Wednesday, October 31

పండుగలు - ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం

"మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు" అంటూ తెలుగు నేలను తల్లిగా కీర్తించిన శంకరంబాడి సుందరాచారి, "చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా, గతమెంతో ఘనకీర్తి కలవోడా" అంటూ తెలుగు తేజాన్ని ఉద్వేగంతో గొంతెత్తిన వేములపల్లి శ్రీకృష్ణ, తెలుగు తల్లి సాంస్కృతిక దర్పాన్ని తమ రచనల ద్వారా తెలియజెప్పిన అనేక వేల యువ సాహితీ కుసుమాల కల్పవృక్షం ఆంధ్ర ప్రదేశ్. [ ఇంకా...]

పిల్లల ఆటలు - ఏడు పెంకులు

ఎంతమంది ఆడవచ్చు : 12 మంది ఆడవచ్చు.
ఈ ఆటలో రెండు గ్రూపులు ఉండాలి. ఒక్కో గ్రూప్ లో ఆరుగురు చొప్పున రెండు గ్రూపులలో పన్నెండు మంది ఆడాలి. ఇద్దరు లీడర్లు తమ రెండు గ్రూపులకు కావలసిన వారిని కోరుకుంటారు. తరువాత 7 పెంకులను నేల మీద ఒక దాని మీద ఒకటి పేరుస్తారు. అటు వైపు ఒక గ్రూపు, ఇటు వైపు ఒక గ్రూపు నిలబడతారు. అచ్చు వేసి ముందుగా నెగ్గిన వారు బంతితో ఆ ఏడు పెంకులను కొడతారు.
[ ఇంకా...]

వంటలు - మైదా కారా (మైదా చిప్స్)

కావలసిన వస్తువులు:
మైదా - 700 గ్రా.
జీలకర్ర - 20 గ్రా.
డాల్డా - 100 గ్రా.
సోడా - చిటికెడు.
ఉప్పు, మిర్చిపొడి - సరిపడినంత.
జీలకర్ర పొడి - సరిపడినంత.
కరివేపాకు - సరిపడినంత.
రిఫైండ్ ఆయిల్ - సరిపడినంత.
డాల్డా - 100 గ్రా.

తయారు చేసే విధానం :
గిన్నెలో మైదా, జీలకర్ర, ఉప్పు, సోడా, డాల్డా వరుసగా వేసి సరిపడినన్ని నీళ్లతో మిశ్రమాన్ని బాగా కలిపి పెద్ద సైజు వుండలు చేసుకోవాలి. [ ఇంకా
...]

భక్తి గీతాలు -పలుకే బంగారమాయెనా

పలుకే బంగారమాయెనా కోదండపాణి పలుకే
పలుకే బంగారమాయె పిలిచిన పలుకవేమి
కలలో నీనామస్మరణ మరువ చక్కని తండ్రి పలుకే
ఇరువుగ నిసుకలోన బొరలినయుడుత భక్తికి
కరుణించి ప్రోచితివని నెరనమ్మితి నిన్నే తండ్రి పలుకే [ ఇంకా
...]

పిల్లల పాటలు - తూ తూ తూనీగా

తూతూ తూతూ తూనీగా
ఎగురలేము నీలాగా.
నీవు తిరుగు తున్నావంటే
వాన మాకు వచ్చే మాటే.
నీ రెక్కల అమరికలోనే
నీ కబ్బును నేరుపు తానే. [ ఇంకా
...]

Tuesday, October 30

నీతి కథలు - మొక్కలకు నీళ్ళు తోడిన దొంగలు

ఒకసారి విజయనగర సామ్రాజ్యంలో భయంకరమైన కరువు వచ్చింది. వర్షాలు అస్సలు కురవలేదు. దానికి తోడు ఎండలేమో మండిపోయాయి. దాంతో బావులలోను, పంపుల్లోను నీళ్ళు ఎండిపోయాయి. ఎప్పుడూ నీటితో నిండుగా ఉండే బావులలో నీళ్ళు బాగా లోపలికి వెళ్ళిపొయాయి.
తెనాలి రామలింగడి ఇల్లు తుంగభద్రానది ఒడ్డున ఉన్న ఆయన ఇంట్లో కూడా బావిలో నీళ్ళు బాగా లోపలికి పోయాయి.
[ ఇంకా...]

ఆధ్యాత్మికం - ఆత్మ సౌందర్యము

సుందరమైన వస్తువు ఆనందమును గొల్పును, చక్కని పుష్పము జనులకు ఆహ్లాదమును గలుగజేయును. అట్లే సుంధర భవనము, సుందర చిత్రము, సుందర దేహము జనుల హృదయ సీమలందు ఆనందము యొక్క సంచారమునకు హేతుభూతములగుచున్నవి.
A Thing of beauty is a joy forever అను ఆంగ్లసూక్తి ఈ భావమునే స్పష్టీకరించుచున్నది. "సుందర పదార్ధము పరమానందమును గలిగజేయు" నని ఆ వాక్యముయొక్క అర్ధము.
[ ఇంకా...]

వంటలు - గోరుచిక్కుడుకాయ కూర

కావలసిన వస్తువులు:
గోరుచిక్కుడు ముక్కలు : 2 కప్పులు
తాజా పెరుగు : కప్పు (గిలకొట్టాలి)
ధనియాల పొడి : టేబుల్ స్పూను
కారం : 2 టీస్పూన్లు
సెనగపిండి : 2 టీస్పూన్లు
జీలకర్ర : టీస్పూను
ఆవాలు : అర టీస్పూను
ఇంగువ : పావు టీస్పూను
కరివేపాకు : 2 రెబ్బలు
నూనె : 2 టెబుల్ స్పూనులు
ఉప్పు : తగినంత

తయారుచేసే విధానం:
గోరుచిక్కుడు కాయలను ఈనెలుతీసి చిన్నముక్కలుగా కోయాలి. ముక్కలను కుక్కరులో రెండు వుజిల్స్ వచ్చేంతవరకు ఉడికించి నీళ్ళు వంచాలి. [ ఇంకా...]

సాహిత్యం - వాడుక బాష

ప్రజలు తమ నిత్య జీవితంలో మట్లాడుకునే భాష వాడుక భాష.
సనాతన భావాలను సమర్ధిస్తూ గ్రాంధిక భాషలో రచనలు చేయడమేగాక బిచ్చగాడితో సైతం గ్రాంధిక భాషలోనే మట్లాడేవారు కొక్కొండ వెంకటరత్నం (1842-1915)గారు. ఇంట్లో భార్యతో కూడా గ్రాంధికంలోనే సంభాషించేవారు.
వాడుక భాషలో గ్రంధ రచన సాగాలని గురజాడ పిలుపునిచ్చారు. [ ఇంకా...]

వంటలు - బంగాళదుంప చక్రాలు

కావలసిన పదార్థాలు :
పెద్దసైజు బంగాళదుంపలు - నాలుగు
నూనె లేదా నెయ్యి - వేయించడానికి సరిపడినంత
ఉడకబెట్టిన బఠాణీలు - రెండు కప్పులు ( మెత్తగా రుబ్బినవి )
సన్నగా తరిగిన అల్లం ముక్కలు - ఒక చెంచా
పచ్చిమిరపకాయలు - రెండు ( సన్నగా తరగాలి )
జీలకర్ర - ఒక చెంచా
నూనె - ఒక చెంచా
గరం మసాలా - సగంచెంచా
ఉప్పు - తగినంత

తయారుచేసేవిధానం:
మొదట బంగాళదుంపల పొట్టు తీసి అడ్డంగా రెండు సమభాగాలుగా కట్‌చేసు కోవాలి. [ ఇంకా...]

Monday, October 29

వంటలు - మామిడి హల్వా

కావలసినవి:
మామిడి పళ్ళరసం - 8 కప్పులు
చక్కెర - 1 కిలో
పాలు - 4 పైంట్ల
నెయ్యి - 1 కిలో
బాదంకాయల తునకలు - 1/2 కప్పు
ఎండు ద్రాక్ష - తగినన్ని

చేసే విధానం:
ఒక పెద్ద బాణలిలో మామిడిరసం, చక్కెర, పాలు వేడిచేయండి. మధ్యస్థమైన వేడిలో వీటిని బాగా కలియతిప్పుతూ ఉండండి. [ ఇంకా...]

వ్యక్తిత్వ వికాసం - సమస్యను మించిన పరిష్కారం

పూర్వం ఒక గొప్ప చక్రవర్తి రాజ్యం పాలిస్తూ ఉండేవాడు. ఆ చక్రవర్తికి సుప్రసిద్ధుడైన మంత్రి పుంగవుడు ఉండే వాడు. అతడు మంచి కుశాగ్రబుద్ది గల ప్రజ్ఞావంతుడు. సమర్ధుడు. రాజ్యపాలనకు సంబందించిన అన్ని విషయాలలోను ఎప్పటికప్పుడు చక్రవర్తికి తగిన సలహాలను ఇస్తుండేవాడు. దూరదృష్టితో వివేకవంతమైన ఆ సలహాలను చక్రవర్తి జవదాటకుండా పాటిస్తూ ఉండేవాడు. ఆ మంత్రిగారి సహాయం, సలహాలు లేకపోతే రాజ్యపాలన కుంటుపడిపోతుందనే అభిప్రాయం చక్రవర్తికి కలిగింది. [ ఇంకా...]

పండుగలు - కార్తీక మాసము

భగవంతునికి ఎక్కువ ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. ప్రతి ఏటా దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో భక్తులంతా నిత్యం శివ నామాన్ని స్మరిస్తూ ఉంటారు. పురాణ కాలంనుంచీ ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తూ కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది. [ ఇంకా...]

