Tuesday, December 29

వ్యక్తిత్వ వికాసం - ఇలా... హాయిగా...

పొద్దున లేచిందగ్గర్నుంచి ఎన్నో పనులు... మరెన్నో ఆందోళనలు. పాఠాలు, పరీక్షలు, స్నేహితులతో పోటీ. అవన్నీ మర్చిపోయి మనసు ప్రశాంతంగా ఉండాలంటే హయిగా సేదదీరడమే ముందు. మరి మీ గది అందుకు అనుకూలంగా ఉందా?
. మీ గది గోడలకు లేతరంగు వేయించుకోండి.
. కిటికీలు, ద్వారానికి పలుచటి నెట్‌లాంటి కర్టెన్లు వేయండి. అవి పగటి వెలుగుని లోనికి రానిస్తాయి.
. మీకిష్టమైన ఆహ్లదకరమైన పరిమళం గదంతా పరుచుకునేలా... [ఇంకా... ]

Monday, December 28

పండుగలు - ముక్కోటి ఏకాదశి

ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశి పవిత్రమైనది. విష్ణు ప్రీతికరమైన ఏకాదశులలో ఇది అత్యంత ప్రధానమైనది.
అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం|
హృదయం మధురం గమనం మధురం మధురాధిపతే రఖిలం మధురం||
అట్టి సుమధుర మూర్తిని ఈ 'ఏకాదశి' రోజున వేయికనులతో వీక్షించి సేవించి తరంచి పోవాలని మూడు కోట్లమంది దేవతలు వైకుంఠమునకు చేరుకునే పుణ్యప్రదమైన రోజు కనుక ఇది వైకుంఠ ఏకాదశిగా "ముక్కోటి ఏకాదశి" గా భక్తులు పిలుస్తూ ఉంటారు. ఇట్టి పర్వదినం ప్రతిసంవత్సరం ధనుర్మాసములో పూర్ణిమకు ముందు వచ్చే ఏకాదశి అవుతుంది.
ప్రముఖ దేవాలయాలలో (తిరుపతి, భద్రాచలం మున్నగు వైష్ణవ) పుణ్యక్షేత్రాలలో... [ఇంకా... ]

Thursday, December 24

పండుగలు - క్రిస్‌మస్ - డిసెంబర్ 25

క్రిస్‌మస్ క్రైస్తవులకు చాలా ముఖ్యమైన పండుగ. ఈ పండుగను భారత దేశంలోనే కాక ప్రపంచంలోని అన్ని దేశాలలోను జరుపుకుంటారు. ఇది యేసుక్రీస్తు పుట్టిన రోజు పండుగ. ప్రతి సంవత్సరం డిసెంబరు 25వ తేదీన ఈ పండుగను జరుపుకుంటారు.
యేసుక్రీస్తు జన్మించి ఇప్పటికి రెండు వేల సంవత్సరాలు దాటిపోయింది. ఆ కాలంలో అంటే రెండు వేల సంవత్సరాల కిందట రోమా సామ్రాజ్యాన్ని ఆగస్టస్ సీజర్ అనే చక్రవర్తి పరిపాలిస్తున్నాడు. ఆయన తన రాజ్యంలో ఎంత మంది ప్రజలు ఉన్నారో లెక్కవేయించాలనుకున్నాడు. అందుకు వీలుగా ప్రజలందరు ఎవరి స్వగ్రామాలకు వాళ్ళు డిసెంబరు 25 తేదీలోగా వెళ్ళాలని ఆజ్ఞాపించాడు.
అప్పుడు ' నజరేతు ' అనే పట్టణంలో మేరీ, జోసఫ్ అనే వాళ్ళు... [ఇంకా... ]

వంటలు - బ్రెడ్ పుడ్డింగ్

కావలసిన వస్తువులు:
బ్రెడ్ ముక్కలు - 8.
గ్రుడ్లు - 2.
పంచదార - 1/2 కప్పు.
కిస్ మిస్ - 1/2 కప్పు.
పాలు - ఒకటిన్నర కప్పు (1.5).
వెన్న - ఒకటిన్నర స్పూను... [ఇంకా... ]

Wednesday, December 23

పిల్లల పాటలు - వానల్లు కురవాలి - వానదేవుడా!

వానల్లు కురవాలి - వానదేవుడా
వానల్లు కురవాలి - వానదేవుడా
వరిచేలు పండాలి - వానదేవుడా
నల్లని మేఘాలు - వానదేవుడా
చల్లగా కురవాలి - వానదేవుడా... [ఇంకా... ]

Tuesday, December 22

భరతమాత బిడ్డలు - శ్రీనివాస రామానుజం

పేరు : శ్రీనివాస రామానుజన్.
తండ్రి పేరు : శ్రీనివాస అయ్యంగార్.
తల్లి పేరు : కోమలత్తమ్మాళ్.
పుట్టిన తేది : 22-12-1887.
పుట్టిన ప్రదేశం : తమిళనాడులోని ' ఈ రోడ్ ' లో జన్మించెను.
చదివిన ప్రదేశం : కుంభకోణం.
చదువు : డిగ్రీ.
గొప్పదనం : 15 ఏళ్ళప్పుడే జార్జ్ స్కూచ్‌సిడ్జ్‌కార్ రూపొందించిన 6000 గణిత సిద్దాంతాలను తులనాత్మకంగా పరిశీలించారు... [ఇంకా... ]

Monday, December 21

పర్యాటకం - లక్షద్వీప్‌

ఇంతకు ముందు లక్షదీవులు, మినికాయ్‌, అమీన్‌ దీవులు అని పిలువబడే మూడు గుంపుల దీవులను కలిపి ఇప్పుడు లక్షద్వీపాలు అని పిలుస్తున్నారు. ఇవి కేరళరాష్ట్ర పడమటి తీరం నుంచి సుమారు రెండు వందల నుంచి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్రంలో ఉన్నాయి. ఇవి మెత్తం 27 దీవులు. ఇందులో కేవలం పదింటిలోనే జనావాసం ఉంది. ఇందులో... [ఇంకా... ]

Thursday, December 17

వంటలు - చపాతీ చాట్

కావలసిన వస్తువులు:

చపాతీలు - మూడు.
నూనె - వేయించటానికి సరిపడా.
మీఠా చట్నీ - అరకప్పు.
పెరుగు - పెద్దకప్పు.
కారం - అర చెంచా.
జీలకర్ర పొడి - ఒక చెంచా... [ఇంకా... ]

Wednesday, December 16

ఎందుకు, ఏమిటి, ఎలా... - టీ-షర్ట్స్

రంగు రంగుల టీషర్ట్స్ వేసుకొని షోగ్గా తిరగాలని మనందరికీ చాలా సరదా. మామూలు చొక్కాల కన్నా టీ-షర్ట్స్ చాలా ఫ్యాషన్‌గా ఉంటాయి. సౌకర్యంగా ఉంటాయి. మరి ఇవి ఎలా తయారయ్యాయి? అని తెలుసుకోవాలనుందా, అయితే ఇది చదవాల్సిందే.

టీ షర్ట్ గురించి తెలుసుకోవాలంటే మొదటి ప్రపంచ యుద్ధకాలానికి వెళ్ళాలి. అప్పట్లో యూరోపియన్లు టీ-షర్ట్స్ వంటి లోదుస్తులను ధరించి యుద్ధం చేస్తుంటే అమెరికన్లు మాత్రం దళసరి యూనిఫాంలు ధరించి యుద్ధం చేసేవారు. కాని యూరోపియన్లు హాయిగా ఉంటే అమెరికన్లు చెమటలు కక్కుతూ ఉండేవారు. దాంతో కొన్నాళ్ళకు అమెరికన్లు కూడా టీ-షర్ట్స్ వైపే మొగ్గు చూపారు. దాంతో ఒక్కసారిగా... [ఇంకా... ]

Tuesday, December 15

తెలుగు బిడ్డలు - పొట్టి శ్రీరాములు

పేరు : పొట్టి శ్రీరాములు.
తండ్రి పేరు : గురవయ్య.
తల్లి పేరు : శ్రీమతి మహాలక్ష్మమ్మ.
పుట్టిన తేది : 1901.
పుట్టిన ప్రదేశం : మద్రాసు.
చదివిన ప్రదేశం : నెల్లూరు... [ఇంకా... ]

Saturday, December 12

జానపద గీతాలు - కాకరచెట్టు మేకల్ మేసే సై కోడలా

మామ : కాకరచెట్టు మేకల్ మేసే సై కోడలా... నీవు
పోకడెక్కడ పోయినావె సై కోడలా
కోడలు : మాపున చెప్పిన మాటలకు మామయ్యలో... నేను
మల్లెమొగ్గలేరబోతి మామయ్యలో
మామ : మల్లెమొగ్గలేరలేదు సై కోడలా... నీవు... [ఇంకా... ]

Wednesday, December 9

అక్షరాలు - సంయుక్త అక్షరాలు

ఒక హల్లుకు వేరే హల్లు చేరే అక్షరాలు
తర్కము (ర + క = ర్క)
ఆసక్తి (కి + త = క్తి)
పద్యము (ద + య = ద్య)
అశ్వము (శ + వ = శ్వ)
కట్నము (ట + న = ట్న)
కాశ్మీరు (శీ + మ = శ్మీ)
భగవద్గీత (దీ + గ = ద్గీ )
హర్షము (ర + ష = ర్ష )... [ఇంకా... ]

Tuesday, December 8

కాలచక్రం - నక్షత్రాలు

నక్షత్రాలు ఇరువై ఏడు
1. అశ్విని
2. భరణి
3. కృత్తిక
4. రోహిణి
5. మృగశిర
6. ఆర్ద్ర... [ఇంకా... ]

Saturday, December 5

వ్యాయామ శిక్షణ - అధిక బరువుకు కారణాలేమిటి?

. అవసరానికి మించి ఆహారం ద్వారా కేలరీలు తీసుకోవడం, రుచులు మీద మక్కువ చంపుకోలేక పోవటం.
అనియమిత జీవనం, అంతు లేని శ్రమ, మనం సృష్టించిన డబ్బు కోసం మనమే పరుగులు తీయడం, క్షణమొక రూపాయిగా మార్చడానికి తపన పడే మన సహజమైన బుద్ధిది ఇంకొక తప్పు.
. ఎటువంటి శారీరక శ్రమ దైనందిన జీవనంలో లేకపోవడం ఆకాశమే హద్దుగా సాగుతున్న మానవ మేథస్సు సృష్టించిన ఓ అందమైన ఉత్పాతం ఇది.
. వ్యాయామాలు చేయకపోవడం - బద్దకం దీనికి కారణం.
. జన్యు సంబధిత లోపాలు - కర్మ సిద్ధంతాన్ని విశ్వసించినా, లేకున్నా... [ఇంకా... ]

Wednesday, December 2

వంటలు - చిక్కుడుకాయ టమోటా కూర

కావలసిన వస్తువులు:
చిక్కుడు కాయలు : 1/2 కిలో.
ఉల్లిపాయలు : 2.
టమోటాలు : 2.
నూనె : 6 స్పూన్లు.
ఉప్పు, కారం, పసుపు : తగినంత.
ఎండు మిర్చి : 2... [ఇంకా... ]

Tuesday, December 1

పర్యాటకం - వేసవి ప్రయాణికులకు పర్యాటక ప్రణాళిక

నాలుగు ప్రాంతాలకు తిరిగితేనే లోకం తీరు తెలుస్తుంది. మనుషుల పోకడలు అవగతమౌతాయి. జీవితపు వైవిధ్యం అనుభవలోకి వస్తుంది. రోజులు కొత్తగా వెలుగుతాయి. విలక్షణ అనుభవాలు వినూత్న అనుభూతుల్ని అందిస్తాయి. అందుకే పర్యటించాలి .కొత్త ప్రాంతాలలోకి ప్రవహించాలి. మామూలు రోజుల్లో ఏదో ఒక హడావిడి వుంటూనే వుంటుంది. జీవిక కోసం పరుగులు తీయక తప్పదు. పిల్లల్ని పరుగు తీయించక తప్పదు. కానీ కాస్త తీరికగా పర్యటించడానికి అనువైన సమయం వేసవి సెలవుల సందర్భం. దసరా సెలవుల్లో, సంక్రాంతి సెలవుల్లోనూ సమయం వుంటుంది. కానీ పరిక్షలు పూర్తయి ఖాళీగా ఉండేది వేసవి సెలవుల్లోనే. అందుకే వేసవిలో విహారం మనసుకు ఆహ్లాదాన్నిస్తుంది. ప్రతి ఏటా కనీసం రెండుసార్లు పర్యటించి రావాలి. లేదంటే... [ఇంకా... ]

Monday, November 30

నృత్యం - జానపద నృత్యాలు

అసంఖ్యాక జాతులతోనూ పతిస్థితులతోనూ కూడి ఉన్న భారతదేశం అనేక శతాబ్దాలుగా రకరకాల జానపద నృత్యాలకు నిలయంగా ఉంది. భారతదేశంలోని నేటి శాస్త్రీయ నృత్య విధానాలు చాలా కట్టుబాట్లకు లోబడి ఉండటంతోపాటు ఎంతో నాజూకుతనాన్ని చూపుతున్నది. ఆటవికుల గూడెములోనూ కర్షకుల కుటీరాలలోనూ నేటికి తమ పాటవాన్ని కోల్పోకుండా బ్రతికి ఉన్న సామాన్య ప్రజా నృత్యాలనుండి మన శాస్త్రీయ నృత్యాలు పుట్టాయి. భారతీయ జానపద నృత్యాలలో నిరాడంబరమైన సరళత ఉంది. వాటి సరళత వెనుక మహత్తర కళాభావాలు రెండు ఉన్నాయి. సహజమైన భావగాంభీర్యం, విస్పష్టమైన వ్యక్తీకరణ ఉన్నాయి. జానపద నృత్యానికి, దానినుండి ప్రధానంగా ఉధ్భవించిన శాస్త్రీయ నృత్యానికి ఉన్న భేదం రీతిలోనే. జానపద నృత్యంలో కళారీతిని ప్రయత్నం పూర్వకంగా తెచ్చుకోవటం అంటూ ఉండదు. ఇందుచేతనే జానపద నృత్యంలో చిరకాలం నుంచి వస్తున్న ప్రబలమైన సంప్రదాయాలు ఉన్నప్పటికీ అది స్వయం ప్రేరణతో... [ఇంకా... ]

Thursday, November 26

విజ్ఞానం - న్యాయ వ్యవస్థ

1. సుప్రీం కోర్ట్
2. హైకోర్ట్
3. సబార్డినేట్ కోర్ట్
4. మేజిస్ట్రేట్ కోర్ట్
5. ఫ్యామిలీ కోర్ట్
6. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్
భారత దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఇది హైకోర్టులపై నియంత్రణాధికారం కల్గిఉన్నది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సలహాపైననే రాష్ట్రపతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను, ఇతర న్యాయమూర్తులను... [ఇంకా... ]

Tuesday, November 24

సౌందర్య పోషణ - ఆకర్షించే గలగల గాజులు

. చేతులకు ధగధగమని మెరిసే బంగారు గాజులు ఎన్ని వున్నా వాటి మధ్యలో మట్టిగాజులు వేసుకుంటేనే వాటికి మరింత నిగారింపు వస్తుంది.
. పెళ్ళిళ్ళు, శుభకార్యాలకు రెండు చేతులకూ రంగురంగుల మట్టిగాజులు వేసుకుంటే మహిళల చేతులు కళకళలాడుతూ ఆకర్షణీయంగా వుంటాయి.
. చిన్నపిల్లలకైతే మట్టి, పింగాణీతో చేసిన గాజులు వేయడం కన్నా ప్లాస్టిక్, రబ్బరు, మెటల్, బంగారంతో చేసిన గాజులే భద్రంగానూ, చూడముచ్చటగానూ వుంటాయి.
. చిన్నపిల్లలకు సన్నటి గాజులు నాలుగైదు వేయడంకన్నా... [ఇంకా... ]

Monday, November 23

సాహిత్యం - జాతీయాలు

తెలుగు నేర్చుకోవాలనుకునేవారు వాడుక భాషలోని కొన్ని పదాల అర్ధాలను తెలుసుకోవడం అవసరమని భావిస్తూ మనం నిత్యం మట్లాడే కొన్ని పదాల వివరణలను ఇప్పుడు ఇస్తున్నాం. ఈ మాటలు ఏ సందర్భంలో అనాలో తెలిసినప్పటికీ గమ్మత్తైన ఈ పదాలు అసలు ఎలా పుట్టాయో తెలుసుకోవడం విఙాఞనదాయకంగానూ, వినోదాత్మకంగానూ ఉంటుంది. తెలుగు భాషకు మాత్రమే సొత్తైన ఈ పదాలను, పదబంధాలను జాతీయాలు అంటారు. మీక్కూడా తెలీకుండా అలవోకగా మీరు అనే ఈ జాతీయాల వివరణలోకి ఇప్పుడు వెళ్దాం.
జాతీయం అంటే?
ఒక జాతి ప్రజ ఒకభావాన్ని ప్రకటించడంలో వ్యక్తం చేసే భాషాపరమైన విలక్షణత. దీన్నే పలుకుబడి అని కూడా అంటారు. "ఓరంతపొద్దు, ఓడలు బండ్లు బండ్లోడలు, గుండెరాయి చేసుకొను, చెవిలో ఇల్లుగట్టుకొనె పోరు, కాలికి... [ఇంకా... ]

Saturday, November 21

జానపద కళారూపాలు - ఉపోద్ఘాతం

తెలుగు నాటక రంగం ఆవిర్భవించి నూరేళ్ళు దాటింది.ఈ నూరేళ్ళుగా వినోదాన్ని నాటకాలనుండి పొందుతున్నాం. సినిమా రాకముందూ, సినిమా వచ్చాకా కూడా సగటు మానవుడి దృష్టి నుంచి నాటక రంగం ఏనాడూ దూరం కాలేదు. ప్రజల అంతరాంతరాల్లో నాటుకు పోయిన ఈ జీవ కళ ఆవిర్భవించకముందు అంటే వంద సంవత్సరాలకు పూర్వం మానవుడు విజ్ఞానం, వినోదాలకోసం ఏం చేసేవాడు? అని ప్రశ్న ఉదయిస్తే దానికి సమాధానం ఎవరో కొద్ది మంది దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఆ కొద్దిమంది కూడా మేధావులేమీ కాదు. సామాన్య మానవులు మాత్రమే వాళ్ళు. ఆ సామాన్య మానవులు కూడా గ్రామీణ నేపధ్యం కలవారు లేక గ్రామీణ సంప్రదాయం పట్ల అభిమానం కలవారు మాత్రమే. వారిని పలకరిస్తే... [ఇంకా... ]

Thursday, November 19

వ్యక్తిత్వ వికాసం - అతివ - ఆత్మవిశ్వాసం

అతివల్లో ఆత్మవిశ్వాసం పెరగాలంటే ముందుగా వాళ్ళని వారు విశ్వసించాలి. ఆత్మ విశ్వాసం పెరగాలంటే అందుకు అనేక బలాలు దోహదం చెయ్యాలి. ముందుగా వారిలో ఆలోచనా జ్ఞానం పెంపొందాలి. స్వతంత్రంగా ఆలోచించడం అలవరుచుకోవాలి. అందుకు కొన్ని సూచనలు పాటించాలి... మిమ్మల్ని గురించి మీరు బాగా తెలుసుకోండి. మీ సంపదలను లెక్కవేయండి. మీ ఇల్లు, మీ కుటుంబం, స్నేహితులు, మీ సక్రమ ఆలోచనలు, భగవంతునితో మీకున్న విశ్వాసం మొదలైన వాటిని... [ఇంకా... ]

Wednesday, November 18

జానపద గీతాలు - చల్ మోహనరంగా...

నీకు నీవారు లేరు నాకూ నా వారు లేరు
ఏటి ఒడ్డున ఇల్లు కడదము పదరా చల్ మోహనరంగా
నీకు నాకు జోడు కలసెను గదరా
మల్లె తోటలోన మంచినీళ్ళ బావికాడ
ఉంగరాలు మరచి వస్తిని కదరా || చల్ ||... [ఇంకా... ]

Tuesday, November 17

ఆహార పోషణ - ఏ విటమిన్ ఎక్కడ దొరుకుతుంది?

నీటిలో కరిగే విటమిన్లు
విటమిన్--రసాయనిక నామము------లభించే పదార్ధాలు------ నూన్యత వలన కలిగే వ్యాధులు
బి 1--- ధయామిన్--- గోధుమ వంటి ధాన్యాలు, వేరుశనగ...--- బెరి బెరి, ఆకలి మందగించటం
బి 2--- రైబోఫ్లేవిన్--- పాలు, గుడ్లు, కాలేయము....--- నోటిపూత, నోటి మూలల్లో పగలటం
బి 6--- పైరిడాక్సిన్--- పాలు, కాలేయము, మాంసము...--- రక్తహీనత, ఉద్వేగము, నాడి మండలంలో... [ఇంకా... ]

Monday, November 16

నీతి కథలు - పేదరాశి పెద్దమ్మ కథ

అనగనగా ఒక ఊరు ఉంది. ఆ ఊళ్ళో పేదరాశి పెద్దమ్మ ఉందట. పెద్దమ్మకు నలుగురు కూతుళ్ళు ఉన్నారు. కూతుళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు. వారికి మంచి మనువులు చూసింది. తను దాచుకున్నవి తలోకాస్త ఇచ్చి వేసింది. తన వద్ద మిగిలింది ఏమీ లేదు. తాను బతకాలి కదా! కనుక ఒక్కో కూతురి ఇంట మూడు మాసాలు ఉంటుంది. అల్లుళ్ళు మంచివాళ్ళు దొరికారు. అత్తగారిని బాగా చూసుకుంటారు. ఇలా చాలా కాలం గడిచింది. ఈ ఏర్పాటు బాగానే ఉంది. పెద్దమ్మకు వంట వార్పు పని లేదు. హాయిగా గడచిపోతూంది. ఒకసారి పెద్దమ్మ కూతురు ఇంట్లో మూడు మాసాలు ఉంది. పెద్ద కూతురు అన్నీ వండి పెట్టింది. హుషారుగా ఉంది పెద్దమ్మ. ఒక రోజు రెండవ కూతురు ఇంటికి బయలు దేరింది. కొంత దూరం సాగింది. మధ్యలో... [ఇంకా... ]

Thursday, November 12

వంటలు - బందర్ హల్వా

కావలసిన వస్తువులు:
గోధుమపిండి - 1 కిలో.
జీడిపప్పు - 100 గ్రా.
బెల్లం - 1 కిలో.
నెయ్యి - 700 గ్రా.
యాలుకల పొడి - 30 గ్రా.
రెడ్ కలర్ - చిటికెడు.
చాక్లెట్ కలర్ - చిటికెడు.

