తోడ్పడి తమ సేవలొ పాలుపంచుకొంటిమి. మహత్తర పుణ్యమును తద్వారా మేము సముపార్జించుకొనగలిగితిమి. [ ఇంకా...]

Friday, October 19

వంటలు - గుమ్మడి విత్తనాల కర్రీ

కావలసినవి:
గుమ్మడి గింజలు - ఒక కప్పు
కందిపప్పు - 1/2 కప్పు
పచ్చికొబ్బరి తురుం - ఒక కప్పు
గరంమసాల - ఒక చెంచా
ఉప్పు, కారం - రుచికి తగినంత
పెద్ద ఉల్లి - ఒకటి
టమాటాలు - రెండు
పచ్చిమిరపకాయలు - రెండు
కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, మీగడ - తగినంత

తయారుచేసే విధానం:
ముందుగా గింజలని ఉడికించాలి, పప్పును ఉడికించాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నూనె వేడిచేసి తాలింపు చేసాక, ఉల్లిపాయ, మిరపకాయలు వేసి వేయించాలి.
[ ఇంకా...]

వంటలు - గుమ్మడి పప్పు

కావలసినవి:
గుమ్మడి ముక్కలు - ఒక కప్పు
బంగళాదుంపలు - రెండు చిన్న ముక్కలు
ఉల్లిగడ్డ - ఒకటి
పచ్చిమిరపకాయలు - రెండు
గరంమసాలా - ఒక చెంచా
పచ్చికొబ్బరి పొడి - ఒక చెంచా
పుదీనా, కొత్తిమీర, కరివేపాకు - తగినంత
నూనె, మీగడ - ఒక చెంచా
కారం, ఉప్పు - రుచికి తగినట్టు
టమాటాలు - రెండు

తయారుచేసే విధానం:
ముందుగా కందిపప్పు, దుంపలు ఉడికించాలి. గుమ్మడి ముక్కలు సన్నగా తరగాలి. ఒక గిన్నెలో నూనెపోసి వేడిచేసి తాలింపు చేయాలి.
[ ఇంకా...]

వంటలు - చలిని తరిమేసే చిరుతిళ్ళు

సాధారణంగా చిరుతిళ్ళు తింటే ఊబకాయం వస్తుందనీ, అవి అనారోగ్యానికి దారి తీస్తాయని అందరూ చెబుతుంటారు. చిరుతిళ్ళు అంటే వాళ్ళ దృష్టిలో వేళా పాళా లేకుండా ఏదిపడితే అది తినెయ్యడం. భోజనం చేసిన వెంటనే ఏదో ఒకటి నోట్లో వేసుకోవడం మనలో చాలామందికి అలవాటే. ఇటువంటి చిరుతిళ్ళు ఆరోగ్యాన్ని హరిస్తాయనడంలో ఎటువంటి సందేహమూ లేదు. [ ఇంకా...]

వ్యక్తిత్వ వికాసం - కమ్మ్యూనికేషన్ గ్యాప్

సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని తీసుకోవడం ఒక ఎత్తైతే ఆ నిర్ణయాన్ని సరైన సమయంలో సద్వినియోగం చేసుకోవడం మరో ఎత్తు. ఒక వ్యక్తి యొక్క ప్రతిభకు అద్దంపట్టేది ఆ వ్యక్తి సమయాన్ని సద్వినియోగం చేసుకునే విధానం మాత్రమే. అతని నిర్ణయాన్ని విజయపధంవైపు మళ్ళించేది అతని సమయపాలన (టైమింగ్) మాత్రమే. కాబట్టి "టైం ఈజ్ మనీ" అన్నారు పెద్దలు. కానీ "టైం ఈజ్ మనీ". [ ఇంకా...]

Thursday, October 18

మీకు తెలుసా - మోటారు కారు కథ

13వ శతాబ్దంలోనే శాస్త్రజ్ఞులు, కవులు, రచయితలు, పరిశోధకులు ఆటోమొబైల్‌ను గురించి అనేక కలలు కన్నారు. కలలన్నీ నిజాలుగా మార్చడానికి ఆటోమొబైల్‌ రంగంలో శ్రీకారం చుట్టడానికి ఫ్రెంచి మార్గదర్శకుల అపూర్వమైన అభినివేశము, పట్టుదల ముఖ్య కారణం అని చెప్పకతప్పదు. మోటరు కారు రోడ్డుమీద తిరగడానికి మోళికంగా చక్రాలు ముఖ్యమైన, వేగం సాధించాలనే ఉబలాటమే దీని అభివృద్దికి ముఖ్య కారణమైంది. [ ఇంకా...]