వ్యక్తిత్వ వికాసం - మనశ్శాంతి

మొదట మనస్సన నెట్టిదో విచారించిన తరువాత దాన్ని శాంతిపఱచు మార్గమునన్వేషింపవచ్చును. మనస్సనునది భగవదంశము. అది ప్రపంచవికారము నొందినపుడు మనస్సని, నిర్వికార స్థితినొందినపుడు ఆత్మయని పిలువబడును. సృష్టి స్థితిలయములు మనసులోనే యున్నవి. సుఖదు:ఖములు మంచి చెడ్డలు దానివల్లనే ఏర్పడుచున్నది. ఒక్క మాటలో చెప్పవలయునన్న సర్వము మనసే. [ ఇంకా...]

ఆధ్యాత్మికం - భాగవతం వింటే బాగవుతాం

శ్రీ కృష్ణాష్టకం
1.వసుదేవసుతం దేవం - కంసచాణూరమర్ధనం
దేవకీపరమానందం - కృష్ణం వందే జగద్గురుం.
2.అతసీపుష్పసంకాశ - హారనూ పురశోభితం
రత్నకంకణకేయూరం - కృష్ణం వందే జగద్గురుం. [ ఇంకా...]

Saturday, October 27

పండుగలు - మొహర్రం

కాలం తనపని తాను చేసుకుంటూ పోతూ ఉంటుంది. అది ఎవరికోసం ఆగదు.అంతులేని నిరంతర కాలప్రవాహంలో మలుపులే కానీ మజిలీలు లేవు.కాలగమనంలో ఎన్నో కేలండర్‌లు మారుతూనే ఉంటాయి.ఎన్నెన్నో సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉంటాయి.ఈ కాల ప్రవాహంలో నూతన సంవత్సరాలు వస్తూనే ఉంటాయి.కనుమరుగు అవుతూనే ఉంటాయి. [ ఇంకా...]

ఆహార పోషణ - పండ్లతో ఆరోగ్యం

  • ప్రతిరోజు కమలాపండు రసం తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
  • బొప్పాయి పండును క్రమతప్పకుండా ప్రతిరోజూ తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడాన్ని ఆరికడుతుంది.
  • జ్వరంవల్ల దాహం తీరికపోతే దానిమ్మరసం తాగితే మంచి ఫలితం ఉంటుంది.
  • మధుమేహవ్యాధిగ్రస్తులకు నేరేడుపండ్లు దివ్యౌషధంగా పనిచేస్తాయి. [ ఇంకా...]

మీకుతెలుసా - సున్నా కథ

మంకందరికీ సున్నా తెలుసు. ఇది ఒకటికన్నా ముందు వస్తుంది. ఈ సున్నాను కనుగొనడం గణితశాస్త్రం మొత్తం మీద విప్లవాత్మక మైన మార్పు తెచ్చింది. సున్నా అనే భావన బాబిలోనియాలాంటి పలు పురాతన నాగరికతలలో కనిపించినప్పటికీ, మనం ఇవాళ ఉపయోగిస్తున్న చిహ్నం ఆ తరువాతి కాలం వరకు కనుగొనబడినది.
మద్య ఆసియా-భారత దేశాల మధ్య వర్తక వాణిజ్యా సంబంధాలు మనదేశానికి 'సున్నా' ను పరిచయం చేశాయని కొందరు నిపుణులు భావిస్తున్నారు.
[ ఇంకా...]

ముఖ్యమైన ఘట్టాలు - అన్నప్రాసన

అన్నప్రాశమమంటే పుట్టిన శిశువుకు మొట్టమొదటిసరి అన్నం ముట్టించడం. ఈ సంస్కారం వలన శిశువుకు ఆయువు, ఆరోగ్యం, తేజస్సు వృద్ధి చెందుతాయి.
అన్నప్రాశన చేయు విధానం: పిల్లలకు ఆరు లేక ఎనిమిది లేక పది మాసములందైనను వర్షాంతమందైనను, శుక్లపక్షమునందు శుక్రుడు ఆకాశమందు పరిశుద్ధుడై ప్రకాశించుచున్నపుడు నవాన్నప్రాశనము చేయవలెనని ఋషులచే చెప్పబడింనది(ముహూర్త దర్పణం).
[ ఇంకా...]

Friday, October 26

వ్రతములు - శ్రీ వైభవ లక్ష్మి వ్రతము

క్షీర సముద్రరాజతనయా, శ్రీ లక్ష్మీ, హరివల్లభ, విద్యాలక్ష్మి, రమా, వైభవలక్ష్మీ, సాంప్రదాయినీ, శ్రీ చక్ర విలసిని, యోగమాత, ప్రకృతి స్వరూపిణీ, జగద్రక్షిణీ అని అనేక నామములతో విరాజిల్లుతున్న శ్రీలక్ష్మిదేవి యైక్క పూజాకధను తెలుసుకుందాము.
వేదములలో లక్ష్మిదేవి యెక్క స్తవన రూపమును అనుసరించి సూక్తములు వివరించబడినవి.లక్ష్మిదేవి యైక్క స్వరూపాన్ని అధర్వణవేదం చాలా చక్కగా తెలియజేయుచున్నది.అదే అధర్వణ వేదమునందు ఫలములను నిర్దేశించే లక్ష్మీ హృదయము ఉపదేశించ బడినది. [ ఇంకా
...]

ఆధ్యాత్మికం - దేహమే దేవాలయం

"దేహమే దేవాలయం జీవుడే దేవుడు" అనే వేద ప్రమాణానుసారం, సృష్టిలో ఉండే ప్రతి జీవి దేహం ఒక దేవాలయమే. ప్రతి జీవి కూడా పరబ్రహ్మమే. అయితే ఇక్కడ మానవులు మినహా ఇతర ప్రాణులకు ఈ విషయం అనుభవంలోకి రాలేదు ఎందుకంటే వాటికి పుట్టుకతోనే విచక్షణాజ్ఞానం లేకుండా పుడతాయి, అదే బలహీనతను ఆసరా చేసుకొని మానవుడు ఇతర జీవుల పట్ల తనకున్న విచక్షణా జ్ఞాన్ని ఉపయోగించుకొని తన స్వార్ధం కోసం తన వశంలోకి తెచ్చుకొని ప్రయోజనాన్ని పొందుతున్నాడు. [ ఇంకా...]

వ్యక్తిత్వ వికాసం - విజయానికి దశ సోపానాలు

"Struggle for the existence and survival & the fittest" అని చార్లెస్ డార్విన్ పేర్కొన్నట్లు ప్రస్తుతము ప్రపంచమంతా పోటీమయమైపోయినది. ఇది 'పులి-జింక ' ఉదంతం వలె ఉంటుంది. 'జింక ' వేగంగా పరిగెత్తటం నేర్చుకొంటేనే మనగల్గుతుంది. లేదా పులి నోటికి ఆహారమౌతుంది. అయితే 'పులి ' జింక కంటే వేగంగా పరిగెత్తటం నేర్చుకోవాలి. లేదా జింక నోటికందకుండా పారిపోతుంది. [ ఇంకా...]

ముఖ్యమైన ఘట్టాలు - ఉపనయనం

కుమారునికి తండ్రి ఉపనయనం చేస్తాడు. తండ్రి దేశాంతరమందుంటే తాత (తండ్రి యొక్క తండ్రి), అతను లేకుంటే తండ్రి సోదరులు వారుకూడా లేకపోతే వటుడి అన్న దానికి అధికారి అవుతాడు. ఒకవేళ అతను కూడా లేకపతే సగోత్రమునందు పుట్టినవారు చేయాల్సిఉంటుంది.

ఏ వయసులో చెయ్యాలి?
బ్రాహ్మణ కులంలో 8వ సంవత్సరాన, క్షత్రియులకు 11వ ఏడున, వైశ్యులకు 12వ ఏడున ఉపనయనం చేయాలి. బ్రాహ్మణులకు చైత్ర మరియు వైశాఖ మాసాలు, క్షత్రియులకు జ్యేష్ట, ఆషాఢ మాసాలూ, వైశ్యులకు ఆశ్వయుజ కార్తీక మాసాలు మంచిది. [ ఇంకా
...]

Thursday, October 25

ముఖ్యమైన ఘట్టాలు - యజ్ఞోపవీతం

'యజ్ఞ+ఉపవీత ' అను రెండుపదాలలో ఈ యజ్ఞోపవీతశబ్దం ఏర్పడుతుంది. యజ్ఞ = యజ్ఞార్థము- అనగా ఉత్తమ కర్మలాచరించుటకు చిహ్నంగా ధరింపబడు, ఉపవీతం = దారం. కనుక దీనిని యజ్ఞోపవీతమంటారు. "యజ్ఞో వై శ్రేష్ఠతమం కర్మ"- శ్రేష్ఠమైన (సత్) కర్మలన్నీ యజ్ఞపదంతో చెప్పబడుతాయి. కావున యజ్ఞోపవీత శబ్ధంలోని యజ్ఞ పదం మానవుడు పురుషార్థ సాధనకు చేయునుత్తమకర్మల కన్నింటికి బోధకంగా- సూచకంగా- ఉంటుంది. [ ఇంకా...]

అందరి కోసం - జానపదనృత్యాలు

అసంఖ్యాక జాతులతోనూ పతిస్థితులతోనూ కూడి ఉన్న భారతదేశం అనేక శతాబ్దాలుగా రకరకాల జానపద నృత్యాలకు నిలయంగా ఉంది. భారతదేశంలోని నేటి శాస్త్రీయ నృత్య విధానాలు చాలా కట్టుబాట్లకు లోబడి ఉండటంతోపాటు ఎంతో నాజూకుతనాన్ని చూపుతున్నది. ఆటవికుల గూడెములోనూ కర్షకుల కుటీరాలలోనూ నేటికి తమ పాటవాన్ని కోల్పోకుండా బ్రతికి ఉన్న సామాన్య ప్రజా నృత్యాలనుండి మన శాస్త్రీయ నృత్యాలు పుట్టాయి. [ ఇంకా...]

