Wednesday, September 9

ఆధ్యాత్మికం - పవిత్రగ్రంధాలు

మానవుని జీవితం మీద పవిత్ర గ్రంధాల ప్రభావం ఎంతైనా ఉంది. సామాజిక వ్యవస్థను తీర్చిదిద్ది, క్రమబద్ధం చేసేవి పవిత్ర గ్రంధాలు. కాబట్టి ప్రతి మతంలోనూ ఈ గ్రంధాలకు పవిత్రత, గౌరవం ఉంది.
నిత్య సత్యాలను ప్రకటించేవి వేదాలు. ప్రజల యొక్క ధార్మిక తత్వాన్నీ, సాంస్కృతిక సంపదను వెల్లడి చేసేవి వేదాలు. ప్రతి మతానికీ ఆ మతానికి సంబంధించిన పవిత్ర గ్రంధాలు ఉన్నాయి. ఆయా పవిత్ర గ్రంధాలను అనుసరించే ఆయా మతాలు నిరూపించబడుతున్నాయి. మన ప్రాచీన ఋషులు ఎంతో శ్రద్ధగా వేద రచన చేశారు. వేద రహస్యాలు దేవతలు చెప్పగా ఋషులు విని పఠించినవి... [ఇంకా…]

Tuesday, September 8

సంగీతం - సంగీత వాయిద్యాలు

ఆర్యులు మన దేశానికి రావడం మాత్రం మన దేశ చరిత్రలో చాలా ముఖ్యమైన ఘట్టం. క్రీస్తుకు పూర్వం రెండు వేల అయిదు వందల సంవత్సరాల క్రితం వచ్చిందని చెప్పుకునే ఆర్యుల వేద సాంప్రదాయం మన దేశాన్ని, అతః పూర్వ సాంప్రదాయాల్ని ఎంతగానే మార్చివేసిందని చెప్పాలి. అంతకు క్రితముండిన ఈ దేశపు ప్రజల జీవన విధానాలు, సాహిత్యం, మతం, కళలు అన్నీ గూడా వేద ప్రభావితాలై ఎంతో ఔన్నత్యాన్ని, నాగరికతని పుంజుకున్నాయి. వేద సంహితలన్నీ మానవ జీవన విధానాల వర్ణనలే. ఉదాహరణకు మన సంగీతం ఋగ్వేద, సామవేద జనితమని చెపుతారు. నిజం కూడ అలాగే కనిపిస్తుంది. సామవేద పఠనాన్ని సామగానమన్నారు... [ఇంకా... ]

Monday, September 7

భారతమాత బిడ్డలు - శ్రీనివాస రామానుజం

పేరు - శ్రీనివాస రామానుజం.
తండ్రి పేరు - శ్రీనివాస అయ్యంగార్.
తల్లి పేరు - కోమలత్తమ్మాళ్.
పుట్టిన తేది - 22-12-1887.
పుట్టిన ప్రదేశం - తమిళనాడులోని ' ఈ రోడ్ ' లో జన్మించెను.
చదివిన ప్రదేశం - కుంభకోణం.
చదువు - డిగ్రీ.
గొప్పదనం - 15 ఏళ్ళప్పుడే జార్జ్ స్కూచ్‌సిడ్జ్‌కార్ రూపొందించిన 6000 గణిత సిద్దాంతాలను తులనాత్మకంగా పరిశీలించారు.
స్వర్గస్తుడైన తేది - 26-4-1920.

శ్రీనివాస రామానుజం 1887 డిసెంబరు 22న తమిళనాడులోని 'ఈ రోడ్' లో జన్మించెను. తండ్రి శ్రీనివాస అయ్యంగార్ కుంభకోణంలోని ఒక బట్టల కొట్టులో గుమస్తాగా పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తూండే వాడు. పేద కుటుంబమైనా తమ అవసరాలకు చాలినంత డబ్బు లేకపోయినా ఆయన ఏనాడూ ఒకరిని చేయిచాచి అర్థించక, తమకున్న దాంతోనే తృప్తిపడి, ఉన్న రోజు తిని, లేని రోజు పస్తుండి, ఎంతో ఆత్మగౌరవంతో బతికేవాడు. [ఇంకా... ]

Saturday, September 5

వనితల కోసం - ముద్దుగారే

ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు
తిద్దరాని మహిమల దేవకి సుతుడు ||ముద్దుగారే||
అంత నింత గొల్లెతల అరచేత మాణికము
పంతమాడే కంసుని పాలి వజ్రము
కాంతుల మూడు లోకాల గరుడపచ్చబూ
చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు ||ముద్దుగారే||... [ఇంకా... ]

Thursday, September 3

విజ్ఞానం - కంప్యూటర్

నేటి ఆధునిక ప్రపంచంలో కంప్యూటర్‌లేని జీవనాన్ని ఊహించుకోవడానికి కష్టమేమో. నేడు కంప్యూటర్ ప్రవేశించని రంగమంటూ లేదు. ఇంతటి అద్భుతమైన సాధనాన్ని కనిపెట్టిన మానవుడే నేడు దాని సహాయం లేకుండా నిమిషం కూడా గడవని స్థితికి చేరుకున్నాడంటే దీని శక్తిని మనం అంచనా వేయగలమా? ఇంతవరకూ మానవుడు ఆవిష్కరించిన మరే యంత్రము కంప్యూటర్ చూపినంత ప్రభావాన్ని చూపలేదంటే దీని ప్రాముఖ్యత ఎంత ఉన్నదో మనకు అర్థమవుతోంది, ఉదయం నిద్రలేవగానే చూసే న్యూస్‌పేపరు నుండి విద్యాలయాలు, ఆఫీసులు, పోస్టాఫీసు, రైల్వేస్టేషను ఎక్కడికి వెళ్ళినా మనకు తెలియకుండానే మన పనులు అన్ని కంప్యూటర్ ద్వారా జరుగుచున్నాయి. మన అవసరాలకు ఉపయోగపడుచున్న కంప్యూటర్ గురించి, 'కంప్యూటర్ అంటే ఏమిటి?' కంప్యూటర్ ఎలా పని చేస్తుంది? ఏ విధమైన అవసరాలకు కంప్యూటరును ఉపయోగించుకోవచ్చు మొదలగు విషయాలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.