తయారు చేసే విధానం :
గోధుమపిండిని సరిపడినన్ని నీళ్ళతో ముద్దలా చేసి ఒక గిన్నెలో... [ఇంకా... ]

Wednesday, November 11

భరతమాత బిడ్డలు - మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌

మౌలానా అబుల్ కలామ్‌ ఆజాద్ భారత స్వాతంత్ర్యం కోసం పరితపించిన వ్యక్తిగా, మత ప్రాతిపదికన భారతదేశం విడిపోవటాన్ని వ్యతిరేకించిన నిజమైన భారతీయునిగా, స్వాతంత్ర్యానంతర భారతదేశంలో సాహిత్యం, విద్యా వికాసాలకొరకు కృషి చేసిన వ్యక్తిగా, దేశభక్తికి మతాలు అడ్డురావని నిరూపించిన వ్యక్తి మౌలానా అబుల్ కలామ్‌ ఆజాద్.

సౌదీ అరేబియా దేశంలోని 'మక్కా' లో 1888 సంవత్సరంలో భారతీయ వ్యక్తి, అరబ్ యువతిల సంతానంగా మౌలానా అబుల్ కలామ్‌ జన్మించారు. మహమ్మదీయ సాంప్రదాయ పద్దతిలో విద్యాభ్యాసం జరిపినప్పటికి మౌలానా రహస్యంగా... [ఇంకా... ]

Monday, November 2

భక్తి సుధ - శ్రీ శివపంచాక్షరీ స్తోత్రమ్

నాగేంద్ర హారాయ త్రిలోచనాయ|
భస్మాంగ రాగాయ మహేశ్వరాయ|
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ|
తస్మై మకారాయ నమశ్శివాయ|
మందాకీని సలిల చందన చర్చితాయ|
నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ|
మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ|
తస్మై మకారాయ మకారాయ నమశ్శివాయ|... [ఇంకా... ]

Saturday, October 24

పిల్లల పాటలు - జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం...

జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం

అర్జునుడు తిన్న అరటి పండ్లరిగి

భీముడు తిన్న పిండివంటలరిగి

గణపతి తిన్న ఖజ్జాలరిగి... [ఇంకా... ]

Friday, October 23

న్యాయ వ్యవస్థ - హైకోర్ట్

రాష్ట్రంలో అత్యున్నత స్థానంలో ఉన్నది హైకోర్టు. ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉంటుంది. రెండు లేక అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు కూడా ఒకే హైకోర్టు ఉండేటట్లు పార్లమెంటు చట్టం చేయవచ్చు. మొత్తం భారతదేశంలో 21 హైకోర్టు‌లు ఉన్నాయి. ఒక్కొక్క హైకోర్టు‌లో ఒక్కొక ప్రధాన న్యాయమూర్తి ఉంటాడు. ఈ న్యాయమూర్తిని ప్రెసిడెంట్ నియమిస్తాడు సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర గవర్నర్‌ను సంప్రదించి... [ఇంకా... ]

Thursday, October 22

పండుగలు - సుబ్రహ్మణ్య షష్ఠి

దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠినాడు దేవసేనతో "శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి" వారికి అత్యంత వైభవంగా వివాహము జరిపించిన ఈ రోజును "శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి" గా పరిగణిస్తారు. ఈ స్వామివారి జన్మవృత్తాంత విశిష్టత సమీక్షగా తెలుసుకుందాము!

పూర్వం మూడులోకాలను భయభ్రాంతులను చేస్తూ బాధిస్తున్న "తారకా సురుడు" అను రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై! దేవతలు బ్రహ్మదేవుని శరణువేడినారు. దానికి బ్రహ్మ వారికి ఒక సూచన చేసినారు. ఈ తారకాసురుడు అమిత తపోబలసంపన్నుడు, అమితబలశాలి, వీనికి ఈశ్వర తేజాంశ సంభవుని వల్లకాని వానికి మరణములేదు. కావున! మీరు సతివియోగ దుఃఖముతో ఉన్న ఈశ్వరునకు ఆ సతీదేవియే మరుజన్మయందు గిరిరాజు హిమవంతునకు పుత్రికగా అవతరించిన ఆ పార్వతీదేవికి వివాహం జరిపించండి. వారికి కలుగు పుత్రుడే తారకాసురుని సంహరించగల... [ఇంకా... ]

Wednesday, October 21

సాహిత్యం - తెలుగు సాహిత్యంలో పేరడీ

పేరడీ అంటే అనుకరణ. అనుకరణ చెయ్యని ప్రాణి ఈ సృష్టిలో ఉండదు. శిశువు పుట్టినది మొదలు తన పరిసరాలను గ్రహిస్తూ అనుకరిస్తుంది. ముఖ్యంగా తల్లిదండ్రులను అనుకరిస్తూ ఎదుగుతుంది. అనుకరణకు సాధ్యంకాని రంగం ఈ సృష్టిలో లేదు. కళా రంగంలో ఈ అనుకరణ సర్వసామాన్యంగా ఉంటుంది. ఒక కళాకారుడు సృష్టించిన కళాభినయం తరువాతి తరాలకు అనుకరణయోగ్యంగా ఉంటుంది. ఆ కళాకారుని చాతుర్యాన్ని అనుసరిస్తూ అనేక ఇతర కళాభినయాలు ఆవిష్కరణకు నోచుకుంటాయి. తాము అనుకరించే కళాభినయం కూడా దేనికో ఒకదానికి అనుకరణ కాక మానదు. అదే ఈ సృష్టిలోని వైచిత్ర్యం. అనుకరణ అనేక రకాలుగా ఉంటుంది. ముఖ్యంగా ఆదర్శ అనుకరణ ఒకటి. ఇందులో... [ఇంకా... ]

Tuesday, October 20

వ్యాయామ శిక్షణ - మెడనొప్పి తగ్గించే మకరాసనం

మకరం అంటే మొసలి. నీటిలోని మొసలి రూపంలోనే ఈ ఆసనం ఉంటుంది కనుక, దీనికి 'మకరాసనం ' అని పేరు వచ్చింది. దీనికే 'నిరాలంబాసనం ' అనే పేరుంది. బోర్లా పడుకుని భుజంగ ఆసనం వేయాలి. రెండు చేతులనూ చుబుకం కింద ఆనించి బుగ్గలను వొత్తుతూ ఉంచాలి. రెండు మోచేతులనూ జోడించి నేల పైన ఉంచాలి. శ్వాసను సామాన్యంగా పీలుస్తూ, కళ్లు మూసుకుని, మెడ మీద మనసును... [ఇంకా... ]

Monday, October 19

భరతమాత బిడ్డలు - అనిబిసెంట్

పేరు - అనిబిసెంట్
తండ్రి పేరు - (తెలియదు)
తల్లి పేరు - (తెలియదు)
పుట్టిన తేది - 1-10-1847
పుట్టిన ప్రదేశం - లండన్
చదివిన ప్రదేశం - లండన్
చదువు - 1977
గొప్పదనం - స్వాతంత్ర్యం తీసుకురావటానికి మన దేశ నాయకులతో చేతులు కలిపి, ఒక భారతీయ మహిళ కంటే ఎక్కువగా కృషి చేసింది. ' న్యూ ఇండియా ' అనే ఆంగ్ల పత్రికను స్థాపించి, రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ ' కామన్ వీల్ ' అనే వారపత్రిక నడుపుతూ ' హోం రూల్ లీగ్ ' ఉద్యమాన్ని లేవదీసింది. బాలగంగాధర్ తిలక్, జిన్నా, మోతీలాల్ నెహ్రూ వంటి మహానాయకులు ఆ లీగ్‌ను సమర్ధిస్తూ అందులో చేరారు. 1917లో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెసు వార్షిక సమావేశానికి అధ్యక్షతవహించి... [ఇంకా... ]

Wednesday, October 14

వ్యక్తిత్వ వికాసం - ఇతరులతో సంభాషించే విధానం ఎలా ఉండాలి?

మనం ఎవరితో మాట్లాడినా మాట్లాడే తీరు ముఖ్యం. మాట్లేడే తీరులో సభ్యత, సంస్కారం బయటపడతాయి. వ్యక్తిత్వం వెల్లడవుతుంది. అందుకే నోరు మంచిదయితే వూరు మంచిదవుతుందని పెద్దలంటారు. మాటలతో అందరి ప్రశంసలు పొందాలంటే కొన్ని సూచనలు పాటించాలి.
. సంభాషణను మొట్టమొదట చమత్కారంగా ప్రారంభించడానికి తగిన ప్రావిణ్యత, నైపుణ్యం సంపాదించాలి.
. సంభాషణ ప్రారంభించిన తర్వాత చిన్న చిన్న వ్యాఖ్యానాలతో హాస్య ధోరణిలో సంభాషణ కొనసాగిస్తూ ఉండాలి. దానివల్ల వ్యక్తిగత ప్రమేయం లేకుండా సంభాషణ సాఫీగా సాగిపోతుంది.
. ఆత్మీయులతో మాట్లాడినా, అపరిచితులతో మాట్లాడినా ఎదుటివాళ్ళ ముఖాన్ని అప్పుడప్పుడు పరిశీలిస్తూ వుండాలి. ఇందువల్ల మనం చెప్పేది జాగ్రత్తగా వింటున్నారా లేదా అని గమనించగలుగుతాం.
. వింటున్నారనుకుంటే మనం సంభాషణ సాగించాలి. లేదా ఎదుటి వాళ్ళ ఆసక్తిని కనిపెట్టి... [ఇంకా... ]

Monday, October 12

ఎందుకు, ఏమిటి, ఎలా ... - భూమధ్యరేఖ వద్ద వేడి ఎక్కువ ఎందుకు?

భూమికి సూర్యుడి నుండి కాంతి, ఉష్ణశక్తులు లభిస్తాయి. భూమిపై ఉష్ణం అన్ని చోట్ల ఒకే విధంగా ఉండదు. కొన్ని చోట్ల ఎక్కువ వేడిగా ఉంటే కొన్ని చోట్ల తక్కువ వేడి ఉంటుంది. భూమి గోళాకారంలో ఉండి, ధ్రువాల వద్ద కొంత మేరకు బల్లపరుపుగా ఉంటుంది. సూర్యకిరణాలు భూమిపై వివిధ ప్రదేశాలలో వివిధ కోణాలలో పడుతూ ఉంటాయి. భూమధ్య రేఖపై సూర్యకిరణాలు నిలువుగా పడితే, దానికి ఉత్తర దక్షిణ దిశల్లో భూమధ్య రేఖ వద్ద వేడి ఎక్కువగా ఉంటుంది. భూమధ్య రేఖ నుంచి ధ్రువాల వైపు వెళ్ళే కొద్దీ వేడి తక్కువగా ఉంటుంది... [ఇంకా... ]

Saturday, October 10

వ్యాకరణం - వ్యాకరణం ఉపోద్ఘాతం

ఏ భాషలోనైనా అంతర్గతంగా ఉన్న లక్షణాలను సూత్రీకరించి వ్రాసిన గ్రంధం వ్యాకరణ గ్రంధమవుతుంది. శబ్ద శాస్త్రమే వ్యాకరణం. ఆ భాషలో లక్షణాలే ఆ భాషకు వ్యాకరణం అవుతుంది. వ్యవహారంలో మాట్లాడుకునే భాషకు కూడా వ్యాకరణం ఉంటుంది. వ్యావహారికంగా దేశ కాల పాత్రలనుబట్టి వచ్చే మార్పులు ఆ భాష వ్యాకరణంలో మార్పులు తీసుకొస్తాయి. ఎప్పటికప్పుడు వీటి నుండి వ్యాకరణ సూత్రాలకు కూడా మార్పులు చేసుకుంటుండాలి. కాబట్టి ఆయా కాలాలలో శిష్ట వ్యవహారాలన్నింటినీ ఆధారం చేసుకుని వ్యాకరణ సూత్రాలని సరిదిద్దుకుంటూండడం సంప్రదాయకం అయింది... [ఇంకా... ]

Thursday, October 8

వంటలు - బిసిబేళాబాత్

కావలసిన వస్తువులు:
లేతవంకాయలు - 200గ్రాములు.
గోరుచిక్కుళ్లు - 50గ్రాములు.
బంగాళాదుంపలు - 100గ్రాములు.
క్యారెట్ - రెండు దుంపలు.
మునక్కాయలు - 6.
చింతపండు - 25గ్రాములు.
కందిపప్పు - 100గ్రాములు.
బియ్యం - 1కిలో.
రిఫైండ్ ఆయిల్ - 100గ్రాములు... [ఇంకా... ]

Tuesday, October 6

పండుగలు - అట్లతద్దె

ప్రతీ సంవత్సరం ఆశ్వీయుజ బహుళ తదియనాడు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఈ "చంద్రోదయ ఉమావ్రతం - అట్లతద్ది" స్త్రీలకు చక్కని ఆనందాన్ని జీవితంలో చక్కని విచిత్రానుభూతులను కలిగిస్తూ ఉంటుంది. ఈ పండుగలో ఒక విశేషం ఉన్నది. కొన్ని వ్రతాలైతే వివాహితులైన స్త్రీలు మాత్రమే నిర్వహిస్తారు. కానీ, ఈ పండుగ పిన్నలు, పెద్దలు కూడా కలిసి వయోభేదం లేకుండా ఆచరిస్తారు. పిల్లలతోబాటు తల్లులు కూడా 20 సం|| వెనకకి పోయి బాల్యజీవితంలోకి వెళ్ళి ఆనందం పొందుతారు. ఇక మూడుకాళ్ల ముదుసలి అయిన బామ్మగారు కూడా! వారి ఆటలాడుకుంటున్న వారినందరని తన దగ్గరకు రప్పించుకుని అమ్మాయిలూ... చూచారా... నా చిన్నప్పుడూ! అంటూ, వారి చిన్ననాటి జ్ఞాపకాలు, అనుభవాలు .. అంటూ ఉంటారు. అటువంటి వృద్ధులలో నవయవ్వనం తొణికిసలాడేది ఈ పండుగలోనే. ఇట్టి ఆటపాటలు కనువిందుచెయ్యాలి అంటే పల్లెసీమలే పట్టుకొమ్మలు... [ఇంకా... ]

Monday, October 5

న్యాయ వ్యవస్థ - సుప్రీం కోర్ట్

భారత దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఇది హైకోర్టులపై నియంత్రణాధికారం కల్గిఉన్నది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సలహాపైననే రాష్ట్రపతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను, ఇతర న్యాయమూర్తులను నియమిస్తాడు. ఇందులో 26 మంది జడ్జీలు ఉంటారు ప్రధాన న్యాయ మూర్తితో కలిపి. ఈ కోర్టులలో
. భారత ప్రభుత్వానికి, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల మధ్య తగాదాలను,
లేక
. భారత ప్రభుత్వం, ఒకటి లేదా కొన్ని రాష్ట్రాలు ఒక వైపు ఒకటి లేదా కొన్ని రాష్ట్రాలు ఇంకొక వైపు ఉన్నప్పుడు వాటి మధ్య తగాదాలను... [ఇంకా... ]

Saturday, October 3

నీతి కథలు - దొంగపిల్లి

భాగీరధీ నది ఒడ్డన పెద్ద జువ్వి చెట్టు ఉంది. ఆ చెట్టు తొర్రలో 'జరధ్గవము' నే ముసలి గ్రద్ద ఉండేది. ఆ గ్రద్దకు కళ్ళు కనిపించవు, అందుకని ఆ చెట్టు మీద ఉండే పక్షులు తమకు తెచ్చుకున్న ఆహారంలో ఆ గ్రద్దకు కొంత పెట్టేవి. ఆ గ్రద్ద, పక్షులు బయటకు వెళ్ళినపుడు వాటి పిల్లలకు మంచి మంచి కథలు చెప్పి నిద్ర పుచ్చేది. ఒక రోజు 'దీర్ఘకర్ణము' అనే పేరుగల పిల్లి పక్షుల పిల్లల్ని తినటానికి ఆ చెట్టు పైకి చేరింది. ఆ పిల్లిని చూసి పక్షి పిల్లలు భయంతో అరిచాయి. ఆ అరుపులు విన్న జరధ్గవము తొర్రలోంచి బయటకు వచ్చి 'ఎవరక్కడ...?' అంటూ కోపంగా అరిచింది. ఆ అరుపుకు పిల్లి పై ప్రాణాలు పైనే పోయాయి. తప్పించుకోవటానికి దానికి... [ఇంకా... ]

Friday, October 2

భరతమాత బిడ్డలు - మహత్మా గాంధీ

పేరు : మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ( మహాత్మా గాంధీ )
తండ్రి పేరు : కరంచంద్ గాంధీ
తల్లి పేరు : పుత్లీబాయి
పుట్టిన తేది : 2-10-1869
పుట్టిన ప్రదేశం : పోరుబందర్
చదివిన ప్రదేశం : లండన్
చదువు : లాయర్
గొప్పదనం : శాంతియుతంగా అనేక సత్యాగ్రహాలు చేసి ఆంధ్ర దేశానికి స్వాతంత్ర్యం తెచ్చాడు
స్వర్గస్తుడైన తేది : 31-1-1948
మహాత్మా గాంధీ గుజరాత్ లోని ఖయిత్వాద్ ప్రాంతంలోని పోరుబందర్ లో కరంచంద్ గాంధీ, పుత్లీబాయి దంపతులకు 1869వ సంవత్సరం అక్టోబర్ 2న జన్మించాడు. నీతి నిజాయితీలకు కట్టుబడిన కుటుంబంలో జన్మించిన గాంధీ చిన్నతనం నుంచి ఎంతో క్రమశిక్షణతో పెరుగుతూ, తల్లి దండ్రుల యెడల గురువుల యెడల ఎంతో వినయ విధేయతలతో ఉంటూ అందరి అభిమానాన్ని చూరగొన్నాడు. మోహన్ దాస్ కి పన్నెండవ సంవత్సరంలోనే కస్తుర్భాతో వివాహమయింది. అంత చిన్నతనంలో పెళ్ళిచేసుకోవటం అతనికి ఇష్టం లేకపోయినా తల్లిదండ్రుల మాట జవదాటలేక అంగీకరించాడు.వివాహ కారణంగా గాంధీ చదువు ఒక ఏడాది వృధా అయింది... [ఇంకా... ]

Thursday, October 1

సాహిత్యం : భాష - ఉత్పత్తి

మానవ జీవితం సుఖ దుఃఖాల సమ్మేళనం. తనలో సంఘర్షణలను రేకెత్తిస్తున్న భావాలను, తన కష్ట సుఖాలను సాటి మానవుడితో పంచుకోవడానికి ఆది మానవుడు సంజ్ఞలు (Gestures) చేసేవాడు. వాటి ద్వారా ఒకరినొకరు సమాచారాన్ని పరస్పరం వ్యక్తపరుచుకునేవారు. ముఖ వికాసం వలన సుఖాన్ని, ముఖ వికారం వలన దుఃఖాన్ని బహిర్గతం చేసుకునేవారు. అట్లేగాక కొన్ని ధ్వనుల ద్వారా కూడా అంతరంగాన్ని వెల్లడించుకునేవారు. అంటే అభిప్రాయాన్ని వ్యక్తపరచే ఒక సాధనం భాష అన్నమాట. అవయవాల సహాయంతో భావాన్ని తెలియజేసే మాటల సముదాయాన్ని కూడా భాష అనవచ్చు. కొన్ని సందర్భాలలో ఉచ్ఛారణ లేకుండానే అవయవాల కదలికల ద్వారా... [ఇంకా... ]

Wednesday, September 30

అందరికోసం - ప్రవాసాంధ్రులు

తెలుగు సైటు పేరు ----- సైటు అడ్రస్

హిందూ సమాజ టెంపుల్ -- www.hindusamajtemple.org
శ్రీ మీనాక్షి టెంపుల్ సొసైటి -- www.meenakshi.org
క్యాపిటల్ ఏరియా తెలుగు సొసైటి -- www.theuscats.org
బోస్టన్ తెలుగు అసోసియేషన్ -- www.tagb.org
ట్రీ స్టేట్ తెలుగు అసోసియేషన్ -- www.telugu.org
ఇండియన్ అంబసీ ఆఫ్ కువైట్ -- www.indembkwt.org... [ఇంకా... ]

Tuesday, September 29

మీకు తెలుసా - కాలగణనం

ప్రాచీన శాస్త్రవేత్తల కాలగణనం:
1 క్రాంతి = 1 సెకెండులోని 34,000లో భాగం
1 త్రుటి = 1 సెకెండులో 300వ వంతు
1 త్రుటి = 1 లవము, లేశము
2 లవములు = 1 క్షణం
30 క్షణములు = 1 విపలం
60 విపలములు = 1 పలం... [ఇంకా... ]

Saturday, September 26

వంటలు : వంకాయ - జీడిపప్పు కూర

కావలసిన వస్తువులు:
వంకాయలు - పావు కేజీ
జీడిపప్పు - పావు కేజీ
ఉప్పు - తగినంత
పసుపు - చిటికెడు

పోపు సామగ్రి :
ఎండుమిర్చి - 4
ఆవాలు - అర టీ స్పూన్
మినప పప్పు - ఒక టీ స్పూన్
జీలకర్ర - పావు టీ స్పూన్
జీలకర్ర - పావు టీ స్పూన్
శనగపప్పు - ఒక టీ స్పూన్... [ఇంకా... ]

Friday, September 25

ఎందుకు, ఏమిటి, ఎలా ... - రాడార్

రాడార్ అంటే ఏమిటి అది ఎలా పని చేస్తుంది, దానిని ఎందుకు ఉపయోగిస్తారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా రాడార్ ఎందుకు ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. రాడార్ మన చుట్టూ అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. విమానాల ఉనికిని గమనిస్తూ అవి క్షేమంగా దిగడానికి, ఎయిర్ లైన్స్ వాళ్ళు నిర్లక్ష్యంగా నడిపే వాహనాల వేగాన్ని కనిపెట్టడానికి పోలీసులు, గ్రహాల మ్యాప్‌లు రూపొందించడానికి, ఉపగ్రహాల స్థితిగతులు తెలుసుకోవడానికి అంతరిక్ష పరిశోధకులు, శత్రువాహనాల జాడను కనిపెట్టడానికి... [ఇంకా... ]

Thursday, September 24

జానపద గీతాలు - మొక్కజొన్న తోటలో

మొక్కజొన్న తోటలో...
సుక్కలన్ని కొండమీద - సోకుజేసుకునే వేళ
పంటబోది వరిమడితో - పకపక నవ్వే వేళ
సల్లగాలి తోటకంత - సక్కలగిల్లి పెట్టువేళ
మొక్కజొన్న తోటలో - ముసిరిన సీకట్లలో
మంచెకాడ కలుసుకో, - మరువకు మామయ్య... [ఇంకా... ]

Wednesday, September 23

పండుగలు - దేవీ నవరాత్రులు

ఆశ్వయుజ మాసం శుక్లపక్షంలో మొదటి తొమ్మిది రోజులనూ 'దసరా' లేక 'దేవీ నవరాత్రులు' అంటారు. ఈ తొమ్మిది రోజుల్లో చివరి మూడురోజులు దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి. విద్యార్ధులు పుస్తకపూజ, శ్రామికులు పనిముట్లపూజ, క్షత్రియులు ఆయుధపూజ చేసి, అమ్మవారి కృపకు పాత్రులు అవుతారు. దేవి మహిషాసురమర్దనిగా రాక్షసుని మీదకు దండెత్తి విజయం సాధించిన స్పూర్తితో, పూర్వం రాజులు ఈశుభ ముహూర్తాన్నే దండయాత్రలకు ఎంచుకొనే వారని పురాణాల్లో చెప్పబడింది. కొన్ని ప్రాంతాలలో దసరాకు ఒక వేడుకగా బొమ్మల కొలువు పెట్టే ఆచారం ఉంది.
దుర్గాష్టమి
దుర్గాదేవి "లోహుడు" అనే రాక్షసుని వధిస్తే లోహం పుట్టిందని, అందువల్ల లోహపరికరాలని పూజించే ఆనవాయితి వచ్చింది అని చెప్తారు. ఇక దుర్గ అంటే?... [ఇంకా... ]

Tuesday, September 22

పిల్లల ఆటలు - డిటెక్టివ్ ఆట 

ఎంతమంది ఆడవచ్చు : 10 మంది
కావలసిన వస్తువు : టవల్
ఆడే స్థలం : గదిలోగాని, ఆరుబయట గాని
ఆటగాళ్ల వయస్సు : 5 నుండి 7 సం|| రాల మధ్య
పోటి సమయం : ప్రతి ఆటగాడికి 5 సెకన్లు
ఆటగాళ్లందరూ కూర్చోవాలి అందరూ పంటలు వేశాక దొంగ అయిన బాలుడు/బాలిక లీడర్ కళ్లు మూస్తాడు. ఈలోగా... [ఇంకా... ]

Saturday, September 19

భక్తి సుధ - శ్రీ అష్టాదశ శక్తి పీఠ స్తోత్రము

1. లంకాయం శంకరీ దేవీ, కామాక్షీ కాంచికాపురే |
ప్రద్యుమ్నే శృంగళాదేవీ చాముండీ క్రౌంచపట్టణే |
2. అలంపురే జోగులాంబా, శ్రీశైలే భ్రమరాంబికా |
కొల్హాపురే మహాలక్ష్మీ, మహూర్యే ఏకవీరికా... [ఇంకా…]

Thursday, September 17

సౌందర్య పోషణ - అవాంఛిత రోమాలు తొలగించండిలా!

