Monday, October 13

ఆధ్యాత్మికం - పంచభూత లింగాలు

పృథ్విలింగం, ఆకాశలింగం, జలలింగం, తేజోలింగం, వాయులింగములను పంచభూతలింగాలు అంటారు.

పృథ్విలింగం: ఇది మట్టిలింగం. కంచిలోఉంది. ఏకాంబరేశ్వర స్వామి అంటారు. పార్వతీదేవిచే ఈ లింగం ప్రతిష్టించబడినది. ఇక్కడున్న అమ్మవారి పేరు కామాక్షీదేవి. అష్టాదశ పీఠాలలో ఇది ఒకటి.

ఆకాశలింగం: ఇది తమిళనాడులోని చిదంబర క్షేత్రంలో ఉన్నది. ఆకాశలింగ దర్శనం రహస్యమైనది. ఆకాశంవలే శూన్యంగా కనిపిస్తుంది. లింగ దర్శనముండదు. అందువల్లనే చిదంబర రహస్యం అనే పేరు వచ్చినది. ఈ క్షేత్రంలో నటరాజస్వామి, శివకామ సుందరి అమ్మవార్లు మాత్రమే ఉంటారు. [ఇంకా... ]

లాలి పాటలు - రామా లాలీ

రామా లాలీ మేఘశ్యామా లాలీ
తామరసనయన దశరథతనయా లాలీ ||రా||

అబ్జవదన ఆటలాడి అలసినావురా నీ
బొజ్జలో పాలరుగగానే నిదురబోవరా ||రా||

అద్దాల తొట్టెలో నేమో అనుమానించేవూ
ముద్దులపాపలున్నారని మురిసి చూచేవూ ||రా|| [ఇంకా... ]

పిల్లల ఆటలు - డైలాగ్స్ గేమ్

ఎంతమంది ఆడవచ్చు : ఎంతమందైనా.
కావలసిన వస్తువులు : పేపరు, పెన్ను.
ఆడే స్థలం : ఎక్కడైనా.

ఈ గేమ్‌కి అన్ని ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ గేమ్‌కి తెల్లపేపర్ మీద సినిమాలలో ఊతపదంలా వాడే పదము లేదా సెంటెన్స్ రాయాలి. ఆ వాక్యాన్ని ఎవరు ఉపయోగించారో ఏ సినిమాలోదో వ్రాయమనాలి. [ఇంకా... ]

Friday, October 10

లాలి పాటలు - చిట్టిపాప

చిన్ని మా అమ్మాయి శ్రీ ముఖము చూసి
సిగ్గుపడి జాబిల్లి పొడువగా వెఱుచు
పందిట్లో అమ్మాయి పాకుతూ వుంటే
పనసపండని జనులు పరుగులెత్తేరు
దొడ్లోను అమ్మాయి దొర్లాడుతుంటే
దోసపండని జనులు దోసిలొగ్గేరు [ఇంకా... ]

తెలుగు బిడ్డలు - సరోజినీ నాయుడు

పేరు : సరోజినీ నాయుడు.
తండ్రి పేరు : అఘోరనాధ ఛటోపాధ్యాయ.
తల్లి పేరు : శ్రీమతి వరద సుందరీదేవీ.
పుట్టిన తేది : 1879 వ సంవత్సరంలో జన్మించెను.
పుట్టిన ప్రదేశం : హైదరాబాద్‌.
చదివిన ప్రదేశం : ఇటలీ, స్విట్జర్లాండ్.
చదువు : మెట్రిక్యులేషన్.
గొప్పదనం : ఈమె భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనటమేగాక, స్రీ విమోచన కోసమూ, అస్పృశ్యతా నివారణ కోసమూ కృషి చేశారు.
స్వర్గస్తురాలైన తేది : 2-3-1949.
రచించిన రచనలు : 'గోల్డెన్ త్రెషోల్డు', 'బర్డ్సు ఆఫ్ టైం', 'ఫెదరర్ ఆఫ్ ది డాన్'.

హిందూ ముస్లిం భాయి భాయి అనే నినాదంతో సభల్లోనూ, సమావేశాల్లోనూ ప్రసంగాలు ఇచ్చి ప్రజల్లో సహజీవనం చేసిన మహనీయ మహిళ సరోజినీ నాయుడు. స్వాతంత్రోద్యమంలో పాల్గొనిన ఆధునిక భారతదేశ ప్రముఖ స్త్రీలలో ఈమె ఒకరు. [ఇంకా... ]

వ్రతములు - ఉండ్రాళ్ళతద్దె

ఈ వ్రతము చేయాలనుకునే వారు ఈ కథను చదువుకోవాలి.

ఒక ఊరిలో స్త్రీలందరు భాద్రపద బహుళ తదియనాడు వుండ్రాళ్ళ తద్దె నోమును నోచు కొనుచుండిరి. అప్పుడావూరి రాజు గారి వేశ్య కూడా నోము నోచు కొనెదనని రాజుతో చెప్పెను. రాజు "నీకు కావలసిన వస్తువులేవో చెప్పు" మనెను. ఆభోగముది చమత్కారముగ తనకు ఆకూ, గీకూ, కోకా, గీకా, కూరా, గీరా కావలయునని చెప్పెను. అదియెంతపని యని రాజు వాటిని తెచ్చుటకు నౌకరులనుబంపెను. వారన్నింటిని తెచ్చిరిగాని 'గీ'యను పేరుతో నున్న వాటిని తేలేక పోయిరి. [ఇంకా... ]

పిల్లల పాటలు - ఇంతింత దీపం

ఇంతింత దీపమ్ము ఇల్లెల్ల వెలుగు

మాడంత దీపమ్ము మేడలకు వెలుగు

గోరంత దీపమ్ము కొండంత వెలుగు

గోపాలకృష్ణయ్య గోకులము వెలుగు [ఇంకా... ]