ఆధ్యాత్మికం - విఘ్నేశ్వరుడు

ఈ విధంగా విఘ్నేశ్వరుని సర్వకార్యాలకు విఘ్నములు తొలగిపోయి అనుకున్న కార్యము జయప్రదంగా నెరవేరవలెనని షోడశోపచారములతో పూజించి పూజా అక్షతలు శిరస్సున ధరిస్తారు.
గణపతి పుట్టుక అందరికీ తెలిసిందే, వివిధయుగాలలో 'గణపతి ' లీలను పరిసీలించినచో 'కృతయుగం' లో 'మహోత్కట వినాయక ' అనుపేరుతో ఉధ్భవించి దేవాంతక నరాంతక అను రాక్షసులను సం హరించెను. [ ఇంకా
...]

Wednesday, October 24

పండుగలు - మాఘ మాసము

మాఘ మాసం" ఎంతో విశిష్టమైనది. ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన తిథి "శుక్ల పక్ష చవితి" దీనిని "తిల చతుర్థి"అంటారు. దీన్నే "కుంద చతుర్థి" అని కూడా అంటారు. నువ్వులను తింటారు. నువ్వులతో లడ్లు చేసి పంచి పెడతారు. ఈ రోజున "డుంఢిరాజును" ఉద్దేశించి, నక్త వ్రతము పూజ చేస్తారు! డుంఢిని ఈ విధంగా పూజించడం వలన దేవతల చేత సైతం పూజలందుకుంటారని కాశీ ఖండములో తెలియజేశారు. [ ఇంకా...]

మీకుతెలుసా - ఫూల్స్ డే

ఒకప్పుడు ఫ్రాన్స్‌లో ఏప్రిల్ ఫస్ట్‌న కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునేవారు. 1582లో రాజైన చార్లెస్-9 కేలెండెర్‌ని మార్చేసి జనవరి 1న కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవాలని ఆదేశాలు జారీ చేశాడు. అయితే సమాచర వ్యవస్థ అంతగా వృద్ధి చెందని ఆ కాలంలో ఆ వార్త దేశంలోని ప్రజలందరికీ త్వరగా చేరలేదు. రాజధానికి దగ్గర్లోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే చేరింది. ఈలోగా మళ్ళీ కొత్త ఏడాది వచ్చేసింది. [ ఇంకా...]

అందరి కోసం - నాట్యం

నాట్య శబ్దము నృత్యమునకు పర్యాయపదము. భరతుని నాట్య శాస్త్రంలో నృత్యం అనే పదం లేదు. నృత్తము, నాట్యము అను పదములే కలవు. నృత్తము నాట్యముకంటే చాలా ప్రాచీనమైనది. ఈ రెండు కళలు వేర్వేరుగ జన్మించి, వేర్వేరుగ అభివృద్ధి చెందాయి. భరతుడే ప్రధమంగా నృత్తమును నాట్యంలో చేర్చాడు. కరణ-అంగహార సంపన్నమైనది నృత్తము. ఇది అర్ధాన్ని బోధించదు. కేవలం అవయవ విన్యాసములతో కూడి ఉండును. [ ఇంకా...]

సంగీతం - సామగానం

'వేదానాం సామవేదోస్మి ' అంటాడు కృష్ణ పరమాత్మ. భగవధ్గీత విభూతి యోగంలో. రుక్ వేదం- రుక్కులతో కూడినది. ఎవరైనా కంఠోపాఠం చేశారు అనడానికి 'రుక్కు పెట్టేశాడు ' అంటారు. రుగ్వేద అధ్యయనం చేసినప్పుడు అనేమాట ఈనాటికీ వాడుకలో ఉన్నది. రెండవది యజు: -యజుర్వేదము, యజు: అంటే యాగం యాగంచేసేటప్పుడు వల్లెవేసేదే యజుర్వేదం. పై రెండువేదాలకూ కృష్ణ పరమాత్మ ప్రాధాన్యం ఇవ్వలేదు. [ ఇంకా...]

Tuesday, October 23

హాస్య సంపద - జోక్స్

ఒక పేటకు చెందిన చర్చి అధికారి ఆ పేట గుండా నడిచి వెళ్ళ్తున్నాడు.దారిలో ఆ చర్చికి సంబంధించిన ఒక వ్యక్తి ఆ ఫాదరుకు కనపడ్డాడు. అతన్ని చూసి "ఏవయ్యా నీ జలుబు ఎలా వుంది?" అని అడిగాడు.
" చాలా మొండిగా వుంది ఫాదర్."
" నీ భార్య ఎలా వుంది?"
" ఆమె అట్లాగే వుంది " అని ఆ వ్యక్తి జవాబిచ్చాడు. [ ఇంకా
...]

పర్యాటకం - శైవక్షేత్రాలు

ప్రతి సంవత్సరం శివరాత్రి మహా పర్వదినం వచ్చిందంటే చాలు ఊరూర వెలసిన శివక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడిపోతాయి. వందలు, వేల సంఖ్యలో భక్తులు పొద్దంతా ఉపవాసాలు ఉండి, సాయంకాలం నుండి రాత్రిళ్లు పొద్దు పోయేదాకా ఈశ్వరుని ఆరాధనలలో మునిగిపోతారు. రాత్రంత జాగారం చేసే వారు మరెందరో. దేశవ్యాప్తంగా ఆ రోజు శైవ దేవాలయాలన్నీ ప్రత్యేక అర్చనలు, సేవలు, అభిషేకాలతో కన్నులపండువ చేస్తాయి. [ ఇంకా...]

Monday, October 22

ఆధ్యాత్మికం - వామనావతారం

సృష్టి, స్థితి, లయలకు కారకులు త్రిమూర్తులు. వీరు తమ భక్తులకు ఇచ్చు వరాలకు ఏదేని విపరీతాలు సంభవిస్తే, దాని వలన మానవాళికి హాని కలిగితే, తిరిగి వీరే ఏదో ఒక అవతారాన్ని ఎత్తి వారిని హతమార్చి సర్వమానవ సౌబ్రాత్రుత్వానికి మేలు చేస్తారు. అందులో భాగంగానే ఈ 'దశావతారాలు' అనగా పది అవతారములు. మొదటిది మత్స్యావతారం, రెండవది కూర్మావతారం, మూడవది వరాహావతారం, నాల్గవది నరశిం హావతారం, అయిదవది వామనావతారం, ఆరవది పరశురామావతారం, ఏడవది రామావతారం, ఎనిమిదవది కృష్ణావతారం, తొమ్మిదవది బుధ్ధావతారం, పదవది కల్కి అవతారం. [ ఇంకా...]

వంటలు - గోధుమరవ్వ గంజి

కావలసినవి పదార్థాలు:
సన్నటి గోధుమరవ్వ - ఒక గ్లాసు
పంచదార - ఆరు స్పూన్లు
పాలు - మూడు గ్లాసులు
యాలుకల పొడి - కొద్దిగా

తయారుచేసేవిధానం:
ఒక వంతు గోధుమరవ్వకు మూడు వంతు నీళ్ళు తీసుకొని ముందుగా నీళ్ళను బాగా మరిగించాలి. [ ఇంకా...]

వంటలు - శనగ గుగ్గిళ్ళు

కావలసినవి పదార్థాలు:
సెనగలు - అరకిలో
పోపుదినుసులు - సరిపడా
కొత్తిమీర - రెండు కట్టలు
కరివేపాకు - ఒక కట్ట
పచ్చి మిరపకాయలు - ఆరు, ఏడు
మంచి నూనె - కొద్దిగా
నిమ్మరసం - మూడు చెంచాలు
ఉప్పు - సరిపడా

తయారుచేసే విధానం:
అరకిలో సెనగలను శుభ్రం చేసి ఉదయమే నూళ్లలో నానబెట్టాలి.బాగా నానిన సెనగలను నీళ్లు లేకుండా చక్కగా వడకట్టాలి.
[ ఇంకా...]

వ్యాయామ శిక్షణ - మీరు-మీపాదాలు

మీపాదాలతో మీరెంత దూరం నడుస్తున్నారో తెలుసా? సుమారు 1,60,000కి.మీ.లకు పై బడిన దూరం భూతలం మీద, కొండలమీద, కోనలలో, మైదానాలలో,తోటలలో, పోలాలలో నడుస్తున్నారు. 26 ఎముకలతో, 33 కీళ్ళతో, 100కి పైన కండరాలతో మీ పాదం చాల సంక్లిషమై ఉంటుంది. పాదాలు అతి సున్నితమైనవి, నాజూకైనవి. [ ఇంకా...]

పిల్లల పాటలు - కెరటం

రంగురంగుల బొమ్మను
బాలలు ఆడే బొమ్మను
నాట్యము చేసే బొమ్మను
ఎరువు, తెలుపు బొమ్మను [ ఇంకా...]

Saturday, October 20

వంటలు - పెసరపప్పు గంజి

కావలసిన పదార్థాలు:
పెసరపప్పు - 2 గ్లాసులు
పంచదార - ఆరు స్పూన్లు
చిక్కటిపాలు - 4 గ్లాసులు
యాలుకల పొడి - కొద్దిగా

తయారుచేసే విధానం:
పెసరపప్పును కొంచెం నీటిలో బాగా ఉడికించాలి. పప్పు బాగా ఉడికిన తరువాత వేడి చేసిన పాలను పప్పులో పోసి ప్పప్పు, పాలు రెండు బాగా కలిసేలా కలియబెట్టాలి. [ ఇంకా...]