కొంత మంది మహిళలకు గడ్డం మీద, పైపెదవిపైన, నుదిటిపైన, బుగ్గలపైన, కనుబొమ్మలు ద్వారా శాశ్వతంగాను, తాత్కాలికంగాను తొలగించవచ్చు.

. చేతులు, కాళ్ళపై వుండే రోమాలను వాక్స్, రోమహారి క్రీములు, రేజర్స్ ఉపయోగించి నిర్మూలించాలి.

. పొత్తికడుపు, గుండెలపైన, మెడకింద... [ఇంకా…]

సౌందర్య పోషణ - గోళ్ళకు

అందమైన, ఆరోగ్యమైన గోళ్ళు చేతులకు ఎంతో అందాన్నిస్తాయి. గోళ్ళ సంరక్షణకు కొన్ని టిప్స్ తెలుసుకుందాము.
. గాఢమైన రంగులను గోళ్ళకు వేస్తే గోళ్ళు పొట్టిగా కనిపిస్తాయి. దీనికి పరిష్కారం, గోరుకు ఒక పక్క నిలువు గీతను తెల్లగా పెయింట్ చేయకుండా వదిలేయడం.
. గోళ్ళ ఆరోగ్యానికి కూడా నిమ్మకాయ మేలు చేస్తుంది. నిమ్మ తొక్కలతో గోళ్ళు రుద్దితే గోళ్ళు అందంగానూ, పుచ్చిపోకుండా ఉంటాయి.
. గోళ్ళ చుట్టూ ఉన్న చర్మంపై క్యూటికల్ ఆయిల్‌ని పూయాలి. ఊడిన గోళ్ళని క్యూటికల్ కటర్స్‌తో... [ఇంకా…]

వంటలు - బాంబే హల్వా

కావలసిన వస్తువులు:
మైదాపిండి - ఒక కప్పు
శనగపిండి, చెక్కెర - ఒక కప్పు
పసుపురంగు ఫుడ్ కలర్ - అర టీ స్పూన్‌
నెయ్యి - ఒకటిన్నర కప్పులు
జీడిపప్పులు, బాదం ముక్కలు - రెండు టీ స్పూన్లు

తయారు చేసే విధానం :

మైదాపిండిని ముందురోజు రాత్రే నీటిలో గట్టిగా కలిపిఉంచాలి. శనగపిండిని సువాసన వచ్చేవరకూ వేయించాలి. అడుగు మందంగా వుండే పాత్రలో చెక్కర వేసి నీరుపోసి తీగపాకం... [ఇంకా…]

Tuesday, September 15

సౌందర్య పోషణ - ఆకర్షించే గలగల గాజులు

. చేతులకు ధగధగమని మెరిసే బంగారు గాజులు ఎన్ని వున్నా వాటి మధ్యలో మట్టిగాజులు వేసుకుంటేనే వాటికి మరింత నిగారింపు వస్తుంది.

. పెళ్ళిళ్ళు, శుభకార్యాలకు రెండు చేతులకూ రంగురంగుల మట్టిగాజులు వేసుకుంటే మహిళల చేతులు కళకళలాడుతూ ఆకర్షణీయంగా వుంటాయి.

. చిన్నపిల్లలకైతే మట్టి, పింగాణీతో చేసిన గాజులు వేయడం కన్నా ప్లాస్టిక్, రబ్బరు, మెటల్, బంగారంతో చేసిన గాజులే భద్రంగానూ, చూడముచ్చటగానూ వుంటాయి.

. చిన్నపిల్లలకు సన్నటి గాజులు నాలుగైదు వేయడంకన్నా వెడల్పుగా వుండే సింగిల్ గాజు వేస్తేనే... [ఇంకా…]

Monday, September 14

వ్యక్తిత్వ వికాసం - విజయ సాధనకు సప్త శాసనాలు 

విజయానికి సూత్రాలు ఎవరూ విక్రయించలేరు.జీవితంలో విజయ శిఖరాగ్రం చేరుకున్న వ్యక్తుల జీవితాలనుంచి నేర్చుకున్న పాఠాలనుంచి కొన్ని సూచనలను మనం తీసుకోవాలని వివేకం ప్రబోధిస్తున్నది. అసంఖ్యాకమైన విజయవంతమైన జీవితాలను గురించి తీవ్రంగానూ మరియు చిత్తశుద్ధితోనూ అధ్యయనం చేసి,శాస్త్రీయ దృష్టితో పరిశీలించినప్పుడు,కొన్ని ప్రాధమిక అంశాలు వెలుగులోకి వచ్చాయి. వీటిని "విజయానికి శాసనాలు" అని విశ్వాసనీయంగా అంగీకరించవచ్చు. ప్రస్తుతం ఏడు ప్రధాన విజయ శాసనాలను గురించి తెలుసుకుందాం.
సరైన గమ్యస్థానం నిర్ణయించుకోవాలి
సరైన గమ్యస్థానం అభ్యుదయేచ్ఛను ఉదయింపజేస్తుంది. అత్యధికులైన విజేతలకు సరైన గమ్యస్థానాలు... [ఇంకా…]

Saturday, September 12

నీతికధలు - పరమానందయ్య శిష్యులు చేసిన శొంఠి వైద్యం

ఒక గ్రామంలో రామయ్య అనే వ్యాపారస్థుడు వున్నాడు. అతనికి పరమానందయ్యగారంటే ఎంతో భక్తి. పరమానందయ్యగారి తండ్రి, తాతల కాలం నుండి కుటుంబ గురువులు. అందువల్ల ఆయన పరమానందయ్యగారిని దైవసమానంగా భావిస్తున్నాడు. ఆయన మాట వేద వాక్యంగా భావించి పాటిస్తాడు. అప్పుడప్పుడూ ఆయన పరమానందయ్యగారి వద్దకు వచ్చి తృణమో పణమో యిచ్చి వెళుతూ వుంటాడు.
రామయ్య తన గ్రామంలో వడ్డీ వ్యాపారం చేసేవాడు. కిరాణా దుకాణం, బట్టల దుకాణం నడిపేవాడు. అనేక అబద్దాలు ఆడి, మోసాలు చేసి విశేష ధనం, భూమి సంపాదించాడు. కానీ భార్యా పిల్లలు దక్కలేదు. నా అనే దిక్కులేక, గ్రామస్థులతో, సరిపడక మనసు బాగులేనప్పుడూ, ఏదయినా అనారోగ్యం వచ్చినప్పుడూ పరమానందయ్యగారి వద్దకు వెళ్ళి, రెండురోజులు ఉండి పోతుండేవాడు.
ఇలా జరుగుతూ ఉండగా ఒకసారి... [ఇంకా…]

Friday, September 11

భక్తి గీతాలు - అలమేలుమంగనీ వభినవరూపము

అలమేలుమంగనీ వభినవరూపము
జలజాక్షు కన్నులకు చవులిచ్చేవమ్మ
గరుడాచలాధీశు ఘనవక్షముననుండి
పరమానంద సంభిరతవై
నెరతనములు జూపి నిరంతరమునాథుని
హరుషింపగ జేసి తిగదమ్మ... [ఇంకా…]

Thursday, September 10

సాహిత్యం - మన గ్రంధాలయాలు

జిల్లాలో మొత్తం 92 గ్రంథాలయాలు ఉన్నాయి. వాటిలో 65 శాఖా, 27 గ్రామీణ గ్రంథాలయాలు. వీటిలో ప్రస్తుతం 52 శాఖా, 13 గ్రామీణ గ్రంథాలయాలు పనిచేస్తున్నాయి. మొత్తం గ్రంథాలయాల్లో 18 సొంతభవనాల్లో, 17 అద్దె భవనాల్లో నడుస్తున్నవి.
అందులో కొన్ని గ్రంథాలయాలు
1. గీతా లైబ్రరి - చీరాల
2. గౌతమి లైబ్రరి - రాజమండ్రి
3. బ్రౌన్ లైబ్రరి - కడప
4. సారస్వత నికేతనం - వేటపాలెం
5. సిటి సెంట్రల్ లైబ్రరి - హైదరాబాద్ ... [ఇంకా…]

Wednesday, September 9

ఆధ్యాత్మికం - పవిత్రగ్రంధాలు

మానవుని జీవితం మీద పవిత్ర గ్రంధాల ప్రభావం ఎంతైనా ఉంది. సామాజిక వ్యవస్థను తీర్చిదిద్ది, క్రమబద్ధం చేసేవి పవిత్ర గ్రంధాలు. కాబట్టి ప్రతి మతంలోనూ ఈ గ్రంధాలకు పవిత్రత, గౌరవం ఉంది.
నిత్య సత్యాలను ప్రకటించేవి వేదాలు. ప్రజల యొక్క ధార్మిక తత్వాన్నీ, సాంస్కృతిక సంపదను వెల్లడి చేసేవి వేదాలు. ప్రతి మతానికీ ఆ మతానికి సంబంధించిన పవిత్ర గ్రంధాలు ఉన్నాయి. ఆయా పవిత్ర గ్రంధాలను అనుసరించే ఆయా మతాలు నిరూపించబడుతున్నాయి. మన ప్రాచీన ఋషులు ఎంతో శ్రద్ధగా వేద రచన చేశారు. వేద రహస్యాలు దేవతలు చెప్పగా ఋషులు విని పఠించినవి... [ఇంకా…]

Tuesday, September 8

సంగీతం - సంగీత వాయిద్యాలు

ఆర్యులు మన దేశానికి రావడం మాత్రం మన దేశ చరిత్రలో చాలా ముఖ్యమైన ఘట్టం. క్రీస్తుకు పూర్వం రెండు వేల అయిదు వందల సంవత్సరాల క్రితం వచ్చిందని చెప్పుకునే ఆర్యుల వేద సాంప్రదాయం మన దేశాన్ని, అతః పూర్వ సాంప్రదాయాల్ని ఎంతగానే మార్చివేసిందని చెప్పాలి. అంతకు క్రితముండిన ఈ దేశపు ప్రజల జీవన విధానాలు, సాహిత్యం, మతం, కళలు అన్నీ గూడా వేద ప్రభావితాలై ఎంతో ఔన్నత్యాన్ని, నాగరికతని పుంజుకున్నాయి. వేద సంహితలన్నీ మానవ జీవన విధానాల వర్ణనలే. ఉదాహరణకు మన సంగీతం ఋగ్వేద, సామవేద జనితమని చెపుతారు. నిజం కూడ అలాగే కనిపిస్తుంది. సామవేద పఠనాన్ని సామగానమన్నారు... [ఇంకా... ]

Monday, September 7

భారతమాత బిడ్డలు - శ్రీనివాస రామానుజం

పేరు - శ్రీనివాస రామానుజం.
తండ్రి పేరు - శ్రీనివాస అయ్యంగార్.
తల్లి పేరు - కోమలత్తమ్మాళ్.
పుట్టిన తేది - 22-12-1887.
పుట్టిన ప్రదేశం - తమిళనాడులోని ' ఈ రోడ్ ' లో జన్మించెను.
చదివిన ప్రదేశం - కుంభకోణం.
చదువు - డిగ్రీ.
గొప్పదనం - 15 ఏళ్ళప్పుడే జార్జ్ స్కూచ్‌సిడ్జ్‌కార్ రూపొందించిన 6000 గణిత సిద్దాంతాలను తులనాత్మకంగా పరిశీలించారు.
స్వర్గస్తుడైన తేది - 26-4-1920.

శ్రీనివాస రామానుజం 1887 డిసెంబరు 22న తమిళనాడులోని 'ఈ రోడ్' లో జన్మించెను. తండ్రి శ్రీనివాస అయ్యంగార్ కుంభకోణంలోని ఒక బట్టల కొట్టులో గుమస్తాగా పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తూండే వాడు. పేద కుటుంబమైనా తమ అవసరాలకు చాలినంత డబ్బు లేకపోయినా ఆయన ఏనాడూ ఒకరిని చేయిచాచి అర్థించక, తమకున్న దాంతోనే తృప్తిపడి, ఉన్న రోజు తిని, లేని రోజు పస్తుండి, ఎంతో ఆత్మగౌరవంతో బతికేవాడు. [ఇంకా... ]

Saturday, September 5

వనితల కోసం - ముద్దుగారే

ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు
తిద్దరాని మహిమల దేవకి సుతుడు ||ముద్దుగారే||
అంత నింత గొల్లెతల అరచేత మాణికము
పంతమాడే కంసుని పాలి వజ్రము
కాంతుల మూడు లోకాల గరుడపచ్చబూ
చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు ||ముద్దుగారే||... [ఇంకా... ]

Thursday, September 3

విజ్ఞానం - కంప్యూటర్

నేటి ఆధునిక ప్రపంచంలో కంప్యూటర్‌లేని జీవనాన్ని ఊహించుకోవడానికి కష్టమేమో. నేడు కంప్యూటర్ ప్రవేశించని రంగమంటూ లేదు. ఇంతటి అద్భుతమైన సాధనాన్ని కనిపెట్టిన మానవుడే నేడు దాని సహాయం లేకుండా నిమిషం కూడా గడవని స్థితికి చేరుకున్నాడంటే దీని శక్తిని మనం అంచనా వేయగలమా? ఇంతవరకూ మానవుడు ఆవిష్కరించిన మరే యంత్రము కంప్యూటర్ చూపినంత ప్రభావాన్ని చూపలేదంటే దీని ప్రాముఖ్యత ఎంత ఉన్నదో మనకు అర్థమవుతోంది, ఉదయం నిద్రలేవగానే చూసే న్యూస్‌పేపరు నుండి విద్యాలయాలు, ఆఫీసులు, పోస్టాఫీసు, రైల్వేస్టేషను ఎక్కడికి వెళ్ళినా మనకు తెలియకుండానే మన పనులు అన్ని కంప్యూటర్ ద్వారా జరుగుచున్నాయి. మన అవసరాలకు ఉపయోగపడుచున్న కంప్యూటర్ గురించి, 'కంప్యూటర్ అంటే ఏమిటి?' కంప్యూటర్ ఎలా పని చేస్తుంది? ఏ విధమైన అవసరాలకు కంప్యూటరును ఉపయోగించుకోవచ్చు మొదలగు విషయాలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.

కంప్యూటర్ అంటే ఏమిటి?... [ఇంకా... ]

Wednesday, September 2

అందరికోసం - ఫౌంటెన్ పెన్

మనకు ఏది వ్రాయాలన్న మనం ఉపయోగించేది మొదట పెన్ను. కాని మనకు ఆ పెన్ను గురించి వివరాలు ఏమి తెలయవు కనుక ఇప్పుడు ఆ పెన్ను ఎలా పుట్టినదో, అసలు ఎవరు కనుగొన్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇవ్వాళ మనం క్లాస్‌రూంలో పెన్ను పట్టుకొని టకటకా నోట్స్ రాసుకుంటున్నాంగానీ ఇలా పెన్నును ఈ షేప్‌లో చూడడం వెనుక బోలెడంత కథ ఉంది. భారతదేశంలో పెన్ను, పేపరు రానంత వరకూ రాతకోతలన్నీ తాటాకుల మీద, ఘంటంతో సాగేవి. ఆ తర్వాత సిరాలో ముంచి రాసే పెన్నులు వచ్చాయి. అయితే నాలుగు పదాలు రాయగానే మళ్ళీ పెన్నును సిరాలో ముంచి రాయాల్సి వచ్చేది... [ఇంకా... ]

Tuesday, September 1

వంటలు - జంతికలు (పప్పులతో...)

కావలసినవి:
కందిపప్పు - ఒక గ్లాసు.
మినపప్పు - ఒక గ్లాసు.
పెసరపప్పు - ఒకగ్లాసు.
బియ్యం - 5 గ్లాసులు ( కావలంటే కొంచెం తగ్గించుకోవచ్చు).
నువ్వులు - 25 గ్రాములు నూనె - తగినంత.
కారం - తగినంత.

చేసే విధానం:
పప్పులను దోరగా వేగించి పెట్టుకోవాలి. బియ్యాన్ని కూడా వేగించాలి. వీటన్నిటి కలిపి మరలో పిండి పట్టించాలి. దానిలో నువ్వులు, నాలుగు స్పూన్ల మరిగించిన నూనె, తగినంత ఉప్పు, కారం, నీరు పోసి కలిపిన ముద్దను జంతికల గొట్టంలో పెట్టి కాగుతున్న నూనెలో జంతికలు వేసి వేగాక ... [ఇంకా... ]

Monday, August 31

సాహిత్యం - సాహిత్యం అంటే

సమాజము యొక్క ప్రతిబంబమే సాహిత్యం. వర్తమాన సమాజంలోని జీవన పరిస్థితులు, ఆచార వ్యవహారాలు, ఇంకా ఆయా సమాజాలను ప్రభావితం చేసే అనేక ఇతర అంశాల ఛాయాచిత్రమే సాహిత్యం. పురాతన సమాజాలను అధ్యయనం చేయడం అధునాతన సమాజాల ఆవిర్భావానికి హేతువులాంటిది. సమాజ అధ్యయనం సాహిత్యం ద్వారా సులువు కాబట్టి సాహిత్య అధ్యయనాన్ని సమాజంలోని ప్రతి వ్యక్తీ అలవాటు చేసుకోవాలి. సాహిత్యం మన సంస్కృతి పట్ల మన బాధ్యతను మనకు గుర్తుచేస్తుంది. మన సంప్రదాయంలోని మాధుర్యాన్ని మనకు తెలియజేస్తుంది. మనలో సంస్కారాన్ని కలిగిస్తుంది. ఈవిధంగా సమాజానికి హితం చేస్తుంది కాబట్టే అది సాహిత్యం అయ్యింది... [ఇంకా... ]

Saturday, August 29

తెలుగు - తెలుగు సంవత్సరాలు

ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, ప్రజోత్పతి, అంగీరస, శ్రీముఖ, భావ, యువ, ధాత, ఈశ్వర, బహుధాన్య, ప్రమాది, విక్రమ, వృష, చిత్రభాను, స్వభావ, తారణ, పార్ధివ, వ్యయ, సర్వజిత్తు, సర్వధారి, విరోధి, వికృతి, ఖర, నందన, విజయ, జయ, మన్మథ, దుర్ముఖి, హేవిళంబి, విళంబి, వికారి, శార్వరి, ప్లవ, శుభకృతు, శోభకృతు, క్రోధి, విశ్వావసు, పరాభవ, ప్లవంగ, కీలక, సౌమ్య, సాధారణ, విరోధికృతు, పరీధావి, ప్రమాదీచ, ఆనంద, రాక్షస, నల... [ఇంకా... ]

Friday, August 28

పుణ్యక్షేత్రాలు - యాదగిరి గుట్ట

విజయవాడ - హైదరాబాదు రైలు మార్గంలో రాయగిర్ స్టేషనుకు సుమారు 7కి.మీ. దూరంలో వుంది. స్టేషను నుండి బస్సులు, టాంగాబండ్లు చాలా వున్నాయి. ఇది యాదగిరికొండ మీద నున్న శ్రీలక్ష్మీనృసింహ క్షేత్రము. ఆంధ్రప్రదేశ్‌లో ఒక ప్రధానమైన యాత్రాస్ధలం.
ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. 315 మెట్లు ఎక్కి స్వామి దర్శనం చేసుకోవచ్చు. కాని కొండమీదికి నేరుగా బస్సులు కూడా ఉన్నాయి. తిరుమల - తిరుపతి, శ్రీశైలంలలో మాదిరిగా కొండమీద అనేక సత్రాలున్నాయి. [ఇంకా... ]

Thursday, August 27

వంటలు - కాకరకాయ కూర

కావలసిన వస్తువులు:
కాకరకాయలు - 1 కిలో.
నూనె - 150 గ్రా||.
మినపప్పు - 25 గ్రా||.
శనగపప్పు - 25 గ్రా||.
ఎండుమిర్చి - 25.
ఉప్పు - తగినంత.