మీకు తెలుసా - రుద్రాక్ష

ఆధ్యాత్మికతతో, ప్రేమపూరకమైన భక్తితో, భక్తి వైరాగ్యంతో నిండిపోయుండే భారతీయుడి హృదయానికీ, రుద్రాక్షకూ అవినాభావ సంబంధం ఉంది. ఈ సంబంధం భక్తుడికీ, భగవంతునికీ ఉన్న సంబంధంవంటిది. రుద్రాక్షను భగవంతునికి ప్రతిరూపంగా భావించే సంప్రదాయం ఆది కాలంనుండీ మనకు వస్తూనే ఉంది. ఇది కేవలం సంప్రదాయంగానే కాక అనేక విశ్వాసాలకు ప్రతిరూపంగా కూడా ఉండడంతో కుల మత ప్రమేయం లేకుండా వీటిని భారతీయులు ధరిస్తుంటారు. ఇవి అత్యంత శక్తివంతమైనవనీ, వీటిని ధరిస్తే ఎటువంటి చెడు ప్రభావం తమపై పడదనే భావన ఉండడంతో వీటికి గిరాకీ ఎక్కువ. చాలా అరుదుగా లభించే రుద్రాక్షలంటే ఎవరైనా ఆరాటపడుతూనే వుంటారు. [ఇంకా... ]

Thursday, October 9

సంగీతం - జయదేవుడు

12వ శతాబ్దానికి చెందిన గొప్ప కవి జయదేవుడు. పశ్చిమ బెంగాలుకు చెందిన బిర్‌భూం జిల్లాలోని అడ్‌జై నదీ తీరంపైన వెలసిన ఒక చిన్న గ్రామమ్మైన కౌండుభి (అప్పట్లో దీన్ని కెండుబిల్వ అని పిలిచేవారు)లో జయదేవుడు జన్మించాడు. "గీత గోవిందం" అనే తన ఉతృష్టమైన సంస్కృత కావ్యాన్ని జయదేవుడు ఈ కెండులి గ్రామంలోనే వ్రాసాడు. అప్పట్లో గౌడ్‌గా పిలువబడే బెంగాలును కళల సాహిత్యాభిమానులైన సేన రాజులు పాలించేవారు. గౌడ్ రాజ్యాన్ని పాలించిన ఆఖరి గొప్ప హిందూ రాజు లక్ష్మణసేన (క్రీ.శ.1178-1205) కొలువులొ వెలసిన మాణిక్యాలలో ఒక మణిగా జయదేవుడు ఉండేవాడు. [ఇంకా... ]

జానపద గీతాలు - చల్ మోహనరంగా...

నీకు నీవారు లేరు నాకూ నా వారు లేరు
ఏటి ఒడ్డున ఇల్లు కడదము పదరా చల్ మోహనరంగా

నీకు నాకు జోడు కలసెను గదరా
మల్లె తోటలోన మంచినీళ్ళ బావికాడ
ఉంగరాలు మరచి వస్తిని కదరా || చల్ || [ఇంకా... ]

నీతి కథలు - ఎత్తుకు పై ఎత్తు

ఒక ఊరిలో ఒక వర్తకుడున్నాడు. అతడు గొప్ప జిత్తుల మారి. అతనొక నాడు మరొక వూరి సంతకు బయలుదేరాడు. దారిలో అతను చాలా విచారంగా వున్నాడు. అతని విచారానికి కారణం ఆనాడు తనింకా లాభసాటి పని ఏదీ చెయ్యలేదు అన్న ఆలోచనే. ఎలాగో లాభం దారిలోనే సంపాదించాలనే దురాలోచన ప్రారంభమయిందతనికి. ఇంతలో దారిలో ఒక మనిషి తారసపడినాడు. ఆ రైతు మరొక గ్రామం నుండి షావుకారు వెళుతున్న గ్రామానికే సంతపని మీద వెళుతున్నాడు. అతన్ని చూడగానే షావుకారికి పల్లెటూరి రైతు అంటే బైతు అని షావుకారు నమ్మకం. ఆ నమ్మకంతో సునాయాసమైన లాభం సంపాదించడానికి షావుకారు బ్రహ్మాండమైన ఎత్తువేశాడు. రైతుని చూసి ఎక్కడికి వెళుతున్నావని అడిగాడు. రైతు సంతకు వెడుతున్నానని జవాబు చెప్పాడు. [ఇంకా... ]

పిల్లల పాటలు - ఆటలంటే మాకిష్టం...

ఆటలంటే మాకిష్టం - పాటలంటే మాకిష్టం
ఆటల కన్నా పాటల కన్నా - అల్లరి పనులే మాకిష్టం
సినిమాలంటే మాకిష్టం - మిఠాయిలంటే మాకిష్టం
సినిమా కన్నా మిఠాయి కన్నా - షికార్లు కొట్టుట మాకిష్టం
పిట్టలంటే మాకిష్టం - పువ్వులంటే మాకిష్టం
పిట్టల కన్నా పువ్వుల కన్నా - చెట్లు ఎక్కడం మాకిష్టం [ఇంకా... ]

వంటలు - ఎర్ర క్యాప్సికం దోసె

కావలసిన వస్తువులు:
ఎర్ర క్యాప్సికం (సన్నగా తరగినవి) - ఒకటి.
వెన్న - అరకప్పు.
కోడిగుడ్లు (తెల్లసొన మాత్రమే తీసుకోవాలి) - రెండు.
మొక్కజొన్నపిండి - పావుకప్పు.
మిరియాల పొడి - అరస్పూను.
ఉప్పు - తగినంత.
ఉల్లిపాయలు (సన్నగా తరగినవి) - ఒకటి.
ఉల్లికాడలు (వీటిని పొడుగ్గా నిలువుగా కోసుకోవాలి)- ఎనిమిది.