వంటలు - ఈస్టర్ కేక్

కావలసిన పదార్థాలు :
మైదాపిండి - 200 గ్రాములు
పంచదారపొడి - 200 గ్రాములు
నెయ్యి - 200 గ్రాములు
గుడ్లు - నాలుగు
బేకింగ్ పౌడర్ - 1 టేబుల్ స్పూన్
వెనీల టేబుల్ - 1 టేబుల్ స్పూన్
ఐసింగ్ కోసం..
వెన్న 100 గ్రాములు, ఐసింగ్ సుగర్ 200 గ్రాములు

తయారీవిధానం:
మైదాపిండి జల్లించండి. ఈ పిండిని ఓ గిన్నెలోని తీసుకుని అందులో గుడ్లు, పంచదార, వెన్న, బేకింగ్ పౌడర్, ఎసెన్స్ వేయండి. వీటన్నింటినీ చేత్తో కానీ.. ఎలక్ట్రిక్ బీటర్‌తో కానీ బాగా కలపండి. [ ఇంకా...]

ఆధ్యాత్మికం - వరాహవాతరం

శ్రీ మహావిష్ణువు జలప్రళయంలో మునిగిపోయిన భూమిని ఉధ్ధరించటానికి వరాహరూపాన్ని దాల్చాడు. ఒకసారి మనువు వినయంతో చేతులు జోడించి పితృదేవులైన బ్రహ్మదేవునితో ఇలా అన్నాడు. "ఓ పితృవర్యా! సమస్త ప్రాణుల సృష్టికర్త మీరే, మేము ఏపనులు చేసి మిమ్ములను సేవించగలమో సెలవీయండి" అన్నాడు. ఆ మాటలు విన్న బ్రహ్మదేవుడు "కుమారా! నీకు శుభమగుగాక! నీమాటలతో సంతృప్తి చెందాను నీవు నాఆఙ్ఞతో ఆత్మసమర్పణం చేసుకున్నావు. [ ఇంకా...]

వంటలు - మాంగో ఖీర్

కావలసినవి:
తియ్య మామిడి గుజ్జు
చక్కెర పాకం
కొబ్బరి పాలు
ఎండు ద్రాక్ష - తగినన్ని

చేసే విధానం:
తియ్య మామిడి గుజ్జు తీసి వడగట్టండి. తరువాత దీన్ని ఒక స్టైన్‌లెస్ పాత్రలో పోసి, దానితో సమానమైన నీటిని కలపండి. [ ఇంకా...]

Wednesday, October 17

వంటలు - పులావ్

కావలసినవి:
బసుమతి బియ్యం - 3 కప్పులు
మామిడి పండ్ల రసం - 1కిలో
పాలు - 1 లీటర్
జున్ను - 1 కప్పు
చక్కెర - 2 కప్పులు
నెయ్యి - 3 చెంచాలు
రోజ్‌వాటర్ - 2 నిండు చెంచాలు
కుంకుమ పువ్వు - 11/2 చెంచా
బాదంకాయలు - 25
ఏలకకాయలు - 10
లవంగాలు - 6
దాల్చిన చెక్కలు - 4
ఉప్పు - చిటికెడు

చేసే విధానం:
పాలను, మామిడి రసాన్ని కలిపి రెండు సమభాగాలుగా ఉడికించండి. మూడు సార్లు బియ్యాన్ని కడిగి శుభ్రం చేసి వడబోయాలి. [ ఇంకా
...]

వంటలు - బర్ఫీ

కావలసినవి:
కొబ్బరి - ఒక కప్పు
మామిడి పండు రసం - ఒక కప్పు
నెయ్యి - ఒక చెంచాడు
పాలు - ఒక కప్పు
చక్కెర - ఒక చెంచాడు

చేసే విధానం:
మిక్సర్లో చూర్ణమయిన ఒక పూర్తి కప్పు కొబ్బరిని తీసుకోండి. [ ఇంకా
...]