వ్యక్తిత్వ వికాసం - ఆత్మ గౌరవం

ఎవరైతే కష్టించి పని చేస్తారో, ఙ్ఞానవంతులో, తెలివి కలవారో, నైపుణ్యం కలవారో అటువంటి వారు అన్ని చోట్లా గౌరవింప బడతారని జగమెరిగిన సత్యం. అఙ్ఞానులు, అసమర్ధులు, సోమరిపోతులు, మందబుద్దులు ఎల్లప్పుడూ అవమానాల పాలవుతారు. ఎన్ని సార్లు అవమానించ బడినా, చీత్కరించబడినా, అనేక సార్లు హెచ్చరించబడినా, తాఖీదులందుకొన్నా, తమతప్పులకు చివాట్లు తిన్నా, చివరకు శిక్షించబడినా కూడా కొంతమంది తమకు తాము మెరుగు పరచుకోవడానికి ప్రయత్నించరు. అటువంటి వాళ్ళు బాధపడరు. [ ఇంకా...]

వంటలు - గుమ్మడి చట్నీ

కావలసినవి:
కందిపప్పు - ఒక కప్పు
ఎండుమిర్చి - ఐదు
గుమ్మడి తురుము - అర కప్పు
ధనియాలు, జీలకర్ర - రెండు స్పూన్లు
వెల్లుల్లి - ఒక రెబ్బ
చింతపండు - రెండు రెబ్బలు
నూనె - తగినంత
ఇంగువ, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు - తగినంత

తయారు చేసే విధానం:
ముందుగా ఒక గిన్నెలో కొంచెం నూనె వేడిచేసి కందిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి. మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర గుమ్మడి వేసి వేయించాలి.
[ ఇంకా...]

వంటలు - చురుమురి

కావలసిన పదార్థాలు:
మరమరాలు - 1/4 కిలో
క్యారట్ తురుము - 100 గ్రా
కీర తురుము - 100 గ్రా
ఉప్పు - తగినంత
కారప్పొడి - కొద్దిగా
కొత్తిమీర తురుము - కొద్దిగా
నిమ్మరసం - రెండుస్పూన్లు

తయారుచేసే విధానం:
మరమరాలను ఒక చిన్న గిన్నెలోకి తీసుకుని దానికి క్యారట్ తురుము, కీరా తురుము, ఉప్పు, కారప్పొడి, కొత్తిమీర తురుము వేసి చక్కగా కలిపి సన్నటి సెగ మీద రెండు, మూడు నిమిషాలు వేయించాలి.
[ ఇంకా...]

ఆధ్యాత్మికం - నిరంతర దైవ చింతన

జైన శాస్త్రములో ఒక చక్కనిగాధ కలదు. పూర్వము శ్రీ రామచంద్రుడు రావణ సంహారానంతరము పట్టాభిషేకము పూర్తి ఆయినపిదప ఆనందముగా రాజ్యమును పరిపాలించుచుండెను. యుద్దమున శ్రీరామునకు సాయమొనర్చిన పలువురు ఆ సమయమున శ్రీ రామచంద్రుని సమీపించి "మహాత్మా యుద్దకాలమున మేము తమకు ఆనేక విధముల తోడ్పడి తమ సేవలొ పాలుపంచుకొంటిమి. మహత్తర పుణ్యమును తద్వారా మేము సముపార్జించుకొనగలిగితిమి. [ ఇంకా...]

Friday, October 19

వంటలు - గుమ్మడి విత్తనాల కర్రీ

కావలసినవి:
గుమ్మడి గింజలు - ఒక కప్పు
కందిపప్పు - 1/2 కప్పు
పచ్చికొబ్బరి తురుం - ఒక కప్పు
గరంమసాల - ఒక చెంచా
ఉప్పు, కారం - రుచికి తగినంత
పెద్ద ఉల్లి - ఒకటి
టమాటాలు - రెండు
పచ్చిమిరపకాయలు - రెండు
కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, మీగడ - తగినంత

తయారుచేసే విధానం:
ముందుగా గింజలని ఉడికించాలి, పప్పును ఉడికించాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నూనె వేడిచేసి తాలింపు చేసాక, ఉల్లిపాయ, మిరపకాయలు వేసి వేయించాలి.
[ ఇంకా...]

వంటలు - గుమ్మడి పప్పు

కావలసినవి:
గుమ్మడి ముక్కలు - ఒక కప్పు
బంగళాదుంపలు - రెండు చిన్న ముక్కలు
ఉల్లిగడ్డ - ఒకటి
పచ్చిమిరపకాయలు - రెండు
గరంమసాలా - ఒక చెంచా
పచ్చికొబ్బరి పొడి - ఒక చెంచా
పుదీనా, కొత్తిమీర, కరివేపాకు - తగినంత
నూనె, మీగడ - ఒక చెంచా
కారం, ఉప్పు - రుచికి తగినట్టు
టమాటాలు - రెండు

తయారుచేసే విధానం:
ముందుగా కందిపప్పు, దుంపలు ఉడికించాలి. గుమ్మడి ముక్కలు సన్నగా తరగాలి. ఒక గిన్నెలో నూనెపోసి వేడిచేసి తాలింపు చేయాలి.
[ ఇంకా...]

వంటలు - చలిని తరిమేసే చిరుతిళ్ళు

సాధారణంగా చిరుతిళ్ళు తింటే ఊబకాయం వస్తుందనీ, అవి అనారోగ్యానికి దారి తీస్తాయని అందరూ చెబుతుంటారు. చిరుతిళ్ళు అంటే వాళ్ళ దృష్టిలో వేళా పాళా లేకుండా ఏదిపడితే అది తినెయ్యడం. భోజనం చేసిన వెంటనే ఏదో ఒకటి నోట్లో వేసుకోవడం మనలో చాలామందికి అలవాటే. ఇటువంటి చిరుతిళ్ళు ఆరోగ్యాన్ని హరిస్తాయనడంలో ఎటువంటి సందేహమూ లేదు. [ ఇంకా...]

వ్యక్తిత్వ వికాసం - కమ్మ్యూనికేషన్ గ్యాప్

సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని తీసుకోవడం ఒక ఎత్తైతే ఆ నిర్ణయాన్ని సరైన సమయంలో సద్వినియోగం చేసుకోవడం మరో ఎత్తు. ఒక వ్యక్తి యొక్క ప్రతిభకు అద్దంపట్టేది ఆ వ్యక్తి సమయాన్ని సద్వినియోగం చేసుకునే విధానం మాత్రమే. అతని నిర్ణయాన్ని విజయపధంవైపు మళ్ళించేది అతని సమయపాలన (టైమింగ్) మాత్రమే. కాబట్టి "టైం ఈజ్ మనీ" అన్నారు పెద్దలు. కానీ "టైం ఈజ్ మనీ". [ ఇంకా...]

Thursday, October 18

మీకు తెలుసా - మోటారు కారు కథ

13వ శతాబ్దంలోనే శాస్త్రజ్ఞులు, కవులు, రచయితలు, పరిశోధకులు ఆటోమొబైల్‌ను గురించి అనేక కలలు కన్నారు. కలలన్నీ నిజాలుగా మార్చడానికి ఆటోమొబైల్‌ రంగంలో శ్రీకారం చుట్టడానికి ఫ్రెంచి మార్గదర్శకుల అపూర్వమైన అభినివేశము, పట్టుదల ముఖ్య కారణం అని చెప్పకతప్పదు. మోటరు కారు రోడ్డుమీద తిరగడానికి మోళికంగా చక్రాలు ముఖ్యమైన, వేగం సాధించాలనే ఉబలాటమే దీని అభివృద్దికి ముఖ్య కారణమైంది. [ ఇంకా...]

వంటలు - ఈస్టర్ కేక్

కావలసిన పదార్థాలు :
మైదాపిండి - 200 గ్రాములు
పంచదారపొడి - 200 గ్రాములు
నెయ్యి - 200 గ్రాములు
గుడ్లు - నాలుగు
బేకింగ్ పౌడర్ - 1 టేబుల్ స్పూన్
వెనీల టేబుల్ - 1 టేబుల్ స్పూన్
ఐసింగ్ కోసం..
వెన్న 100 గ్రాములు, ఐసింగ్ సుగర్ 200 గ్రాములు

తయారీవిధానం:
మైదాపిండి జల్లించండి. ఈ పిండిని ఓ గిన్నెలోని తీసుకుని అందులో గుడ్లు, పంచదార, వెన్న, బేకింగ్ పౌడర్, ఎసెన్స్ వేయండి. వీటన్నింటినీ చేత్తో కానీ.. ఎలక్ట్రిక్ బీటర్‌తో కానీ బాగా కలపండి. [ ఇంకా...]

ఆధ్యాత్మికం - వరాహవాతరం

శ్రీ మహావిష్ణువు జలప్రళయంలో మునిగిపోయిన భూమిని ఉధ్ధరించటానికి వరాహరూపాన్ని దాల్చాడు. ఒకసారి మనువు వినయంతో చేతులు జోడించి పితృదేవులైన బ్రహ్మదేవునితో ఇలా అన్నాడు. "ఓ పితృవర్యా! సమస్త ప్రాణుల సృష్టికర్త మీరే, మేము ఏపనులు చేసి మిమ్ములను సేవించగలమో సెలవీయండి" అన్నాడు. ఆ మాటలు విన్న బ్రహ్మదేవుడు "కుమారా! నీకు శుభమగుగాక! నీమాటలతో సంతృప్తి చెందాను నీవు నాఆఙ్ఞతో ఆత్మసమర్పణం చేసుకున్నావు. [ ఇంకా...]

వంటలు - మాంగో ఖీర్

కావలసినవి:
తియ్య మామిడి గుజ్జు
చక్కెర పాకం
కొబ్బరి పాలు
ఎండు ద్రాక్ష - తగినన్ని

చేసే విధానం:
తియ్య మామిడి గుజ్జు తీసి వడగట్టండి. తరువాత దీన్ని ఒక స్టైన్‌లెస్ పాత్రలో పోసి, దానితో సమానమైన నీటిని కలపండి. [ ఇంకా...]