తయారు చేసే విధానం:

క్యాప్సికం ముక్కలు, కొద్దిగా వెన్న, కోడిగుడ్ల సొన, మొక్కజొన్న పిండి, మిరియాలు పొడి, ఉల్లిపాయల తరుగు, కొద్దిగా ఉప్పు అన్నింటినీ మిక్సీలో వేసి మెత్తని మిశ్రమం చేసుకోవాలి. [ఇంకా... ]

Wednesday, October 8

వ్యక్తిత్వ వికాసం - సమయ పాలన (టైమ్ మేనేజ్‌మెంట్)

ఏ మనిషికైన తాను అనుకున్న దానిని సాధించటానికి ముఖ్యంగా కావాలసినది సమయ పాలన. లోకంలో ఏ మనిషికైన రోజుకు ఉండేది 24 గంటలే. ఎటొచ్చీ ఆ 24 గంటలు సమర్థవంతంగా నిర్వహించుకోవడమే 'టైమ్ మేనేజ్‌మెంట్' అంటారు. ఒక సారి సమయాన్ని పోగొట్టుకుంటే అంటే వృధా చేసుకుంటే మళ్ళీ మనం దానిని ఎప్పటికీ పొందలేము. అందుకే అలాంటి సమయాన్ని ఎంత సమర్థవంతంగా ప్లాన్ వేసుకోవాలో, తద్వారా మన వ్యక్తిత్వాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఏ మనిషికైనా విజయం వరించాలి అంటే ప్లానింగ్ అవసరం. ప్లానింగ్ లేని మనిషి గమ్యం అగమ్యగోచరంలా ఉంటుంది. ఒక క్రమ పద్దతిలో ప్లాన్ వేసుకుంటే జీవితం నందనభరితం అవుతుంది. కొద్ది పాటి ప్లానింగ్‌తో జీవితాన్ని ఎలా సుఖమయం చేసుకోవచ్చునో తెలుసుకుందాం. [ఇంకా... ]

ఎందుకు, ఏమిటి, ఎలా - స్వెటర్లు

చలికాలం రాగానే మూలనపడి వున్న స్వెటర్లను వెతుక్కొని మరీ వేసుకుంటాం. అవి ఎందుకు మనం వాడుతున్నాము, ఎలా తయారయ్యాయి అనేది మనం తెలుసుకుందాము.

ఆదిమానవుడు ఆధునికుడై కనిపెట్టినా అల్లిక సూదుల ద్వారా ఉన్ని వస్త్రాలను అల్లడం అతడు చాలా కాలం పాటు నేర్చుకోలేదు. మొదట ఈ పనిని మొదలెట్టింది అరబ్బులు. వాళ్ళే రాగితో అల్లిక సూదులను తయారు చేసి వాటితో సాక్సులు అల్లడం మొదలెట్టారు. ఆ తర్వాత 14వ శతాబ్దంలో ఈజిప్టు నుంచి యూరప్‌కు ఉలెన్ సాక్సులు చేరాయి. అక్కడి నుంచి యూరప్ అంతా ఉన్ని వస్త్రాల అల్లిక మొదలయ్యింది. [ఇంకా... ]

భరతమాత బిడ్డలు - రవీంద్రనాథ్ ఠాగూర్

పేరు : రవీంద్రనాధ్ ఠాగూర్
తండ్రి పేరు : దేవేంద్రనాధ్ ఠాగూర్
తల్లి పేరు : శ్రీమతి శారదాదేవి
పుట్టిన తేది : 7-5-161
గొప్పదనం : దేశభక్తి గేయాల ద్వారా తెల్లదొరల పాలన అంతమొందించడానికి కారకుడయ్యారు. "ఈనాటి మన జాతీయగీతం "జనగణమణ" ఆయన కలం నుంచి వచ్చింది."

మంచి అలవాట్లు అలవరచుకొని, పేరు ప్రతిష్టలను ఆర్జించిన ప్రముఖులలో ఒకరు రవీంద్రనాధ్ ఠాగూర్. వారు ఎన్నుకున్న బాట "కవిత్వం" తన దేశభక్తి గేయాల ద్వారా తెల్లదొరల పాలన అంతమొందించడానికి కారకుడయ్యారు. "ఈనాటి మన జాతీయగీతం "జనగణమణ" ఆయన కలం నుంచి వచ్చింది." [ఇంకా... ]

కవితలు - ఆ నవ్వులో

నిన్నటి దిగులు లేదు
రేపటి బాధ లేదు
ఆ నవ్వు

హిమానీనదం అంత స్వచ్ఛంగా
హిమాలయాలంత అందంగా
ఆ నవ్వు

నిన్నని మరిపిస్తూ
రేపటిని తలపకు రానీకుండా
నేడు నా ముందు నిలచింది సాకారమై [ఇంకా... ]

సంస్కృతి - కూచిపూడి కళాక్షేత్రం

ఈ పేరు వినని తెలుగు కళాకారుడు ఉండడు. కూచిపూడి భాగవతుల ప్రదర్శనలకు నోచుకోని గ్రామం తెలుగునాట లేదు. తమ ప్రదర్శనల ద్వారా విశ్వ విఖ్యాతినొందిన కూచిపూడి గ్రామం కృష్ణా జిల్లాలో మచిలీపట్నంకు 15 మైళ్ళ దూరంలో ఉంది. తన పదాలతో దక్షిణ దేశాన్నంతా సుసంపన్నం చేసిన క్షేత్రయ్య స్వగ్రామమైన మువ్వ గ్రామంలో 500 సంవత్సరాలకు పూర్వమే నాట్య కళకు అంకురార్పణ జరిగినట్లు చారిత్రాకాధారాలున్నాయి.

కూచిపూడి భాగాతుల ప్రదర్శనానికి మూలపురుషుడు సిదేంద్ర యోగి. ఈయన తన నాత్య గీతాభినయాలను కూచిపూడి కళాకారులకు అంకితం చేశాడు. ఆనాటినుంచీ ఈనాటివరకూ కూచిపూడి నాట్య ప్రదర్శనలు, వారి భాగవతాలూ, వంశపారంపర్యంగా ప్రచారం పొందాయి. [ఇంకా... ]

Tuesday, October 7

కధలు - సంభవామి

మూడు చక్రాల బండి... లాగుతూనే ఉన్నాడు బికారి. కడలి పోటుకు ఎరుపెక్కిన ఎర్రనీరెండ బికారిని చుట్టుముట్టి చెమటను ఆవిరుల రూపంలో హరించివేస్తోంది.
లాగుతున్నాడు... ఊపిరిని బిగబెట్టి ఒక చేతిని రిక్షా హాండిల్ బార్ మీద, మరో చేతిని బండికి కట్టిన టైరు పంజామీద...
మనసును, దృష్టిని మమేకం చేసి మరీ లాగుతున్నాడు. మూడు చక్రాల చెక్కరిక్షా... బికారి రెండు కాళ్ళతో కలిపి ఐదు చక్రాలయ్యాయి.
'ఊహు ....' కదలనని మొరాయిస్తోంది.
ఇసుకలో కూరుకుపోయిన రిక్షాబండి... మోటుపల్లి రేవు మోటుగా అన్పిచింది బికారికి.
నానావిధాల తంటాలు పడుతున్నాడు. [ఇంకా... ]