పర్యాటకం - మధుర

మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా జన్మించిన నేల మధుర. మువ్వగోపాలుని మృదుపద మంజీరాలు ఘల్లు ఘల్లున నడయాడిన "బృందావనమే" అది. అక్కడ అణువణువునా వినిపించే కృష్ణనామ స్మరణ భక్తుల హృదయాలను పులకింపజేస్తుంది. పరమ పవిత్రమైన ఆ పట్టణంలోని ప్రతి వీథిలోనూ కృష్ణుడు కొలువుదీరి ఉన్నాడనడానికి అక్కడి అనేక ఆలయాలే నిదర్శనం. [ ఇంకా...]

ఆధ్యాత్మికం - పూర్ణ పురుషుడు

బుద్ధ భగవానుని సమకాలికుడైన మహావీరుడు - బుద్ధుని మహా పరిత్యాగం, బుద్ధుని తపస్సు, మానవాళిపట్ల బుద్ధుని ప్రేమను పదే పదే గుర్తుకు తెస్తాడు. బీహార్‌లోని పాట్నాకు సమీపంలోగల ఒక పట్టణంలో మహావీరుడు 599 బిసిలో జన్మించాడు. అతని తండ్రి ఒక ప్రముఖుడు. వజ్జీ రాజ్యధిపతి అయిన చేతకుని కుమార్తి ప్రియకరణి లేక త్రిశల - మహావీరుని తల్లి. బాల్యదశలో మహావీరుడు పాఠశాలకు పంపబడ్డాడు. పాఠశాలలో అధ్యాపకుల అవసరం అతనికి లేదని వివేకాన్ని అతడు మనస్సులోనే నెలకొల్పుకున్నాడు. [ఇంకా...]

Tuesday, October 16

నీతికథలు - తల్లి ప్రేమ

తల్లి ప్రేమ సాటిలేనిది. దక్షిణ భారతంలోని ఒక గ్రామంలోని ఒక రాజప్రాసాదం వంటి గృహంలో ఒక తల్లీ కొడుకు సుఖంగా జీవిస్తున్నారు. తల్లి వృద్ధాప్యం వల్ల కానిదయిపోయినప్పుడు ఆమెపట్ల శ్రద్ధ తీసుకునేందుకు కొడుకు విసుగుదల చూపాడు. అదృష్టవశాత్తూ ఇద్దరూ భాగ్యవంతులే కాకుండా తల్లి మంచి ఆరోగ్యంతోనే ఉండడం జరిగింది.
ఒక రోజు కుమారుడు తల్లితో తాను ఆమెను వదలి వెళ్ళేందుకు నిర్ణయించుకుని, మరోచోట గృహం ఏర్పర్చుకున్నానని చెప్పాడు. తాము విడిపోయేలోగా లెక్కలన్నీ తేల్చుకునే అభిలాషను కూడా తెలియచేశాడు. [ ఇంకా...]

నాటికలు - వద్దంటే పెళ్ళి

శానయ్య : తలుపేసుకోండి, ఇక్కడున్నట్టు వస్తాను.ఇల్లు పదిలం. ఇంతలో అపసవ్యాలు ఎమి జరగనియ్యవద్దు. డబ్బుకి చాటు రోజులు. నాదగ్గిర బాకీ వసూలు చేసుగోడానికని చెబుతూ కొదరూ నాకోసం రావచ్చు. వాళ్ళతోటి నేను ఊళ్ళోలేననీ, ఎక్కడ కెళ్ళానో ఎప్పుడొస్తానో తెలియదనీ, చెప్పండి. మరికొందరు నా బాకీలు వసూళ్ళు ఇవ్వడానికొస్తారు. వాళ్ళతోటిమాత్రం నేను సరయ్య ఇంట్లో ఉంటానని చెప్పండి. ( అని, కుడివేపుకి నిష్క్రమించబోయేసరికి, సరయ్య వస్తాడు). [ ఇంకా...]

పండుగలు - అంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవం

మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు" అంటూ తెలుగు నేలను తల్లిగా కీర్తించిన శంకరంబాడి సుందరాచారి, "చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా, గతమెంతో ఘనకీర్తి కలవోడా" అంటూ తెలుగు తేజాన్ని ఉద్వేగంతో గొంతెత్తిన వేములపల్లి శ్రీకృష్ణ, తెలుగు తల్లి సాంస్కృతిక దర్పాన్ని తమ రచనల ద్వారా తెలియజెప్పిన అనేక వేల యువ సాహితీ కుసుమాల కల్పవృక్షం ఆంధ్ర ప్రదేశ్. ఈ వృక్షానికి సాహితీ సుమాలే కాదు సంప్రదాయ సిద్ధాంతాలు కూడ వాడని పువ్వులై విరబూస్తుంటాయి. [ ఇంకా...]

