Monday, November 3

ఆధ్యాత్మికం - అద్వైత త్రయం

దేవుడు ఉన్నాడని అంగీకరించే మతం ఆస్తిక మతం. ఆస్తికులలో జీవులు చేతులు, కాళ్ళు మొదలైన వివిధ శరీరావయవాలులాగా దేవుని చేరి ఉంటారని చెప్పేవారు విశిష్టాద్వైతులు. జీవుడికీ, దేవుడికీ అన్ని కాలాల్లోనూ, అన్ని అవస్థలలోనూ భేదం ఉంటుందని వాదించేవారు ద్వైతులు. రెండు విధాలు కానిది, భేదం లేదని వాదించేవారు అద్వైతులు. ఈ వాదాన్ని ప్రతిపాదించినవారు శ్రీ శంకరాచార్యులు. అద్వైత వాదాన్నే "మాయా వాదం" అంటారు. దీనినే ప్రచ్చన్న బౌద్ధం అని కూడా అంటారు. ఈ దేహమే దేవాలయం. అందులో జీవుడే దేవుడు. దేహం పోయినా జీవుడు ఉంటాడని అద్వైతుల వాదన. దేహం నశించాక జీవుడు వేరే శరీరంలో ప్రవేశిస్తాడు. లేకపోతే ప్రకృతితో అంతర్లీనమైపోతాడు. పాలలో ఉండే వెన్నను తీసేస్తే ఆ వెన్న తిరిగి పాలలో కలవదు. అలాగే దేవుడు నుండి జీవుడుని వేరుచేస్తే ఆ జీవుడు తిరిగి దేవుడులో కలవడు. కాబట్టి జగత్తు సత్యం, జీవుడు సత్యం అంటుంది విశిష్టాద్వైతం. విశిష్టాద్వైత వాదాన్ని ప్రతిపాదించినవారు శ్రీరామానుజాచార్యులవారు.

అద్వైత విశిష్టాద్వైతాల తరువాత ద్వైతమతం ఆవిర్భవించింది. ఈ మతాన్ని స్థాపించింది ఆనందతీర్ధులు. వీరినే మధ్వాచార్యులు అని కూడా అంటారు. వీరు జగత్తు సత్యం, దేవుడు సత్యం, జీవుడు సత్యం అంటారు. జీవుడూ, దేవుడూ ఎప్పటికీ ఒక్కటి కాజాలరు. [ఇంకా... ]

పిల్లల ఆటలు - అవ్వా - అప్పచ్చా

ఎంతమంది ఆడాలి : ముగ్గురు ఆడాలి.

ముగ్గురు పంటలెయ్యాలి. ముందుగా ఎవరు పండితే వారు అతన్ని ఏనుగు మీద ఎక్కించాలి. మరి ఏనుగేది. మిగతా ఇద్దరూ ఏనుగుగా మారతారన్నమాట. ఎలాగంటే - ఇద్దరూ ఎదురెదురుగా నిలుచుని తమ కుడి అరచేతులను పైకి లేపి నిచ్చెన కట్టాలి. ఎదురు బాలుడు కూడా అలాగే కట్టాక ఇద్దరు చేతులు కలుపుతారు. ఇప్పుడు ఆ నిచ్చెన ఏనుగు అన్నమాట. పండిన బాలుడు చేతుల మధ్య కూర్చుండ బెట్టుకొని పైకి లేపి, వూరేగించాలి. అప్పుడు ఇలా పాడాలి. [ఇంకా... ]

భక్తి గీతాలు - సీతా కళ్యాణ వైభోగమే

సీతా కళ్యాణ వైభోగమే
రామ కళ్యాణ వైభోగమే ||సీ||

పవనజ స్తుతి పాత్ర పావన చరిత్ర
రవిసోమ నవనేత్ర రమణీయ గాత్ర ||సీ||

భక్త జన పరిపాల భరిత శరజాల
భుక్తి ముక్తిద లీల భూదేవ పాల
పామరా సురభీమ పరిపూర్ణ కామ
శ్యామ జగదభిరామ సాకేతధామ ||సీ| [ఇంకా... ]

వ్రతములు - కైలాస గౌరి వ్రతము

ఈ వ్రతము చేయాలనుకునే వారు ఈ కథను చదువుకోవాలి.

ఒక రాజునకొక్కతే కుమార్తె గలదు. అతడామెకొక వన్నెల విసనకర్ర వంటి వయ్యారి మగని యేరి తెచ్చి పెండ్లి చేసెను. కాని ఆమె భర్త యెల్లప్పుడు వేశ్యాలోలుడై భార్య ముఖమైనను చూడకుండెను. అందుచేత ఆ రాచ చిన్నది మిక్కిలి బాధపడి, పార్వతీదేవిని ప్ర్రతిదినము పూజించుచు, తన పతిని తనతో కలుపమని ప్రార్ధించుచుండెడిది. అట్లు కొంతకాలము జరిగిన తర్వాత పార్వతీదేవి ఆమె యందు కరుణించి ఒకనాటి రాత్రి ఆమె స్వప్నములో కనిపించి, కైలాసగౌరి నోము నోచినచో భర్తతో యెడబాటు లేకుండునని తెలిపెను. తెల్లవారిన తర్వాత నామె ముందురోజు రాత్రి స్వప్న వృత్తాంతమును తన తండ్రికి తెలిపి, ఆ నోమును నోచుకొనెను. [ఇంకా... ]

Friday, October 31

పిల్లల పాటలు - అమ్మకొక ముద్ద

ఆకేసి ఉప్పేసి
పప్పేసి అన్నం పెట్టి
చారేసి నెయ్యివోసి
అమ్మకొక ముద్ద

చెల్లికొక ముద్ద
అక్కకొక ముద్ద
అవ్వకొక ముద్ద
తాతకొక ముద్ద [ఇంకా... ]

వంటలు - అటుకుల పోణీ

కావలసిన వస్తువులు:

గోభీ పువ్వు (చిన్నది) - 1
ఆలు - 2
లావు అటుకులు - 250 గ్రా
పచ్చి మిర్చి (తరిగినవి) - 6
కరివేపాకు - 2 రెమ్మలు
కొత్తిమీర - 2 రెమ్మలు
ఆవాలు - 5గ్రా
జీలకర్ర - 5 గ్రా
ఎండుమిర్చి - 3
పసుపు - అర టీ స్పూను
ఉప్పు, రిఫైండ్ ఆయిల్ - సరిపడినంత
పచ్చి కొబ్బరి తురుము - కొద్దిగా

తయారు చేసే విధానం:
కడాయిలో నూనె వేడి చేసి పప్పు దినుసులు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పసుపు, ఉప్పు వరసగా కాక గోభీ, ఆలు ముక్కలు వేసి కలిపి సన్నని సెగపై ఉడికించాలి. [ఇంకా... ]

నీతి కథలు - పుట్టినరోజు

ఉదయం ఆరు గంటలు కావొస్తోంది. రవి ఇంకా నిద్రలేవలేదు. "ఒరేయ్ రవి! లేవరా! ఈరోజు నీ పుట్టినరోజు, మరచిపోయావా"? అంటూ సునీత గదిలోకి వచ్చింది. మగతనిద్రలో వున్న రవి, తల్లి పిలుపుతో లేచికూర్చున్నాడు. అది చూసి సునీత "హ్యపీ బర్తడే" అంటు శుభాకాంక్షలు తెలిపింది. "ముందు నువ్వు వెళ్ళి స్నానం చేసిరా! మీ డాడీ హాల్లో ఎదురచూస్తున్నారు" అంటూ వెళ్ళిపోయింది.