లాలి పాటలు - ఉయ్యాల జంపాల

ఉయ్యాల జంపాలలూగరావమ్మ
వెలలేని బంగారుటూగుటుయ్యాల ||ఉ||
కమలమందున బుట్టి కమలాక్షుని చేపట్టి
కామూని కన్నట్టి కంజదళనేత్రి ||ఉ|| [ఇంకా... ]

పిల్లల ఆటలు - భాషలో తమాషా

ఎంతమంది ఆడవచ్చు : పది మంది
కావలసిన వస్తువులు : పేపర్లు, పెన్సిళ్ళు లేదా పలకలు, బలపాలు
ఆడే స్థలం :గదిలో ఆడవచ్చు
ఆటగాళ్ళ వయస్సు : 7 సం||రాల వయస్సు వాళ్ళు
పోటీ సమయం : 2 నిమిషాలు

ఎటు నుంచి చదివినా ఒకే అక్షరం వచ్చే పదాలు రాయడం ఇక్కడ పోటీ. [ఇంకా... ]

నీతి కధలు - స్వశక్తి

కేశవాపురం అనే ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి రాము, సోము అనే ఇద్దరు కొడుకులు. ఇద్దరికీ పెళ్ళిళ్ళు జరిగాయి. ఇల్లు పెద్దది కావటము వలన అందరూ కలసే ఉన్నారు. రాము పెద్దవాడు. ఉదయమేలేచి పొలము పనికి వెళ్ళి తండ్రికి సాయపడుతూ ఉండేవాడు. సోము సోమరిగా ఉంటూ పగటి పనికి వెళ్ళి కలలు కంటూ కాలక్షేపము చేసేవాడు. ఎవరు చెప్పినా ఏ పని చేయక పడుకొని ఉండేవాడు. కొంతకాలము గడిచింది. ఆ ఊరికి ఒక మెజీషియన్ వచ్చాడు. అనేక విద్యలు ప్రదర్శించాడు. చివరగా ధాన్యమును బంగారముగా మార్చాడు. సోమూకి ఆశ్చర్యము కలిగింది. [ఇంకా... ]

వంటలు - గోధుమపిండితో పూర్ణాలు

కావలసిన వస్తువులు:
గోధుమ పిండి - 1/4 కిలో
పచ్చి శనగపప్పు - 1/4 కిలో
బెల్లం - 1/4 కిలో
పచ్చికొబ్బరి - 1 చిప్ప
యాలుకలు - 10
నూనె - 1/2 కిలో

తయారు చేసే విధానం:

పచ్చి శనగపప్పు రాళ్ళు లేకుండా చేసుకోవాలి. బెల్లం తరగాలి. యాలుకలను పొడి కొట్టుకొని ఉంచుకోవాలి. పచ్చికొబ్బరి తురమాలి. గోధుమ పిండి జల్లించుకోవాలి. పచ్చి శనగపప్పును రెండు గంటలు నానబెట్టి నీళ్ళన్నీ ఒంపేసి కుక్కర్‌లో ఉడక బెట్టాలి. [ఇంకా... ]

Wednesday, May 28

నీతి కథలు - విలువైన ఉంగరం

ధనికుడైన వృద్ధుడొకడు తన ఆస్తిని సమభాగాలుగా తన ముగ్గురు కొడుకులకూ పంచి యిచ్చాడు. కాని విలువైన వజ్రపు ఉంగరాన్ని తను వుంచుకున్నాడు. "అలా ఎందుకు చేశావు?" అన్న ప్రశ్నకు అతను ఇలా జవాబిచ్చాడు. "ఆఖరుకు నాకు మిగిలిన ఈ వజ్రపు ఉంగరాన్ని విభజించడం సాధ్యం కాని పని. కనుక నా ముగ్గురు కొడుకులలో ఎవరు నిజమైన మానవతావాదో నేను కనుగొన్నాకనే ఈ వజ్రపు ఉంగరం వాడికి దక్కుతుంది". అతని ముగ్గురు కొడుకులూ మూడు త్రోవలలో వెళ్ళారు. కాలం అతి వేగంగా సాగిపోయింది. అతను నిర్ధారించిన సమయం ఆసన్నమైంది. ముగ్గురు అన్నదమ్ములూ తండ్రి యింటికి మరలి వచ్చారు. [ఇంకా... ]

Monday, May 26

నీతి కథలు - ఎద్దు పాలు

ఒకరోజు రాజుగారికి ఎద్దుపాలు త్రాగాలని అనిపించింది. 'ఎద్దుపాలా!?' అదేమంత పెద్ద కోరిక ఎవరైనా భటులకు చెప్తే వాళ్ళుతీసుకుని వస్తారు కదా! అని మీరు అనవచ్చు. నిజమే కాని ఎద్దులు పాలు ఇవ్వవు కదా! ఆ విషయం రాజుగారికి తెలుసు అయినా కూడా బీర్బల్ ఏం చేస్తాడోనని బీర్బల్‌ను ఆ విధమైన కోరిక కోరాడు రాజుగారు. ఇప్పుడు అర్ధం అయ్యింది కదా! అక్బర్ చక్రవర్తికి ఎంత విచిత్రమైన కోరిక కలిగిందో సరే! వెంటనే బీర్బల్‌ను పిలిపించాడు. తనకు ఎద్దుపాలు త్రాగాలని ఉందని చెప్పాడు. [ఇంకా... ]

Friday, May 23

నీతి కథలు - బ్రహ్మ పుట్టినరోజు పండుగే 'ఉగాది'