తయారు చేసే విధానం :
కాకరకాయ గర్భాన కాస్త లోతుగానూ, విడిగానూ గాట్లు పెట్టి వుడికించి వార్చి వుంచాలి. ఒట్టిమూకుట్లో మినప్పప్పు , శనగపప్పు, ఎండుమిర్చి వేయించి సరిపడా ఉప్పు, కారం కొట్టాలి. [ఇంకా... ]

Tuesday, April 7

ఎందుకు, ఏమిటి, ఎలా ... - చాటింగ్

సాయంకాలాలు ఏమీ ఉబుసుపోక పల్లె జనాలంతా వేపచెట్టు కిందకు చేరినట్లు, నెట్ పక్షులన్నీ చాట్‌రూమ్‌ల్లోకి చేరతాయి. దేశవిదేశాల్లోని వ్యక్తులందరితోనూ సంభాషిస్తూ, వారి మనోభావాలను పంచుకోవడానికి వీలు కల్పించే మెసెంజర్‌లు ఎంత మంచివో అంత చెడ్డవి. దూరమైపోయిన ఒకనాటి స్నేహితుడు/స్నేహితురాలితో కాస్త ఎక్కువ సేపు మనసు విప్పి మాట్లాడుకోవడానికి చాటింగ్ కంటే అనుకూలమైనది ఏదీ లేదు. కానీ చాట్‌రూంల రూటే వేరు. అపరిచిత వ్యక్తులతో పరిచయం చేసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. ఆ పరిచయాలు కొంతమందికి తమ కెరీర్‌ను మలుచుకోవడానికి పనికివచ్చాయి. మరికొంతమందికి టైంవేస్ట్ మాత్రమే చేశాయి. ఇంకొంతమందికి చేదు అనుభవాలు మిగిల్చాయి. సేఫ్‌గా చాటింగ్ చేయడానికి ఎంఎస్ఎన్, యాహూ సర్వీసుల వాళ్లు ఈ కింది టిప్స్ చెబుతున్నారు... [ఇంకా... ]

వంటలు - అరటికాయ కూర

కావలసిన వస్తువులు:
అరటి కాయలు : 4.
ఉల్లిపాయలు : 2.
పచ్చిమిర్చి : 4.
అల్లం : చిన్న ముక్క.
నూనె : 4 స్పూన్లు.
ఆవాలు : 1/2 స్పూను.
ఉప్పు, పసుపు : తగినంత.
ఎండు మిర్చి : 2.
శనగపప్పు : 1 స్పూను.
మినపప్పు : 1 స్పూను.
కొత్తిమీర : 1 కట్ట.
కరివేపాకు : 2 రెబ్బలు.
జీలకర్ర : 1 స్పూను.

తయారుచేసే విధానం:
అరటికాయలను చెక్కు తీయకుండా 3 ముక్కలుగా కోసి ఉప్పు వేసి నీళ్ళలో ఉడికించుకోవాలి. ఉడికిన తరువాత పై చెక్కు తీసి ఒక పళ్ళెంలో పొడిపొడిగా చేసి పెట్టుకోవాలి. [ఇంకా... ]

ఆహార పోషణ సూచిక - అదనపు ఆహారం

తల్లిపాలు - శిశువు పెరుగుదల, అభివృద్దికి సహజమైన, అసమానమైన ఆహారం. ఇవి ఎన్నో విశిష్టతలు కలిగినప్పటికీ శిశువుకు 4 నుండి 6 నెలల వయసు వచ్చాక వారు పెరుగుతున్న అవసరాలు తీర్చలేవు. తల్లిపాలపైననే పూర్తిగా ఆధారపడే శిశువు క్రమంగా పెద్దలు తీసుకొనే ఆహారానికి మారే దశను 'వీనింగ్' అంటారు.

మనం భుజించే ఆహారంవల్ల పిల్లల కడుపునిండినా అందులో పోషక విలువలు తక్కువ. శిశువుకు గల ప్రత్యేక అవసరాలదృష్ట్యా మన ఆహారంలోనే కొన్ని మార్పులు, చేర్పులు చేసినట్లైతే అది శిశువు అవసరాలను తీర్చగలుగుతుంది. [ఇంకా... ]

పిల్లల పాటలు - ఎంతోమంది పనివాళ్ళు...

ఎంతోమంది పనివాళ్ళు - ఎంతో మంచి పనివాళ్ళు
మడకను దున్నే మాదన్నా - కొడవలి పట్టిన కొండమ్మా
గుడ్డలు నేసే గురవయ్యా - బట్టలు ఉతికే బాలమ్మా || ఎంతోమంది ||

కుండలు చేసే కుమరయ్యా - కొలిమిని ఊదే కోనయ్యా
చెప్పులు కుట్టే చెన్నయ్యా - దుస్తులు కుట్టే మస్తానూ || ఎంతోమంది || [ఇంకా... ]

Monday, April 6

వంటలు - వాలెంటైన్ చాక్లెట్

కావలసిన వస్తువులు:
పాలపొడి - అరకప్పు.
కండెన్స్‌డ్ మిల్క్ - రెండుటేబుల్ స్పూన్లు.
ఐసింగ్ షుగర్, కోకోపొడి, తాజా వెన్న - ఒక్కోస్పూను చొప్పున.
అంజూర్(బేకరీల్లో లభిస్తాయి) తరుగు - ఒక పెద్దస్పూను.
బాదంపప్పులు - గుప్పెడు.

తయారుచేసేవిధానం:
ఓ వెడల్పాటి గాజు బౌల్ తీసుకుని అందులో పాలపొడి, కోకోపౌడర్, వెన్న, ఐసింగ్ షుగర్ అన్నీవేసి పాలుపోసి చక్కగా గట్టిగా చపాతీల పిండిలా కలపండి. ఆ మిశ్రమానికి అంజూర్ తరుగును చేర్చండి. ఇప్పుడు వెడల్పాటి గాజుట్రే తీసుకుని దానికి కాస్త వెన్నరాసి... అందులో ఈ మిశ్రమాన్ని సమంగా సర్ధండి. [ఇంకా... ]

అవీ, ఇవీ కొనుక్కొనేటప్పుడు - టీవి (టెలివిజను)

టీవి కొంటే కారు బహుమతి అంటూ షోరూములు తాయిలాలతో ఊరిస్తుంటాయ్. శబ్ధం ఎక్కువైతే దృశ్య నాణ్యత తక్కువ అవుతుందనీ, పిక్చర్ ఫర్వాలేదంటే సౌండ్ నాసిరకంగా ఉంటుందన్న అపోహలు సరైన నిర్ణయం తీసుకోనివ్వవు. ఫీచర్లతో పాటే కొండెక్కే ధరలు. అయోమయంలో ముంచెత్తే సేల్స్‌మెన్‌ల మాటలు కలర్ టీవీ కొనాలని షోరూములకెళ్లే సగటు మధ్య తరగతి వ్యక్తి పరిస్ధితి ఇదే.

అయోమయాల నుంచి బయటపడి సరసమైన ధరకు సరైన టీవీని ఎంచుకోవాలంటే ఈ సూచనలు పాటించాల్సిందే. కలర్ టీవీలు అయిదు విభిన్న రకాల్లో లభ్యం అవుతున్నాయి. ప్రాధమిక మోడల్, ఫ్లాట్ స్క్రీన్, ప్రొజెక్షన్, ప్లాస్మా, ఎల్‌సీడీ. నిన్న మొన్నటి వరకూ పద్నాలుగు అంగుళాల కలర్ టీవీలదే రాజ్యం. ఆ తర్వాత 20 అంగుళాల టీవీలను కొనేవారి సంఖ్య పెరిగింది. [ఇంకా... ]

భరతమాత బిడ్డలు - లాల్ బహదూర్ శాస్త్రి

పేరు : లాల్ బహదూర్ శాస్త్రి.
తండ్రి పేరు : శారదాప్రసాద్ రాయ్.
పుట్టిన తేది : 2-10-1904.
పుట్టిన ప్రదేశం : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొగల్ సరాయ్ గ్రామంలో జన్మించారు.
చదివిన ప్రదేశం : మొగల్ సరాయ్.
గొప్పదనం : బ్రిటీషు వారిని ఎదిరించి, దేశ స్వాతంత్ర్యం కోసం ఎన్నో సత్యాగ్రహలు చేశాడు.
స్వర్గస్థుడైన తేది : 1966 వ సంవత్సరంలో స్వర్గస్థుడైనారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొగల్ సరాయ్ గ్రామంలో లాల్ బహదూర్ 1904 అక్టోబర్ 2న జన్మించారు. తండ్రి శారదాప్రసాద్ రాయ్ ఒక నిరుపేద. బతకలేక బడిపంతులు అని అనుకుంటున్న ఆ రోజుల్లో ఆయన బడిపంతులు వృత్తిని చేపట్టి అతికష్టంగా తన కుటుంబాన్ని పోషిస్తూ కాలం గడిపేవాడు. ఇద్దరు ఆడపిల్లల తరువాత జన్మించిన లాల్ బహదూర్ ను చూసుకొని ఆ తల్లిదండ్రులెంతో మురిసిపోయారు. [ఇంకా... ]

సౌందర్య పోషణ - పాదాలకు

. అర టీస్పూన్ పసుపు, తాజా కొబ్బరి తురుము అరకప్పు తీసుకోవాలి. ఈ రెండింటినీ బాగా కలిపి పాదాలకు పట్టించి మర్దనా చేయాలి. తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి.

. అరి కాళ్ళు మృదువుగా ఉండాలంటే తరచూ వాటిని కొబ్బరినూనెతో మర్దనా చేస్తుండాలి.

. కాలేజీలకు స్కర్టులు వేసుకునే వారికి మోకాళ్లు నల్లగా ఉంటే బాగుండదు. అందుకు కమలాపండు ముద్దలా చేసి కొబ్బరినూనెలో అరగంట పాటు నానబెట్టి ఆ మిశ్రమాన్ని ప్యాక్ లా వేయాలి. తర్వాత శనగపిండి, పాలు, తేనె ఒక్కో చెంచాడు చొప్పున కలపాలి. ఈ మిశ్రమాన్ని మోకాళ్ల కు పట్టించి ఆరాక కడిగేయాలి. [ఇంకా... ]

పిల్లల ఆటలు - ఖాళీల పూరింపు 

చిన్న పిల్లకు ఖాళీలను పూరించటమంటే చాలా ఇష్టం అందుకని చిన్న పిల్లల ఆటలో ఈ ఖాళీల పూరింపును కూడా చేర్చాము. ఈ ఆటలో కనీసం నలుగురు పిల్లలు పాల్గొనవచ్చు. పిల్లల్లో ఒక్కొక్కరికి ఒక అక్షరానికి సంబంధించిన పదాలు ఇవ్వాలి. ఆటగాళ్ళు ఎ, బి, సి, డి లనుకుంటే వాళ్ళకు ఇచ్చిన ఖాళీల పూరింపు ఇట్లా ఉంటుంది.

ఉదా: Team A వారు గ (అక్షరం) మీదపూరించవలెను.
ప్రశ్న: - డి - రం.
జవాబు: గడియారం.

ఎవరు సరిగ్గా ఖాళీలు పూరిస్తే వారు విజేత. [ఇంకా... ]

Friday, April 3

వ్యాయామ శిక్షణ - సమూహ (గ్రూప్) వ్యాయామం

మనలో చాలా మందికి పనులు వాయిదా వేయడం అలవాటే. తమకు తాము ప్రేరణ కలిగించుకుని తీసుకున్న నిర్ణయాన్ని చివర వరకు కొనసాగించగల శక్తి అందరికీ ఉండదు. వ్యాయామం చేయడంలోనూ మీది అదే తీరైతే గ్రూప్ వ్యాయామమే మీకు తగినది.

. పరస్పరం మాట్లాడుకుంటూ ఉండటంవల్ల ఒకరి నుంచి మరొకరు ప్రేరణ పొందుతారు. అందరూ కలిసి వ్యాయామానికి సంబంధించిన ఒక్కో అంశం గురించి చర్చించుకుంటూ ఉండటం వల్ల తేలికగా అనుసరించగలుగుతారు.

. రోజూ వ్యాయామం చేసేటప్పుడు పోటీపడి అందరితో సమానంగా చేయగలుగుతారు. త్వరగా నేర్చుకొనే అవకాశమూ ఉంది. మనకు తెలియకుండానే పక్కవారి కన్నా బాగా చేయాలన్న పట్టుదల వచ్చేస్తుంది. [ఇంకా... ]

వంటలు - గుమ్మడి వరుగు (చిప్స్)

కావలసిన వస్తువులు:

బూడిద గుమ్మడికాయ, పసుపు, ఉప్పు.

తయారుచేసే విధానం:

మొదట బూడిదగుమ్మడికాయను చెక్కుతో పాటే బాగా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. ఈ తరిగిన ముక్కలన్నిటినీ ఉప్పు, పసుపు వేసి జాడిలో పెట్టుకుని ఒక రోజంతా నాననివ్వాలి. మరుసటి రోజు గట్టిగా మూతపెట్టి కావలసినప్పుడు నూనెలో దోరగా వేగించుకొని కొద్దిగా ఉప్పు కారం చల్లుకోవాలి. [ఇంకా... ]

భక్తి గీతాలు - శివాదుర్గ కాళి ప్రియ చంద్ర మౌళి

శివాదుర్గ కాళి ప్రియ చంద్ర మౌళి
సరోజాలతోనే పూజచేతు ఆ...

గులాబీలతోనే పూజసేతు "శి"
శంభుని రాణి చల్లని చూపు

భక్తావాళి భాధలు బాపు
ప్రార్ధింతుము రేపూ మాపు

గ్రహ బాధలు రూపు మాపు
స్తుతింతును రోజు రోజు

వెన్నెల కాంతులు మాపై నిలుపు
వికసించే నీ ముఖ బింబం [ఇంకా... ]

పుణ్య క్షేత్రాలు - శ్రీ కాళ హస్తి

తిరుపతికి తూర్పున సువర్ణముఖి నది ఒడ్డున గల కొండల మధ్య అమరివున్నది శ్రీ కాళహస్తీశ్వర దేవాలయం.
నామ సార్ధకత:
శ్రీ అనగా సాలెపురుగు, కాళము అనగా పాము, హస్తి అనగా ఏనుగు. ఈ ప్రాంతంలో స్వయం భూలింగముగా వెలసిన శివలింగం పై మూడున్నూ అర్చించి భక్తి నిరూపణలో పోటాపోటీగా సంచరించి చివరికి మోక్షమును పొందాయని ఒక కథ. కనుకనే ఈ స్వామి శ్రీ కాళ హస్తీశ్వరుడనేది సార్ధకనామంగా వున్నదని ప్రతీతి. మరో విశేషం ఏమిటంటే భక్తకన్నప్ప చరిత్ర కూడా ఇచ్చోటనే జరిగి భక్తిలోని గొప్పదనాన్ని చాటిన దివ్య ప్రదేశంగా పేరొందింది. ఈ స్వామి మహత్యాన్ని ఉగ్గడిస్తూ శ్రీ కృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలలో ఒకరైన మధురకవి దూర్జటి శ్రీ కాళ హస్తీశ్వర శతకంగా రూపొందించి ధన్యతను పొందాడు, చిరస్మరణీయుడైనాడు. [ఇంకా... ]

నీతి కథలు - దురాశే దుఃఖమునకు మూలము

గోవిందయ్య అనే వ్యాపారస్తుడు అతి పిసినారి. ఏదయినా సరే బేరమాడటంలో అవతలి వ్యక్తికి విసుగు తెప్పించి తను లాభపడాలని కోరుకునే మస్తత్వము గల వ్యక్తి. ఒక దినమున అరణ్యమార్గము గుండా పట్నము వెళ్తున్నాడు. తనతోపాటు ఎవరూ లేరు. అతనిని చూస్తే వర్తకులుగాని, సాటివారుగానీ, హడలెత్తేవారు. అరణ్యమార్గములో పోతూవుండగా చెట్టు పొద సమీపములో బక్కచిక్కిన శరీరముతో వున్న ఋషి పడి వున్నాడు. అతను 'దాహం... దాహం' అని వినీ వినపడనట్లుగ అంటుంటే గోవిందయ్య వెళ్ళి తన వద్దగల మంచినీళ్ళు మునీశ్వరుని నోట్లో పోశాడు. కళ్ళు తెరిచి ముని "చివరి ఘడియల్లో నాకు దాహార్తిని తీర్చినావు. నీ మేలు మరవను. నాకు ఇది చివరి నిమిషం. నిమిషంలో మృత్యువు నన్ను సమీపించనుంది. వెంటనే అదైనా వరము కోరుకో... నేను ప్రసాదించగలను" అన్నాడు.[ఇంకా... ]

Thursday, April 2

లాలి పాటలు - చందమామ రావే - జాబిల్లి రావే!

చందమామ రావే - జాబిల్లి రావే!
బండిమీద రావే - బంతి పూలు తేవే
పల్లకిలో రావే - పంచదార తేవే
సైకిలెక్కిరావే - చాక్లెట్లు తేవే

పడవమీద రావే - పట్టు తేనె తేవే
మారుతిలో రావే - మంచి బుక్సు తేవే
పెందలాడే రావే - పాలు పెరుగు తేవే [ఇంకా... ]

వంటలు - చిక్కుళ్ళ వేపుడు

కావలసిన వస్తువులు:
పెద్దగింజలుండే చిక్కుళ్ళు - 250.
నూనె - 50.
కారం - అరచెంచాడు.
లవంగపొడి - చిటికెడు.
కర్వేపాకు - 2 రెబ్బలు.
ఎండుమిర్చి - 1.
ఉప్పు - తగినంత.

తయారు చేసే విధానం :
చిక్కుళ్ళు వుడకేసి, ఒక పొంగురాగానే దింపి వార్చేయాలి. [ఇంకా... ]

పండుగలు - శ్రీరామనవమి

దుష్టశిక్షణ శిష్టరక్షణార్ధమై చైత్రశుద్ద దశమినాడు ఐదుగ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్నకాలమందు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యాపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనం 'శ్రీరామనవమి' గా విశేషంగా జరుపుకుంటాం.

'రామ' యనగా రమించుట అని అర్ధం. కావున మనము ఎల్లప్పుడు మన హృదయకమలమందు వెలుగొందుచున్న 'ఆ శ్రీరాముని' కనుగొనుచుండవలెను.

ఒకసారి పార్వతీదేవి పరమశివుని 'కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం' అని, విష్ణు సహస్రనామ స్తోత్రంనకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరుతుంది. [ఇంకా... ]

అవీ, ఇవీ కొనుక్కొనేటప్పుడు - చెప్పులు

చెప్పులే కదా! అనో లేకపోతే స్టయిల్ గా కనిపించాయనో ఎలాపడితే అలా పాదరక్షలను కొనకూడదు. వాటిని కొనడానికి ఒక టైం ఉంటుందని తెలుసా మీకు. అలాగే చెప్పులు కొనేటప్పుడు తీసుకోవాల్సిన, గుర్తుంచుకోవాల్సిన జాగ్రత్తలు కూడా కొన్ని ఉన్నాయి. అవేమిటంటే -

రెండు పాదాలు ఒకే సైజులో ఉండవనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కొత్త చెప్పులు, షూ, శాండల్ ఏవి కొంటున్నా రెండు పాదాలకు వేసుకుని సైజు చూసుకోవాలి. వేసుకున్నప్పుడు కొంచెం అసౌకర్యంగా అనిపిస్తే కొన్నాళ్లు వేసుకుంటే సాగుతాయిలే అని తీసుకోవద్దు. బ్రాండ్ సైజుల బట్టి కొనొద్దు. స్టయిల్ ను బట్టి సైజులు మారుతుంటాయి. అందుకని పాదరక్షలు కొనే ప్రతిసారి రెండు పాదాలకు వేసుకుని గమనించి కొనుక్కోవాలి. కాలి వెనుక భాగం షూలో సరిగా కూర్చోవాలి. అలా ఉంటే కాలి వేళ్లను సులువుగా కదిలించొచ్చు. [ఇంకా... ]

పిల్లల ఆటలు - తాబేలు రేసు

ఎంతమంది ఆడవచ్చు : ఎంతమందైనా.
ఆడే స్థలం : గదిలో, ఆరుబయట ఆడవచ్చు.
కావలసిన వస్తువులు : చాక్ పీస్ , ప్లాస్టిక్ తాడు.
ఆటగాళ్ల వయస్సు : 7 సం|| రాల నుండి.

ఆటగాళ్ళందర్ని మోకాళ్ళు, అరచేతులమీద నించోబెట్టాలి. 'స్టార్ట్' చెప్పగానే అంతా ఫినిషింగ్ లైన్ దగ్గరకి (ఇది చాక్ పీస్ తో గీయవచ్చు, లేదా నేలమీద ప్లాస్టిక్ తాడు ఉంచవచ్చు.) ఎంత నెమ్మదిగా సాధ్యం అయితే అంత నెమ్మదిగా వెళ్ళాలి. [ఇంకా... ]

Tuesday, March 31

ఆహార పోషణ సూచిక - గుప్పెడన్నం గొప్పమేలు

అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు మన పెద్దలు. వారన్నందుకే కాదు నిజానికి పోషకాల విషయంలోనూ అన్నం ప్రత్యేకతే వేరు. అందుకే ఎన్ని వెరైటీలు తిన్నా చివరికి ఒక ముద్ద పెరుగన్నం తినందే తృప్తిగా ఉండదు చాలా మందికి. నిజానికి అది మంచి అలవాటు కూడా ఎందుకంటే బియ్యంలో అధికంగా ఉండే గంజిశరీరానికి చలువచేస్తుంది. చలికాలంలో ఎక్కువగా సూప్స్ తాగడానికి ఇష్టపడే వాళ్ళు ఎండాకాలంలో గంజిలో మజ్జిగ కలుపుకొని తాగుతుంటారు.

గోధుమలు ఇతర ధాన్యాలతో పోలిస్తే బియ్యంలో ఎక్కువ ప్రొటీన్లు దాదాపు 7 శాతం ఉంటాయి. విటమిన్ బి, (ధయామిన్) ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ పాలిష్ చేసిన, కడిగిన బియ్యాన్ని వండేటప్పుడు దాదాపు 75 శాతం ధయామిన్ తగ్గిపోతుంది. దీనివల్ల శరీరంలో విటమిన్ బి లోపిస్తుంది. [ఇంకా... ]

వంటలు - కో కో సిరప్

కావలసిన వస్తువులు:

కో కో - 1 కప్పు.

పంచదార - 2 కప్పులు.

చన్నీళ్ళు - 3 కప్పులు.

తయారు చేసే విధానం:

ముందుగా కోకో, పంచదార, చన్నీళ్ళు కలిపి 20 నిమిషాల పాటు ఉడికించి గట్టి పాకం పట్టాలి. సన్నని సెగ పై ఆపకుండా కలియబెడుతూ ఉండాలి. పాకం తయారు అవ్వగానే చల్లార్చి పొడి సీసాలో పోసుకోవాలి. [ఇంకా... ]

పిల్లల ఆటలు - చుక్కలాట

ఈ ఆట ఇద్దరు ఆడవచ్చు. ముందుగా అడ్డంగా నిలువుగా కలిపి పైన చూపినట్టు 100 చుక్కలు పెట్టుకోవాలి. తరువాత ఒక ఆటగాడు ఒక చుక్క నుండి ఇంకొక చుక్కకు ఒక గీతను గీయాలి. తరువాత మరొక ఆటగాడు తన ఇష్టమొచ్చిన దగ్గర గీత గీస్తాడు. ఇవి నిలువుగానైనా, అడ్డంగానైనా ఎలా అయినా గీయవచ్చు. అయితే ఏ ఆటగాడు వాటిని (స్క్వేర్) చతురస్త్రంలాగా గీస్తాడో, ఆ చతురస్త్రం (బాక్స్)లో అతని పేరు మొదటి అక్షరాన్ని వేయాలి. [ఇంకా... ]

జానపద గీతాలు - కోడలా కోడలా కొడుకు పెళ్ళామా

"కోడలా కోడలా కొడుకు పెళ్ళామా
పచ్చిపాల మీద మీగడలేవి?
వేడిపాల మీద వెన్నల్లు యేవి?
నూనెముంతల మీద నురగల్లుయేవు?"