రవి తండ్రి రాఘవ పట్టణంలో పెద్ద వ్యాపారస్ధుడు. రవి వారికి ఒక్కగానొక్క కొడుకు. ఆ ఊరి పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్నాడు. కలవారి బిడ్డయినా క్రమశిక్షణతో పెరిగాడు. మాష్టార్లకు రవి అంటే చాలా యిష్టం. చదువుల్లోను, ఆటల్లోను ఫస్టు. తోటి పిల్లలతో స్నేహంగా ఉంటాడు. పేదపిల్లలను అవసరాల్లో ఆదుకొంటాడు. రవి స్నానం చేసి వచ్చి తల్లిదండ్రుల ఆశీస్సులందుకొన్నాడు. రాఘవ వందరూపాయల నోటును రవి చేతికిచ్చి "నీ కిష్టమైన వస్తువు కొనక్కో" అని చెప్పి వెళ్ళి పోయాడు. [ఇంకా... ]

వ్యక్తిత్వ వికాసం - ఏకాగ్రత

"వింటే భారతం వినాలి. తింటే గారెలే తినాల". అనే సామెత మీరు ఎప్పుడైనా విన్నారా? తినటానికి గారెలు ఎంత రుచిగా ఉంటాయో, వినటానికి భారతం అంత బాగా ఉంటుందని దాని భావం. భారతంలో కౌరవులు, పాండవుల కథ ఉన్నది.

ధృతరాష్ట్రుడు పుట్టడమే గుడ్దివాడుగా పుట్టాడు. ఆయనకు నూరుగురు కొడుకులు. వాళ్ళందరినీ కలిపి "కౌరవులు" అంటారు. పాండు రాజుకు అయిదుగురు కొడుకులు. వాళ్ళందరిని కలిపి "పాండవులు" అంటారు. పాండవులలో పెద్దవాడు ధర్మరాజు. మిగిలిన వాళ్ల పేర్లు వరుసగా భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. పాండవులు చిన్నవాళ్లగా ఉన్నప్పుడే వాళ్ల తండ్రి చనిపోయినాడు. అందువల్ల వాళ్ళు కూడ కౌరవులతో కలసి ధృతరాష్ట్రుని వద్దనే పెరుగుతున్నారు. ద్రోణాచార్యుడు అనే అయన వాళ్లకు విలువిద్యను నేర్పుతున్నాడు. విలువిద్య అంటే బాణాలు ఎట్లా వేయాలో నేర్పే విద్య. [ఇంకా... ]

ఎందుకు, ఏమిటి, ఎలా - బల్బు

ఒక బల్బును లోహపు తీగతో ఒక బ్యాటరీకి కలిపితే బల్బు వెలుగుతుంది. ఎందుకంటే ఆ విద్యుత్తు వలయంలో కరెంటు ప్రవహిస్తుంది కాబట్టి. కరెంటు అంటే ఎలక్ట్రాన్ల ప్రవాహమేకదా. మరి ఆ ఎలక్ట్రాన్లు బ్యాటరీకి సంబంధించినవా? ఒకవేళ బ్యాటరీవి అయితే బల్బును దారపు పోగుతో కలిపినా వెలగాలి కదా. ఎలక్ట్రాన్లు లోహపు తీగవే అయితే ఇక బ్యాటరీ అవసరం ఏముంది? వలయంలో కరెంటు ప్రవహిస్తే బల్బు ఎందుకు వెలగాలి?

అన్ని రకాల పదార్థాల్లోను, మనుషుల్లోను ఉండే ఎలక్ట్రాన్లను పక్కకు తీసి ఏది దేని నుంచి వచ్చిందో చెప్పమంటే ఎవరికీ సాధ్యం కాదు. బల్బు ఎలక్ట్రాన్ల ప్రవాహం వల్లనే వెలుగుతుంది. బల్బులో వెలుగునిచ్చేది కాంతి శక్తి. ఏ శక్తినీ శూన్యం నుంచి పుట్టించలేము. ఎలక్ట్రాన్ల ప్రవాహంలో ఉండే గతిజశక్తి మొదట ఉష్ణశక్తిగాను, తిరిగి కాంతి శక్తిగాను మారి వెలుగునిస్తుంది. [ఇంకా... ]

Thursday, October 30

వ్యాయామ శిక్షణ - పరీక్షలకు చదివేటప్పుడు ఎలా...

ఏకాగ్రతగా చదివితేనే, ఒత్తిడికిగురికాకుండా చదివిందంతా ఒక పద్ధతిప్రకారం సమీక్షించుకోగలిగితేనే పరీక్షలలో మంచి ఫలితాలు పొందవచ్చు. తేలికగా వుండే శ్వాస వ్యాయామాలు...చాలాసేపు కదలకుండా కూర్చుని చదవగలిగే ఏకాగ్రతనిస్తాయి. రిలాక్సేషన్ వ్యాయామాలు మనసు మీద వత్తిడి పడకుండా చూస్తాయి. అసలే పరీక్షల హడావుడిలోవుంటే ఈ గొడవేంటని విసుక్కోకుండా ఈ చిన్నచిన్న వ్యాయామాలు చేసి చూడండి ఎంత తేడా ఉంటుందో మీకే తెలుస్తుంది. ఏమేమి చేయవచ్చంటే...

1. దీర్ఘంగా శ్వాస తీసుకొని వదిలే...బ్రీతింగ్ ఎక్సర్ సైజులు ఎంతో హాయినిస్తాయి.
2. సూర్యనమస్కారాలు అలవాటుంటే క్రమంతప్పకుండా చేయండి.
3. ఒక అరగంట సేపు వేగంగా నడవండి.
4. బాల్ బ్యాట్మెంటెన్ గానీ, టెన్నీస్ గాని కాసేపు ఆడండి.
5. పదినిముషాలు అలా సైకిల్ మీద ఒక రౌండ్ కొట్టిరండి. [ఇంకా... ]

ఆధ్యాత్మికం - పరమేశ్వరుని ఆరాధన

సృష్టి మొత్తం ఒక నియమ పూర్వకమైన సువ్యవస్తతకు లోబడి నడుస్తోంది. గ్రహాలు, నక్షత్రాలు తమ తమ కక్ష్యలలో ఇరుసుమీద ఈమాత్రం అటూఇటూ దారి తప్పకుండా పరిభ్రమిస్తాయి. దివారాత్రులు, ఋతువులు మొదలగు వాటిలో ఒక నియమం ఏర్పడి ఉన్నది. కర్మ ఫలాలు ఒక దైవవ్యవస్తకు సంబంధించినవే. పాలు పెరుగుగా మారటానికి, విత్తనం మొక్కగామారటానికీ కొంతసమయం పడుతుంది. అదే విధంగా కర్మలననుసరించి మంచిచెడుల ఫలితం కొంతసమయం వెనుకా ముందుగానైనా నిశ్చితరూపంలో అందుతుంది. అలాకాని పక్షంలో ప్రపంచమంతా ఆటవిక న్యాయం రాజ్యమేలేది. నోరున్నవాడిమాటే చెల్లుబాటవుతూ, బలమున్నవాడిమాటే సాగుతూ వుండేది. కానీ అలాజరగటంలేదు.

విధ్వాంసులు, ధనవంతులు కళాకారులూ పహిల్వానులు కాగలగాలి అనుకొంటే కృషిసాధన చేసి తీరాలి. కృషికి తగిన ఫలితం తప్పక లభిస్తుంది. ఏజాతి విత్తనాలు నాటుతామో ఆ జాతి పంటనే కోరుకుంటాము. మధ్యం తాగినవాడికే నిషా తలకెక్కుతుంది. విషంతాగినవాడు ప్రాణాలు పోగొట్టుకొంటాడు. ఇదే కర్మఫలం యొక్క సునిశ్చిత వ్యవస్తకు ప్రత్యక్ష ప్రమాణం. [ఇంకా... ]

వంటలు - ఆలూ చిప్స్

కావలసిన వస్తువులు:

బంగాళ దుంపలు (ఆలూ) చెక్కు తీసినవి - 1/2 కిలో.