మనం మన కుటుంబసభ్యుల యొక్క మాపెద్దల, గురువుల మనావతార పురుషుల యొక్క పుట్టినరోజు పండుగలను ఘనంగా జరుపుకుంటూ ఏ ఏటికాయేడు కలుపుకుంటూ వారి వారి వయస్సులను లెక్కించుకొంటున్నాము. అట్లాగే భారతదేశమందలి చాతుర్వర్ణ్యముల వారు ఈ స్రుష్టికర్యైన బ్రహ్మదేవుని పుట్టిన రీజగు చైత్రశుధ్ధపాడ్యమిని పరంపరగా జరుపుకొంటూ ఏ సంవత్సరమునకు ఆసంవత్సరం కలుపుకుంటూ నాటి నుండి నేటి వరకూ ' శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్యహ బ్రాహ్మణహా ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే...' మొదలుగా సంకల్పమును చెప్పుకొనుచూ లేక చెప్పించుకొనుచూ లెకించుకొంటున్నాము. [ఇంకా... ]

Thursday, May 22

విజ్ఞానం - బ్యాంక్

బ్యాంకులలో మనం డబ్బు దాచి పెట్టుకోవటానికి రెండు విధానాలు ఉంటాయి
సేవింగ్ అకౌంట్
కరెంట్ అకౌంట్
కరెంట్ అకౌంట్ ఇది ఎక్కువగా వ్యాపారస్తులు ఉపయోగిస్తుంటారు అంటే ఎప్పటికప్పుడు డబ్బువేస్తూ ఉంటారు అవసరమైనప్పుడు తీసుకుంటూ ఉంటారు.
బ్యాంకులలో మనం డబ్బు దాచి పెట్టుకోవటానికి సేవింగ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. అది ఉంటే మనము ఆ బ్యాంకులో డబ్బు దాచి పెట్టుకోవచ్చు. [ఇంకా... ]

నీతి కథలు - చిలుక తెలివి

వ్యాపారి ఒకడు రామచిలుకను తెచ్చి పంజరంలో పెట్టాడు. స్వేచ్చగా ఉండే చిలుకకు పంజరంలో వుండటం జైలు శిక్షగా అనిపించింది. ఎలాగయినా సరే ఈ చెరనుండి బయటపడాలని అది నిశ్చయించుకొన్నది. ఆలోచించగా ఆలోచించగా దానికొక ఉపాయం తట్టింది. అది వ్యాపారిని పిలచి నన్నిలా పంజరంలో పెడితే నీకేంటీ లాభం? నన్నొదిలి పెడితే నీకు ఆణిముత్యాలాంటి మూడు నిజాలు చెబుతాను అంది. వ్యాపారి నవ్వి ఊరుకొన్నాడు. మళ్ళీ చిలుకే అంది. మొదటినిజం చెబుతాను అదినీకు నచ్చితే నన్ను డాబాపైకి తీసుకొని వెళ్ళవచ్చు. రెండవ నిజం చెబుతాను. అదికూడా నచ్చితే కొబ్బరిచెట్టుమీద కూర్చోవడనికి నాకు అనుమతి ఇవ్వాలి. [ఇంకా... ]

Wednesday, May 21

పిల్లల పాటలు - దేశభక్తి

దేశమును ప్రేమించుమన్నా - మంచి అన్నది పెంచుమన్నా
వట్టి మాటలు కట్టి పెట్టోయ్ - గట్టిమేలు తలపెట్టోయ్!
పాడి పంటలు పొంగిపొర్లే - దారిలో నువు పాటు పడవోయ్
తిండి కలిగితే కండ కలదోయ్ - కండ కలవాడేను మనిషోయ్!
ఈసురోమని మనుషులుంటే - దేశమేగతి బాగుపడునోయ్
జల్దుకోని కళలెల్ల నేర్చుకు - దేశి సరుకులు నించవోయ్
అన్ని దేశల్ క్రమ్మవలె నోయి - దేశి సరుకుల నమ్మవలెపోయి
డబ్బుతేలేనట్టి నరులకు - కీర్తి సంపదలబ్బవోయ్! [ఇంకా... ]

Tuesday, May 20

నీతి కథలు - మంచి స్నేహితుడెవరు?

చాలాకాలం క్రిందట మంచితెలివితేటలు, వివేకం ఉన్నఒకరాజు ఉండేవాడు. అతడి పేరుప్రతిష్టలు ఇతరరాజ్యాల వరకు పాకిపోయినవి. అనేక కళలలో ఆరితేరిన కళాకారులు అతని మెప్పును, పారితోషికంపొందేదుకూతడి దర్బారుకు విచ్చేసేవారు. అందులో కొందరు తమతెలివితేటలను ప్రదర్శించి రాజు వివేకాన్ని పరీక్షించడానికి కూడా దయచేసేవారు. ఒకరోజు ఒక కళాకారుడు రాజుదర్బారుకు వచ్చాడు. తాను తయారుచేసిన మూడుబొమ్మలనుకూడా అతను తనతో కూడా తీసుకొచ్చాడు. [ఇంకా... ]

Monday, May 19

కవులు - మంగళంపల్లి శ్రీహరి ప్రసాద్, హైదరాబాద్.

1. పేరు : మంగళంపల్లి శ్రీహరి ప్రసాద్
చిరునామా : హైదరాబాద్. ఆంధ్ర ప్రదేశ్
ఈ మెయిల్ : msamyati@yahoo.com
కవితలు : స్వర్గం, సుఖం
కవి గురించి : తెలుగు కవితలు వ్రాయడంలో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. [ఇంకా... ]

నీతి కథలు - రాజగురువు తెలివి

ఒకప్పుడు విజయభట్ అనే రాజగురువు వుండేవాడు. ఆ ఆస్థానంలో పన్నెండు అగ్రహారాలు వుండేవి. అందులో సురేంధ్రనగర్ అగ్రహారంలో భట్ నివసించేవాడు. ఆస్థానమంతా అర్జున్ సింగ్, సాబర్ సింగ్, అనబడే అన్నదమ్ముల ఆధీనంలో వుండేది. ఇందులో అర్జున్ సింగ్ యోగ్యుడు, బుద్దిమంతుడు, ఈ విషయం రాజగురువు భట్‌కు బాగా తెలుసు. కొన్నాళ్ళకు ఆ అన్నదమ్ములు విడిపోవాలని నిశ్చయించుకొన్నారు. అయితే సురేంధ్రనగర్ అగ్రహారం కోసం ఇద్దరూ వాదులాడుకోవడం ప్రారంభించారు. ఈ విషయం రాజగురువుదాకా వెళ్ళింది. ఆయన ఆ అన్నదమ్ముల వద్దకు వచ్చాడు. వారు గురువును చూచి ఎంతో గౌరవంగా పిలిచారు. తమ సమస్యను తీర్చ వలసిందిగా కోరారు. అప్పుడు రాజగురువు వారికొక కధ చెప్పాడు. [ఇంకా... ]

Saturday, May 17

కవులు - వడలి రాధాకృష్ణ, చీరాల.