వంటలు - మునగాకు చట్నీ

కావలసినవి :
మునగాకులు : కప్పు
నూనె : 2 టీస్పూన్లు
ఎండుమిర్చి : 6
సెనగపప్పు : టేబుల్ స్పూను
మినపప్పు : టేబుల్ స్పూను
చింతపండు : నిమ్మకాయంత (నీళ్ళల్లో నానబెట్టాలి)
ఉప్పు : ముప్పావు టీస్పూను
కొబ్బరి తురుము : 2టేబుల్ స్పూన్లు
ఆవాలు : అర టీస్పూను
ఇంగువ : చిటికెడు

తయారుచేసే విధానం:

పాన్లో టీస్పూను నూనె వేసి వేడిచేయాలి. ఎండుమిర్చి, సెనగపప్పు వేయించి తీయాలి. [ ఇంకా...]

వంటలు - రాజ్‌కప్స్

కావలసినవి( కప్స్ కోసం ):
మైదా - ఒకటిన్నరకప్పు
మెత్తగా రుబ్బిన బఠాణీలు -సగం కప్పు
ఉప్పు - సగం చెంచా
నూనె - రెండుచెంచాలు వేపడానికి సరిపడా నూనె
నింపడానికి
ఉడకబెట్టి ముక్కల్లా కోసిన బంగాళదుంపలు - ఆరు
ఉడకబెట్టిన శనగలు - రెండు చెంచాలు
సన్నగా తరిగిన ఉల్లిపాయలు - పావు కప్పు
ఉడకబెట్టిన బఠాణీలు - ఆరు చెంచాలు
చాట్ మసాలా - ఒక చెంచా
చిలికిన పెరుగు - ఒక కప్పు
కారం - సగం చెంచా
వేయించిన జీలకర్ర పొడి - ఒక చెంచా
ఉప్పు - తగినంత
పైన అలంకరించడానికి సన్న కారప్పూస, కొత్తిమీర కొద్దిగా, పుదీన పచ్చడి అల్లం పచ్చడి.

తయారుచేసే విధానం:
మైదాపిండిలో రుబ్బిన బఠాణీ, ఉప్పు, నూనె కొద్దిగా నీరువేసి మెత్తగా కలపాలి. [ ఇంకా...]

Monday, October 15

వంటలు - మాంగో ఐస్‌క్రీం

కావలసినవి పదార్ధాలు :
మామిడి పండ్లు - 1 కిలో
చక్కెర - 5 చెంచాలు
పాలు - 11/2 లీటర్లు
మీగడ - 4 ఔన్సులు
రోజ్ వాటర్ - ఒక ఔన్స్
తయారు చేసే విధానం:
మామిడి పండ్లను తోలు ఒలిచి, గుజ్జును ఒక మిక్సర్లో వేసుకోండి. [ ఇంకా
...]

ఆధ్యాత్మికం - రామ శబ్దము

బ్రహ్మదేవుడు 'నారాయణ' శబ్దం లోని రెండవ అక్షరమైన 'రా'ను నమశ్శివాయ శబ్దములోని రెండవ అక్షరమైన 'మ ' ను తీసుకొని రామ అను శబ్దమును సృష్టించి, సరస్వతీదేవికి చెప్పాడు. ఈ రామనామము మహా మహిమాన్వితమైనదనీ, రామనామం ఉఛ్ఛరిస్తే ఎంతో ఫలితం కలుగుతుందనీ, ముక్తిదాయకమని చెప్పాడు. ప్రక్కనే కుమారుడైన నారదుడు ఉన్నాడు. [ ఇంకా...]