తయారు చేసే విధానం:

బంగాళాదుంపలను శుభ్రంగా కడిగి తీసి సన్నని ముక్కలుగా నిలువుగా కోసుకోవాలి. ఆ ముక్కల్ని నీళ్లలో ఐదు నిముషాల పాటు నానపెట్టాలి. తరువాత వడకట్టి పొడి బట్టలో వేసి వాటిలో ఉన్న పిండి పోయేవరకు మెత్తగా ఒత్తాలి. ఇలా చెయ్యడం వల్ల ముక్కలు ఒకదానికొకటి అతుక్కోవు, వేగించినప్పుడు కళాయికి అంటుకుపోవు. [ఇంకా... ]

లాలి పాటలు - లాలి పాట

లాలనుచు నూచేరు లలనలిరుగడల
బాల గండవర గోపాల నినుజాల లాలీ లాలీ

ఉదుటు గుబ్బల సరము లుయ్యాలలూగ
పదరి కంకణరవము బహుగతుల మ్రోగ

ఒదిగి చెంపలకొప్పు లొక్కింత వీగ
ముదురు చెమటల నళికములు తొప్పదోగ ||లాలీ||

మలయ మారుతగతులు మాటికి చెలంగ
పలుకు కపురపుతావి పైపై మెలంగ ||లాలీ|| [ఇంకా... ]

జానపద కళారూపాలు - కలాపాలు

జానపద కళారూపాలలో కలాపం చాలా ప్రసిద్ధమూ, ప్రాచీనమూ అయినది. భామా కలాపం, గొల్ల కలాపం, చోడిగాని కలాపం - ఇలా కలాపాలన్న పేరున చాలా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పుకోవాలంటే యక్షగాన ప్రబంధాలకు రూపాంతరాలే కలాపం, బుర్రకథ, హరికథ. ఏదో ఒక నాయిక పాత్రను ధరించి ఆడుతూ, పాడుతూ తన కథను తానే మనకు చెప్పే యక్షగాన రూపమే కలాపం. భామాకలాపం, గొల్లకలాపం వంటివి దేశీకిందకు రావు. మార్గశాఖకు చెందినవి. అయితే చోడిగాని కలాపం మొదలయినవి దేశీ శాఖకు చెందినవి. కలాపం అన్నది, కలాప రచనలు అనేది వ్యవహారంలో ఉన్న పేరు. [ఇంకా... ]

Wednesday, October 29

భరతమాత బిడ్డలు - పొట్టి శ్రీరాములు

పేరు - పొట్టి శ్రీరాములు
తండ్రి పేరు - గురవయ్య
తల్లి పేరు - శ్రీమతి మహాలక్ష్మమ్మ
పుట్టిన తేది - 1901
పుట్టిన ప్రదేశం - మద్రాసు
చదివిన ప్రదేశం - నెల్లూరు
రచనలు - 'ఎ బంచ్ ఆఫ్ ఓల్డ్ లెటర్స్ ', 'డిస్కవరీ ఆఫ్ ఇండియా', 'గ్లింపెస్స్ ఆఫ్ వర్డ్ హిస్టరీ'
స్వర్గస్తుడైన తేది - డిసెంబర్ 15
గొప్పదనం - నిరాహారదీక్ష చేసి మద్రాసు రాష్ట్రాం నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని వేరు చేసినారు.

ఒకప్పుడు మన ఆంధ్రాప్రాంతం మద్రాసులో అంతర్భాగంగా ఉండేది. తమిళ సోదరులు, మనం ఎంతో ఐకమత్యంగా, అన్యోన్యంగా ఉన్నప్పటికీ, పరిపాలనా పరంగా, భాషాపరంగా కొన్ని ఇబ్బందులు ఉండేవి! మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మద్రాసు రాష్ట్రంలో జనాభా ఎక్కువైయింది. వైశాల్యం కూడా ఎక్కువే. అందుచేత ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలని తెలుగువారు కోరుకునేవారు. కానీ అందుకు పాలకులు అంగీకరించలేదు. అనేక ప్రయత్నాలు చేసినా విఫలమయ్యాయి. చివరికి పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించారు. యుద్దాలతో సాధించలేని కార్యాన్ని శాంతియుత పోరాటంతో సాధించిన శ్రీరాములు చిరస్మరణీయులు. ఆయన గురించి తెలుసుకుందాం. [ఇంకా... ]

పిల్లల పాటలు - ఉయ్యాల...

లాల ఉయ్యాలమ్మ జోల ఉయ్యాల
ఊగేటి మా పాప తూగుటూయ్యాల

చిల్లి ఉయ్యాలమ్మ పొట్టి ఉయ్యాల
పట్టి ముద్దులపాప పసిడి ఉయ్యాల

పాల ఉయ్యాలమ్మ గాలి ఉయ్యాల
ఆకాశవీధిలో కెగురు ఉయ్యాల [ఇంకా... ]

వ్రతములు - నందికేశ్వర వ్రతము

ఈ వ్రతము చేయాలనుకునే వారు ఈ కథను చదువుకోవాలి.

ఒకనాడు పార్వతి శివుని పాదములు పట్టుచుండగా నతడామె చేతులు కఠినముగ నున్నందున తన పాదములను పట్టవలదనెను. పార్వతి తన చేతులెందుకు కఠినముగ నున్నవో తెలుపవలసినదని యడుగగా హరుడామె పరోపకారము చేయకపోవుటచే నట్టి కాఠిన్యము హస్తములకు వచ్చెననియు, అవి మృదుత్వమునందుటకు నీళ్ళాటిరేవున వేడి నీళ్ళతో వచ్చుపోవువారికి తలంటి నీళ్ళు పోయవలయుననియు చెప్పెను. పార్వతి భర్త ఆఙ్ఞతో అట్లు చేయుచుండగా నొక పేదరాలు వచ్చి, ఆమెతో తలంటినీళ్ళు పోయించుకొని వెల్లుచుండగా ఆమెపై దయ తలచి పార్వతి సంపదనిచ్చెను. నాటి నుండి ఆ పేదరాలు ధనవంతురాలయి గుమ్మం లోకి వచ్చువారికి పని చెప్పుచుండెను. ఆ సంగతి పార్వతికి తెలిసి గర్విష్టురాలగు ఆమె భాగ్యమును తీసివేయుటకు విఘ్నేశ్వరుని పంపగా అతనికామె ఉండ్రాళ్ళ నైవేద్యము పెట్టెను. [ఇంకా... ]

మీకు తెలుసా - పాస్‌వర్డ్ గుర్తుండాలంటే...

మెయిల్ ఓపెన్ చేసేటప్పుడు చాలా మంది ఎవ్వరూ కనుక్కోలేని విధంగా పాస్‌వర్డ్ ఇవ్వాలని పప్పులో కాలేస్తుంటారు. ఒక్కోసారి పాస్‌వర్డ్ గుర్తురాక నానా తంటాలు పడాల్సి వస్తుంది. ఇలాంటి సమస్య ఎదురుకాకుండా ఉండాలంటే...

పాస్‌వర్డ్ ఇచ్చేటప్పుడు వాళ్ళ కారునెంబర్లు, లేదా బైక్ నెంబర్లతో వారికి ఇష్టమైన పువ్వుల నెంబర్లు మిళితం చేసి ఇవ్వవచ్చు.

ఉదా: మీ కారు నెంబర్ AP04 అనుకోండి. మీకిష్టమైన పువ్వు లిల్లీ (lily) అనుకోండి. అప్పుడు మీ పాస్‌వర్డ్ నెంబర్ alpi014y ఇవ్వవచ్చు. [ఇంకా... ]

Thursday, October 23

జానపద గీతాలు - ఓ చిన్నదానా విడవనె చెంగు

ఓ చిన్నదానా విడవనె చెంగు
ఓ చిన్నదానా వదలనె కొంగు
బందారు చిన్నదాన బాజాబందూలదాన
బాజాబందూల మీద మోజేల లేదే ..ఓ చిన్నదానా..