పేరు : వడలి రాధాకృష్ణ
తల్లిదండ్రులు : వడలి వెంకట సుబ్బారావు, సూరమ్మ
వయస్సు : 44 సం||లు
విద్యార్హతలు : ఎం.ఎ. పబ్లిక్ ఎడ్మినిస్ట్రేషన్, ఎం.బి.ఎ. ఇంజనీరింగ్‌లో మాస్టర్ డిగ్రీ (బిట్స్ పిలాని)
ఉద్యోగం : ఐటిసి లిమిటెడ్ - ఐయల్‌టీడి డివిజన్, చీరాలలో ఉద్యోగం[ఇంకా... ]

పిల్లల ఆటలు - అక్షరంతో సృష్టి

ఎంతమంది ఆడవచ్చు : ఆరుగురు
కావలసిన వస్తువులు : పెన్ను, పేపరు
ఆడే స్థలం : ఆరు బయట, గదిలోగాని
పోటీ సమయం : 10 నిమిషాలు
ఆటగాళ్ళ వయస్సు : 8 సం|| నుండి 10 సం||లలోపు
ఒకే అక్షరంతో ఏర్పడే పదాలు కనుగొనడం
'రం' అక్షరంతో
1) అంగుళీయకం
2) భూగర్భంలో రహస్య మార్గం [ఇంకా... ]

Friday, May 16

నీతి కథలు - మేకపోతు గాంభీర్యం

అనగనగా ఒక మేక దాని యజమానికి ఆ మేక అంటే ఎంతో ఇష్టం. ఆ మేకకు కృష్ణుడు అని పేరు పెట్టి ఎంతో ప్రేమగా చూసుకోసాగాడు ఆ యజమాని. ఒక రోజు . . . మిగతా మేకలతో కలిసి కృష్ణుడుని కూడా అడవికి మేతకు తీసుకుని వెళ్లాడు. కృష్ణుడు మేకల మందతో కలిసి అడవిలో బాగా ఆడుకుంది. కడుపునిండా గడ్డి, ఆకులు అలములు తిన్నది. ఆ రోజు దానికి చాలా ఆనందంగా ఉంది. ఉరుకులు పరుగులు పెడుతూ అడవి అంతా తిరిగిన ఆ మేకపిల్ల అందరికన్నా ముందు వెళ్లాలన్న ఉత్సాహంతో మందనుంచి తప్పిపోయింది. [ఇంకా... ]

Monday, April 28

వంటలు - పాన్ కేక్స్ (క్రిస్మస్ కేకులు)

కావలసిన వస్తువులు:
కరిగించిన వెన్న - 100 గ్రా.
పంచదార పొడి - 1/2 కప్పు.
ఆరంజ్ రసం - సగం పండు.
పైనాపిల్ ముక్కలు - 1 కప్పు (సన్నగా తరిగినవి).
మైదాపిండి - 2కప్పులు.
జీడిపప్పు, బాదం, పిస్తా పలుకులు - 2 చెంచాలు.
మిక్స్‌డ్ డ్రై ఫ్రూట్స్ - 100 గ్రా.

తయారు చేసే విధానం:
పంచదార పొడిని ఆరంజ్ రసంలో కలిపి, వెన్న, పిండి కూడా చేర్చి పిండిని కొంచం జారుగా కలుపుకోవాలి.[ఇంకా... ]

పిల్లల ఆటలు - అష్ట చెమ్మ

ఎంతమంది ఆడవచ్చు : ఇద్దరు లేదా నలుగురు లేదా, రెండు జంటలు ఎదురెదురుగా కూర్చొని ఆడతారు.
గవ్వలు గాని, చింతపిక్కలు గాని, అరగదీసి గాని పిక్కలను కుదిపించి ఆడాలి. పిక్కలను సమయోచితంగా కదుపుతూ, ఎదుటి వ్యక్తి పిక్కలను చంపుతూ ముందుకు దూసుకుపోవటం విజేతలక్షణం.[ఇంకా... ]

Friday, April 25

నీతి కథలు - తెచ్చిపెట్టుకొన్న తిప్పలు

గోవిందప్ప కోనేట్లో కోటి రకాల కప్పలు ఉన్నాయి. బావురు కప్పలు, పచ్చ కప్పలు, వాన కప్పలు, గోండ్రు కప్పలు, చిరు కప్పలు ఇలా ఎన్నెన్నో రకాలు. అవన్నీ కలిసిమెలిసి బ్రతుకుతున్నాయి. ఎండా, వానా తేడా లేకుండా ఎరపొరుపులు రాకుండా ఎల్లకాలం చల్లగా జీవిస్తున్నాయి. చీకూచింతా లేకుండా హాయిగా కాలక్షేపం చేస్తున్నాయి.
కోనేటికి నాలుగు వైపులా రాతిమెట్లున్నాయి. సాయంత్రమయ్యే సరికి నగరంలో వాళ్ళంతా మెట్ల మీదకి చేరుకునేవాళ్ళు వెన్నెల రాత్రిళ్ళలో ఆ మెట్ల మీదే గడిపేవాళ్ళు. వాళ్ళు చేసే చర్చలు, వాదనలు కప్పలు వింటూ వుండేవి. రానురాను మనుషుల పద్ధతులన్నీ కప్పలకు అంటుకున్నాయి. కొంత కాలానికి కప్పలు సరికొత్త విషయం ఒకటి తెలిసింది. మనుషులు తమను పాలించడానికి ఒక 'రాజు' ని ఎన్నుకున్నారట![ఇంకా... ]