"అత్తరో ఓయత్త ఆరళ్ళయత్త
పచ్చిపాలమీద మీగడుంటుందా?
వేడిపాల మీద వెన్నలుంటాయా?
నూనె ముంతల మీద నురగలుంటాయా?"

"ఇరుగు పొరుగులార! ఓ చెలియలార
అత్తగారి ఆరళ్ళు చిత్తగించరా? [ఇంకా... ]

పుణ్య క్షేత్రాలు - శ్రీరంగపట్నం

మైసూరుకు 12 కి.మీ దూరంలో ఉన్న ప్రదేశం టిప్పుసుల్తాను ప్రాసాదంలో అత్యంత చారిత్రక ప్రాధాన్యత సంతరించుకున్నది. కావేరినది రెండు పాయల మధ్యన ఉన్న దివిలాంటి దానిలో అమరియున్నది. మహిమాన్విత కావేరి పట్టణం చుట్టూ ప్రవహిస్తున్నది. టిప్పుసుల్తాన్ వారి కోట వేసవి మకాము యిక్కడ వున్నదంటారు. గౌతమ మహర్షి ఇక్కడ తపస్సు చేసినట్లుగా పురాణ ప్రశస్తి వుంది. క్రీ.శ 894 సంవత్సరంలో శ్రీ తిరుమలనాయుడు రంగనాధుని ఆలయం నిర్మించి రంగపురంగా వెలయింపచేశాడు. శ్రీరంగపట్నం 1120లో విష్ణువర్ణనుని సోదరులు ఉదయాదిత్యుడు కట్టించాడని ప్రతీతి. 1495 శ్రీరంగపట్నం విజయనగర రాజుల ఆధీనంలోకి వచ్చి, 1610లో మైసూరు రాజు ఒడయారు చేసుకున్నారు. తరువాత మహమ్మదీయులైన హైదర్ ఆలీ, టిప్పు సుల్తానుల కాలంలో వారి ఆధీనంలో ఉండి తరువాత 1799 లో బ్రిటీషు వారి హస్తగతమయింది. ఇక్కడ మూఖ్యంగా చూడదగినవి- 'టిప్పుసుల్తాన్ వారి వేసవి విశ్రాంతి భవనం, చిత్రకళ అందంగా పొందుపరచబడి వుంది. హైదర్ ఆలీ, ఆయన్ భార్య సమాధులున్నాయి. [ఇంకా... ]

Thursday, March 26

లాలి పాటలు - ఊయలూగుమా కృష్ణ

ఊయలూగుమా కృష్ణ ఊయలూగుమా
హాయిగా వినిపింతు జోల ఊయలూగుమా ||ఊ||

లాలీ గోపాలకృష్ణ లాలీ గోవింద కృష్ణ
లాలీ మా పాలి దైవమ లాలీ లాలీ
రేపల్లియే ఊయలై వూగగా

గోపెమ్మ యెద జోలలే పాడగా
ఆనందమూ నందునీ యింట విరిసే
జగమందు కనువిందగు లీల వెలిసే ||లా|| [ఇంకా... ]

పండుగలు - మంగళగౌరీ వ్రతం

మన భారతీయ సంస్కృతిలో మహోన్నతమైనది వివాహసంస్కారం. అన్ని ఆశ్రమాలలోను గృహస్థాశ్రమము చాలా శ్రేష్ఠమైనదని మన వేదములు, స్మృతులు ఘోషిస్తున్నాయి. ఇందు భార్య, భర్త ఇరువురు ఒకరిపై నొకరు ప్రేమానురాగాలతో జీవించుటతోపాటుగా భర్థ ఏకపత్నీవ్రతుడుగా భార్య ప్రతివ్రతామ తల్లిగా వెలుగొందుతుంటారు. అట్టి గృహము ఎల్లప్పుడు నిత్యకళ్యాణము - పచ్చతోరణముతో విరాజిల్లుతూ ఉంటుంది. ఈ గృహస్థాశ్రమ నిర్వహణకు మన మహర్షులు మంచి సంస్కారాలను ఏర్పరిచారు. అలా ఈ గృహస్థాశ్రమ నిర్వహణ ఆచరించుటకూడ ా ఒక మహాయజ్ఞముతో సమానమైనది అని ' మను ' మహర్షియొక్క అభిప్రాయం. అటువంటి గృహస్థాశ్రమమున సౌశీల్యవతియైన స్త్రీ గృహకృత్యములు, గృహస్థధర్మములు నిర్వహించుకుంటూ అనేక రూపాలలో ఇలా గృహస్థునకు తోడ్పడుతూ ఉంటుంది. [ఇంకా... ]

తెలుగు బిడ్డలు - కందుకూరి వీరేశలింగం

పేరు : కందుకూరి వీరేశలింగం.
పుట్టిన తేది : 16-4-1848.
పుట్టిన ప్రదేశం : రాజమండ్రి.
చదివిన ప్రదేశం : రాజమండ్రి.
గొప్పదనం : బాల్యవివాహాలను అరికట్టి, వితంతువుల పునర్వివాహలను ప్రోత్సహించారు.
స్వర్గస్తుడైన తేది : 27-5-1919.

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ సాంఘీక సంస్కర్త కందుకూరి వీరేశలింగం. 1848 ఏప్రిల్ 16 న రాజమండ్రిలో ఒక సంపన్న కుటుంబంలో ఇతడు జన్మించెను. పాఠశాలలో చాలా చురుకుగా ఉండేవాడు. ఇతడు నాలుగోతరగతి చదువుతుండగా, ఉత్తమ విద్యార్ధి ఎవరు ఆనే ప్రస్తావన వచ్చినప్పుడు, విద్యార్ధుల్లో చాలా మంది ఇతని పేరును సూచించారు.
[ఇంకా... ]

నీతి కథలు - తెలివిగల బాలుడు

ఒక నగరంలో ఒక నవాబు ఉన్నాడు. అతడు గొప్ప ధనవంతుడు. అతనికి పెద్ద భవనం ఉంది. చాలామంది పనివారున్నారు. కాని చాలా క్రూరుడు. ఇతరులను హింసించడం, ఇతరులను బాధించడం అతనికి ఆనందం. అలా చాలామందిని బాధపెట్టాడు. ఒక రోజున ఆ భవనం వద్దకు పేద బాలుడు వచ్చాడు. సలాం చేశాడు. ఆకలిగా ఉంది. తినటానికి ఏమన్నా పెట్టించమన్నాడు. వెంటనే నవాబు లేచి ఆ బాలుణ్ణి పెద్ద హాల్లో కూర్చోబెట్టాడు. తను ఎదురుగా కూర్చున్నాడు. పనివాళ్ళను పిలిచాడు. నీళ్ళు, పళ్ళు తెమ్మన్నాడు. భోజనం వడ్డించమన్నాడు. పనివారు లోపలికి వెళ్ళారు. ఉత్త చేతులతో వచ్చారు. ఇద్దరికి వడ్డించినట్లు నటించారు. ఆ నవాబు తిన్నట్లు నటించాడు. పేద బాలుడిని తినమన్నాడు. కాని ఎదురుగా తినడానికి ఏమిలేదు. బాలుడికి అర్థం కాలేదు. నవాబు చేతులు కడిగినట్లు నటించాడు. పనివారితో మిఠాయిలు తెమ్మన్నాడు. వారు తెచ్చినట్లు నటించారు. నవాబు తిన్నట్లు నటించాడు. మధు పానీయాలు తెమ్మన్నాడు. పనివారు తెచ్చినట్లు నటించారు. నవాబు తాగుతున్నట్లు నటించాడు. [ఇంకా... ]

వంటలు - కోవా కేసర్ ఖైన్

కావలసిన వస్తువులు:
పాలు - 5 లీటర్లు.
చక్కెర - 600 గ్రా.
కేసరి (కుంకుమపువ్వు) - 3 గ్రా.
బాదంపప్పు - 100 గ్రా.


తయారు చేసే విధానం :
పాలు బాగా చిక్కబడేంతవరకు సన్నని సెగపై మరిగించి, ఆపై ట్రేలో పోయాలి. ఫ్యాను గాలికింద ఆరబెట్టి కోవ సిద్ధంచేసుకోవాలి. కోవా గట్టిపడ్డ తర్వాత కొద్దిగా తీసుకుని దానిలో కుంకుమపువ్వు వేసి కొంచెం వేడిపాలు పోయాలి. పది నిముషాలసేపు నాననివ్వాలి. [ఇంకా... ]

Tuesday, March 24

ఎందుకు, ఏమిటి, ఎలా ... - ఐస్ క్రీం

వేసవి కాలం వచ్చిందంటే మనం అంతా లొట్టలు వేస్తూ ఎగబడి తినేది ఐస్ క్రీంనే. అవునా? ఈ ఐస్ క్రీం ఎప్పుడు పుట్టిందో ఎలా పుట్టిందో తెలుసా? ఐస్ క్రీం తినడమే మనకు తెలుసు. కాని దానిని ఎవరు కనిపెట్టారు అనే ప్రశ్న వేసుకున్నా అది మనకు తెలియదు కాబట్టి దానిని గురించి వదిలేసి మన ముందున్న ఐస్ క్రీంను ఓ పట్టుపడతాం. ఐస్ క్రీం ఎలా పుట్టిందో ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్వం చైనా వంటవాళ్ళు రకరకాల పండ్ల నుంచి గుజ్జును, రసాన్ని తీసి చల్లగా ఉండటం కోసమని దానిలో మంచు ముక్కలు కలిపి నిల్వచేసేవారట. అది ఐస్‌క్రీం తొలి రూపం అన్నమాట. నాలుగువేల ఏళ్ళ క్రితం ఒక చైనా చక్రవర్తి ఇంట్లో పని చేసే వంటవాడు చక్రవర్తిని మెప్పించడానికి పండ్ల గుజ్జులో మంచు ముక్కలు కలిపి వడ్డించాడు. అది చక్రవర్తికి బాగా నచ్చింది. రోజూ ఈ వంటకమే వడ్డించమన్నాడు. అలా ఐస్‌క్రీం క్రమంగా ఆదరణ పొందింది. నీరో చక్రవర్తి పండ్లను తేనెతో కలిపి మంచు ముక్కలతో పాటు తినేవాడట. అదీ ఒక ఐస్‌క్రీం లాంటిదే. [ఇంకా... ]

పిల్లల పాటలు - అంతా ఒక్కటే

అంతా ఒక్కటే మనమంతా ఒక్కటే
ఆంధ్రులమైన తమిళులమైనా
ఉత్కళులైనా కన్నడులైనా
మరాఠి అయినా గుజరాత్ అయినా
పంజాబ్ అయినా బంగ్లా అయినా || అంతా ||

వందనమండీ వందనం (తెలుగు)
వణక్కమమ్మా వణక్కం (తమిళం)
నమస్కార్ నమస్కార్ (హిందీ)
ఇస్సలాం ఇస్సలాం (అస్సామీ) [ఇంకా... ]

భరతమాత బిడ్డలు - బాబూ రాజేంద్రప్రసాద్

పేరు : బాబూ రాజేంద్రప్రసాద్.
తండ్రి పేరు : మహదేవ్ సహాయ.
పుట్టిన తేది : 3-12-1884.
పుట్టిన ప్రదేశం : బీహార్.
చదివిన ప్రదేశం : బీహార్.
చదువు : న్యాయశాస్త్రం.
గొప్పదనం : రైతుల రక్షణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయించటానికి పాటు పడ్డారు.

రాజేంద్రప్రసాద్ 1884 డిసెంబరు 3న జన్మించారు. తండ్రి మహదేవ్ సహాయ ఆయుర్వేద వైద్యం చేస్తుండేవాడు. రాజేంద్రప్రసాద్ తాతగారు బీహార్ జిల్లాలోని హధువా సంస్థానంలో దివానుగా ఉండేవారు. వారి పూర్వికులు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారు. ఉద్యోగాల అన్వేషణలో తలోకవైపు చెదిరిపోయారు. రాజేంద్రప్రసాద్‌కి చిన్నతనము నుంచి బీదల యెడల ఎంతో సానుభూతి ఉండేది. అతని తండ్రి వైద్యం చేస్తున్నప్పుడు ఆయన ఒళ్ళో కూర్చోని రోగులను పరిశీలిస్తూ ఉండేవాడు. [ఇంకా... ]

పెద్దల ఆటలు - దాడి

ఈ ఆటను ఇద్దరు ఆడతారు. ఒకరు 11 చింతపిక్కలు, మరొకరు 11 చిన్న గులకరాళ్ళు లేదా పుల్లతో ఈ ఆట ఆడాలి. ఎలాగైనా 3 జంక్క్షన్లలో గులకరాళ్ళు గానీ చింతపిక్కెలుగానీ పెట్టగలిగితే అతనికి ఒక 'దాడీ అవుతుంది. ఎదుటఆటగాడికి చెందిన పిక్కలను ఇతను తీసేయవచ్చు. ఇలా ఎన్ని 'దాడీ లైతే వారికి ఎడ్వాంటేజ్ ఉంటుంది'. జంట దాడిలు కనక పెట్టుకోగలిగితే అవతల ఆటగాడు తన పిక్కలను కోల్పోయినట్టే. [ఇంకా... ]

పుణ్య క్షేత్రాలు - ద్వారకా తిరుమల

పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరుకు 42 కిలోమీటర్ల దూరంలో ఉందీ దివ్యక్షేత్రం. విజయవాడ నుండి ఏలూరు బస్సులోగాని, రైలులోగాని వెళ్ళవచ్చును. మద్రాసు, హౌరా రైలు మార్గంలో ఏలూరు ఎక్స్‌ప్రెస్ రైళ్ళకు మొదటి స్టాపింగు అవుతుంది. నిరంతరం ఏలూరుకు విజయవాడ నుండి నాన్ స్టాపు బస్సులు గలవు. ఏలూరు నుండి భీమడోలు, తడికలపూడి ద్వారా ద్వారకా తిరుమల చేరవచ్చును.

ఇక్కడ ఒక చిన్న గుట్ట మీద శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. గుట్ట కింద గ్రామాన్ని తిరుపతి అంటారు. తిరుమల తిరుపతి వేంకటేశ్వరునికి చెల్లించాలనుకున్న మొక్కుబడులు కూడా ఒక్కో సమయంలో అంతదూరం వెళ్ళలేని భక్తులు ఇక్కడనే స్వామివారికి మొక్కుబడులు తీర్చుకొంటూంటారు. భక్తులు విశేషంగా వస్తారు. దీనినే చిన్న తిరుపతి అని కూడా అంటుంటారు. ఇక్కడ వివాహ, ఉపనయనాది కార్యక్రమములు, అన్న ప్రాశనలు, వగైరాలు, తలనీలాల మొక్కుబడులు చెల్లించుకుంటుంటారు. [ఇంకా... ]

Friday, March 20

మీకు తెలుసా - పిల్లల్లో ఊబకాయం

ఇటీవల కాలంలో పిల్లల్లో ఊబకాయ సమస్య బాగా కనిపిస్తోంది. మారిన ఆహారపు అలవాట్లు ముఖ్యంగా ఫాస్ట్‌ఫుడ్ సంస్కృతి, శీతలపానీయాలు బాగా తీసుకవడం వంటివి లావెక్కడానికి ప్రధాన కారణాలు. భారీ శరీరం వల్ల పిల్లలు వారి వయసుకు మించి కనిపిస్తారు. ఆరోగ్యానికి కూడా ఊబకాయం మంచిది కాదు. పిల్లల్లోని ఈ భారీకాయ సమస్యని ఒక్కసారి తగ్గించడం సాధ్యమయ్యే విషయం కాదు. కింద పేర్కొన్న అంశాలను పరిగణనలో పెట్టుకుని, ఇచ్చిన వ్యాయామాలను క్రమం తప్పకుండా పిల్లల చేత చేయించాలి.

1. పిల్లలు తమ ఫాస్ట్‌ఫుడ్ జీవనశైలిని మార్చుకునేలా ప్రోత్సహించాలి. శారీరకంగా ఉస్తాహంగా ఉండేట్టు వారిని తీర్చిదిద్దాలి. ఆరోగ్యకరమైన అహారాన్ని వాళ్లకి అలవాటు చేయాలి.
2. టీవి ముందర గంటల తరబడి కూర్చోనివ్వద్దు. ఈ అలవాటు వల్లే పిల్లల్లో ఊబకాయ సమస్య ఎక్కువవుతోంది. [ఇంకా... ]

వంటలు - పల్లీ పకోడీలు

కావలసిన వస్తువులు:
వేరుశనగపప్పు(పల్లీలు) - 2 కప్పులు.
శనగ పిండి - 2 కప్పులు.
బియ్యపు పిండి - 1/2 కప్పు.
అల్లంవెల్లుల్లి పేస్టు - 1 స్పూను.
పచ్చిమిర్చి - 1/4 కప్పు (తరిగినవి).
వనస్పతి - 1/4 కప్పు.
కారం - 1/2 స్పూను.
ఉప్పు - తగినంత.
పసుపు - చిటికెడు.
నూనె - సరిపడినంత.

తయారు చేసే విధానం:
ఓ గిన్నెలోకి శనగపిండి, బియ్యపు పిండిలను తీసుకోవాలి. వనస్పతి కరిగించి దీనిలో వేయాలి. తరువాత నూనె తప్ప మిగిలిన పదార్ధాలన్నీ వేయాలి. తగినంత నీటితో పకోడీ పిండిలా కలుపుకోవాలి. [ఇంకా... ]

ఎందుకు, ఏమిటి, ఎలా ... - యాసిడ్

మలినాలను తొలగించే శక్తి యాసిడ్‌కు ఎలా వచ్చిందో, ఎందుకు దానిని ఉపయోగిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా జిడ్డులాగా పేరుకునే మురికికి కారణం ప్రొటీన్లు లేదా కార్బోహైడ్రేటు మలినాలే. చాలా బండలు, నేల మీద పై పొరలో ఉండే రసాయనిక పదార్థం కాల్షియం కార్బనేటు మనం మురికిని వదిలించడానికి వాడే యాసిడ్ హైడ్రోక్లోరిక్ ఆమ్లంకు కాల్షియం కార్బనేట్‌తో చర్య జరిపి కార్బన్‌డయాక్సైడును, కాల్షియం క్లోరైడును, నీటిని ఇచ్చే ధర్మం ఉంది. కొద్దిగా పొరలాగా ఆసిడ్ ను వేసినప్పుడు అది వెంటనే పై పొరతో రసాయనిక చర్య జరిపి ఆ పొరను తొలగిస్తుంది. ఆ పొరతో పాటే దానికి అంటుకొనివున్న మలినాలు కూడా తొలగిపోతాయి. [ఇంకా... ]

పండుగలు - బుద్ధ జయంతి

నేటికి రెండున్నర వేల సంవత్సరములకు పూర్వము భూమిపై ధర్మము పేరుతో పశువులను వధించు చుండిరి. అప్పుడు జీవ హత్య నిలుపుటకు మాయాదేవి గర్భమున భగవానుడు బుద్ధునిగా అవతరించెను. ఇతని తండ్రి శుద్ధోదనుడు. వీని రాజధాని కపిల వస్తు నగరము. బాల్యమున బుద్ధుని నామము సిద్ధార్ధుడు. జ్యోతిష్కులు "ఈ బాలుడు రాజగును. కాని విరక్తుడై లోకకళ్యాణ కారుడగు"నని చెప్పిరి. అప్పుడు శుద్ధోదన రాజు పెద్ద భవనము నిర్మించి రాకుమారుని అందులో ఉంచెను. రోగములు, దుఃఖములు, మృత్యువులు యేమి తెలియ నివ్వక పెంచెను. ఇతనికి యశోధరతో వివాహము జరిగెను. వీరికొక పుత్రుడు కలిగెను. వారి పేరు రాహులుడు. సిద్ధార్ధుడు ఒకమారు నగరము చూచుటకై తండ్రి ఆజ్ఞ తీసికొని వెలుపలకు వచ్చెను. నగరము నందు తిరుగు సమయమున ఒక వృద్ధుడు కనిపించెను. మరొక మారు నగరము సందర్శించునప్పుడు ఒకరోగి కనిపించెను. మూడవమారు దర్శించునప్పుడు చనిపోయినవాడు కనిపించెను. [ఇంకా... ]

పిల్లల ఆటలు - కాళ్ళ గజ్జా కంకాళమ్మ

ఎంత మంది పాల్గొనవచ్చు : నలుగురు.

ఎక్కువగా ఆడపిల్లలు ఈ ఆటను ఆడతారు. ముందుగా పిల్లలు కింద కూర్చుని తమ కాళ్ళను బారచాపాలి. అనంతరం గ్రూప్ లీడర్ మొదట కూర్చున్న ఆటగాడు ఆటగత్తెల మోకాళ్ళ మీద చెయ్యి వేసి దాన్ని వరుసగా అందరి కాళ్ళ మీదకు జరుపుతూ ఇలా పాట పాడతారు. కాళ్ళ గజ్జ కంకాళమ్మ, వేకువ చుక్క వెలగ మొగ్గ, కాళ్ళూ తీసి పక్కన పెట్టు" ఇలా చివరి పదం ఏ కాలు వద్ద ఆగిందో ఆ కాలుని ఆ ఆటగాడు మడిచేయాలి. మరలా పాట ప్రారంభించి పైన చెప్పినట్టు పాడాలి. చివరి పదం ఏ కాలి వద్ద ఆగితే ఆ కాలుని మడిచేయాలి. [ఇంకా... ]

Tuesday, March 17

ఆహార పోషణ సూచిక - దంత రక్షణే దేహ రక్షణ

సాధారణంగా ప్రతి మానవుడు తన ఆరోగ్యంపట్ల కాస్తో కూస్తో శ్రద్ధ వహిస్తూనే ఉంటాడు. ముఖ్యంగా సౌందర్య పోషణకు ఎక్కువ శ్రద్ధ తీసుకుంటుంటాడు. బలవర్ధకమైన ఆహారం తీసుకోవడం ద్వారా మరింత శక్తివంతంగా ఉండడానికి ప్రయత్నిస్తుంటాడు. శరీరంలోని ప్రతి భాగంపట్ల ఎంతో జాగ్రత్తలుపడుతుంటాడు. శిరోజాలకూ అంతే ప్రాధాన్యమిస్తాడు. అయితే మన దేహ అంతర్భాగాలు ఆరోగ్యం ఉండాలంటే వాటికి మించిన పరిశుభ్రంగా ఉంచుకోవాలసిన దంతాలపట్ల మాత్రం పెద్దగా శ్రద్ధ చూపడు. ఇది దాదాపు ప్రతి మనవుడి నైజం. దంత పరిరక్షణ లేకపోతే జీర్ణవ్యవస్థ పరిశుభ్రంగా ఉండదన్న కనీస జ్ఞాన్ని విస్మరిస్తుంటాడు. దంత క్షయం ద్వారా వచ్చే వ్యాధుల గురించి సరైన అవగాహన లేక వాటిపట్ల ఏమరపాటుగా ఉంటాడు. గుండె, ఊపిరితుత్తులలాగానే దంతాలను పరిరక్షించుకోవలసిన ఆవశ్యకత ఉందనే విషయాన్ని ప్రతి మనిషీ గుర్తించాలని తెలిపేందుకే ఈ వ్యాసం. [ఇంకా... ]

వంటలు - హనీ డేట్

కావలసిన వస్తువులు:
మైదాపిండి - పావుకిలో.
ఖర్జూరాలు - పావుకిలో.
తేనె - 100 గ్రాములు.
నూనె - వేయించడానకి సరిపడా.