గుంటూరు చిన్నదాన గుళ్ళా పేరులదానా
గుళ్ళాపేరుల మీద కళ్ళూపోలేదే .. ఓ చిన్నదానా..

కాకినాడ చిన్నదానా కాసూల్ కంటేలదానా
కాసూల్ కంటేల మీద మనసేలలేదే .. ఓ చిన్నదానా.. [ఇంకా... ]

వ్యక్తిత్వ వికాసం - ఆందోళనను అరికడదాం

సగటు మానవుడి సాధారణ స్పందనలలో ఆందోళన ఒకటి. వాస్తవానికి ఇది సర్వసాధారణంగా ప్రతి వ్యక్తిలోనూ ఎదో ఒకనాడు కలిగేదే. ఆందోళన చెందని మనిషి ఉండడం అంటూ జరగదు. ఐతే ఆందోళన చెందే పర్సెంటేజిలోనే ఉన్నది అసలు కథంతా. చిన్నా, పెద్దా ప్రతి సంఘటనకీ స్పందించే మనిషికే ఎన్నో తలనొప్పులు. ప్రతి సంఘటన సంఘర్షణ కాబోదు. అలా అవుతుందేమోనన్న ఆలోచనే ఆందోళనకు గురిచేస్తుంది ఎవరినైనా.ఆందోళన అనేది ఒక మానసిక వ్యాధి. మెదడును తొలుచుకుతినే క్రిమిలాంటిది. శరీరంలోని జీవ శక్తిని ఇది పీల్చేస్తుంది. మనస్సు నీరసపడిపోయి, అంతర్దృష్టి లోపించినప్పుడు మనస్సు అంతే మబ్బులు క్రమ్మేస్తాయి. మనస్సు గాబరాపడిపోతుంది. దుఖంతోనూ, విచారంతోనూ మునిగిపోతుంది. కాబట్టి, ఆందోళన, ఆదుర్దా, దుఖం అన్నీ ఏకమవుతాయి. ప్రతి నిత్యం ఎన్నో అవసరాలు,కోరికలు మనను చుట్టేస్తుంటాయి. ప్రతిదీ అవసరంగానే కనిపిస్తుంటుంది. ఆ అవసరాన్ని సాధించుకోవడంకోసం తీవ్రంగా ప్రయత్నించడం, అది సాధ్యం కాకపోయినప్పుడు తీవ్ర నిరాశకు గురికావడం జరుగుతుంటుంది. [ఇంకా... ]

పిల్లల ఆటలు - మెదడుకు పదును

ఎంతమంది ఆడవచ్చు : పది మంది
కావలసిన వస్తువులు : 20 రకాల చిన్నచిన్న వస్తువులు, పేపర్లు, పెన్సిళ్ళు, దుప్పటి
ఆడే స్థలం : గదిలో ఆడవచ్చు
ఆటగాళ్ళ వయస్సు : 5 నుండి 7 సం||రాల మధ్య
పోటీ సమయం : 10 నిమిషాలు
ముందుగా 20 రకాల చిన్న చిన్న వస్తువులను ఒక గదిలో ఉంచాలి. పిల్లలందరిని కూర్చోబెట్టి వస్తువులను పరిశీలించమని చెప్పాలి. [ఇంకా... ]

కథలు - మరో ఉప్పెన

"వీణ్ణి చూస్తూంటే చాలా అసూయగా ఉందే నాకు!" తల్లిని కరుచుకొని ఒదిగి పడుకున్న కొడుకును చూస్తూ అన్నాడు వెంకటరమణ. ఆ దగ్గరితనాన్ని తాను కోల్పోయిన భావం కనిపించింది అతడి గొంతులో. మంచాన్ని ఆనుకొని తనకు దగ్గరగా కూర్చున్న భర్త బుగ్గ మీద కొంటెగా పొడిచింది అమృత. కొడుకు తలను నిమురుతూ "వీడు అసలు నాకు పుట్టిన వాడేనా అమృతా!" అన్నాడు వెంకటరమణ. అతడి పెదాల మీద చిరు మందహసం. వెంకటరమణ చెవిని ఒక గుంజు గుంజింది అమృత. "పరాచికమా?". "అది కాదు. ఎప్పుడూ అమ్మా అమ్మా అంటూ నీ ఊసేగాని నాన్న అంటూ ఒక వెధవ ఉన్నాడని వీడికి తెలియదే !". గాలికి కొట్టుకుంటున్న కిటికీ రెక్కలకేసి చూసింది అమృత . ఇంటి పైకప్పు పెంకుల పగ్గుళ్ళలోంచి మెరుపులు స్పష్టంగా కనిపిస్తూంటే ఉరుముల శబ్దానికి కదిలిన చెట్టుకొమ్మల గలగలలు వింతగా వినిపిస్తున్నాయి. "నిన్నా మొన్నా లేదు. ఇప్పుడు గాలికూడా మొదలయినట్లుంది. "కిటికి తలుపులు వేయడానికి లేచాడు వెంకటరమణ. ఆ పెంకుటిల్లు మధ్యతరగతికి స్థితిగతులకు నిలువుట్టదంలా ఉంది. [ఇంకా... ]

ఇతిహాసాలు - రామాయణము - పాత్రలు - ముఖ్యాంశాలు

రామాయణము మహాకావ్యము. ఇందులో 24,000 శ్లోకాలు సంస్కృత భాషలో వాల్మీకి మహర్షిచే రచించబడ్డాయి. ఇందులో సీతారాముల పవిత్ర చరిత్ర, కొడుకు తండ్రిని ఏవిధంగా గౌరవించాలీ, సోదురులు ఒకరిపట్ల మరొకరు ఎటువంటి ప్రేమ కలిగి ఉండాలి, మిత్రుల మధ్య అన్యోన్యత ఎలా ఉండాలి, రాజు ప్రజలనెలా పాలించాలి మొదలైన వివరాలుంటాయి. శ్రీరామచంద్రుడు సాక్షాత్ నారాయణుడే అయినప్పటికీ దైవశక్తిని వినియోగించకుండా మానవ శక్తితోనే దుష్ట శిక్షణ చేయడమే కాకుండా ఒక సాధారణ మానవుడుగా జీవించాడు. అరణ్యవాసం, భార్యావియోగం వంటి కష్టాలన్నీ అనుభవించాడు. రావణ సంహారం మాత్రమే రామాయణ పరమార్ధం కాదు. ఆ త్రేతాయుగాన చెలరేగిన అధర్మాన్ని, బహుభార్యత్వాన్నీ, అసత్యాన్నీ కూడా నిర్మూలించడం,మనిషిలోని దుర్గుణాలన్నీ తొలగించడమే రామావతారం ఉద్దేశం. ఈ సత్కార్యాలవల్ల సాధారణ ప్రజలు ఆయన బాటలోనే నడిచి సుఖ జీవనం సాగించే అవకాశం కలిగింది. అందుకే ఏ యుగానికైనా ఆయనే ఆదర్శ పురుషుడు. [ఇంకా... ]