Thursday, April 24

భరతమాత ముద్దు బిడ్డలు - కందుకూరి వీరేశలింగం

పేరు : కందుకూరి వీరేశలింగం
తండ్రి పేరు : (తెలియదు)
తల్లి పేరు : (తెలియదు)
పుట్టిన తేది : 16-4-1848
పుట్టిన ప్రదేశం : రాజమండ్రి
చదివిన ప్రదేశం : రాజమండ్రి
చదువు : (తెలియదు)
గొప్పదనం : బాల్యవివాహాలను అరికట్టి, వితంతువుల పునర్వివాహలను ప్రోత్సహించారు.
స్వర్గస్తుడైన తేది : 27-5-1919

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ సాంఘీక సంస్కర్త కందుకూరి వీరేశలింగం. 1848 ఏప్రిల్ 16 న రాజమండ్రిలో ఒక సంపన్న కుటుంబంలో ఇతడు జన్మించెను. పాఠశాలలో చాలా చురుకుగా ఉండేవాడు. ఇతడు నాలుగోతరగతి చదువుతుండగా, ఉత్తమ విద్యార్ధి ఎవరు ఆనే ప్రస్తావన వచ్చినప్పుడు, విద్యార్ధుల్లో చాలా మంది ఇతని పేరును సూచించారు.[ఇంకా... ]

Wednesday, April 23

నీతి కథలు - పాలు ముట్టని పిల్లి

విజయనగరములో నివసించుచున్న ప్రజలకు ఎలుకల బాధ భరించరానిదైనది. ప్రభుత్వము ప్రజలను పిల్లులను పెంచమని ప్రోత్సహించినిది. రాయలవారు ప్రభుత్వోద్యోగులకు పిల్లులను ఉచితంగా యిప్పించారు. పిల్లులను పెంచుటకు పాలు అవసరము. కావున ఒక్కొక్క ఆవును కూడా యిప్పించినారు.
ప్రభుత్వోద్యోగులతోపాటు కవులకు, పండితులకు కూడా ఒక్కొక్క పిల్లిని, ఒక్కొక్క ఆవును యిచ్చినారు. అందరితోపాటు రామకృష్ణ కవికి కూడా ఒక పిల్లిని, ఒక ఆవును ఇచ్చినారు. రామకృష్ణుడు పిల్లిని సరిగా పెంచలేదు.[ఇంకా... ]

Monday, April 21

చిట్కాలు - బట్టలకు సంబంధించినవి

మగవారి కోటు, ప్యాంటు గుండీలు సన్నటి నైలాన్ దారంతో కుడితే చాలా కాలం తెగకుండా ఉంటాయి.
మీ పిల్లల వైట్ సాక్స్ బ్రౌన్ గా తయారయ్యాయా? నీటిలో రెండు లెమన్ స్లయిసెస్ వేసి ఆ నీటిలో ఈ సాక్సును వేసి నీటిలో బాయిల్ చేసి ఆ పైన ఉతకండి చాలు సాక్స్ తెల్లగా మెరిసిపోతాయి.
లెదర్ సోఫా పైన పిల్లలు క్రేయాన్స్ తో గీస్తే, వంటసోడా ఉప్పు కాస్త నీరు కలిపి పేస్టులా చేసి ఈ పేస్టుతో రుద్దితే మరక తొలగిపోతుంది.
సిల్క్ బట్టలు నీడలోనే ఆరవేయాలి.[ఇంకా... ]

నీతి కథలు - ఏ గుళ్ళో పెళ్ళి

పరంధామయ్య గారికి ఏడుగురు కుమార్తెలు. ఆరుగురికి వివాహాలు పూర్తి చేశాడు. కాని ఏడవకుమార్తె వివాహము గురించి సంబంధాల కోసము తెగ ప్రయత్నము చేశాడు. ఎక్కడా సరియైన సంబంధము దొరకలేదు. ఒక రోజున పరంధామయ్య పట్నంలో ఉన్న చిన్నప్పటి బాల్యస్నేహితుని ఇంటికి వెళ్ళాడు. ఆయనకు, పరంధామయ్యగారికి దూరపు చుట్టరికం కూడా వుంది. ఆయనే ఒక సంబంధం గురించి చెప్పి వాళ్ళింటికి తీసుకువెళ్ళాడు. ఆ సంబంధము పరంధామయ్య గారికి నచ్చింది. పెళ్ళిచూపులు ఏర్పాటు చేశారు.[ఇంకా... ]

Thursday, April 17

నీతి కథలు - ప్రాణం తీసిన గొప్ప

అది ఒక పెద్ద చెట్టు. దాని మొదలు దగ్గర కొన్ని రకాల రెక్కల పురుగులు చేరి, కబుర్లాడు కొంటున్నాయి. ఆ కబుర్లు పెరిగి పెరిగి, చివరికి మనలో ఎవరుగొప్ప? అనే వివాదానికి వచ్చింది!

ఆ పురుగులలో ఒక రెక్కల చీమ గబగబా ముందుకు వచ్చి చూడండి! నేను నేలమీద పాకగలను, గాలిలో ఎగరగలను 'నేనే గొప్ప' అంటూ అటూ ఇటూ తిరిగింది చరచరా! అది చూసి ఒక చీకురు పురుగు తన పెద్ద రెక్కలను ఆడిస్తూ చూడండి నా రెక్కలు ఎంత పెద్దవో, మీలో ఇంతంత పెద్ద రెక్కలు ఎవరికీ లేవు 'నేనే గొప్ప' అంది గర్వంగా, తన రెక్కలను చూసుకొంటూ, చూపిస్తూనూ! [ఇంకా... ]

Tuesday, April 8

పిల్లల ఆటలు - చెయిన్ కట్

ఎంతమంది ఆడవచ్చు : ఎంతమందైనా ఆడవచ్చు.