తయారు చేసే విధానం:
మైదాపిండిని చపాతీ పిండిలా కలిపి కాసేపు నాననివ్వాలి. ఖర్జూరాల్లోని గింజలు తొలగించి మిక్సీలో మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఇప్పుడు బాణలిలో నునే వేడి చేయండి. కలిపి పెట్టుకున్న మైదాపిండిని చతురస్త్రాకారంలో కాస్త మందంగా వత్తాలి. దీనిపై సరిపడా ఖర్జూరాల ముద్దను తీసుకుని ఒక పక్కన మందంగా వేయాలి. మిగతా భాగంతో ఈ మిశ్రమాన్ని మూసేయాలి. వేలితో నొక్కి అతికించాలి. ఇప్పుడది కజ్జికాయలాగా తయారౌతుంది. [ఇంకా... ]

లాలి పాటలు - జో జో జో జో శ్రీ కృష్ణ

జో జో జో జో శ్రీ కృష్ణ

జో జో యని పాడెదాను జో జో జో జో శ్రీ కృష్ణ

పొంగుచూను లాలబోసి అంగరక్ష బెట్టి నీకు

అద్దాల తొట్టెలోన ముద్దుగా పవళింపజేతూ ||జో||

ముంగురులు దువ్వి నీకు ముత్యాల హారమేసి

మొలకును గజ్జాలు కట్టి మురళినీ చేతికిత్తు ||జో|| [ఇంకా... ]

భరతమాత బిడ్డలు - మధర్ థెరిసా

పేరు : మదర్ థెరిసా.
తండ్రి పేరు : నికలస్ బొజాక్సియొ.
తల్లి పేరు : డ్రానా ఫైల్ బెర్నయ్.
పుట్టిన తేది : 27-8-1910.
పుట్టిన ప్రదేశం : యుగోస్లేవియా.
చదివిన ప్రదేశం : యుగోస్లేవియా.
గొప్పదనం : దరిద్రులకు, రోగులకు, కుష్టురోగులకు తల్లిలా ఆలనా పాలనా చూస్తూ వారి హృదయంలో చెరగని స్థానం సంపాదించినది. ముంబాయిలోని మురికి వాడలను శుభ్రపరచడానికి శ్రమించింది.
స్వర్గస్థురాలైన తేది : 5-9-1997.

'స్కోప్ జీ' పట్టణంలో అల్బేనియా దంపతులు ఉండేవారు.ఆగ్నేస్ తండ్రి పేరు 'నికలస్ బొజాక్సియొ'భవనాలు నిర్మించే కాంట్రాక్టరు. ఆయన భార్య పేరు డ్రానా ఫైల్ బెర్నయ్' వెనిస్ ఫ్రాంతానికి చెందిన స్త్రీ. ఆ దంపతులకు 1910 ఆగస్టు 27వ తేదీన మూడవ బిడ్డ జన్మించింది. [ఇంకా... ]

పుణ్య క్షేత్రాలు - హరిద్వార్

భారతదేశంలో అతి పవిత్రస్థలాల్లో ఒకటిగా పేర్కొనబడింది. శివాలిక్ పర్వత పాదాలవద్ద పావనగంగా కుడివైపు తీరంలో అమరియున్న పుణ్యస్థలం. సప్తమోక్షదాయక పురాణాల్లో ఒకటి. దీనినే మాయాపురి, గంగాద్వారం అనే నామంతరాలతో పిలుస్తారు. శైవులు హరద్వారమనీ, వైష్ణవులు హరిద్వారమనీ, వైష్ణవులు హరిద్వారమనీ, భక్తిమేర పిలుచుకొంటూ ఉంటారు. మొత్తం మీద హిందువులకు అతి పవిత్రస్థలం-ముఖ్య యాత్రాస్థలం. సముద్ర మట్టానికి 1000 అడుగుల ఎత్తు జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో గొప్ప సుందర నగరంగా ప్రశస్తిని పొందింది. మహామహుడైన కపిలస్థాన్ పురాతన ప్రసిద్ది. ఒకప్పుడు ఎంతో విశాలమై మైళ్ళ పొడవున వ్యాపించియున్న మహా పట్టణంగా కీర్తించబడి ఉన్నది. ఈ విషయ అబుల్‌ఫజల్ తన గ్రంధములో వ్రాసారు. ఈయన అక్బరు కాలంలో ఈ పట్టణ సందర్శనం చేశారు. [ఇంకా... ]

Monday, March 16

ఎందుకు, ఏమిటి, ఎలా ... - హిప్నాటిజం

హిప్నాటిజం అంటే ఏమిటి, దీనిని ఎవరు కల్పించారు, ఎలా పని చేస్తుంది, ఎందుకు ఉపయోగిస్తారు అనేది మనం తెలుసుకుందాం.

హిప్నాటిజం అంటే సమ్మోహనపరిచే విద్య. ఇంగ్లాండ్ దేశపు డాక్టర్ జేమ్స్ బ్రెయిడ్ దీనికి శాస్త్రీయస్థాయిని కల్పించాడు. మాటల ద్వారా, కంఠస్వరం ద్వారా, ఎదుటివారి మనస్సుపై ప్రభావాన్ని కలుగజేసి, వారి మనస్సులపైన శరీరంపైన వారికి ఆధీనం తప్పింపజేయడమే హిప్నాటిజం అంటే. అలా ఆదీనం తప్పిన వ్యక్తులు నిద్రావస్థలోకి వెళ్ళి తమకు తెలియకుండానే హిప్నాటిస్ట్ ఏం చేయమంటే అది చేస్తారు. హిప్నాటిజం ద్వారా వ్యాధులను నయం చేసే పద్దతిని జర్మన్ దేశస్తుడైన 'ఫెడరిక్ ఆంటోన్ మెస్మర్' కనిపెట్టాడు. దీన్నే 'మెస్మరిజం' అంటారు. శారీరక, మానసిక వ్యాధులను నయం చేయడానికి 'హిప్నోథెరఫీ' ఎక్కువగా వాడుకలోకి వచ్చింది. [ఇంకా... ]

భక్తి గీతాలు - శివాదుర్గ కాళి ప్రియ చంద్ర మౌళి

శివాదుర్గ కాళి ప్రియ చంద్ర మౌళి
సరోజాలతోనే పూజచేతు ఆ...
గులాబీలతోనే పూజసేతు "శి"

శంభుని రాణి చల్లని చూపు
భక్తావాళి భాధలు బాపు

ప్రార్ధింతుము రేపూ మాపు
గ్రహ బాధలు రూపు మాపు

స్తుతింతును రోజు రోజు
వెన్నెల కాంతులు మాపై నిలుపు [ఇంకా... ]

నీతి కథలు - లంచగొండికి శిక్ష తప్పదు

హేలాపురికి రాజు నవనీత వర్మ. ఆయన జనరంజకంగా పరిపాలన చేసేవాడు. ఆయన పేదలకు ఎంతో సహాయం చేసేవాడు. ఒక రోజున ఒక పేద బ్రాహ్మణుడు ఆయన దగ్గరకు వచ్చాడు. అతని పేరు పుండరీక శర్మ. 'బ్రాహ్మణుడా! నీవు ఏ పని మీద వచ్చావు?' అని అడిగాడు రాజు. అందుకు బ్రాహ్మణుడు ఎంతో వినయంగా చెప్పాడు. 'మహారాజా! నేను కటిక బీదవాడిని. ఆ బాధ భరించలేకుండా ఉన్నాను. దయతో నాకు సహాయం చేయండి' అని వేడుకున్నాడు. రాజుగారు అతని బాధ తెలుసుకున్నారు. అతని వంక పరిశీలనగా చూశారు. అతని బట్టలు చిరిగి ఉన్నాయి. అతని శరీరం సన్నగా ఎముకలు కనిపించేలా ఉంది. రాజు కొంతసేపు ఆలోచించాడు. 'ఇక మీద మీరు రోజూ ఉదయం రండి. నన్ను కలవండి' అని చెప్పాడు మహారాజు. రాజు వద్ద సెలవు తీసుకుని వెళ్ళాడు శర్మ. మరుసటి రోజు ఉదయం మహారాజును కలిశాడు శర్మ. 'ఈ ఉత్తరం తీసుకువెళ్ళండి. మా కోశాధికారికి యివ్వండి' అన్నాడు మహారాజు. శర్మ ఆ ఉత్తరం తీసుకుని కోశాధికారి దగ్గరకు వెళ్ళాడు. ఆ ఉత్తరం చూసుకొని కోశాధికారి రెండు వరహాలు శర్మకు ఇచ్చాడు. శర్మకు ఎంతో ఆనందం కలిగింది. [ఇంకా... ]

వంటలు - క్యాప్సికంతో కచోరీలు

కావలసిన వస్తువులు:
కాప్సికమ్ మధ్య సైజువి - అర కేజి.
పుట్నాల పప్పు - 100 గ్రా.
ఎండుమిర్చి - నాలుగు.
ఎండు కొబ్బరి - 25 గ్రా.
ఉప్పు - తగినంత.
వెల్లుల్లి - నాలుగు రెబ్బలు.
నూనె - తగినంత.

తయారు చేసే విధానం :
మొదట పుట్నాలు శుభ్రం చేసుకుని ఎండుమిర్చి కొబ్బరి, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు అన్నీ కలిపి మిక్సీలో పొడిచేసి ఉంచుకోవాలి. కాప్సికమ్ కడిగి తొడిమల దగ్గర చాకుతో గుండ్రంగా కోసి తొడిమను తీసేసి గింజలన్నిటినీ విదిలించేయాలి. [ఇంకా... ]

పిల్లల ఆటలు - క్విజ్

ఈ పోటీలో కనీసం అయిదుగురు పిల్లలు పాల్గొనవచ్చు. తేలికగా అర్ధం చేసుకోగలిగే తేలికపాటి ప్రశ్నలు వేయాలి. వాటి ఉపయోగం చెప్పాలి. లేదా కాగితం పై రాయాలి. అందరికి పలక బలపం లేదా పుస్తకం - పెన్సిల్ ఇవ్వాలి..

ఉదా :ప్రశ్న - సమాధానం
అన్నం - తింటారు
రామ్మా చిలకమ్మ - చూడాలని వుందిలో పాట
పాలు - తాగుతాం
కొబ్బరి నూనె - రాసుకుంటాం
టీ.వీ - చూస్తాం

ఈ ప్రశ్నలకు ఎవరు ఎక్కువ సమాధానాలు చెప్పగలరో వారు విజేత. [ఇంకా... ]

Monday, March 9

పండుగలు - దత్తాత్రేయ స్వామి జయంతి

ఒకసారి లోకకళ్యాణార్థం నారదుడు ఆడిన చతురోక్తికిలోనైన లక్ష్మీ, సర్వస్వతి, పార్వతిమాతలు, మహాపతివ్రత అయిన అనసూయపై ఈర్ష్య అసూయ ద్వేషాలను పెంచుతున్నారు. ఈ ఈర్ష్య అసూయ ద్వేషమనే దుర్గుణలకు లోనయితే! దేవతలకైనా అనేక దుఃఖాలు కలుగుతాయని స్వరులకు తెలియచెప్పుటకో: లేక శ్రీదత్తుని అవతారానికి నాంది పలుకుటకో! మరి నారదుని ఆంతర్యమేమిటో?

ఏది అయితేనేమి! ఈ గుణాలూ వారి మనస్సునిండా దావానలంలా వ్యాపించి ముగ్గురమ్మల గుండెలు భగ్గుమన్నాయి. వారి వారి పత్నులను తక్షణం ఆ అనసూయ ఆశ్రమానికి వెళ్ళి ఆమె పాతివ్రత్యాన్ని భగ్నం చేయమని ప్రార్థించారు. త్రిమూర్తూలు ఎంతవారించినా, పెడచెవిని పెట్టారు ససేమిరా! అన్నారు. దానికి తోడు ఆ ముగ్గురమ్మలకు ఇంద్రాది దేవతల భార్యలు కూడా వంతపాడారు. [ఇంకా... ]

వంటలు - సోయాబాల్స్

కావలసిన వస్తువులు:
మీల్ మేకర్(సోయా బాల్స్)ఉడికించినవి - ఒక కప్పు .
కార్న్‌ఫ్లోర్ - ఒక టేబుల్ స్పూన్‌ .
అల్లం వెల్లుల్లి ముద్ద - ఒక టీ స్పూన్‌.
గరం మసాలా - ఒక టీ స్పూన్‌.
సోయాసాస్ - రెండు టీ స్పూన్లు.
మిర్చి - రెండు.
అల్లం, వెల్లుల్లి ముక్కలు - తగినంత .
నూనె - వేయించడానికి తగినంత.
పుదీన, జీడిపప్పు, కొత్తిమీర - తగినంత.

తయారు చేసే విధానం:
మూకుడులో నూనె కాగిన తరువాత చీల్చిన పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేసి వేగించాలి. అందులోనే పుదీనా కూడా వేసి కొద్దిగ వేగిన తరువాత మీల్‌ మేకరు వేయాలి. [ఇంకా... ]

కథలు - మనసు మూలాల్లోకి...

'ఎం.జె.ధన్' అది అక్కడి పేరు. మనకు మేడిచర్ల జగన్నాధం భారతదేశంలో అందులోనూ సంస్కృతికి పట్టుకొమ్మ అయిన ఆంధ్రదేశంలో ఓ పల్లెటూరిలో పుట్టి, డాక్టరుగా ఎదిగిన జగన్నాధం... ముప్పై సంవత్సరాలకు పైబడి మక్కువతో అక్కున చేర్చుకున్న వైద్యవృత్తి కోసం దేశాన్ని, ఊరును వదిలి, తన వైద్య ప్రస్థానంలో జిల్లా రాజధాని నుండి రాష్ట్ర రాజధాని మీదుగా దేశ రాజధానికి ఎదిగి.. ఇంతింతై ఎదిగిన వాడు జగన్నాధం. పేరొందిన డాక్టరై అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, స్విట్జర్లాండ్, ఇంగ్లండ్‌లను సందర్శించి చివరకు డాక్టర్ ఎం.జె.ధన్ గా లండన్‌లో స్థిరపడ్డాడు.

ఓ రకమైన వేగవంతమైన జీవితానికి అలవాటు పడ్డ జగన్నాధం, అక్కడి సంస్కృతిలోని వాడినీ, వేగాన్నీ బాగానే ఒంట పట్టించుకున్నాడని చెప్పొచ్చు. డాక్టర్‌గా ఓ విధమైన యాంత్రిక జీవితంలో బాగానే ఒదిగిపోయాడు. జనరల్ సర్జన్‌గా రోగులకు తన వంతు సేవ చేస్తూ మంచి డాక్టరుగా పేరు సంపాదించాడు. చొచ్చుకుపోయే నైజం గల జగన్నాధం, లండన్‌లో ఈనాడు ఓ పేరు మోసిన సర్జన్. [ఇంకా... ]

పిల్లల ఆటలు - న్యూస్ పేపర్ క్విజ్

ఎంతమంది ఆడవచ్చు : 8మంది (నలుగురు ఒక బ్యాచ్ చొప్పున).
ఆడే స్థలం : గదిలో గాని, ఆరుబయట గాని.
కావలసిన వస్తువులు : న్యూస్ పేపర్లు 2.
ఆటగాళ్ల వయస్సు : 7 నుండి 8 సం||రాలు మధ్య.

ఈ ఆటలో రెండు టీమ్‌లను ఎంపికచేయాలి. రెండు ఒక దిన పత్రికలను (ఒకే రోజున) రెండు టీమ్‌ల ఆటగాళ్ళతో చదివించాలి. అనంతరం ఆ పేపర్లలో ఆ రోజు వచ్చిన వార్తలపై ప్రశ్నలు వేయాలి. ఏ టీమ్ సరైన సమాధానం చెపితే వారికి మార్కు వస్తుంది. [ఇంకా... ]

అవీ, ఇవీ కొనుక్కొనేటప్పుడు - హ్యాండ్ బ్యాగ్

నేటి ఆధునిక కాలంలో మహిళల హ్యండ్ బ్యాగ్ వాడకం చాలా పెరిగింది. అన్నిరకాల స్ధాయిల వారికి, చిన్న వారి దగ్గర నుంచి పెద్ద వారి వరకు అందరికీ హ్యండ్ బ్యాగ్ కానీ, పర్సు కానీ వుండాలి. చేతిలో అవి వుంటే వారికి ఇక నిశ్చింత. హ్యాండ్ బ్యాగ్ చేతిలో వుంటే ఒక తోడు వుందన్న అనుభూతి కలుగుతుంది. మహిళల అన్నిటా ఉపయొగపడుతూ నిత్య జీవన వ్యవహారాలలో ప్రముఖ స్ధానంలో నిలుస్తుంది.హ్యండ్ బ్యాగ్, మహిళల వ్యక్తిత్వాన్ని ఇనుమడించే హ్యాండ్ బ్యాగ్ కొనుగోలు గురించి కొన్ని సూచనలు.

. మార్కెట్‌లో రకరకాల మెటీరియల్స్ తో తయారైన వివిధ మోడల్స్‌లో వుండే అందమైన బ్యాగ్‌లు అనేకం లభిస్తున్నాయి. వాటిలో మీ పర్సనాలిటీకి సరిపడే బ్యాగ్‌ను ఎంచుకోవాలి.

. కొంచెం ధర ఎక్కువైనా మంచి మెటీరియల్‌తో తయారైన బ్యాగ్‌లు కొనడం మంచిది. నిత్యవాడకానికి మంచి లెదర్‌బ్యాగ్‌లు అయితే ఎక్కువ కాలం మన్నుతాయి. [ఇంకా... ]

Wednesday, March 4

వ్యాయామ శిక్షణ - నాజూగ్గా ఉండడంకోసం

బాపు బొమ్మలాంటి సన్నని నడుము, తీరైన అవయవ సౌష్టవం ఇప్పుడు అపురూపమైపోయాయి. మారిన పరిస్థితులు, ఆహారపు అలవాట్లలో వచ్చిన పెను మార్పులు నాజూకు శరీరాన్ని దూరం చేస్తున్నాయి. సన్నబడాలంటే తినడం తగ్గించాలి కానీ, కడుపునిండా తినమంటున్నారేమిటి? అని ఆశ్చర్యపోతున్నారా! నచ్చింది తిన్నా నాజూగ్గా ఎలా ఉండవచ్చో చూద్దామా.

సన్నగా కనబడడానికి, సన్నపడడానికి చాలా మంది టీనేజర్స్ పడరాని పాట్లు పడుతున్నారు. జిమ్‌ల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. బ్యూటీషియన్లకు వేలకు వేలు సమర్పించుకుంటున్నారు. ఇన్ని తిప్పలు పడినా ఫలితం ఆవగింజలో అరభాగం కూడా వుండడంలేదు. వీరి ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. కొన్ని రోజుల పాటు కొన్ని రకాల జబ్బులు కూడా వచ్చి పడుతున్నాయి. రోజుల తరబడి కడుపు మాడ్చుకోవడం వలన జీవప్రక్రియ దెబ్బతింటుంది. [ఇంకా... ]

ఆధ్యాత్మికం - భక్తులను సదా రక్షించే శ్రీ సాయినాధుడు

ఈ భూమిపై ధర్మాచరణకు తీవ్ర విఘాతం కలిగినప్పుడు, ఆధర్మం అవధులు దాటి చెలరేగినప్పుడు, దుష్టశిక్షణ శిష్టరక్షణ, ధర్మసంస్థాపనలను తన సంకల్పంగా చేసుకొని ప్రతీయుగంలోను అవతరిస్తానని శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీతలో వివరించాడు. ఆప్రకారంగానే వివిధ యుగాలలో, వివిధ అవతారాలలో, రూపాలలో ఆ పరమాత్మ దివి నుండి భువికి తిరిగివచ్చి తన అవతార కార్యం చేసాడు. అట్లా అవతరించిన పుణ్యపురుషులు, సాధుసత్పురుషులలోకెల్లా అగ్రగణ్యుడు, మహిమాన్విత శక్తివంతుడు, రాజాధిరాజా, యోగులందరికీ సామ్రాట్ వంటివారు. మన సమర్ధ సద్గురువు శ్రీసాయినాధులు. ఈ పవిత్ర భారతావనిలో పంతొమ్మిదవ శతాబ్ధంలో అవతరించి, ఒక పాడుబడిన మశీదును తన నివాసంగా చేసుకోని అనేక లీలలను గావించి, లక్షలాది మందికి జ్ఞానమార్గం చూపించి వారికి చివరికంతా తోడు నీడగా నిలిచిన పరిశుద్ధ పరబ్రహ్మ అవతారం శ్రీసాయి. మనసా, వాచా, కర్మణా తనకు సర్వస్వం శరణాగతి ఒనరించిన భక్తుల లలాట లిఖితాన్ని సైతం తిరగ వ్రాసి వారికి ఇహపరాలను ప్రసాదించిన విశిష్ట గురుదేవులు శ్రీసాయినాధులు. అటువంటి శ్రీసాయి చేసిన కొన్ని లీలలను ఇప్పుడు స్మరించుకుందాం! [ఇంకా... ]

లాలి పాటలు - లాలి పాట

లాలనుచు నూచేరు లలనలిరుగడల
బాల గండవర గోపాల నినుజాల లాలీ లాలీ
ఉదుటు గుబ్బల సరము లుయ్యాలలూగ
పదరి కంకణరవము బహుగతుల మ్రోగ

ఒదిగి చెంపలకొప్పు లొక్కింత వీగ
ముదురు చెమటల నళికములు తొప్పదోగ ||లాలీ||

మలయ మారుతగతులు మాటికి చెలంగ
పలుకు కపురపుతావి పైపై మెలంగ ||లాలీ|| [ఇంకా... ]

పుణ్య క్షేత్రాలు - కాశి

పావన గంగాతీరంలో గంగకు ఉపనదులైన వరుణ - అసి నదుల మధ్య ఒద్దికగా అమరియున్న, అమరధామమే బెనారస్, లేక వారణాశి లేక కాశి. "అంతర్ నేత్రాలు తెరిచే వారణాశి 4000 సంవత్సరాల నాటిది". హైందవ సంస్కృతి ప్రచారంలో, వైజ్ఞానికంగాను, చారిత్రకంగాను అనాది నుండి పేరెన్నిక గన్న పట్టణం, కాశీ మహా పుణ్యక్షేత్రము. ఉత్తరప్రదశ్‌లో ఉన్నది. గంగానదికి ఆవలివైపు బెనారస్, వారణాశి అని, ఈవలివైపు కాశి అని పిలువబడుచున్నది. వరుణ ఘట్టమునకు వాసి ఘట్టమునకు మధ్యనున్నది గనుక, దానికి వారణాశి అని పేరు వచ్చినది.