Wednesday, October 22

నీతి కథలు - ఆటో డ్రైవర్ నిజాయితీ

ఏలూరు పట్టణములో నరేష్ అనే అతడు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి తల్లి, తండ్రి, భార్య, ఒక కుమార్తె ఉన్నారు. సంపాదన చాలక అవస్థలు పడుతుండేవారు.తల్లికి అనారోగ్యంగా ఉండేది, తండ్రి సంపాదన అంతంతమాత్రమే. అయినా నీతి తప్పక వచ్చే సంపాదనతో తృప్తిగా జీవిస్తున్నారు. ఒక రోజున ఇద్దరు దంపతులు అతని ఆటోలో అశోక్‌నగర్‌కి స్టేషన్ నుండి ఎక్కారు. వారు ధనవంతులు. నగలుగల బ్యాగ్ ఆటో వెనుక భాగములో పెట్టి దిగిపోయారు. ఇంటికి వచ్చి భోజనము చేస్తుండగా కూతురు ఆటో ఎక్కి ఆడుకుంటూ ఆ బ్యాగ్‌ను చూసి ఇంటిలోకి తెచ్చింది. బ్యాగ్‌లో తినే ఆహారపదార్థములేమైనా వున్నాయేమో అని జిప్ వూడదీసి చూస్తే దాంట్లో బంగారు ఆభరణాలు, డబ్బు వున్నాయి. వెంటనే తల్లిదండ్రులకి చెప్పింది. [ఇంకా... ]

భరతమాత బిడ్డలు - బాలగంగాధర్ తిలక్

పేరు - బాలగంగాధర్ తిలక్
పుట్టిన తేది - 23-7-1856
పుట్టిన ప్రదేశం - రత్నగిరిలో
చదువు - న్యాయశాస్త్రం
గొప్పదనం - బ్రిటీషుపరిపాలనపై ప్రజలలో చైతన్యమును పెంపొందించెను. భారతీయులలో విద్యాభివృద్దికి అతడు పాటుపడెను. తిలక్ రచించిన గ్రంథాలు ('గీతారహస్యం', 'ఆర్కిటిక్ హొం ఆఫ్ వేదాస్') ; స్థాపించిన పత్రికలు ('కేసరి', 'మరాటా')
స్వర్గస్తుడైన తేది - 1-8-1920

బాలగంగాధర్ తిలక్ 1856 వ సంవత్సరం జులై 23న రత్నగిరిలో జన్మించాడు. తండ్రి ఒక సామాన్య బడిపంతులు. తల్లి మహాభక్తురాలు. చిన్నతనంలోనే తిలక్ తండ్రి అతనికి సంస్కృతంలోనూ, గణిత శాస్త్రంలోనూ గట్టిశిక్షణ ఇచ్చాడు. తిలక్ కూడా చదువు పట్ల ఎంతో ఆసక్తి చూపుతూ మెట్రిక్యులేషన్ దాకా ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణుడవుతూ వచ్చాడు. అతనికి పదహరేళ్ళు వచ్చేసరికి తల్లిదండ్రులిద్దరూ మరణించటం, అతని వివాహం జరగటం అన్ని జరిగిపోయాయి. [ఇంకా... ]

పర్యాటకం - ఉడిపి

కర్ణాటక రాష్ట్రం దక్షిణ కన్నడ జిల్లాకు పశ్చిమంగా మంగళూరుకు 60 కి.మీ. దూరంలో ఉన్న ఉడిపి ఒక పుణ్యక్షేత్రం. అనేక దేవాలయాలతో, ప్రతినిత్యం లక్షలాది మముక్షువులైన యాత్రికులతో, నిత్యనూతనోత్సవాలతో కళకళాలాడుతుంటుంది. ఇచ్చటి వాతావరణం ఎప్పుడూ అనుక్షణ ప్రవర్ధమానమైన దివ్య చైతన్యంతో స్పందిస్తూ ఉంటుంది. 'ఉడుప ' (చంద్రుడు) అనే పదాన్ని అనుసరించి 'ఉడిపి' అనే పేరు ఏర్పడింది. చారిత్రక ప్రసిద్దమైన ఈ పవిత్ర యాత్రాస్ధలం పరిశుభ్రంగా చంద్రుడిలా ప్రకాశిస్తూ ఉంటుంది. అక్కడక్కడ పెద్ద పెద్ద అందమైన మామిడి తోటలతో, పనస తోటలతో సువిశాలమైన వరి పొలాలగుండా ప్రయాణంచేసే యాత్రికులకు ఇచ్చటి కొబ్బరి చెట్లు, పోకచెట్లు స్వాగతం పలుకుతుంటాయి. 13వ శతాబ్దానికి చెందిన శ్రీ మధ్యచార్యులు శ్రీ శంకరుల అద్వై తమతాన్ని, శ్రీ రామానుజుల విశిష్టాద్వైత మతాన్ని పూర్తిగా ఖండించి కొత్తగా ద్వైత మతాన్ని (మద్వ మతం) ప్రతిపాదించిన అవతారమూర్తి - వాయుదేవుడు, హనుమంతుడు, భీమసేనుల అవతారం అని ప్రతీతి. గొప్ప పండితుడైన అచ్యుత ప్రేక్షుల ఆశ్రయంలో వేదవేదాంతంగాలు అధ్యయనం చేసిన మధ్వచార్యు (వాసుదేవుడు) ల ధారణాశక్తి సునిశితమైనది. వీరి శరీరం దార్ధ్యం అసాధారణ, అపారం. [ఇంకా... ]

వంటలు - కంది పచ్చడి

కావలసిన వస్తువులు:

కందిపప్పు - పావుకిలో.
ఎండు మిర్చీ - పది.
జీలకర్ర - ఒక చెంచా.
ఉప్పు - సరిపడినంత.
తయారు చేసే విధానం :

కందిపప్పుని మాడనీయకుండా మంచి సువాసన వచ్చేలా వేయించాలి. అది వేగుతుండగానే ఎండుమిర్చి తొడిమలు లేకుండా అందులో వేయాలి. బాగా వేయించి ఈ పప్పుమిరపకాయల్తో తగుపాటి ఉప్పువేసి కొంచెం నీళ్ళు చిలకరిస్తూ మెత్తగా పచ్చడి రుబ్బుకోవాలి. [ఇంకా... ]

జానపద కళారూపాలు - తోలుబొమ్మలు

దీర్ఘ కాలంగా ఆంధ్ర దేశంలోని ఆబాల గోపాలాన్ని అలరిస్తున్న కళారూపం తోలుబొమ్మలాట. ప్రేక్షకులకు కన్నులపండుగ కల్పించే కళారూపమిది. బొమ్మలతో నాట్యం చేయించడమే తొలుబొమ్మలాట కళారూపం.తోలుబొమ్మలాటల గురించి అనేక శాసనాల్లో కూడా లిఖించబడి ఉంది.

మన ప్రాచీన కళారూపలలో తోలుబొమ్మలు ఒకటి. ఇవి క్రీస్తు పూర్వం 3వ శతాబ్ధినాటికే చాలా ప్రచారంలో ఉన్నాయని తెలుస్తూంది. తెనుగువారి ప్రాచీన కళా వైదగ్ద్యాన్ని ఖండాంతరాలకు వ్యాపించి పెట్టిన కళ ఇది. నేడు పాశ్చాత్య దేశాలలో గొప్పగా చెప్పుకొనే ఛాయా ప్రదర్శనాలకు మూలం ఈ తోలుబొమ్మలే. ఖండాంతరాలకు - జావా, బోర్నియా, సుమిత్ర, బలి, సయాం, కంబోడియా, బర్మా మొదలయిన దేశాలలో - మన దేశంనుంచీ వలస వెళ్ళినవారు తోలుబొమ్మలను ప్రదర్శిస్తూ, రామాయణం, భారతం మొదలయిన కథలను ఎక్కువగా ప్రదర్శిస్తుంటారు. [ఇంకా... ]

Tuesday, October 21

పుణ్యక్షేత్రాలు - మంత్రాలయం

కర్నూలు నుండి ఎమ్మిగనూరు ద్వారా తుంగభద్రానదీ తీరంలో పెద్ద సన్యాసులైన శ్రీరాఘవేంద్రస్వామి సమాధి నొందిన బృందావనం ముఖ్య విశేషం మంత్రాలయం శ్రీరాఘవేంద్రస్వామి సమాధి దేవాలయం మంత్రాలయం రోడ్ రైల్వే స్టేషనుకు సుమారు 15కి.మీ. దూరం వుంది. ఇక్కడకు రాష్ట్రంలో పలుచోట్ల నుండి టూరిస్టు బస్సులు, R.T.C. బస్సులు నడపబడుతున్నాయి. భారతీయాత్మ, ఆధ్యాత్మిక విద్య 'ద్వైతవేదాంతము' నకు విశిష్టసేవ చేసిన మహామహులు, ఉపనిషత్తులకు ఖండార్ధలు, అనేక ఆధ్యాత్మిక గ్రంధాలకు వ్యాఖ్యానములు వ్రాసి జ్ఞానభక్తిని ప్రభోధించిన సద్గురువు శ్రీమంత్రాలయ రాఘవేంద్రస్వామి వారు. వారు ఇక్కడనే జీవసమాధి పొందారు. [ఇంకా... ]

మీకు తెలుసా - పెన్సిల్ పుట్టిందిలా...