Wednesday, October 17

వంటలు - పులావ్

కావలసినవి:
బసుమతి బియ్యం - 3 కప్పులు
మామిడి పండ్ల రసం - 1కిలో
పాలు - 1 లీటర్
జున్ను - 1 కప్పు
చక్కెర - 2 కప్పులు
నెయ్యి - 3 చెంచాలు
రోజ్‌వాటర్ - 2 నిండు చెంచాలు
కుంకుమ పువ్వు - 11/2 చెంచా
బాదంకాయలు - 25
ఏలకకాయలు - 10
లవంగాలు - 6
దాల్చిన చెక్కలు - 4
ఉప్పు - చిటికెడు

చేసే విధానం:
పాలను, మామిడి రసాన్ని కలిపి రెండు సమభాగాలుగా ఉడికించండి. మూడు సార్లు బియ్యాన్ని కడిగి శుభ్రం చేసి వడబోయాలి. [ ఇంకా
...]

వంటలు - బర్ఫీ

కావలసినవి:
కొబ్బరి - ఒక కప్పు
మామిడి పండు రసం - ఒక కప్పు
నెయ్యి - ఒక చెంచాడు
పాలు - ఒక కప్పు
చక్కెర - ఒక చెంచాడు

చేసే విధానం:
మిక్సర్లో చూర్ణమయిన ఒక పూర్తి కప్పు కొబ్బరిని తీసుకోండి. [ ఇంకా
...]

పర్యాటకం - మధుర

మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా జన్మించిన నేల మధుర. మువ్వగోపాలుని మృదుపద మంజీరాలు ఘల్లు ఘల్లున నడయాడిన "బృందావనమే" అది. అక్కడ అణువణువునా వినిపించే కృష్ణనామ స్మరణ భక్తుల హృదయాలను పులకింపజేస్తుంది. పరమ పవిత్రమైన ఆ పట్టణంలోని ప్రతి వీథిలోనూ కృష్ణుడు కొలువుదీరి ఉన్నాడనడానికి అక్కడి అనేక ఆలయాలే నిదర్శనం. [ ఇంకా...]

ఆధ్యాత్మికం - పూర్ణ పురుషుడు

బుద్ధ భగవానుని సమకాలికుడైన మహావీరుడు - బుద్ధుని మహా పరిత్యాగం, బుద్ధుని తపస్సు, మానవాళిపట్ల బుద్ధుని ప్రేమను పదే పదే గుర్తుకు తెస్తాడు. బీహార్‌లోని పాట్నాకు సమీపంలోగల ఒక పట్టణంలో మహావీరుడు 599 బిసిలో జన్మించాడు. అతని తండ్రి ఒక ప్రముఖుడు. వజ్జీ రాజ్యధిపతి అయిన చేతకుని కుమార్తి ప్రియకరణి లేక త్రిశల - మహావీరుని తల్లి. బాల్యదశలో మహావీరుడు పాఠశాలకు పంపబడ్డాడు. పాఠశాలలో అధ్యాపకుల అవసరం అతనికి లేదని వివేకాన్ని అతడు మనస్సులోనే నెలకొల్పుకున్నాడు. [ఇంకా...]

Tuesday, October 16

నీతికథలు - తల్లి ప్రేమ

తల్లి ప్రేమ సాటిలేనిది. దక్షిణ భారతంలోని ఒక గ్రామంలోని ఒక రాజప్రాసాదం వంటి గృహంలో ఒక తల్లీ కొడుకు సుఖంగా జీవిస్తున్నారు. తల్లి వృద్ధాప్యం వల్ల కానిదయిపోయినప్పుడు ఆమెపట్ల శ్రద్ధ తీసుకునేందుకు కొడుకు విసుగుదల చూపాడు. అదృష్టవశాత్తూ ఇద్దరూ భాగ్యవంతులే కాకుండా తల్లి మంచి ఆరోగ్యంతోనే ఉండడం జరిగింది.
ఒక రోజు కుమారుడు తల్లితో తాను ఆమెను వదలి వెళ్ళేందుకు నిర్ణయించుకుని, మరోచోట గృహం ఏర్పర్చుకున్నానని చెప్పాడు. తాము విడిపోయేలోగా లెక్కలన్నీ తేల్చుకునే అభిలాషను కూడా తెలియచేశాడు. [ ఇంకా...]

నాటికలు - వద్దంటే పెళ్ళి

శానయ్య : తలుపేసుకోండి, ఇక్కడున్నట్టు వస్తాను.ఇల్లు పదిలం. ఇంతలో అపసవ్యాలు ఎమి జరగనియ్యవద్దు. డబ్బుకి చాటు రోజులు. నాదగ్గిర బాకీ వసూలు చేసుగోడానికని చెబుతూ కొదరూ నాకోసం రావచ్చు. వాళ్ళతోటి నేను ఊళ్ళోలేననీ, ఎక్కడ కెళ్ళానో ఎప్పుడొస్తానో తెలియదనీ, చెప్పండి. మరికొందరు నా బాకీలు వసూళ్ళు ఇవ్వడానికొస్తారు. వాళ్ళతోటిమాత్రం నేను సరయ్య ఇంట్లో ఉంటానని చెప్పండి. ( అని, కుడివేపుకి నిష్క్రమించబోయేసరికి, సరయ్య వస్తాడు). [ ఇంకా...]

పండుగలు - అంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవం

మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు" అంటూ తెలుగు నేలను తల్లిగా కీర్తించిన శంకరంబాడి సుందరాచారి, "చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా, గతమెంతో ఘనకీర్తి కలవోడా" అంటూ తెలుగు తేజాన్ని ఉద్వేగంతో గొంతెత్తిన వేములపల్లి శ్రీకృష్ణ, తెలుగు తల్లి సాంస్కృతిక దర్పాన్ని తమ రచనల ద్వారా తెలియజెప్పిన అనేక వేల యువ సాహితీ కుసుమాల కల్పవృక్షం ఆంధ్ర ప్రదేశ్. ఈ వృక్షానికి సాహితీ సుమాలే కాదు సంప్రదాయ సిద్ధాంతాలు కూడ వాడని పువ్వులై విరబూస్తుంటాయి. [ ఇంకా...]

వంటలు - మునగాకు చట్నీ

కావలసినవి :
మునగాకులు : కప్పు
నూనె : 2 టీస్పూన్లు
ఎండుమిర్చి : 6
సెనగపప్పు : టేబుల్ స్పూను
మినపప్పు : టేబుల్ స్పూను
చింతపండు : నిమ్మకాయంత (నీళ్ళల్లో నానబెట్టాలి)
ఉప్పు : ముప్పావు టీస్పూను
కొబ్బరి తురుము : 2టేబుల్ స్పూన్లు
ఆవాలు : అర టీస్పూను
ఇంగువ : చిటికెడు

తయారుచేసే విధానం:

పాన్లో టీస్పూను నూనె వేసి వేడిచేయాలి. ఎండుమిర్చి, సెనగపప్పు వేయించి తీయాలి. [ ఇంకా...]

వంటలు - రాజ్‌కప్స్

కావలసినవి( కప్స్ కోసం ):
మైదా - ఒకటిన్నరకప్పు
మెత్తగా రుబ్బిన బఠాణీలు -సగం కప్పు
ఉప్పు - సగం చెంచా
నూనె - రెండుచెంచాలు వేపడానికి సరిపడా నూనె
నింపడానికి
ఉడకబెట్టి ముక్కల్లా కోసిన బంగాళదుంపలు - ఆరు
ఉడకబెట్టిన శనగలు - రెండు చెంచాలు
సన్నగా తరిగిన ఉల్లిపాయలు - పావు కప్పు
ఉడకబెట్టిన బఠాణీలు - ఆరు చెంచాలు
చాట్ మసాలా - ఒక చెంచా
చిలికిన పెరుగు - ఒక కప్పు
కారం - సగం చెంచా
వేయించిన జీలకర్ర పొడి - ఒక చెంచా
ఉప్పు - తగినంత
పైన అలంకరించడానికి సన్న కారప్పూస, కొత్తిమీర కొద్దిగా, పుదీన పచ్చడి అల్లం పచ్చడి.

తయారుచేసే విధానం:
మైదాపిండిలో రుబ్బిన బఠాణీ, ఉప్పు, నూనె కొద్దిగా నీరువేసి మెత్తగా కలపాలి. [ ఇంకా...]

Monday, October 15

వంటలు - మాంగో ఐస్‌క్రీం

కావలసినవి పదార్ధాలు :
మామిడి పండ్లు - 1 కిలో
చక్కెర - 5 చెంచాలు
పాలు - 11/2 లీటర్లు
మీగడ - 4 ఔన్సులు
రోజ్ వాటర్ - ఒక ఔన్స్
తయారు చేసే విధానం:
మామిడి పండ్లను తోలు ఒలిచి, గుజ్జును ఒక మిక్సర్లో వేసుకోండి. [ ఇంకా
...]

ఆధ్యాత్మికం - రామ శబ్దము

బ్రహ్మదేవుడు 'నారాయణ' శబ్దం లోని రెండవ అక్షరమైన 'రా'ను నమశ్శివాయ శబ్దములోని రెండవ అక్షరమైన 'మ ' ను తీసుకొని రామ అను శబ్దమును సృష్టించి, సరస్వతీదేవికి చెప్పాడు. ఈ రామనామము మహా మహిమాన్వితమైనదనీ, రామనామం ఉఛ్ఛరిస్తే ఎంతో ఫలితం కలుగుతుందనీ, ముక్తిదాయకమని చెప్పాడు. ప్రక్కనే కుమారుడైన నారదుడు ఉన్నాడు. [ ఇంకా...]