కాశ్యాంతు మరణాన్ముక్తి అను ఆర్యోక్తి ఉన్నది. కాశీలో మరణిస్తే ముక్తి తప్పక లభిస్తుంది అని దీని అర్ధము. ఎటు చూచినా అయిదు క్రోసులున్న ఈ పట్టణంలో, ఏజీవి మరణించినా ఆ సమయమున కుడిచెవి పైకి ఉంటుంది. ఈశ్వరుడు తారక మంత్రోపదేశము చేసి మోక్షము ప్రసాదిస్తాడు. [ఇంకా... ]

భరతమాత బిడ్డలు - బాబూ రాజేంద్రప్రసాద్

పేరు : బాబూ రాజేంద్రప్రసాద్.
తండ్రి పేరు : మహదేవ్ సహాయ.
పుట్టిన తేది : 3-12-1884.
పుట్టిన ప్రదేశం : బీహార్.
చదివిన ప్రదేశం : బీహార్.
చదువు : న్యాయశాస్త్రం.
గొప్పదనం : రైతుల రక్షణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయించటానికి పాటు పడ్డారు.

రాజేంద్రప్రసాద్ 1884 డిసెంబరు 3న జన్మించారు. తండ్రి మహదేవ్ సహాయ ఆయుర్వేద వైద్యం చేస్తుండేవాడు. రాజేంద్రప్రసాద్ తాతగారు బీహార్ జిల్లాలోని హధువా సంస్థానంలో దివానుగా ఉండేవారు. వారి పూర్వికులు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారు. ఉద్యోగాల అన్వేషణలో తలోకవైపు చెదిరిపోయారు. రాజేంద్రప్రసాద్‌కి చిన్నతనము నుంచి బీదల యెడల ఎంతో సానుభూతి ఉండేది. అతని తండ్రి వైద్యం చేస్తున్నప్పుడు ఆయన ఒళ్ళో కూర్చోని రోగులను పరిశీలిస్తూ ఉండేవాడు. [ఇంకా... ]

Saturday, February 21

వంటలు - పన్నీర్‌బ్రెడ్‌

కావలసిన వస్తువులు:
శాండ్‌విచ్ బ్రెడ్ ముక్కలు - ఎనిమిది.
పన్నీర్ - 100గ్రాములు.
ఉల్లిపాయ - ఒకటి.
కారం - టీస్పూను.
అల్లంవెల్లుల్లి - అరటీస్పూను.
సెనగపిండి - 100గ్రాములు.
ఉప్పు - తగినంత.
మంచినీళ్లు - కప్పు.
నూనె - వేయించడానికి సరిపడా.

తయారు చేసే విధానం:
ఉల్లిపాయ సన్నగా తరగాలి. పన్నీర్‌ సన్నగా తురమాలి. బాణలిలో టేబుల్ స్పూన్ నూనె వేసి అల్లం వెల్లుల్లి, ఉల్లిముక్కలు వేయించాలి. తరువాత పన్నీర్, ఉప్పు, కారం, గరం మసాలా కూడా వేసి ఓ ఐదు నిమిషాలు వేయించి దించి పక్కన ఉంచాలి. [ఇంకా... ]

భక్తి గీతాలు - మంగళగౌరి మాహేశ్వరీ

మంగళగౌరి మాహేశ్వరీ మముగన్న తల్లి పరమేశ్వరీ
కరుణామయి నీ కంటిపాపలో
చల్లన పెరుగును ముల్లోకాలు ||క||

తల్లి నీపేరు తలచిన చాలును
కలిగెను శతకోటి కళ్యాణాలు ||మ||

అమ్మలగన్న అమ్మవునీవే
శుభములనోసగే శుభమూర్తి నీవే
వెండికొండపై వెలసింది నీవే
ఇంటింట నెలకొన్న ఇలవేల్పునీవే
మా ఇలవేల్పు నీవే ||మ|| [ఇంకా... ]

మీకు తెలుసా - మహిళలకు ఋణాలు అందించే సంస్ధలు

మహిళలకు ఋణాలు అందించే సంస్ధలు - అభివృద్ధి పధకాలు

అన్ని రంగాలలోను స్త్రీలు ముందంజ వేస్తున్న రోజులివి. ఒకప్పుడయితే స్త్రీలకు వంటిల్లే చాలుననుకునేవారు. వారిని చదవనిచ్చి, ఆలోచించగలిగేలా చేస్తే పురుషులతో సమానంగా అభివృద్ధిపధం వైపు పయనించగలరని గుర్తించారు. స్త్రీ, పురుష అసమానతలను పక్కనపెట్టి వారిని ప్రొత్సహిస్తే రాష్ట్రాభివృద్ధికి తమ వంతు కర్తవ్యాన్ని చక్కగా నిర్వహించగల నేర్పరితనం వారిలో ఉంది. అందుకే పట్టణ ప్రాంత మహిళలకే కాకుండా, చదువురాని గ్రామీణ స్త్రీలు సైతం కుటీర పరిశ్రమలు, చిన్నతరహా పరిశ్రమల ద్వారా స్వావలంబన సాధిస్తారని వారికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అనేక పధకాలను అమలు చేస్తున్నాయి.

జాతీయబ్యాంకులు, గ్రామీణ సహకార బ్యాంకులు, స్టేట్ పైనాన్స్ కార్పొరేషన్, రాష్ట్ర మహిళా కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ వంటి ఆర్ధిక సంస్ధలు ఋణాలు మంజూరు చేస్తున్నాయి. [ఇంకా... ]

ఆహార పోషణ సూచిక - పొషక విలువల తోటకూర

ఉపయోగాలు:

గుండె జబ్బులు ఉన్నవారు తోటకూరను ఉడకబెట్టి తినడం ద్వారా గుండెజబ్బుల నుండి దూరంగా ఉండవచ్చు. కాల్షియం లోపం ఉన్నప్పుడు ఎవరికైనా గోర్లు పెరగవు. పళ్లమీద పచ్చని పొరలు ఏర్పడుతుంటాయి. కాబట్టి నిత్యం ఆహారంలో తోటకూరను తీసుకోవడం వలన వీటన్నింటిని నివారించుకోవచ్చు, రక్తంలోని హిమోగ్లోబిన్‌లో ఐరన్ లోపించిన వారు రక్తహీనతలకు లోనవుతూ ఉంటారు. ఇటువంటి వారు ఎక్కువగా పెసరపప్పు, తోటకూర కలిపి వండినటువంటి కూరలను తినడం ద్వారా ఎంతోమంచి జరుగుతుంది. తోటకూరలో ఉండేటటువంటి కాల్షియం, ఐరన్‌లు బాలింతలకు, గర్భవతులకు, పిల్లలకు పోషక విలువలు అందజేస్తాయని వైద్యశాస్త్రం సూచిస్తుంది. [ఇంకా... ]

పిల్లల ఆటలు - చెప్పింది చెయ్యి

ఎంతమంది ఆడవచ్చు : ఎంతమందైనా ఆడవచ్చు.

ఈ ఆటలో లీడర్ ఉండాలి. లీడర్ ముందుగా చిన్న చిన్న తెల్ల కాగితాలపై రకరకాల పనులు రాసి మడత పెట్టాలి. అంటే ఒక దాంట్లో పాట పాడాలి, రెండవ దాంట్లో పకపకానవ్వాలి, వరుసగా కుంటుకుంటూ రావాలి, బ్రహ్మానందం లాగా మాట్లాడాలి., బాలకృష్ణ లాగా డైలాగ్ లు చెప్పాలి అని రాయాలన్నమాట. కూర్చున్న పిల్లలందరికి తలొకటి ఇచ్చి అవి విప్పి లోపల ఉన్నది చెప్పి వరుసగా అవి చేయ్యాలని చెప్పాలి. ఒక అమ్మాయికి మగాడిలా షేవింగ్ చేసుకోవాలి అని అందులో ఉంటే షేవింగ్ చేస్తున్నట్లు నటించాలి. మగపిల్లాడికి వంట చేయమని వస్తే వంట చేస్తున్నట్లు నటించాలి. భలే సందడిగా నవ్వులతో హోరెత్తిపోతుంది. ఒక సారి ప్రయత్నం చేసి చూద్దామా! [ఇంకా... ]

Friday, February 20

ముఖ్యమైన ఘట్టాలు - పెళ్ళి చేయటం

వ్యక్తి తానే కేంద్రబిందువుగా ఉండే స్థితినుంచి మరో వ్యక్తి కేంద్రబిందువుగా ఉండే స్థితికి ఎదిగే నిజమైన జీవిత యాత్ర వివాహంతోనే ఆరంభమవుతుంది. వ్యక్తి తానే కేంద్రబిందువుగా ఉండే స్థితినుంచి మరో వ్యక్తి కేంద్రబిందువుగా ఉండే స్థితికి ఎదిగే నిజమైన జీవిత యాత్ర వివాహంతోనే ఆరంభమవుతుంది. నైతిక సూత్రాలనే బీజాలు వివాహం తరువాతనే మొలకెత్తి వేగంగా పెరగనారంభిస్తాయి. ప్రేమ, తన్మయత, త్యాగం, భక్తి, ఓరిమి మొదలైన సద్గుణాలు పూర్తిగా ఎదిగేందుకు వివాహ జీవితం ఎన్నో అవకాశాలను ఇస్తుంది. కుటుంబ జీవనంలో ఎదగడానికి వివాహ వ్యవస్థ అవసరం. ఈ భావాన్ని పెండ్లి కుమారునికి కలిగించడానికే వేదాలు ఇలా ప్రకటించమని అతనికి సలహా ఇస్తుంది. ప్రియా! ఆవాహనం చేయబడిన దేవతల సన్నిధిలో, మన జీవితంలోని పవిత్ర సందర్భంలో, నీ పాణిగ్రహణం చేస్తున్నాను. ఆశీర్వదించబడిన ఓ స్త్ర్రీ రత్నమా! దీర్ఘకాలం నా జీవిత భాగస్వామిగా ఉండు. నా కుటుంబ బాధ్యతలను నీ కప్పగిస్తున్నాను. సంతోషముగా నీ బాధ్యతను నెరవేర్చు. పవిత్రమైన ఈ ప్రమాణం దైవసన్నిధిలో పెండ్లి కుమారుడు చేసే ఆ క్షణం నిజానికి ఎంతో ఆనందకరమైనది. [ఇంకా... ]

వంటలు - గుమ్మడికాయ బజ్జీలు

కావలసిన వస్తువులు:
గుమ్మడికాయ - 250 గ్రా.
శనగపిండి - 1 కప్పు.
పచ్చిమిరపకాయ ముక్కలు (చిన్నవిగా తరగాలి) - 2 టేబుల్ స్పూన్లు.
తురిమిన అల్లం - 1 టేబుల్ స్పూను.
కారం - చెంచా సగం.
తినే సోడా - చిటికెడు.
తురిమిన చీజ్ - ఒక టేబుల్ స్పూను.
ఉప్పు - తగినంత.
నూనె - సరిపడినంత.

తయారు చేసే విధానం:
మొదట గుమ్మడికాయ చిన్న చిన్న ముక్కలుగా, సన్నని స్లైసుల్లా కట్ చేసుకోవాలి. [ఇంకా... ]

పిల్లల పాటలు - బాలలం - బాలలం - 1

బాలలం, బాలలం మేమంత బాలలం

కన్న తల్లిదండ్రులకు - కదలాడే బొమ్మలం

భరతమాత పెంచుతున్న - భావి మావి కొమ్మలం

చదువుకునే దీపాలం - సమత నాత రూపాలం

నవ భారత మందిరాన - నవ జీవన శిల్పాలం [ఇంకా... ]

ఆహార పోషణ సూచిక - హిమోగ్లోబిన్ పెరగాలంటే!

ఆహార లోపం, ఆహారంలోని పోషకాల్ని శరీరం శోషించుకోలేకపోవడం, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు, పొట్టలో పురుగులు ఊండడం, ఎముకల మూలుగులో రక్తకణాలు తగిన పరిమాణంలో ఉత్పత్తి కాకపోవడం వంటివి ప్రధాన కారణాలు.

ఆహారంలో చేసుకోవాల్సిన మార్పులు :

1. పొద్దున టిఫిన్ తో పాటు ఒక గ్లాసు పాలు, ఒక పండు, నాలుగైదు ఖర్జూరాలు చేర్చాలి.
2. సాయంత్రం నాలుగు గంటలకు రాగిజావ, ఒక అరటిపండు తీసుకోవాలి.
3. భోజనంలో ప్రతిరోజూ పప్పు, ఆకుకూర (రెండూ కలిపి కాదు) ఉండేట్లు చూసుకోండి.
4. పడుకునే ముందు ఒక గుప్పెడు వెరుశనగలు, కాస్తబెల్లం,నాలుగైదు ఖర్జూరాలు తీసుకోండి. [ఇంకా... ]

భరతమాత బిడ్డలు - టంగుటూరి ప్రకాశం

పేరు : టంగుటూరి ప్రకాశం పంతులు.
తండ్రి పేరు : శ్రీ గోపాలకృష్ణయ్య.
తల్లి పేరు : శ్రీమతి సుబ్బమ్మ.
పుట్టిన తేది : 1872.
పుట్టిన ప్రదేశం : ఒంగోలు తాలూకాలోని కనుపర్తి గ్రామంలో (ఇప్పుడు ప్రకాశం జిల్లా) జన్మించాడు.
చదివిన ప్రదేశం : ఇంగ్లాండ్.
చదువు : ప్లీడరు (న్యాయవాది).
గొప్పదనం : ఆంధ్రరాష్ట్ర అభివృద్దికై పాటుపడినారు. స్వాతంత్ర్య సమరంలో పాల్గొని దేశానికి స్వాతంత్ర్యం తెచ్చాడు. స్వరాజ్య అనే పత్రికను స్థాపించాడు.
స్వర్గస్తుడైన తేది : 25-5-1957.

శ్రీ ప్రకాశం 1872 లో అప్పటి గుంటూరు జిల్లా, ఒంగోలు తాలూకాలోని కనుపర్తి గ్రామంలో (ఇప్పుడు ప్రకాశం జిల్లా) జన్మించాడు. తండ్రి శ్రీ గోపాలకృష్ణయ్య, తల్లి శ్రీమతి సుబ్బమ్మ. ఆ దంపతులకు ఆరుగురు సంతానం. వారిలో ప్రకాశం మూడవవాడు. [ఇంకా... ]

Thursday, February 19

పుణ్య క్షేత్రాలు - పెదకాకాని

కాకానిలో సాంబశివాలయము మహా మహిమాన్వితమై యున్నది. ఈ స్వామి వారి ప్రతిభ అనేక రకాలు. ప్రతి ఆదివారం భక్తులు తండోపతండాలుగా వచ్చి మొక్కుబడులు చెల్లించుకొంటూ ఉంటారు. ఇక్కడ సత్రాలున్నాయి. అన్ని వస్తువులూ దొరకుతాయి ప్రభలు, బండ్లు గట్టుకొనివచ్చి మొక్కుబడులు చెల్లించుకుంటూ ఉంటారు. వివాహ ఉపనయనాదులు నిర్వహించుకుంటూ స్వామి దయకు పాత్రులవుతారు. వ్యాధిగ్రస్తులు, సంతానహీనులు అక్కడనే వుండి ఆలయంచుట్టూ ప్రదక్షిణలు చేసి వారికోర్కెలను సాఫల్యం చేసికొంటూ ఉంటారు. ఇక్కడకు దగ్గరలోనే నంబూరు స్టేషన్ కెదురుగా రేడియో బ్రాడ్ కాస్టింగ్ స్టేషను, హేమలతా టెక్స్‌టైల్సు మిల్లు ఉన్నాయి. [ఇంకా... ]

వంటలు - క్వీన్స్ కేక్స్

కావలసిన వస్తువులు:
వెన్న - 30 గ్రా.
పంచదార పొడి - 50 గ్రా.
గుడ్డు - 1.
పాలు - 15 మి.లీ.
మైదాపిండి - 50 గ్రా.
బేకింగ్ పౌడర్ - 1/4 చెంచా.
ఎండు ద్రాక్ష - 30 గ్రా.
వెనిల్లా ఎస్సెన్స్ - కొన్ని చుక్కలు.

తయారు చేసే విధానం:
ఎండుద్రాక్ష తొడిమలు తీసి, నీళ్ళతో శుభ్రం చేయాలి. తర్వాత ఒక ఉతికిన, శుభ్రమైనబట్టతో తడి లేకుండా తుడవాలి. మైదాను, బేకింగ్ పౌడర్‌ను జల్లించాలి. వెన్నను, పంచదార పొడిని బాగా క్రీమింగ్ చేయాలి. [ఇంకా... ]

అవీ, ఇవీ కొనుక్కొనేటప్పుడు - సోఫా సెట్

ఫర్నీచరు కొనేటప్పుడు చాలామంది చేసే పొరపాటు పైపై మెరుగులు చూసి కొనేయడం. డబ్బు పెట్టి కొనే వస్తువు అందం ఎంత ముఖ్యమో నాణ్యతా అంతే ముఖ్యం. అందుకని నచ్చిన మోడల్ ఎంచుకున్నాక వెంటనే డబ్బు చెల్లించకండి. ముందుగా దాని నాణ్యతా ప్రమాణాలపై దృష్టిపెట్టండి. సోఫా ఈ రోజుల్లో అందరి డ్రాయింగ్ రూముల్లో తప్పనిసరి ఫర్నీచరు అయ్యింది. కాబట్టి అది కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో చూద్దాం.

1. ఎంచుకున్న సోఫా మీద కనీసం పదినిమిషాలు కూర్చోండి. సౌకర్యంగా ఉందీ లేనిదీ తెలుస్తుంది.
2. చేతులు పెట్టుకునే చోట, కింద, వెనక వైపున అంతా సమంగా మెత్తగా ఉందా లేక ఎక్కడైనా గట్టిగా ఫ్రేమ్ తగుల్తుందా గమనించండి.
3. దాని మీద కూర్చొని అటూ ఇటూ కదలండి. కీచుమని ధ్వని రాకుండా ఉంటేనే సరిగా ఉన్నట్లు. [ఇంకా... ]

నీతి కథలు - దొంగ దొరికాడు

అక్బర్ చక్రవర్తి కాలంలో ఒక ముసలావిడ ఉండేది. పాపం ఆవిడకు నా అన్న వాళ్ళు ఎవ్వరూ లేరు. ఒక్కత్తీ వంటరిగా ఉండేది. ఇలా రోజులు గడుస్తుండగా ఒకరోజున ఆవిడకు హజ్ యాత్రకు వెళ్ళాలన్న కోరిక కలిగింది. ఆ సమయంలోనే ఊళ్ళో మరికొందరు కలిసి హజ్ యాత్రకు వెడుతున్నారని ఆవిడకు తెలిసింది. ఇంకేముంది వాళ్ళతో కలిసి యాత్రకు వెడితే బావుంటుందని ఆవిడకు అనిపించింది. సరే వాళ్ళను కలిసి ఇలా తను కూడా యాత్రకు రావాలని అనుకుంటన్నట్టుగా వారితో చెప్పింది. వాళ్ళు సరేనని అన్నారు.

మరి యాత్రకు వెళ్ళాలంటే డబ్బులు కావాలి కదా! అందుకని తన దగ్గర వున్న బంగారు నగలన్నింటిని అమ్మేసింది. నగలు అమ్మగా వచ్చిన డబ్బులో కొంత తన దారి ఖర్చులకు ఉంచుకుంది. మిగిలిన డబ్బులను ఒక సంచిలో వేసి మూట కట్టింది. ఆ సంచిని మైనంతో అతికించేసింది.
[ఇంకా... ]

చిట్కాలు - వంటల తయారికి సంబంధించినవి

1. అన్నం వండుతున్న సమయంలో పాత్రలో నీరు మరగడం ప్రారంభించగానే మంటను బాగా తగ్గించండి. ఒక సారి మరిగిన నీరు అలా మరుగుతూనే ఉండేందుకు పెద్ద మంట అనవసరం. పెద్ద మంటలో వంటకు పట్టే సమయం తగ్గుతున్నది అపోహ మాత్రమే.
2. అప్పడాల్ని నిల్వ చేసేటప్పుడు వాటి మీద కొద్దిగా కారం, ఇంగువ చల్లితే పురుగులు, చీమలు దరిచేరవు
3. అల్లం తడి గుడ్డలో చుట్టి నీళ్ళ కుండ పైన ఉంచితే వారం, పది రోజుల వరకూ తాజాగానే ఉంటుంది.
4. ఆకుకూరలను ఒకటి, రెండు రోజుల కంటే ఎక్కువ రోజులు ఉంచకండి.
5. ఆయిల్ పలుసార్లు వండడం వలన మడ్డిగా తయారయిందా? దాంట్లో ఒక చిన్న బంగాళదుంప స్లయిస్ వేసి ఒక రోజంతా అలా ఉంచండి. ఆ ఆయిల్ మరల ఉపయోగించుకునేందుకు సిద్దం.
6. ఇంట్లో పార్టీ ఏదైనా జరిగి, గాజు పింగాణీ వస్తువులు ఎక్కువగా కడగాల్సి వచ్చినప్పుడు సింక్ లో రెండూ మందపాటి పాత టవల్స్‌ని పరిస్తే ఒకవేళ చేయిజారినా పగలకుండా ఉంటాయి. [ఇంకా... ]

Wednesday, February 18

పెద్దల ఆటలు - బెలూన్ పగలగొట్టే ఆట

ఈ ఆట చాలా సరదాగా ఉంటుంది. దీనికి కావలసిందల్లా బూరలు, దారం మాత్రమే.