పిల్లలూ! మీకు బొమ్మలు గీయడం వచ్చునా? సరే, బొమ్మలు గీయటానికి ఏమేంకావాలో చెబుతారా? పెన్సిల్, రబ్బర్, కాగితమూ.. అంటున్నారా, సరిగానే చెప్పారు. ఈ రోజు మనం పెన్సిల్ పుట్టుక గురించి తెలుసుకుందాం.

జోసెఫ్ డిక్సన్ ఇంగ్లాండ్‌లో పుట్టాడు. చాలా పేదవాడు. ఇల్లు గడవటానిక ఒకచిన్న దుకాణంలో పనికి చేరాడు. యజమాని చెప్పింది గుర్తుపెట్టుకోవటానికి ఏం చెయ్యాలో తెలియక ఒకరోజు బయటపడి ఉన్న ఓ నల్లరాయితో గోడమీద రాశాడు. అంతే! ఆ రోజు నుంచి ముఖ్యమైన విషయాన్ని గోడమీద ఆ నల్లరాయితో రాసేవాడు. ఆ రాయే 'గ్రాఫైట్'. [ఇంకా... ]

ఆధ్యాత్మికం - భగవద్గీత సారం

నీవు అనవసరంగా ఎందుకు దిగులుపడుతున్నావు? నీవు ఎవర్ని చూసి భయపడుతున్నావు? నిన్ను ఎవరు చంపగలరు? ఆత్మకు పుట్టుక గిట్టుకలు లేవు. జరిగినది మంచికోసమే జరిగింది. జరుగుతున్నదేదో మంచికోసమే జరుగుతోంది. జరగబోయేది మంచి కోసమే జరగబోతుంది. గతాన్ని గురించి మనస్సు పాడుచేసుకోవద్దు. భవిష్యత్తును గురించి దిగులుపడవద్దు. ఏమి నష్టపోయావని నీవు బాధపడుతున్నావు? నీతో కూడా నీవు ఏమి తెచ్చావు? ఏమి పోగొట్టుకున్నావు? నీవు ఏమి తయారుచేసావు? ఆ చేసినదేదో నాశనం అయింది. నీవు ఏమీ తీసుకురాలేదు. నీ దగ్గరున్న దాన్ని నీవు ఇక్కడే పొందావు. [ఇంకా... ]

లాలి పాటలు - కృష్ణ లాలీ యశోదమ్మ

కృష్ణలాలీ నందుని కృష్ణలాలీ యశోదమ్మ

నోముల పంట కృష్ణలాలీ || కృ ||

పాలు పెరుగు వెన్నతిని గోల చేసేవు

రవ్వలేల నీతో కృష్ణ వేగలేనురా || కృ ||

గోపకాంతలంతవచ్చి చాడీ చెప్పేరు

నీకు కరువ ఇంట పెరుగు పాల కెపుడైన || కృ || [ఇంకా... ]

పిల్లల ఆటలు - ఉల్టాపుల్టా గేమ్

ఎంతమంది ఆడవచ్చు : ఎంతమందైనా.
కావలసిన వస్తువులు : పేపరు, పెన్ను.
ఆడే స్థలం : గదిలో ఆడవచ్చు

ఈ గేమ్ కి ముందుగానే అన్ని రడీ చేసుకోవాలి. ఒక పేపర్ కింది విధంగా రాసుకోవాలి.

ఉదాహరణకు:

వ త్రి న రా - నవరాత్రి
ప సం ఉ వా - ఉపవాసం
నం రం అ త - అనంతరం
ణి ది మ వ్య - దివ్యమణి [ఇంకా... ]

Monday, October 20

పెద్దల ఆటలు - అష్టాదశా శక్తిపీఠాల ఆట

అష్టాదశ శక్తిపీఠాలు పేర్లు

ఈ ఆట లో పాల్గొనే వారందరికీ ఆట నిర్వహించేవారు పేపరు పెన్ను ఇవ్వాలి. ఆట ఏమిటంటే ఒక్క నిముషంలో అష్టాదశ శక్తిపీటాల పేర్లు వ్రాయాలి. ఎవరైతే ఎక్కువ రాస్తారో వారే విన్నరు.

నిర్వహించేవారి కోసము:

అష్టాదశ శక్తిపీఠాలు:

శ్రీ శాంకరీ దేవి - శ్రీలంక
శ్రీ కామాక్షి దేవి - కంచి
శ్రీ సింహళ దేవి - ప్రద్యుమ్నం
శ్రీ చాముండీ దేవి - కంసపట్టణం [ఇంకా... ]

వంటలు - కాకరకాయ చిప్స్

కావలసిన వస్తువులు:

కాకరకాయలు - 1 కిలో.
కార్న్‌ఫ్లోర్ - 50 గ్రా.
మైదా - 70 గ్రా.
అల్లం, వెల్లుల్లి - ఒకటిన్నర టీ స్పూన్.
ధనియాలపొడి - 1 టీ స్పూన్.
కారం - అర టీ స్పూన్.
జీలకర్ర పొడి - అర టీ స్పూన్.
కొత్తిమీర - 2 కట్టలు.
ఉప్పు - తగినంత.
నిమ్మ ఉప్పు - అర టీ స్పూన్.
రిఫైన్డ్ ఆయిల్ - వేయించడానికి సరిపడా.
రెడ్ఆరెంజ్ కలర్ - చిటికెడు.

తయారు చేసే విధానం :

పొడవుగా ఉన్న కాకరకాయల్ని ఎంచుకోండి. శుభ్రం చేశాక చాకుతో పొడవుగా సన్నగా తరగండి. ఈ ముక్కల్ని మరుగుతున్న నీళ్లలో వేయండి. ఈ నీళ్లలో ఉప్పు, నిమ్మ ఉప్పు కలపండి. అయిదు నిమిషాల పాటు కాకరకాయ ముక్కల్ని ఉంచి నీళ్లను వడగట్టండి. [ఇంకా... ]

పిల్లల పాటలు - అమ్మ

అమ్మ కన్న మంచిదీ
ఆమె వంటి పెన్నిధీ
ఎంత వెదకి చూచినా
లేదు లేదు ఎందునా.