వంటలు - బఠాణీ బోండా

కావలసిన పదార్థాలు:
బంగాళదుంపలు - రెండు కప్పులు( మెత్తగా ఉడికించి చిదమాలి )
బోండాల మధ్యలో పెట్టడానికి ఉడకబెట్టిన బఠాణీలు - ఒక కప్పు
నూనె - ఒక చెంచా
తరిగిన అల్లం ముక్కలు - ఒక చెంచా
కారం - సగం చెంచా
ధనియాల పొడి - ఒక చెంచా
గరం మసాలా - సగం చెంచా
సన్నగా తరిగిన కొత్తిమీర - ఒక చెంచా
ఉప్పు - రుచికి తగినంత
బోండాల పైకి
శనగపిండి - సగం కప్పు
కారం - సగం చెంచా
వాము - సగంచెంచా
సోడా - చిటికిడు
నునె - వేయించడానికి సరిపడినంత
ఉప్పు - తగినంత

తయారుచేసే విధానం:
ఉడకబెట్టి చిదిమిన బంగాళ దుంపలకు కొద్దిగా ఉప్పుకలిపి పక్కన పెట్టుకోండి. [ ఇంకా...]

Saturday, October 13

నీతి కథలు - చీమ యుక్తి

అది ఒక పెద్ద చీమల బారు. పప్పు బద్దలను నోట కరుచుకొని, ఆ చీమలు వాటి కలుగులోకి పోతున్నాయి. చీమలు పట్టుకొని వస్తున్న ఆ పప్పులను చూడగానే ఓ తొండకు నోరు వూరింది. మెల్లిగా చీమల బారు పక్కగా చేరి చీమల నోట్లో వున్న పప్పు బద్దలను లాగుకొని తినడం మొదలు పెట్టింది. చీమలకు భయం వేసి, చెల్లా చెదురుగా తిరుగుతున్నాయి కంగారుగా! చీమల నాయకురాలు పెద్ద కండ చీమ, చీమల కంగారు చూసింది. గబగబా చీమల దగ్గరకు వచ్చి వాటికి సంజ్ఞ చేసి, దగ్గరలో వున్న ఓ కలుగు దగ్గరకు వెళ్ళి కూర్చుంది. [ఇంకా... ]

Friday, October 12

పండుగలు - రంజాన్

పవిత్రతే పరమపదసోపానంగా ముస్లిం సోదరులు భావించే మాసం రంజాన్. రంజాన్ మాసంలో పసిపిల్లలనుంచి పెద్దవారి వరకు హృదయాలు పవిత్ర భావనతో నిండిపోతాయి. మానవాళికి ముక్తి మార్గాన్ని చూపించేందుకు దైవం పంపిన పరమ పవిత్రమైన "ఖురాన్" గ్రంధం అవతరించిన మాసమిది. అందుకే ఈ మాసానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. [ ఇంకా...]

నీతి కథలు - పారిన పథకం

గౌరీపురంలో వుండే సూరమ్మకు గయ్యాళితనము, ధనాశ ఒక పాలు ఎక్కువగానూ, పొదుపరితనము, సంపాదించగలిగే నేర్పు ఒక పాలు తక్కువగానూ వుండేవి. ఆమెకు ఇద్దరు పిల్లలు. వాళ్ళు చిన్నవాళ్ళుగా వుండగానే భర్తపోగా, ఉన్న ఆస్తినే కర్పూరంలా కరిగిస్తూ వాళ్ళను పెంచుకొచ్చింది. ఈ మధ్యనే కూతురు లక్ష్మికి పెళ్ళి చేసింది. ఇక పెళ్ళికి మిగిలినవాడు కొడుకు గోపాలుడు. [ ఇంకా...]

ఆధ్యాత్మికం - దివ్యప్రార్ధన

నిజ క్రైస్తవునికి ప్రతిదినం ప్రార్థనే ఊపిరి. ఒక భక్తుడు "నేను ఉదయం పూట ప్రార్థించని దినమున తల గొరిగించుకున్న సంసోను వలె ఉంటాను అన్నాడు. పరి.పౌలు మనము సంపూర్ణ భక్తి, మాన్యత కలిగి, నెమ్మదిగాను సుఖముగాను బ్రతికే నిమిత్తం - అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కోసం, రాజులు, అధికారులకోసం విజ్ఞాపనలు, ప్రార్థనలు యాచనలను, కృతజ్ఞతా స్తుతులను చేయవలెను;(1.తిమోతి-2:1,2) అని రాసెను. ఈ భూగోళము పాపంతో భారమైనను ఇంకనూ వేడితో దహించకుండా ఉండడానికి పరిశుద్దుల ప్రార్థనలే కారణం. [ ఇంకా...]

పిల్లల పాటలు - చక్కిలిగింత పాట

ఇల్లు అలికీ - ముగ్గూ వేసి
పీటవేసి - ఆకువేసి
పప్పువేసి - పాయసం వేసి
అన్నంపెట్టి - అప్పచ్చీ పెట్టి
పాలు పెట్టీ - పెరుగు వేసి
కూరవేసి - చారు వేసి [ ఇంకా
...]

ఆధ్యాత్మికం - బిల్వాష్టకం

1. త్రిదళం త్రిగుణాకారం - త్రినేత్రంచ త్రియాయుధం!
త్రిజన్మ పాపసమ్హారం - ఏకబిల్వం శివార్పణం.
2. త్రిశాఖై ర్భిల్వపత్రైశ్చ - హ్యచ్చిద్రైతహ కోమలై శ్శుభై:!
శివపూజాం కరిష్యామి - ఏకబిల్వం శివార్పణం. [ ఇంకా
...]

Thursday, October 11

ఆహార పోషణ - ఆకులో ఏముంది?

  • పప్పు, కూర, పులుసు, బజ్జీలు, పాలక్ పన్నీర్...రకరకాలుగా తినే పాలకూరల్లో అమినోయాసిడ్స్, ఐరన్, విటమిన్ ఎ, మెగ్నీషియం, సల్ఫర్, పోటాషియం, పోలిక్ యాసిడ్ పుష్కలం. ఒక్కమాటలో చెప్పమంటే
  • టమిన్లూ లభిస్తాయందులోపరిమళభరిత పుదీనాలోనూ విటమిన్లకు, ఖనిజలవణలకు కొదవేమీలేదు. ఐరన్, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. [ ఇంకా...]

ఆధ్యాత్మికం - భద్రాచల రామదాసు

'అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి ' అని చూపిస్తూ భద్రాచల వైభవాన్ని, సౌందర్యాన్ని వేనోళ్ళ పొగడుతూ అక్కడ రామచంద్రమూర్తి లక్షణునితో కూడి స్వర్ణప్రాకారాలతో గోపురాలతో విలసిల్లే దేవాలయంలో కొలువై భూలోక వైకుంఠంగా భద్రగిరిని శోభింపజేస్తున్నాడని, అక్కడ వెల్లువలై ప్రవహించే పవిత్రమైన గౌతమిలో స్నానంచేసి శ్రీరాముని కళ్లారా చూసి తరించమంటూ, స్థావర జంగమ రూపాలతో మన కళ్ళకు కనిపించేదంతా రామమయం అని, అంతరంగంలో ఆత్మారాముడు అనంతరూపుడై వింతలు సలుపుతున్నాడు అని, భద్రాచలంలో నెలకొన్న శ్రీరామచంద్రుని సృష్టిలో అంతటా చూచి, ఆ మహాత్ముని కొనియాడి, తరించడమే ముక్తిమార్గమని బోధించే 'అంతా రామమయం బీజగమంతా రామమయం ' అనే కీర్తనలు వినని వారుండరు. [ ఇంకా...]

Wednesday, October 10

పిల్లలపాటలు - మా మంచి అమ్మ

మా అమ్మ చెప్పేది మా మంచి మాటలు
మా అమ్మ పాడేవి ఇంపైన పాటలు
మా అమ్మ చేతివి కమ్మనీ వంటలు
మా అమ్మ తినిపించు గోరుముద్దలు [ ఇంకా
...]

పర్యాటకం - వన్యలోకం

అక్కడికి వెళితే నిజంగానే ప్రకృతి ఒడిలో ఉన్నట్లే. చుట్టూ ఆకుపచ్చని గడ్డి మైదానాలు, అగాధాల వంటి లోయలు, నీలాకాశం, ఎత్తయిన కొండలు, వాటిపైన చిక్కటి దుప్పటిలాంటి వనం, దానినిండా దట్టమైన ఫల ,పూల ఫృక్షాలు, చ ల్ల గాలి, ఆ వాతావరణం మనసును వశపరచుకోవడానికి ఎంతో సమయం పట్టదు. అది ప్రసిద్దిగాంచిన బి.ఆర్.కొండల మాటున ఉన్న ప్రముఖ అభయారణ్యం, బి.ఆర్.కొండలు, అక్కడి అరణ్యం ఒకప్పుడు అడవిదొంగ వీరప్పన్ రహస్య స్థావరాలుగా ఉండేవి. కాబట్టి పర్యాటకుల పెద్దగా అటుకేసి దృష్టి సారించలేదు. [ ఇంకా...]

ఆధ్యాత్మికం - శరణుఘోష ప్రియుడు

'ఓంస్వామియే శరణమయ్యప్ప, హరిహరసుతనే శరణమయ్యప్ప, ఆపద్బాంధవునే శరణమయ్యప్ప!' అంటూ అయ్యప్ప భక్తులు భగవంతుని శరణుకోరే విధానాన్నే శరణు ఘోష అని వ్యవహరిస్తారు. అడవులలో కొండలలో నడచి వెళ్ళే స్వాములకు (భక్తులకు) శరణు ఘోష రక్ష. యాత్రచేసే బృందం అందరూ ఒక్కసారి స్వామివారి శరణు ఘోష చెప్పి అడవిని దద్దరిల్లజేస్తారు. [ ఇంకా...]