వంటలు - బఠాణీ బోండా

కావలసిన పదార్థాలు:
బంగాళదుంపలు - రెండు కప్పులు( మెత్తగా ఉడికించి చిదమాలి )
బోండాల మధ్యలో పెట్టడానికి ఉడకబెట్టిన బఠాణీలు - ఒక కప్పు
నూనె - ఒక చెంచా
తరిగిన అల్లం ముక్కలు - ఒక చెంచా
కారం - సగం చెంచా
ధనియాల పొడి - ఒక చెంచా
గరం మసాలా - సగం చెంచా
సన్నగా తరిగిన కొత్తిమీర - ఒక చెంచా
ఉప్పు - రుచికి తగినంత
బోండాల పైకి
శనగపిండి - సగం కప్పు
కారం - సగం చెంచా
వాము - సగంచెంచా
సోడా - చిటికిడు
నునె - వేయించడానికి సరిపడినంత
ఉప్పు - తగినంత

తయారుచేసే విధానం:
ఉడకబెట్టి చిదిమిన బంగాళ దుంపలకు కొద్దిగా ఉప్పుకలిపి పక్కన పెట్టుకోండి. [ ఇంకా...]

Saturday, October 13

నీతి కథలు - చీమ యుక్తి

అది ఒక పెద్ద చీమల బారు. పప్పు బద్దలను నోట కరుచుకొని, ఆ చీమలు వాటి కలుగులోకి పోతున్నాయి. చీమలు పట్టుకొని వస్తున్న ఆ పప్పులను చూడగానే ఓ తొండకు నోరు వూరింది. మెల్లిగా చీమల బారు పక్కగా చేరి చీమల నోట్లో వున్న పప్పు బద్దలను లాగుకొని తినడం మొదలు పెట్టింది. చీమలకు భయం వేసి, చెల్లా చెదురుగా తిరుగుతున్నాయి కంగారుగా! చీమల నాయకురాలు పెద్ద కండ చీమ, చీమల కంగారు చూసింది. గబగబా చీమల దగ్గరకు వచ్చి వాటికి సంజ్ఞ చేసి, దగ్గరలో వున్న ఓ కలుగు దగ్గరకు వెళ్ళి కూర్చుంది. [ఇంకా... ]

Friday, October 12

పండుగలు - రంజాన్

పవిత్రతే పరమపదసోపానంగా ముస్లిం సోదరులు భావించే మాసం రంజాన్. రంజాన్ మాసంలో పసిపిల్లలనుంచి పెద్దవారి వరకు హృదయాలు పవిత్ర భావనతో నిండిపోతాయి. మానవాళికి ముక్తి మార్గాన్ని చూపించేందుకు దైవం పంపిన పరమ పవిత్రమైన "ఖురాన్" గ్రంధం అవతరించిన మాసమిది. అందుకే ఈ మాసానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. [ ఇంకా...]

నీతి కథలు - పారిన పథకం

గౌరీపురంలో వుండే సూరమ్మకు గయ్యాళితనము, ధనాశ ఒక పాలు ఎక్కువగానూ, పొదుపరితనము, సంపాదించగలిగే నేర్పు ఒక పాలు తక్కువగానూ వుండేవి. ఆమెకు ఇద్దరు పిల్లలు. వాళ్ళు చిన్నవాళ్ళుగా వుండగానే భర్తపోగా, ఉన్న ఆస్తినే కర్పూరంలా కరిగిస్తూ వాళ్ళను పెంచుకొచ్చింది. ఈ మధ్యనే కూతురు లక్ష్మికి పెళ్ళి చేసింది. ఇక పెళ్ళికి మిగిలినవాడు కొడుకు గోపాలుడు. [ ఇంకా...]

ఆధ్యాత్మికం - దివ్యప్రార్ధన

నిజ క్రైస్తవునికి ప్రతిదినం ప్రార్థనే ఊపిరి. ఒక భక్తుడు "నేను ఉదయం పూట ప్రార్థించని దినమున తల గొరిగించుకున్న సంసోను వలె ఉంటాను అన్నాడు. పరి.పౌలు మనము సంపూర్ణ భక్తి, మాన్యత కలిగి, నెమ్మదిగాను సుఖముగాను బ్రతికే నిమిత్తం - అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కోసం, రాజులు, అధికారులకోసం విజ్ఞాపనలు, ప్రార్థనలు యాచనలను, కృతజ్ఞతా స్తుతులను చేయవలెను;(1.తిమోతి-2:1,2) అని రాసెను. ఈ భూగోళము పాపంతో భారమైనను ఇంకనూ వేడితో దహించకుండా ఉండడానికి పరిశుద్దుల ప్రార్థనలే కారణం. [ ఇంకా...]