అమ్మ కంటి వెలుగుతో
ఆమె చేతి చలువతో
బ్రతుకు పూలు పూయదా?
సతము ఫలము లీయదా? [ఇంకా... ]

కవితలు - గాంధీ కవిత్వం

ఒకరోజు ఒక బక్క పద్యం
గాంధీని చూద్దామని
గాంధీ ఆశ్రమానికి వచ్చింది.
గాంధీ రామ నామం స్మరిస్తూ

నూలు వడకుతూనే ఉన్నాడు
వాకిలి దగ్గర వేచి ఉన్న పద్యాన్ని చూడనేలేదు.
తాను భజన అయినా కానందుకు సిగ్గుపడుతూ
పద్యం గొంతు సవరించుకొంది. [ఇంకా... ]

భక్తి సుధ - శ్రీ సాయి చాలీసా

షిరిడీవాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో
దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం
త్రిమూర్తి రూపా ఓ సాయి కరుణించి కాపాడోయి
దరిశన మియ్యగ రావయ్య ముక్తికి మార్గం చూపుమయా ||షిరిడి||

కఫిని వస్త్రము ధరియించి భుజముకు జోలి తగిలించి
నింబ వృక్షపు ఛాయలో ఫకీరు వేషపు ధారణలో
కలియుగ మందున వెలసితివి త్యాగం సహనం నేర్పితివి
షిరిడి గ్రామం నీ నివాసం భక్తుల మదిలో నీ రూపం ||షిరిడి|| [ఇంకా... ]

Saturday, October 18

జానపద కళారూపాలు - బుర్రకథలు

మన జానపద కళాసంపదకు లోటులేదు. కావలసినన్ని జానపద కళారూపాలు మనకు ఉన్నాయి. బుర్రకథలు ఎప్పటినుంచీ ప్రచారంలో ఉన్నాయో సరిగా తెలియదు కాని రామాయణ కాలానికే - ఇవి ఉన్నట్టు తెలుస్తూంది. బుఱ్ఱ కథ ఇవి బొబ్బిలి వరస కథలనుండి, జంగం కథలనుండి రాజకీయ ప్రబోధం ప్రధానోద్దేశంగా సుమారు 1942 ప్రాంతాల్లో అవతరించాయని కొందరి అభిప్రాయం. గుంటురు జిల్లా వీటి జన్మస్థలము. తంత్రి మరియు బుర్ర అనే శబ్దాలు కలిసి తంబుర శబ్దం ఏర్పడింది. ఈ తంబురతో చెప్పే కథలు కనుక ఇవి తంబుర కథలై రానురాను ఆ రూపం మారి బుర్రకథలు అనే రూపం ఏర్పడింది. గుమ్మెటలను బుర్రలు అని గుంటూరు జిల్లాలో వ్యవహరిస్తారు కనుక బుర్రలు కొడుతూ చెప్పే కథలు బుర్రకథలు అని రూపం ఏర్పడి ఉండొచ్చని విమర్శకుల అభిప్రాయం. [ఇంకా... ]

కథలు - నింగినీడలు

'అది అంతే' ఒకింత స్వరాన్ని పెంచుతూ అన్నాడు కమలాకరం. సిరిమల్లికి మొదట్లో అర్ధం కాలేదు. చూస్తుంటే అసలు ఆ మనిషే అర్ధం కాకుండా ఉన్నాడు.

'నా చేతిలో ఏముంది చెప్పండి. అన్నింటికీ ఆ పైవాడి మీద భారం వేయడం తప్ప'

'భారాలు, తులాభారాలు సరే, అసలు ఎవరి భారాలు వారికి ఉంటాయ్ కమలాకరం మాటల్లో ఒకింత అసహనం కనిపిస్తోంది.

'దానికి నేను చేసేదేముంది' ఎడం వైపు ఒత్తిగిల్లుతూ అంది సిరిమల్లి.

'ఇవిగో బలానికి ఇంజక్షన్లు, టానిక్‌లు. ఈ పళ్ళు తీసుకుంటే కడుపులో బేబీగ్రోత్ బాగుంటుంది. ఆరోగ్యం బాగా చూసుకోవలసిన భాద్యత నీదే! బ్యాగ్‌ని ప్రక్కనే ఉన్న టీపాయ్ మీద పెడుతూ అంది దాక్షిణ్య.

సిరిమల్లె వాటి వైపు చూసుకుంది. కొంతకాలమైనా తనను గురించి పట్టించుకునే మనుషులు. కానీ అదే మనుషుల్లో కొంత స్వార్థం, అవసరం తాలూకు ఉద్దేశాలు. వారంతా గత తొమ్మిది మాసాలుగా అంతకు ముందు కొన్నినెలలుగా తన ఇంటిచుట్టూ, తన పేదరికం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. [ఇంకా... ]

తెలుగు బిడ్డలు - త్యాగయ్య

పేరు - త్యాగయ్య.
తండ్రి పేరు - రామబ్రహ్మం.
తల్లి పేరు - సీతమ్మ.
పుట్టిన తేది - 4-5-1767.
పుట్టిన ప్రదేశం - తిరువారూర్.

కాకర్ల త్యాగయ్య 1767వ సంవత్సరం మే నెల నాలుగవ తారీఖున తంజావూరు జిల్లాలోని కావేరీ నదీ తీరంలోని తిరువారూర్ అనే గ్రామంలో జన్మించాడు. తండ్రి రామబ్రహ్మం మహాభక్తుడు. తంజావూరును పాలించిన రాజుల అభిమానాన్ని పొందిన రామభక్తుడు. తల్లి సీతమ్మ త్యాగయ్యను ఎంతో ప్రేమతో తన కీర్తనలలో 'సీతమ్మ మాయమ్మ... శ్రీరాముడు మాతండ్రి' అని గానం చేశాడు. తన ఆరాధ్య దైవాలైన సీతారాముల పేర్లు తన తల్లిదండ్రుల పేర్లు కావటం అతనికి ఎంతో ఆనందం కలిగించింది. తల్లి పేరును కొంతమంది రచయితలు శాంతమ్మగా రాశారు, కానీ అది నిజంకాదు. ఆయన రచించిన 'ప్రహ్లాద భక్తి విజయం' అనే రూపకంలో తండ్రిపై ప్రేమతో తండ్రి రామబ్రహ్మం గురించి ప్రస్తావించాడు. [ఇంకా... ]

వ్రతములు - అట్లతద్దె

ఈ వ్రతము చేయాలనుకునే వారు ఈ కథను చదువుకోవాలి.

ఒక రాచ చిన్నది తోడి చెలికత్తెలతో కలసి అట్ల తద్దె నోమును నోచుటకు వుపవాసముండెను, మూడు జాములు దాటు సరికి రాచ బిడ్డ సుకుమారి యగుటచే శోషవచ్చి పడిపోయెను. అంతట నామె అన్నలు వచ్చి ఆమె అట్లు పడి పోవుటకు కారణమును తల్లి వలన గ్రహించిరి, వారు తమ చెల్లెలు చంద్రుడు వచ్చు వరకు నుండ లేదని అనుకొని ఒక చింతచెట్టు కొమ్మకు అద్దము కట్టి దానికి యెదుట అరికె కుప్పకు అగ్గిని పెట్టి చెల్లిని లేపి "అడుగో చంద్రుడు వచ్చెను. భోజనమును చేయు" మనిరి. అద్దములో నిప్పు చూచి చంద్రుడే వచ్చెననుకొని, ఆమె భోజనము జేసెను. [ఇంకా... ]

లాలి పాటలు - పవళింపు పాట

పవళింప వేంచేయు సమయము స్వామీ ||ప||
పసిడి పాదుకలూని పడతి సీత కేలూని ||ప||

రసిక జనుల గొల్వ రత్న పాదుకలూని
వసియింప వేంచేయి సమయము స్వామీ ||ప||

ముసిముసి నగవుల మోహనకారుడై
ముదమున వేంచేయు సమయము స్వామీ ||ప||

దశరధాత్మజుడిదె దయతోడ నరసింహ
దాసుని ప్రార్ధన సకలము చేకొని ||ప|| [ఇంకా... ]

Friday, October 17

జానపద గీతాలు - మొక్కజొన్న తోటలో

సుక్కలన్ని కొండమీద - సోకుజేసుకునే వేళ,
పంటబోది వరమడితో - పకపక నవ్వే వేళ,
సల్లగాలి తోటకంత - సక్కలగిల్లి పెట్టువేళ,
మొక్కజొన్న తోటలో - ముసిరిన సీకట్లలో,
మంచెకాడ కలుసుకో, - మరువకు మామయ్య,