Tuesday, October 9

ఆహార పోషణ - అమ్మలాంటి నిమ్మ

  • రోజూ పరగడుపున ఒక గ్లాసుడు గోరువెచ్చని నీళ్ళలో ఒక నిమ్మకాయ రసం కలుపుకొని, కొంచెం ఉప్పు కలిపి తాగితే ఊబకాయం తగ్గుతుంది.
  • నిమ్మరసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే, జీర్ణశక్తిబాగుంటుంది. ఒంట్లో కొవ్వు శాతం తగ్గుతుంది.
  • కొంచెం ఉప్పు, నిమ్మరసం, కొద్దిగా పసుపు కలిపి వారానికి రెండుసార్లయినా పళ్ళు తోముకుంటే పలువర మెరవడమే కాకుండా, చిగుళ్ళవ్యాధులు ఉన్న వారికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. [ ఇంకా...]

పర్యాటకం - బాహుబలి

రెండు కొండల మధ్య ప్రకృతి సిద్దంగా ఏర్పడిన సరోవరమే "బెళగొళ" కన్నడంలో బెళ్ళి అంటే తెల్లని అని, గొళ అంటే నీటిగుండం అని అర్థం. జైన సంప్రదాయం ప్రకారం సంసార జీవితాన్ని త్యజించి సన్యాసాశ్రమం స్వీకరించిన వారిలో అత్యంత పూజనీయులైన వారిని శ్రమణులు అంటారు.అలాంటి శ్రమణులు చాలామంది ధ్యానంలో శేషజీవితం గడిపి నిర్వాణం పొందడానికి ఈ కొండలలో, పరిసర ప్రాంతాలలో నివసించారు. [ ఇంకా...]

ఆధ్యాత్మికం - విగ్రహారాధన

విగ్రహారాధనను కొంతమంది ప్రముఖులే ఖండించారు. అంటే విగ్రహారాధన పనికిరాదనా దాని అర్ధం. కాదు ఎందుకంటే పెద్దలు పెట్టిన ఏ పద్దతి, శాస్త్రం తప్పు కాదు. అందులో ఏదో అర్ధం నిగూఢంగా దాగి ఉంటుంది. దానిని గ్రహించి మనం దాని ప్రయోజనాన్ని ఉపయోగించుకోవాలి. అంతేకాని 'తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు ' అన్న వ్యక్తుల మాటలు పట్టించుకోరాదు. [ ఇంకా...]

Monday, October 8

ఆహార పోషణ - తులసి టీ

ఇంటి పెరట్లో ఒక తులసి మొక్క ఉంటే చాలు ఇంటిల్లిపాదీ ఆరోగ్యంగా ఉండవచ్చని పెద్దలు చెబుతారు.ఇది నూటికి నూరుపాళ్ళు నిజం. దీంట్లో ఉండే ఔషధ విలువలు అలాంటివి మరి. ఆరోగ్య పరంగా, సౌందర్యపరంగా తులసి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఆయుర్వేదంలో తులసిని ఆరోగ్యప్రదాయినిగా కొనియాడారు. లక్ష్మీ తులసి, కృష్ణ తులసి అని రెండు రకాలుగా ఉంటుంది. [ ఇంకా...]

ఆధ్యాత్మికం - గురూచిష్టం

నిర్గుణుడు, నిరాకారుడు అయిన భగవంతునికి ఎలాంటి రూపము, గుణములు లేవు కనుక ఆయన మన ఇంద్రియాలకు, మనస్సుకూ గోచరించడు. అన్ని ఆరాధనలకంటే నిర్గుణోపాసనే అత్యుత్తమమైనదని వేదశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అయితే ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్న వారికి మాత్రమే అది సాధ్యం, సామాన్య మానవులకు సగుణోపాసనే అతి సులువైన మార్గం. [ ఇంకా...]

పర్యాటకం - కూర్గ్

దేశంలో పేరన్నిక గన్న హిల్ స్టేషన్‌లలో కూర్గ్ ఒకటి. కళ్లను, మనసును మైమరిపించే అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను ఇది స్వర్గధామం. కర్ణాటకలోని ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పర్యాటక కేంద్రం మైసూర్‌కు ఇది 100 కి.మీ. దూరంలో ఉంది. సముద్ర మట్టానికి 1170 అడుగుల ఎత్తున గల కూర్గ్ కోడగు జిల్లా కేంద్రం. ప్రతి సంవత్సరం అక్టోబరు నుండి మార్చి నెలాకరు దాకా కూర్గ్‌ను సందర్శించడానికి అనువైన కాలంగా చెబుతారు. [ ఇంకా...]

Saturday, October 6

ఆధ్యాత్మికం - మహాకాళి

"అర్థేందు మకుటాం దేవీం వందే వారిధి సంభవాం
అంతర్‌జ్వాలా స్వరూపాం తాం జగచ్చైతన్య విగ్రహాం"
ఈ స్తోత్రం ముగురమ్మలను, వారికంటే ఆతీతమైన ఆద్యాశక్తిని ప్రస్తుతిస్తున్నది. భక్తులకు దర్శనం ఇచ్చే మూర్తిమత్త్వము, ధ్యానంలో గోచరించే తత్త్వస్ఫూర్తి, యోగ దీప్తిలో కలిగే అద్భుతానుభవం.. సర్వాతీత గుణాతీతయైన పరాంబా లక్షణము... అనీ దీనిలో స్పష్టంగా వర్ణింపబడ్డాయి. దశ మహావిద్యలు ఆమె శక్తి యొక్క ఒక్కొక్క ఆవిష్కార స్థానం. [ ఇంకా
...]

ఆధ్యాత్మికం - కాబాగృహం

ఇస్లామ్ ధార్మిక భవనానికి అతి ముఖ్యమైన మూలస్తంభం హజ్. మనిషి మనస్సును దుర్నడతల నుండి కట్టడి చేసేందుకు, ప్రక్షాళన చేసేందుకు నిర్ణయింపబడ్డ అతి ముఖ్య ఆరాధనయే హజ్. ఇస్లాం లోని వేరువేరు ఆరాధనలన్నింటికీ ప్రాణం ఈ హజ్. వివిధ ఆరాధనలన్నీ హజ్ అనే ఈ చట్రంలో బిగించ బడ్డాయి. ఇవన్నీ సరియైన రీతిలో అమలు చేసినప్పుడే హజ్ పరమార్థం సఫలీకృతమవుతుంది. [ ఇంకా...]

ఆహార పోషణ - సామర్ధ్యాన్ని పెంచే సరైన ఆహారం

జీవనశైలిలో మార్పులు, ఒత్తిడి వల్ల గతంలో ఎప్పుడూ లేనంత తీవ్రంగా ఈ రోజుల్లో వంధ్యత్వ సమస్యలు తలెత్తుతున్నాయి.ఆడవాళ్లలో హార్మోన్ల అసమతుల్యత, అండం విడుదలకు సంధించిన సమస్యలు,శరీర బరువులో తేడాలు, అధిక శారీరక శ్రమ, ఒత్తిడి, ధైరాయిడ్ వ్యాధులు సంతానలేమికి దారి తీస్తున్నాయి. [ ఇంకా...]

పర్యాటకం - జైసల్మేర్

"తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు"-అన్న సూక్తిని తలపించేలా, ఒకనాటి భారతీయ కళాకారుల నిర్మాణ చాతుర్యానికి నిలువెత్తు ప్రతీకగా రాజస్థాన్‌లోని జైసల్మేర్ దేశంలోని ప్రధాన పర్యాటక కేంధ్రాలలో ఒకటైంది. అక్కడి "సోనార్ ఖిల్లా"నే జైసల్మేర్ కోట"గా పిలుస్తున్నారు. ప్రపంచంలోని ఏకైక "సజీవ కోట"ఇదే. ప్రసిద్ధ థార్ ఎడారిలోని మరుభూమిలో నిర్మితమైన సుందర పట్టణమే జైసల్మేర్. [ ఇంకా...]

Friday, October 5

ఆహార పోషణ - నీటి పండు

  • ఆఫ్రికా దేశంలోని కలహారి ఎడారి ప్రాంతంనుంచి పుచ్చకాయ ప్రపంచదేశాలకు చేరిందని చరిత్రకారులు భావిస్తున్నారు.
  • ఐదువేల సంవత్సరాల క్రితం ఈజిప్టులో పుచ్చకాయను పండించినట్టు ఆధారాలున్నాయి. ప్రస్తుతం చైనా దేశం ప్రపంచంలో అత్యధికంగా పుచ్చ కాయను పండిస్తోంది.
  • దీంట్లో 92 శాతం నీరు ఉండడం వల్ల దీన్ని వాటర్ మిలన్ అని అంటారు. [ ఇంకా...]

ఆధ్యాత్మికం - స్తుతి వైభవం

"మీరు శ్రమలో ఉంటే ప్రార్థించండి, సంతోషంలో ఉంటే కీర్తనలు పాడండి" అని యాకోబు తన పత్రికలో రాశాడు. దేవుడిని ఎప్పుడు స్తుతించగలం? మనకు ఎలాంటి సమస్యలు, కష్టాలు, భాధలు లేనప్పుడు మాత్రమే ఆరాధించగలం.ఈ మూడు మన జీవితాలతో పెనవేసుకొని మనతో నడిచేవే. మరి దేవుడిని ఆరాధించలేమా?నిజం చెప్పాలంటే వీటిలో నుంచే మనం దేవుడిని స్తుతించగలం.ఒక వ్యక్తి తనకున్న సమస్యను బట్టే దేవుడికి దగ్గర కాగలడు. [ ఇంకా...]