పాల్గొనే వారందర్నీ రెండు గ్రూపులుగా విడదీయాలి. ఇప్పుడు మొదటి గ్రూపువారికి బూరని ఊది గట్టిగా ముడివేసి ఒక మూర దారం వదిలి తెంపి కాలిబొటనవేలికి కట్టుకోమనండి. అలా మొదటి గ్రూపు వారందరూ చేసిన తరువాత హాలు మధ్యలో రౌండ్ గీయండి. గీసిన రౌండ్ లో బూర కట్టుకొన్న వారిని ఒకరిని నుంచోమనండి. తరువాత రెండో గ్రూపు వారి నుంచి ఒకరిని వచ్చి నుంచోమనండి. ఆట ఏమిటంటే రౌండు లోనే ఇద్దరూ ఉండాలి. బూరకట్టుకొని ఉన్నవారు బెలూనును కింద ఆనించి తీస్తూ ఉండాలి. [ఇంకా... ]

జానపద గీతాలు - చీరల్ కావలెనా

చీరెల్ కావలెనా రవికల్ కావలెనా
నీకేమి కావలెనే పొద్దుటూరి సంతలోనా

చీరల్ నా కొద్దురో రవికల్ నా కొద్దురో
నీవే నీవే నీవే కావాలిరో రంగమ్మత్త కొడుకా

డావుల్ కావలెనా ఆరం కావలెనా
నీకేం కావలెనే పులివెందుల సంతలోనా

డావుల్ నాకొద్దురో ఆరం నాకొద్దురో
నీవే నీవే నీవే కావాలిరో రంగమ్మత్త కొడుకా [ఇంకా... ]

నీతి కథలు - మోసం చేసిన మోసం

ఒక పిల్లల కోడి, తన చిట్టి పొట్టి కోడి పిల్లలను వెంట బెట్టుకొని చెత్తకుప్పల మీద తిరుగుతూ పురుగులను ఏరుకొని తింటూ వుంది. కోడిని, కోడిపిల్లలను చూడగానే, ఆ పక్కనే కలుగులో వున్న పాముకు నోరూరింది. ఎలాగైనా ఓ కోడి పిల్లను మింగాలనుకుంది. తల్లి కోడి చూస్తూ వుండగా, పిల్ల కోడిని పట్టుకుంటే, తల్లి కోడి వాడి ముక్కుతో తన కళ్ళు పొడిచేస్తుందని పాముకు తెలుసు!

అందు కోసం ఏదైనా ఎత్తు వేయాలని అనుకొని, చచ్చిన దానిలాగ ఓ పక్కగా పడుకుంది. పాము! పాము అంటే ఇంకా భయం ఎరుగని కోడి పిల్లలు ఇటూ అటూ తిరుగుతూ, ఆ పాము మీద నుంచి ఈ పక్కకూ, ఆ పక్కకూ గెంతుతూ వున్నా పాము కదలకుండా, మెదలకుండా పడుకునే వుంది. [ఇంకా... ]

ఇతిహాసాలు - శుక్రాచార్యుని జన్మవృతాంతం

శుసనుడనే ముని ఒకసారి కుబేరుని సంపదను దోచుకుపోతాడు. అప్పుడు కుబేరుడు లబోదిబోమని మొత్తుకుంటూ వెళ్ళి శివుని దగ్గర మొరపెట్టుకొన్నాడు అతడి మొరను ఆలకించిన శివుడు కుబేరునికి అభయహస్తమిచ్చి, శుశనుడి కోసం గాలిస్తాడు. విషయం అర్ధం చేసుకొన్న శుసనుడు సరాశరి ఈశ్వరుని శూలం మీదనే కూర్చున్నాడు. అది గమనించిన గరళకంఠుడు తన శూలాన్ని కిందకు వంచుతాడు. అలా వంగిన శూలమే 'పినాకి ' అయినది. [ఇంకా... ]

ఆహార పోషణ సూచిక - ఆరోగ్యానికి మేలుచేసే బాక్టీరియా

ప్రోబయోటిక్స్ అంటే
మనిషి ఆరోగ్యాన్నిచ్చే సజీవ బాక్టీరియాలో సాక్రోమైటిక్స్ అని ఎఫ్ఎఒ నిర్వచనం చెప్పింది. ఈ కోవకు చెందిన బాక్టీరియాలో సాక్రోమైసస్ బౌలార్డ్, లాక్టో బాసిల్లన్ లేదా బైఫిడో బాక్టీరియం వగైరాలున్నాయి.

వీటి ఉపయోగం:
1. కొలోన్ (పెద్దపేగు లో పిహెచ్ స్థాయిని తగ్గించి హానికర బాక్టీరియాను నాశనం అయ్యేటట్లు చేస్తాయి.
2. వ్యాధినిరోధక వ్యవస్థను బలపరచి, పాధీజెనిక్ బాక్టీరియాకు నిరోధకశక్తిని అభివృద్ది చేస్తాయి. మాక్రోఫేగస్, లింఫోసైట్‌ల చర్యలను పెంచుతాయి. ఇమ్యునోగ్లోబులిన్స్ కారకాలను వృద్ధిచేస్తాయి. దీనివల్ల వ్యాధినిరోధక వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.
3. ఇంఫెక్షన్లను తగ్గిస్తుంది. ముఖ్యంగా వెజినోసిస్ ( మహిళల్లో వచ్చే ఈస్ట్ ఇన్ ఫెక్షన్లు ) వంటి వాటిని తగ్గిస్తుంది. [ఇంకా... ]

Tuesday, February 17

ఆధ్యాత్మికం - శ్రీ సాయి నీళ్లతో దీపాలను వెలిగించుట

గోదావరీ నదీ పరీవాహక ప్రాంతమైన అహమద్ నగర్ జిల్లాలో ఒక కుగ్రామమైన షిరిడీలో ఒక పాడుబడ్ద మశీదులో స్థిర నివాసమేర్పరుచుకున్న శ్రీ నిత్యం తన మశీదులో రాత్రిళ్ళు దీపాలను వెలిగించే వారు. దీపాలని వెలిగించేందుకు అవసరమయిన నూనెను ఆ ఊరులోని షావుకార్ల వద్ద నుండి యాచించి తెచ్చేవారు. మానవుని హృదయంలో జన్మాంతరాలుగా పేరుకొనిపోయి వున్న అజ్ఞానపు చీకట్లను పటాపంచలు చేసి, వారికి సన్మార్గం చూపేందుకే ఈ దీపాలను వెలిగిస్తున్నానని శ్రీ సాయి తన భక్తులతో తరచుగా చెప్పేవారు. ఆ గ్రామంలో బాలా భాటే అనే ఒక ఆసామికి శ్రీ సాయి యొక్క పద్ధతులు నచ్చేవి కావు, శ్రీ సాయి ఒక పిచ్చి ఫకీరని, చిన్నపాటి క్షుద్ర విద్యలను నేర్చుకొని ప్రజలను మోసం చేస్తున్నాడని భాటే ఆ ఊరి ప్రజలకు చేప్పేవాడు. పైగా మహ్మదీయుడైన సాయి మశీదులో హిందువుల ఆచార పద్ధతిలో దీపాలను వెలిగించడం హిందువుల మత విశ్వాసాలను మంటగలపడమేనని అందరినీ రెచ్చగొట్టసాగాడు. [ఇంకా... ]

ఎందుకు, ఏమిటి, ఎలా ... - చెట్టు నీడ చల్లనేల

గోడనీడ వేడిగా ఉంటుంది. కానీ చేట్టు నీడ చల్లగా ఉంటుంది. ఈ తేడా ఏమిటి. ఎందువల్ల ఇలా జరుగుతుంది అనేది తెలుసుకుందామా!

గోడ ఓ నిర్జీవ ఘన పదార్థం. దృశ్యకాంతి ఏమాత్రం గోడలోంచి దూసుకుపోదు. కాబట్టి గోడకు ఇవతల వైపు నీడ ఏర్పడుతుంది. అయితే సూర్యకాంతిలో దృశ్యకాంతితో పాటు, అధిక శక్తిమంతమైన అతినీల లోహిత కాంతి, తక్కువ శక్తిమంతమైనదే అయినా ఉష్ణభాగం అధికంగా ఉన్న పరారుణ కాంతి కూడా ఉంటాయి. గోడ మీద పడిన కాంతిలో కొంత భాగం ఆవలి వైపున పరానవర్తనం చెందినా, మిగతా కాంతిని గోడ పదార్థం శోషించుకుంటుంది. ఇలా కాంతిశక్తి గోడలో ఉష్ణశక్తిగా మారి గోడస్ నుంచి అన్ని వైపులకు ఉష్ణవాహనం ద్వారా ప్రసరిస్తుంది. అందులో కొంత భాగం గోడకు ఇవతలివైపు కూడా వస్తుంది. [ఇంకా... ]

వంటలు - మ్యాంగో స్క్వాష్

కావలసిన వస్తువులు:
మామిడిపండ్లు గుజ్జు - 3 కప్పులు.
సిట్రిక్ ఆసిడ్ - 15 గ్రా.
పొటాషియం మెటాబైసుల్ఫేట్ - 1/2 స్పూను.
పంచదార - 750 గ్రా.
నీరు - 4.5 కప్పులు.

తయారు చేసే విధానం:
ముందుగా మామిడి పండ్ల గుజ్జు తీసి, పంచదార, నీరు పోసి చక్కగా ఉడికించాలి. ఉడికిన గుజ్జు దించి చల్లార్చి సిట్రిక్ ఆసిడ్ పొడిచేసి పొటాషియం మెటాబైసల్ఫేట్ వేడినీళ్ళలో కలిపి గుజ్జులో కలపాలి. మరల గుజ్జును పల్చగా చేసి 5 నిమిషాలు ఉడికించాలి. [ఇంకా... ]

పిల్లల పాటలు - చిన్నోడమ్మా చిన్నోడు

చిన్నోడమ్మా చిన్నోడు
చిన్ని సైకిలు కొన్నాడు

రాళ్ళ మీద తిప్పాడు
కాలు జారి పడ్డాడు

ఆసుపత్రిలో చేరాడు
మందు బిళ్ళలు మింగాడు

మళ్ళీ ఇంటికి వచ్చాడు
మంచం ఎక్కి పన్నాడు [ఇంకా... ]

పుణ్య క్షేత్రాలు - శ్రీకూర్మం

శ్రీకాకుళంకి దగ్గరలోనే శ్రీ కూర్మనాధస్వామి ఆలయం దర్శించదగినది. ఇందుకు తోడు శ్రీ రామానుజాచార్యులు, శ్రీ వరదరాజస్వామి, శ్రీ మధ్వాచార్యులు, శ్రీ కోదండరామస్వామి ఆలయాలు కూడా ఉన్నాయి. అయితే శ్రీ కూర్మవతారము విష్ణ్వంశదశావతారాల్లో ఒకటయి మొదటి ఇది శివక్షేత్రంగా వెలసిఉన్నా శ్రీరామానునాజాచార్యులు వారివలన ఇదివైష్ణవక్షేత్రంగాను, దివ్యప్రదేశంగాను మలచారని చెప్తున్నారు. ఆలయం అతి ప్రాచీనమయినది. చుట్టూ మండపాదుల స్తంభాలమీది శిల్ప చాతుర్యం వేనోళ్ళకొనియాడ దగినది. గోపురాలమీద కూడ విశాలమైన స్ధలమున్నది. ఇక్కడ అనేక పుష్కరిణిలు కూడా వున్నాయి. [ఇంకా... ]

Monday, February 9

భరతమాత బిడ్డలు - మోక్షగుండం విశ్వేశ్వరాయ

పేరు : మోక్షగుండం విశ్వేశ్వరాయ (మోక్షగుండం విశ్వేశ్వరయ్య కాదు).
తండ్రి పేరు : శ్రీ శ్రీనివాసశాస్త్రి.
తల్లి పేరు : వెంకాయమ్మ.
పుట్టిన తేది : 1816 వ సంవత్సరంలో పుట్టారు.
పుట్టిన ప్రదేశం : ముద్దినేహళ్ళి.
చదివిన ప్రదేశం : చిక్ బల్లాపూర్ , బెంగుళూరులో సెంట్రల్ కాలేజీ.
చదువు : ఇంజనీరింగు.
గొప్పదనం : ఆయన మైసూరు రాష్ట్రప్రగతిలో మరపురాని పాత్ర వహించారు. కృష్ణరాజసాగర్ డాం నిర్మాణం, మైసూరు యూనివర్శిటీ స్థాపన, మైసూరు బ్యాంకు స్థాపన, ఆయన కృషివల్లనే జరిగాయి.
స్వర్గస్తుడైన తేది : 14 - 4 -1962.

మోక్షగుండం విశ్వేశ్వరాయ 1816 లో బెంగుళూరు దగ్గర్లో ఉన్న ముద్దినేహళ్ళి అనే గ్రామంలో ఒక పేద కుటుంబంలో పుట్టారు. మోక్షగుండం అనే గ్రామం కర్నూలు జిల్లాలో ఉంది. దాదాపు మూడు వందల సంవత్సరాల క్రితం వారి పూర్వికులు మైసూరు ప్రాంతం వలసపోవటం జరిగింది. [ఇంకా... ]

ఎందుకు, ఏమిటి, ఎలా ... - మైక్రోవేవ్‌ ఓవెన్

వంటలో సమయాన్ని, ఇంధనాన్ని, ఖర్చును ఆదాచేసే మైక్రోవవ్‌ను ఆధునిక సాధనంగా చెప్పవచ్చు. మైక్రోవేవ్ మీద వంట వండుకోవడమో, లేక మైక్రోవేవ్ మీద వంటను చేసుకుంటే బాగుండును అనుకోవడం తప్ప దాని గురించి మరేమీ తెలియకపోవచ్చు. మైక్రోవేవ్ ఓవెన్ ప్రయోజనాలు, సాంకేతిక వివరాలు ఇవి.

మైక్రోవేవ్ ఓవెన్‌లో ముఖ్యంగా వాట్‌ల వ్యవస్థ, నియంత్రణ ప్యానెల్, పవర్ లెవల్స్ ఉంటాయి. 350 ఆపైన వాట్‌లను ఉపయోగించి వీటిని తయారుచేస్తారు. అయితే చాలా వరకు ప్రామాణికంగా 700 వాట్‌లను ఉపయోగిస్తారు. అలాగే చాలా వరకు టి.విల్లో వచ్చే వంట కార్యక్రమాలు, పత్రికలు, మ్యాగజైన్లలో రాసే ప్రత్యేక వంటకాలను ఎక్కువగా ఈ 700 వాట్‌ల ఓవెన్ లోనే ప్రయోగించి చేసి చూస్తారు. మార్కెట్‌లో 700 వాట్‌ల ఓవెన్‌ను కొన్నవారికి వంటల పుస్తకాన్ని బహుమతిగా కూడా ఇస్తుంటారు. ఎవరైనా 700 వాట్‌లకు పైన ఉన్న ఓవెన్ ఎంచుకోవడం దూరదృష్టితో చేసే పని. లేదా చాలా తక్కువ వంట చేసే వారు మాత్రం తమకు తగ్గ వ్యాట్‌తో ఓవెన్‌ను ఎంపికచేసుకోవచ్చు. [ఇంకా... ]

వంటలు - మామిడికాయ తురుం పచ్చడి

కావలసిన వస్తువులు:
మామిడికాయ - 1(చెక్కు తీసి తురమాలి).
వేయించిన ఆవాలు - 1 చెంచా.
మెంతులు - 1 చెంచా.
కారం - 2 లేక 3 చెంచాలు.
ఇంగువ - తగినంత.
ఉప్పు, పసుపు - తగినంత.
నూనె - 2 గరిటెలు.

తయారు చేసే విధానం :
అవాలు, మెంతులు వేయించి పొడిచేసుకోవాలి. మూకుడులో నూనె వేడి చేసి అందులో ఆవాలు, ఇంగువ పోపు వేసి దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుని కారం, మెంతులు, ఆవాల పొడి వేసి పెట్టుకోవాలి. అదే మూకుడులో మరికాస్త నూనె వేసి మామిడి తురుము, పసుపు, ఉప్పు, వేసి మగ్గనివ్వాలి. [ఇంకా... ]

పిల్లల ఆటలు - టమోటా రేసు

ఎంతమంది ఆడవచ్చు : ఎంతమందైనా.

ఆడే స్థలం : గదిలో, ఆరుబయట ఆడవచ్చు.

కావలసిన వస్తువులు : "టమోటా" లేదా "బంగాళదుంప" లేదా "కోడిగుడ్డు" లేదా "బంతి".

ఆటగాళ్ల వయస్సు : 3 సం|| రాల నుండి.


A) పిల్లలు ఎక్కువ మంది వుంటే ఈ ఆట రక్తి కడుతుంది. పిల్లలని నేల మీద ఒకరి పక్కన మరొకర్ని కూర్చోమనాలి .వాళ్ళకి పోటీ టీంగా అదే సంఖ్య గల పిల్లల్ని వాళ్ళకి ఎదురుగా అదే పద్దతిలో కూర్చోమనాలి. అలా కూర్చున్న రెండు వరుసల్లోని పిల్లల్లో మొదట చెరో టమోటా ఇవ్వాలి. స్టార్ట్ చెప్పగానే పిల్లలు కుడినించి ఎడమకి ఆ టమోటా మారుతూ చివరకి ఆఖరిలో కూర్చున్న పిల్ల చేతికి చేరుతుంది. [ఇంకా... ]

పండుగలు - ఏరువాక పూర్ణిమ

ఇది రైతు సోదరులకు అత్యంత ప్రియమైన పండుగ. ఈ "ఏరువాక పూర్ణిమ"ను రైతులు ప్రతి సంవత్సరం 'జ్యేష్ఠ శుద్ద పూర్ణిమ ' నాడు తమపొలలాలలో దుక్కు దున్ని ఎంతో వైభవంగా దీనిని ఆచరించెదరు. ఈదినమందు మరో ముఖ్య విషయం, వార్కి అను నిత్యము వ్యవసాయ పనులలోను వ్యవసాయ అభివృద్దికి చేదోడు వాదోడుగా ఉంటూ, కాలి అందియలు ఘల్లు ఘల్లుమని గంటలు మ్రొగించుకుంటూ "ధాన్యలక్ష్మిని" ఇంటికి తోడ్కొని వచ్చే, వాటి మెడలో కొత్త గంటలు, పలురంగుల పూసలు, పూలతో నిండిన దిష్టితాళ్ళతో వాటిని అలంకరించి, పిదప మంగళవాద్యములతో పొలమునకు తోడ్కొని పోయి అచ్చట నాగలిని, ఈ బసవన్నలను ధూపదీపనైవేద్యములతో పూజించి అనంతరము భూమిని దుక్కిదున్ని "ఏరువాక " ప్రారంభించే శుభదినము 'అన్నదాతలకు '. అలా ఆచరించటవలన వార్కి చక్కని సిరులపంట పండుతుందని వారు విశ్వాసముగా భావిస్తారు. అది కేవలం వారి విశ్వాసమేకాదు వాస్తవము కూడా! అటువంటి వేడుకలు తిలకించాలి అంటే, ప్రకృతి రమణీయ డృశ్యాలతో పచ్చని పైరులతో పాడిపంటలతో నిండి ఉండే పల్లెసీమలే పట్టుగొమ్మలు. [ఇంకా... ]

Monday, February 2

మీకు తెలుసా - ప్రకాశం జిల్లా ఆవిర్భావ దినోత్సవం

ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు పేరిట మూడు జిల్లాల్లో వెనుకబడిన ప్రాంతాలను కలుపుకొని 1970 ఫిబ్రవరి 2వ తేదీన ప్రకాశం జిల్లాగా ఏర్పాటుచేశారు. స్వాతంత్రోద్యమ కాలంలో పోరాటాల గడ్డగా పేరొందిన ఈ ప్రాంతానికి దేశ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. ' ఆంధ్రరత్న ' దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు వంటి నాయకులు మరెందరో యువ ప్రకాశాలతో, స్వాతంత్ర్య ఉద్యమం ప్రకాశించింది. అందుకే ఈ జిల్లాకు ' ప్రకాశం' గా నామకరణం చేశారు. జిల్లా ఆవిర్భావ సందర్భంగా ఉద్యమాల గడ్డ గురించి స్మరించుకుందాం.

దుగ్గిరాలగోపాలకృష్ణయ్య:

1889 జూన్ 2 జన్మించిన దుగ్గిరాలగోపాలకృష్ణయ్య అర్థశాస్త్రంలో ఎం.ఏ పట్టాపొంది దేశభక్తితో 1854 నుంచి సహాయ సమీకరణ, శాసనోల్లంఘన, విదేశీవస్తు బహిష్కరణ తదితర ఉద్యమాలలో ప్రధానపాత్ర పోషించారు. 1920లో చీరాల - పేరాల ఉద్యమం ప్రారంభించారు.1921లో మార్చి 28న విజయవాడలో జరిగిన అఖిలభారత కాంగ్రేస్ మహసభ అనంతరం 1921 ఏప్రియల్ 21న మహాత్మాగాంధీ చీరాల వచ్చి 'దుగ్గిరాల ఉద్యమాన్ని కొనియాడారు. [ఇంకా... ]

నీతి కథలు - పెద్దపులి - బాటసారి

రామాపురం అనే గ్రామంలో శివశర్మ అనే బ్ర్రాహ్మణుడు ఉండేవాడు. అతను ఆ చుట్టుప్రక్కల ఉన్న నాలుగైదు గ్రామాలకు పురోహితుడు. ఒకనాడు పొరుగున ఉన్న కృష్ణాపురంలో వ్రతం చేయించటానికి బయలుదేరాడు. రామాపురం నుంచి కృష్ణాపురం వెళ్ళటానికి మధ్యలో రెండు మైళ్ళ దూరం అడవిని దాటి చేరుకోవాలి. ఆ అడవిలో కౄర జంతువులు లేకపోవటం వల్ల రామాపురం గ్రామస్థులు భయం లేకుండా అడవిని దాటి వెళ్ళేవారు. శివశర్మ అడవిలో నడుస్తుండగా అతనికి ఒక చెరువు గట్టు మీద దర్భలు చేతిలో పట్టుకుని కూర్చున్న పెద్దపులి కనిపించింది. దానిని చూడగానే శివశర్మ గుండెల్లో రాయి పడింది. భగవంతుడా! 'ఈ అడవిలో కౄర జంతువులు ఉండవు కదాని ఒంటరిగా బయలుదేరాను... ఇప్పుడు ఈ పెద్దపులి కనిపించింది. దీని బారి నుంచి నన్ను నువ్వే కాపాడాలి' మనసులో దేవుడిని తలచుకుంటూ అనుకున్నాడు. ఆ సమయంలోనే ఆ పెద్దపులి శివశర్మను చూడనే చూసింది. శివశర్మ కాళ్ళు చేతులు భయంతో వణికాయి. ఓ! బ్ర్రాహ్మణుడా నన్ను చూసి భయపడకు. కౄర జంతువయినా... ఇప్పుడు మాంసాహారిని కాదు... ఇప్పటిదాకా చేసిన పాపాల నుండి విముక్తి పొందాలని భగవంతుడిని ప్రార్దించాను... [ఇంకా... ]