చీకటి మిణుగురు జోతుల - చిటిల చిల్లులడక మునే,
సుద్దులరాగాలు చెవుల - నిద్దరతీయక మునుపే,
ఆకాశపుటొడిని తోట - ఆవలింత గొనక మునే,
పొద్దువాలుగంటనే - పుంతదారి వెంటనే,
సద్దుమణగనిచ్చిరా - ముద్దులమామయ్య! [ఇంకా... ]

మీకు తెలుసా - కాగితం కథ

క్రీ.పూ. 3500 సంవత్సరం ప్రాంతంలో పురాతన ప్రపంచంలో రాయడం కోసం వాడబడిన వస్తువు "పేపిరస్" అనే పదం నుండి "పేపర్" వచ్చింది. ప్రాచీన ఈజిప్టులోని ప్రజలు రాయడానికి ఒక కాడ నుండి ఈ పేపిరస్ తయారుచేయబడేది. దృఢత్వానికీ, ఎడారిలోని పొడిగాలికీ అనువైన పేపిరస్ పైన నమోదైన పాత రికార్డులు యింకా లభిస్తున్నాయి. వాటి వల్ల మనం గత నాగరికతల గురించి చక్కగా తెలుసుకోగలుగుతున్నాము. పురాతన కాలంలో గొర్రె లేక మేక తోలునుండి తయారుచేసిన తోలు కాగితం కూడా రాయడానికి ఉపకరించేది. తోలు కాగితంగానీ రాసే పేపరస్‌గానీ ఖరీదైనవి. చాలా తరచుగా తక్కువ ఖరీదైన చిన్న మైనపు పలకలకు అవి భర్తీ చేయవడ్డాయి. చాలాసార్లు శుభ్రంగా గీకివేసి మళ్ళీ రాతకు వాడుకునేలాగ జంతువుల తోళ్ళు ఉపకరించాయి. [ఇంకా... ]

వంటలు - ఉప్పిడి పిండి

కావలసిన వస్తువులు:

పాలు - 5 లీటర్లు.
చక్కెర - 600 గ్రా.
కేసరి (కుంకుమపువ్వు) - 3 గ్రా.
బాదంపప్పు - 100 గ్రా.

తయారు చేసే విధానం :

పాలు బాగా చిక్కబడేంతవరకు సన్నని సెగపై మరిగించి, ఆపై ట్రేలో పోయాలి. ఫ్యాను గాలికింద ఆరబెట్టి కోవ సిద్ధంచేసుకోవాలి. కోవా గట్టిపడ్డ తర్వాత కొద్దిగా తీసుకుని దానిలో కుంకుమపువ్వు వేసి కొంచెం వేడిపాలు పోయాలి. [ఇంకా... ]

ముఖ్యమైన ఘట్టాలు - బారసాల

బారసాల అంటే

దీనిని అసలు బాల సారె అంటారు. అది వాడుకలోకి వచ్చే సరికి బారసాల అయినది. అసలు బారసాల అంటే పేరు పెట్టటం లేదా నామకరణం చేయటం అని అర్థం.

ఎందుకు చేస్తారు

పుట్టిన బాబుకో లేదా పాపకో పేరు పెట్టటానికి చేస్తారు.

ఎప్పుడు చేస్తారు

పుట్టిన 11 వ రోజు నుండి 27 వ రోజు లోపల చేస్తారు. ఈ రోజులలో 11, 21, 27 రోజులలో చాలా మంది చేస్తారు, అలానే బేసి సంఖ్యలు వచ్చే ఏ రోజైనా చేసుకోవచ్చు. ఈ రోజులలో చేసేటట్లైతే మంచి రోజులు చూసుకో నవసరం లేదు. అప్పుడు కుదరక పోతే పాపో, బాబో పుట్టిన 3 నెలల్లో చేస్తారు కానీ వీలుంటే నెలలోపల చేస్తేనే మంచిది.

ఎవరు చేస్తారు

అమ్మాయి పుట్టింటి వాళ్ళు చేస్తారు. [ఇంకా... ]

ఇతిహాసాలు - కంసుడు

కంసుడు ఉగ్రసేనుని కుమారుడు. రాక్షసాంశచే పుట్టుటవలన క్షత్రియుడైనా నిర్ధాక్షిణ్యము, కఠినత్వం, దుర్మార్గం మొదలైన అంశములు బంధించి మధురా నగరానికి రాజయినాడు. జరాసంధుడు తన కుమారులైన ఆస్తి పాస్తిలను ఇతనికిచ్చి వివాహం జరిపించాడు. శిశుపాల దంత వక్ర్తులు, రుక్మి మొదలైన వారు ఈతని మిత్రులు. తన సోదరిని వసుదేవునికిచ్చి వైభవంగా వివాహము జరిపించి బావతో నగరంలోకి వస్తున్నాడు. ఆనందంగా రధం నడుపుతూ, మార్గమధ్యంలో ఆకాశవాణి మెరుపులా మెరుస్తూ "ఈనీ చెల్లెలు దేవకీ గర్భవాసాన జన్మించిన 8వ శిశువు వలన నీకు మరణం తప్పదు" అని హెచ్చరించెను. ఆ హెచ్చరిక వింటూనే ఆవేశంతో రధం నుండి కిందకు దూకి చెల్లెలిని క్రిందకీడ్చి కత్తితో ఆమెను నరకబోయెను. కానీ వసుదేవుడు "బావా! శాంతించు! ఈమె గర్భమునందు జన్మించిన ఎనిమిదవ శిశువు వల్లనే గదా! నీకు ప్రాణగండము! ఈమె ఏమిచేసింది? స్త్రీని, అబలను, పైగా నీ చెల్లెలిని చంపటం భావ్యంకాదు విడువు" అంటూ బ్రతిమిలాడెను. [ఇంకా... ]

Thursday, October 16

వ్యక్తిత్వ వికాసం - విద్యార్థుల అద్భుత ఙ్ఞాపకశక్తికి 35 టెక్నిక్‌లు

విద్యార్థుల అద్భుత ఙ్ఞాపకశక్తికి 35 టెక్నిక్‌లు

1. మీ ఙ్ఞాపకశక్తి మీద అంచలమైన నమ్మకం, ఆశావహ దృక్పథం.
2. ఙ్ఞాపకశక్తి పెంపొందించాలంటే ఇంట్లో పరిస్థితులు సజావుగా ఉండాలి.
3. ఙ్ఞాపకశక్తి వృద్ధి కోసం పరిశీలన, ఆలోచన అవసరం.
4. మీకు సులభంగా అర్థమయ్యే పాఠ్యపుస్తకాలనే ఎన్నుకోండి.
5. సరైన ఙ్ఞాపకశక్తి కోసం చక్కటి ఆహారం.
6. ఒక చిన్న ధ్యానపు టెక్నిక్ ద్వారా ఙ్ఞాపకశక్తిని పెంపొందించుకోవడం.
7. ఇంగ్లీషు అక్షరాలను అన్వయించి ఫార్ములాలని, లెక్కలను కనుగొనుట.
8. లింకు పద్థతి ద్వారా జ్ఞాపకం వుంచుకోవడం (Acronym method).
9. ఫార్ములాలని గుర్తు పెట్టుకోవడం.
10. ఇంగ్లీషులో పదాలను గుర్తు పెట్టుకోవడం. [ఇంకా... ]

కవితలు - తేనెకన్న మధురం మన తెలుగు

తేనెకన్న మధురం రా, తెలుగు ఆ

తెలుగుదనం మా కంటి వెలుగు

తెలుగుగడ్డ పోతుగడ్డ ఎంత పచ్చన, మా

తెలుగు గుండెలో స్నేహము ఎంతను!

మన పొలాల శాంతి పులుగు ఎంత తెల్లన, మన

తరతరాల కథను పాడు గుండె ఝల్లన [ఇంకా... ]