పర్యాటకం - మహాబలి పురం

భారతీయ ప్రాచీన శిల్పకళా నైపుణ్యాన్ని, నాటి పల్లవ రాజుల ఘనమైన చారిత్రక సంపదను తరతరాలుగా పర్యాటక లోకానికి పంచిపెడుతున్న గొప్ప గోపురాల సముద్ర తీర పట్టణమే మహాబలిపురం. బంగాళాఖాతపు నీలి అలల సవ్వడుల నుండి రాతి కట్టడపు విశేషాల దాకా ఇక్కడ చూడవలసినవి ఎన్నో ఉన్నాయి. మహాబలిపురం డాన్స్ ఫెస్టివల్‌గా పిలిచే వార్షిక వేడుకకు అంతర్జాతీయంగా ఖ్యాతి ఉంది. [ ఇంకా...]

సంస్కృతి - రామాయణం ముఖ్యాంశాలు

రామాయణము మహాకావ్యము. ఇందులో 24,000 శ్లోకాలు సంస్కృత భాషలో వాల్మీకి మహర్షిచే రచించబడ్డాయి. ఇందులో సీతారాముల పవిత్ర చరిత్ర, కొడుకు తండ్రిని ఏవిధంగా గౌరవించాలీ, సోదురులు ఒకరిపట్ల మరొకరు ఎటువంటి ప్రేమ కలిగి ఉండాలి, మిత్రుల మధ్య అన్యోన్యత ఎలా ఉండాలి, రాజు ప్రజలనెలా పాలించాలి మొదలైన వివరాలుంటాయి. [ ఇంకా...]

అందరి కోసం - ఉత్తరాంధ్ర విశ్వేశ్వరుడు

శ్రీముఖలింగేశ్వరుని దేవాలయం శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలంలో ఉంది. ఈ గ్రామం మామిడి తోటలు, శోభాయమానంగా అగుపించే కొబ్బరి తోటలకు ఆలవాలం. దేవాలయ పరిసరాలలో ఉన్నంతసేపూ భగవంతునిపై భక్తిప్రవత్తులతోపాటు మనసుకు ఆహ్లాదం కలుగుతుంది. 'శ్రీముఖలింగం ' పేరులోనే చక్కని అర్ధం ఉంది. "పరమేశ్వరుడు లింగంలో కనిపించుట" అని దీని అర్ధం. [ ఇంకా...]

Thursday, October 4

సంస్కృతి - మహాభారతం ముఖ్యాంశాలు

మహాభారతం ఒక ఉద్గ్రంధం. ఇది ధర్మశాస్త్రం. అంతేకాక ఇది చారిత్రక గ్రంధం కూడా. కాబట్టే ఆనాటి సామాజిక, రాజకీయ లక్షణాలు ఈ గ్రంధంలో లిఖించబడ్డాయి. సర్వ లక్షణ సమన్వితమైన మహాభారతాన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదించినవారే. అందులోని పాత్రల స్వభావాలను ఆకళింపుచేసుకున్నవారే. ఆ ధర్మశాస్త్రాన్నీ అనుసరించేవారే. లౌకికములు, అలౌకికములు అగు విషయములెన్నో ఇందులో చెప్పబడ్డాయి. [ ఇంకా...]

సంస్కృతి - భాగవతం ముఖ్యాంశాలు

శ్రీకృష్ణుని నిర్యాణమనంతరం కలి ప్రవేశించిన కాలమది. బదరికాశ్రమమంలో వ్యాకులచిత్తుడై ఉన్నాడు వ్యాస మహర్షి. నారాయణ మంత్రాలాపాన చేసుకుంటూ ఆశ్రమానికొచ్చిన నారద మహర్షి వ్యాసుడు వ్యధాభరితుడై ఉండటాన్ని గమనించి ధర్మాన్ని నిలబెట్టిన శ్రీ కృష్ణ భగవానుని లీలా వర్ణన గావించమని, భాగవత పఠనం, స్మరణం ముక్తి మార్గమనీ, దాన్ని రచిస్తే అది అతని మనో వ్యాకులతను పోగొట్టడమేగాక ప్రజల్లో భక్తి భావన పెంపొందుతుందనీ ఉపదేశించడంతో వ్యాసుడు భాగవత రచనకు పూనుకున్నాడు. [ ఇంకా...]

అందరి కోసం - బృహదీశ్వరాలయం

తమిళనాడు దేవాలయాలకు ప్రసిద్ధి. ఆ దేవాలయాల్లో బృహదీశ్వరాలయం పెద్దది, ప్రముఖమైనది. ఈ ఆలయాన్ని మొదటి రాజ రాజ చోళుడు (క్రీ.శ985-1014) నిర్మించాడు. ఈ ఆలయం దక్షిణాదిన దేఎవాలయ విమాన నిర్మాణానికి, తమిళ శిల్ప కళా నైపుణ్యానికి పరాకాష్టగా చెప్పవచ్చు. ద్రవిడుల నిర్మాణాల విమానాల్లో అతి పెద్దది. అప్పట్లో ఈ ఆలయాన్ని మొదటి రాజరాజ చోళుని పేరున రాజరాజేశ్వరాలయంగా పిలిచేవారు. కాలక్రమాన తరువాతి రాజుల పాలన కాలంలో పలు మార్పులు చెంది నేడు బృహదీశ్వరాలయంగా పేరుగాంచింది. [ ఇంకా...]

నీతి కథలు - మంచి మిత్రుడు (పావురం - ఎలుక)

పూర్వం గోదావరి నదీ తీరంలో ఓ పెద్ద బూరుగు చెట్టు ఉండేది. ఆకాశమును తాకుచున్నదా అన్నంత ఎత్తుగా విశాలంగా పరుచుకున్న కొమ్మలతో కళకళలాడుతూ ఉండే ఆ చెట్టు మీద ఎన్నో రకాల పక్షులు గూళ్ళు కట్టుకుని జీవిస్తున్నాయి. ఒకరోజు ఉదయం ఆ చెట్టు మీద నివసిస్తున్న 'లఘుపతనక' అనే కాకి నిద్రలేస్తూనే కిందకు చూచింది. ఆ చెట్టుకు కొద్ది దూరంలో ఒక వేటగాడు నూకలు చల్లి వలపన్నుతూ కనిపించగానే దానికి భయం వేసింది. [ ఇంకా...]

Wednesday, October 3

వంటలు - వాంగీ బాత్

కావలసిన వస్తువులు:
వంకాయలు - 1/2 కిలో.
ఉల్లిపాయలు - 1/4 కిలో.
పచ్చి మిరపకాయలు - 4.
బియ్యం - 1/2 కిలో (2 డబ్బాలు).
నూనె - వేయించటానికి సరిపడినంత ( 200 గ్రా.).
ఉప్పు - తగినంత.
మసాలా కారం తయారు చేయడానికి కావలసినవి:
పచ్చి పప్పు - 50 గ్రా.
సాయి మినపప్పు - 50 గ్రా.
ధనియాలు - 50 గ్రా.
ఎండు మిరపకాయలు - 6.

తయారు చేసే విధానం:
ముందుగా మసాలా కారం తయారు చేయటం చూద్దాం:
పచ్చిపప్పు, ధనియాలు, సాయి మినపప్పు, ఎండుమిరపకాయలు తీసుకొని బాండిలో ఒక స్పూను నూనె వేసి వీటిని దోరగా వేయించాలి. [ ఇంకా
...]

వంటలు - బేసన్ లడ్డు

కావలసిన వస్తువులు:
శనగపిండి - 600 గ్రా.
నెయ్యి - 500 గ్రా.
పంచదార - 300 గ్రా.
యాలుకలపొడి - 10 గ్రా.

తయారుచేసే విధానం:
శనగపిండి, నెయ్యి మిశ్రమాన్ని చక్కగా కలిపి సన్నటి సెగపై దోరగా వేయించి పెట్టుకోవాలి. [ ఇంకా...]

పిల్లల పాటలు - బడాయి పిల్లి... 

బడాయి పిల్లి లడాయికెళ్ళి
ఎలుకను చంపి ఏనుగె అంది
పులినే తానని పొంగిన పిల్లి
కుక్కను చూసి ఒక్కటే పరుగు [ ఇంకా
...]

Tuesday, October 2

భక్తి గీతాలు - విశ్వరూపమిదివో

కొండవంటి హరిరూపు గురుతైన తిరుమల
పండిన వృక్షములే కల్పతరువులు
నిండిన మృగాదులెల్ల నిత్యముక్తజనములు
మెండుగ ప్రత్యక్షమాయె మేలువోనాజన్మము [ ఇంకా...]

నీతి కథలు - గురువును మించిన శిష్యుడు

ఆ రోజు సోమవారం. సూరిబాబు ఎంతో ఉత్సాహంగా బడికి బయలుదేరాడు. దారిలో స్నేహితులు కలిశారు. మాటల సందర్భంలో ఆదివారం నాడు తాము ఎలా గడిపామో ఒక్కొక్కరు సంతోషంగా చెప్పడం ప్రారంభించారు. నిఖిల్ తాను తన అభిమాన హీరో సినిమా చూశానన్నాడు. చంద్రం తానెంతో ఇష్టపడే క్రికెట్ ఆడినట్లు చెప్పాడు. లోకేష్ తాను గీసిన డ్రాయింగ్ గురించి వర్ణించాడు. [ ఇంకా...]

Monday, October 1

పిల్లల పాటలు - రింగు రింగు బిళ్ళ

రింగు రింగు బిళ్ళ - రూపాయి దండ
దండ కాదురా! - తామర మొగ్గ
మొగ్గ కాదురా! - మోదుగ నీడ
నీడ కాదురా! - నిమ్మల బావి [ ఇంకా...]