ఈ ఆటలో లీడర్ ఉండాలి. లీడర్ ముందుగా చిన్న చిన్న తెల్ల కాగితాలపై రకరకాల పనులు రాసి మడత పెట్టాలి. అంటే ఒక దాంట్లో పాట పాడాలి, రెండవ దాంట్లో పకపకానవ్వాలి, వరుసగా కుంటుకుంటూ రావాలి, బ్రహ్మానందం లాగా మాట్లాడాలి., బాలకృష్ణ లాగా డైలాగ్ లు చెప్పాలి అని రాయాలన్నమాట. కూర్చున్న పిల్లలందరికి తలొకటి ఇచ్చి అవి విప్పి లోపల ఉన్నది చెప్పి వరుసగా అవి చేయ్యాలని చెప్పాలి.
[ఇంకా... ]

Saturday, April 5

వంటలు - ఉగాది పచ్చడి

కావలసిన వస్తువులు:
మామిడి కాయ - ఒకటి(చిన్నది)
వేప పూత - కొంచెం
సన్నవి కొబ్బరి ముక్కలు - కొన్ని
చింతపండు - 100గ్రా
బెల్లం - 100గ్రా

తయారు చేసే విధానం :
ముందుగా చింతపండుని 1 గంట సేపు నానబెట్టి ఈనెలు రాకుండా పేస్టు తీసుకోవాలి. తరువాత వేప పూతని శుభ్రంగా పుల్లలు లేకుండా తీసుకోవాలి. మామిడి కాయని చిన్న ముక్కలుగా తరగాలి. [ఇంకా... ]

పండుగలు - ఉగాది

'బ్రహ్మ ప్రళయం' పూర్తి అయిన తరువాత తిరిగి సృష్టి ప్రారంభించుసమయాన్ని 'బ్రహ్మకల్పం' అంటారు. ఇలా ప్రతికల్పంలోను మొదటవచ్చే యుగాదిని యుగానికి ఆదిగా, ప్రారంభసమయమును 'ఉగాది' అని వ్యవహరిస్తూ ఉంటారు. అలాగునే ఈ 'ఉగాది' పర్వదినం మనకు చైత్రమాసంలో ప్రారంభ మవడం వల్ల ఆరోజునుండి మన తెలుగు సంవత్సర ఆరంభ దినంగా పరిగణించి, లెక్కించుటకు వీలుగా ఉండేందుకే ఉగాది పండుగను మనకు ఋషిపుంగవులు ఏర్పాటు చేశారు.
ఈ పండగ ప్రత్యేకత 'ఉగాది పచ్చడి.' ఈ పచ్చడిలో చేరే పదార్ధాలలో వేప పువ్వు ముఖ్యమైనది. బెల్లం, కొత్త చింతపండు పులుసు, మామిడి ముక్కలు, కొన్ని ప్రాంతాలలో అరటిపళ్ళ గుజ్జు కూడా చేర్చి పచ్చడిగా తయారుచేస్తారు. [ఇంకా... ]

పిల్లల పాటలు - ఈ చక్కని లోకం

ఎంత చక్కనిది ఈ లోకం
ఎందుకోయి ఇంకొక లోకం

కళ కళ లాడే సూర్యుడు, చంద్రుడు
మిల మిల మెఱసే చుక్కల గుంపులు
తళ తళ లాడే మెఱపు తీవలూ
కావటోయి అవి మనకోసం?

జలజల పాఱే ఏఱులు, నదులూ
తెలితెలి నురువుల సంద్రపు టలలూ
నవ నవ లాడే పచ్చని కోనలు
లేవటోయి అవి మనకోసం? [ఇంకా... ]

Friday, April 4

పిల్లల పేర్లు - య నుంచి ఱ వరకు

య నుంచి ఱ వరకు

యక్షణ, యక్షిణి, యమున, యల్లమ్మ, యవ్వని, యశస్విని, యశోద, యశోధర, యశ్వంత, యాగ్నిక, యాఘ్న, యాదగిరమ్మ, యాదమ్మ, యామిని, యామినీపుష్ప, యువతి, యువరాణి, యోగకుసుమ, యోగప్రియ, యోగమల్లిక, యోగలక్ష్మి, యోగవల్లి, యోగానందిత, యోగిత, యోగిని, యోగేశ్వరి. [ఇంకా... ]

Wednesday, April 2

సంస్కృతి, సంప్రదాయాలు - వ్రతములు

వ్రతములు
మన వైదిక సంస్కృతి మానవాళికి సాంప్రదాయాలను తెలియజేస్తూ సాధించవలసిన అంతిమ లక్ష్యం కోసం విధానాలను ఏర్పరిచాయి. మన యొక్క అంతిమ లక్ష్యం సత్యమును తెలుసుకొనుటమే. ఆ సత్యమును తెలుసుకొనుటకు వ్రతము యొక్క ఆవశ్యకతను గురించి ఈ శ్లోకంలో తెలియజేయబడినది.

శ్లోకం:
వ్రతేన దీక్షా మాప్నోతి దీక్షామాప్నోతి దక్షిణాం
దక్షిణాం శ్రద్ధా మాప్నోతి శ్రద్దయా సత్య మాప్యతే
వ్రతము వలన దీక్ష, దీక్ష వలన దక్షిణ, దక్షిణ వలన శ్రద్ధ, శ్రద్ధ వలన సత్యం లభిస్తుంది. కనుక మనము విధిగా వ్రతాలను ఆచరించాలి
వ్రతమనగా నియమిత సమయంలో నిర్దేశించిన కార్యమును ఆచరించుట. [ఇంకా... ]

Tuesday, April 1

అందరికోసం - హాస్య సంపద

టునాట్‌ఫోర్
ఏ మోయ్ టునాట్‌ఫోర్! టోపీ లేకుండా స్టేషన్‌కి ఎందుకొచ్చావు అడిగారు యస్.ఐ. ఇంటి నుండి టోపీతోనే బయలుదేరాను సార్! కానీ దారిలో ఎవడో కొట్టేశాడు సార్.

రేషన్ కార్డు
మీ వంటికి బియ్యం, పంచదార, గోధుమ,నూక, బియ్యం పడవు కాబట్టి.... అని డాక్టర్ చెపుతుండగా!
పేషంట్ : నా రేషన్ కార్డు మాత్రం చస్తే యివ్వను. [ఇంకా... ]