పిల్లల పాటలు - చక్కిలిగింత పాట

ఇల్లు అలికీ - ముగ్గూ వేసి
పీటవేసి - ఆకువేసి
పప్పువేసి - పాయసం వేసి
అన్నంపెట్టి - అప్పచ్చీ పెట్టి
పాలు పెట్టీ - పెరుగు వేసి
కూరవేసి - చారు వేసి [ ఇంకా
...]

ఆధ్యాత్మికం - బిల్వాష్టకం

1. త్రిదళం త్రిగుణాకారం - త్రినేత్రంచ త్రియాయుధం!
త్రిజన్మ పాపసమ్హారం - ఏకబిల్వం శివార్పణం.
2. త్రిశాఖై ర్భిల్వపత్రైశ్చ - హ్యచ్చిద్రైతహ కోమలై శ్శుభై:!
శివపూజాం కరిష్యామి - ఏకబిల్వం శివార్పణం. [ ఇంకా
...]

Thursday, October 11

ఆహార పోషణ - ఆకులో ఏముంది?

  • పప్పు, కూర, పులుసు, బజ్జీలు, పాలక్ పన్నీర్...రకరకాలుగా తినే పాలకూరల్లో అమినోయాసిడ్స్, ఐరన్, విటమిన్ ఎ, మెగ్నీషియం, సల్ఫర్, పోటాషియం, పోలిక్ యాసిడ్ పుష్కలం. ఒక్కమాటలో చెప్పమంటే
  • టమిన్లూ లభిస్తాయందులోపరిమళభరిత పుదీనాలోనూ విటమిన్లకు, ఖనిజలవణలకు కొదవేమీలేదు. ఐరన్, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. [ ఇంకా...]

ఆధ్యాత్మికం - భద్రాచల రామదాసు

'అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి ' అని చూపిస్తూ భద్రాచల వైభవాన్ని, సౌందర్యాన్ని వేనోళ్ళ పొగడుతూ అక్కడ రామచంద్రమూర్తి లక్షణునితో కూడి స్వర్ణప్రాకారాలతో గోపురాలతో విలసిల్లే దేవాలయంలో కొలువై భూలోక వైకుంఠంగా భద్రగిరిని శోభింపజేస్తున్నాడని, అక్కడ వెల్లువలై ప్రవహించే పవిత్రమైన గౌతమిలో స్నానంచేసి శ్రీరాముని కళ్లారా చూసి తరించమంటూ, స్థావర జంగమ రూపాలతో మన కళ్ళకు కనిపించేదంతా రామమయం అని, అంతరంగంలో ఆత్మారాముడు అనంతరూపుడై వింతలు సలుపుతున్నాడు అని, భద్రాచలంలో నెలకొన్న శ్రీరామచంద్రుని సృష్టిలో అంతటా చూచి, ఆ మహాత్ముని కొనియాడి, తరించడమే ముక్తిమార్గమని బోధించే 'అంతా రామమయం బీజగమంతా రామమయం ' అనే కీర్తనలు వినని వారుండరు. [ ఇంకా...]

Wednesday, October 10

పిల్లలపాటలు - మా మంచి అమ్మ

మా అమ్మ చెప్పేది మా మంచి మాటలు
మా అమ్మ పాడేవి ఇంపైన పాటలు
మా అమ్మ చేతివి కమ్మనీ వంటలు
మా అమ్మ తినిపించు గోరుముద్దలు [ ఇంకా
...]

పర్యాటకం - వన్యలోకం

అక్కడికి వెళితే నిజంగానే ప్రకృతి ఒడిలో ఉన్నట్లే. చుట్టూ ఆకుపచ్చని గడ్డి మైదానాలు, అగాధాల వంటి లోయలు, నీలాకాశం, ఎత్తయిన కొండలు, వాటిపైన చిక్కటి దుప్పటిలాంటి వనం, దానినిండా దట్టమైన ఫల ,పూల ఫృక్షాలు, చ ల్ల గాలి, ఆ వాతావరణం మనసును వశపరచుకోవడానికి ఎంతో సమయం పట్టదు. అది ప్రసిద్దిగాంచిన బి.ఆర్.కొండల మాటున ఉన్న ప్రముఖ అభయారణ్యం, బి.ఆర్.కొండలు, అక్కడి అరణ్యం ఒకప్పుడు అడవిదొంగ వీరప్పన్ రహస్య స్థావరాలుగా ఉండేవి. కాబట్టి పర్యాటకుల పెద్దగా అటుకేసి దృష్టి సారించలేదు. [ ఇంకా...]