కంప్యూటర్ అంటే ఏమిటి?... [ఇంకా... ]

Wednesday, September 2

అందరికోసం - ఫౌంటెన్ పెన్

మనకు ఏది వ్రాయాలన్న మనం ఉపయోగించేది మొదట పెన్ను. కాని మనకు ఆ పెన్ను గురించి వివరాలు ఏమి తెలయవు కనుక ఇప్పుడు ఆ పెన్ను ఎలా పుట్టినదో, అసలు ఎవరు కనుగొన్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇవ్వాళ మనం క్లాస్‌రూంలో పెన్ను పట్టుకొని టకటకా నోట్స్ రాసుకుంటున్నాంగానీ ఇలా పెన్నును ఈ షేప్‌లో చూడడం వెనుక బోలెడంత కథ ఉంది. భారతదేశంలో పెన్ను, పేపరు రానంత వరకూ రాతకోతలన్నీ తాటాకుల మీద, ఘంటంతో సాగేవి. ఆ తర్వాత సిరాలో ముంచి రాసే పెన్నులు వచ్చాయి. అయితే నాలుగు పదాలు రాయగానే మళ్ళీ పెన్నును సిరాలో ముంచి రాయాల్సి వచ్చేది... [ఇంకా... ]

Tuesday, September 1

వంటలు - జంతికలు (పప్పులతో...)

కావలసినవి:
కందిపప్పు - ఒక గ్లాసు.
మినపప్పు - ఒక గ్లాసు.
పెసరపప్పు - ఒకగ్లాసు.
బియ్యం - 5 గ్లాసులు ( కావలంటే కొంచెం తగ్గించుకోవచ్చు).
నువ్వులు - 25 గ్రాములు నూనె - తగినంత.
కారం - తగినంత.

చేసే విధానం:
పప్పులను దోరగా వేగించి పెట్టుకోవాలి. బియ్యాన్ని కూడా వేగించాలి. వీటన్నిటి కలిపి మరలో పిండి పట్టించాలి. దానిలో నువ్వులు, నాలుగు స్పూన్ల మరిగించిన నూనె, తగినంత ఉప్పు, కారం, నీరు పోసి కలిపిన ముద్దను జంతికల గొట్టంలో పెట్టి కాగుతున్న నూనెలో జంతికలు వేసి వేగాక ... [ఇంకా... ]

Monday, August 31

సాహిత్యం - సాహిత్యం అంటే

సమాజము యొక్క ప్రతిబంబమే సాహిత్యం. వర్తమాన సమాజంలోని జీవన పరిస్థితులు, ఆచార వ్యవహారాలు, ఇంకా ఆయా సమాజాలను ప్రభావితం చేసే అనేక ఇతర అంశాల ఛాయాచిత్రమే సాహిత్యం. పురాతన సమాజాలను అధ్యయనం చేయడం అధునాతన సమాజాల ఆవిర్భావానికి హేతువులాంటిది. సమాజ అధ్యయనం సాహిత్యం ద్వారా సులువు కాబట్టి సాహిత్య అధ్యయనాన్ని సమాజంలోని ప్రతి వ్యక్తీ అలవాటు చేసుకోవాలి. సాహిత్యం మన సంస్కృతి పట్ల మన బాధ్యతను మనకు గుర్తుచేస్తుంది. మన సంప్రదాయంలోని మాధుర్యాన్ని మనకు తెలియజేస్తుంది. మనలో సంస్కారాన్ని కలిగిస్తుంది. ఈవిధంగా సమాజానికి హితం చేస్తుంది కాబట్టే అది సాహిత్యం అయ్యింది... [ఇంకా... ]

Saturday, August 29

తెలుగు - తెలుగు సంవత్సరాలు

ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, ప్రజోత్పతి, అంగీరస, శ్రీముఖ, భావ, యువ, ధాత, ఈశ్వర, బహుధాన్య, ప్రమాది, విక్రమ, వృష, చిత్రభాను, స్వభావ, తారణ, పార్ధివ, వ్యయ, సర్వజిత్తు, సర్వధారి, విరోధి, వికృతి, ఖర, నందన, విజయ, జయ, మన్మథ, దుర్ముఖి, హేవిళంబి, విళంబి, వికారి, శార్వరి, ప్లవ, శుభకృతు, శోభకృతు, క్రోధి, విశ్వావసు, పరాభవ, ప్లవంగ, కీలక, సౌమ్య, సాధారణ, విరోధికృతు, పరీధావి, ప్రమాదీచ, ఆనంద, రాక్షస, నల... [ఇంకా... ]

Friday, August 28

పుణ్యక్షేత్రాలు - యాదగిరి గుట్ట

విజయవాడ - హైదరాబాదు రైలు మార్గంలో రాయగిర్ స్టేషనుకు సుమారు 7కి.మీ. దూరంలో వుంది. స్టేషను నుండి బస్సులు, టాంగాబండ్లు చాలా వున్నాయి. ఇది యాదగిరికొండ మీద నున్న శ్రీలక్ష్మీనృసింహ క్షేత్రము. ఆంధ్రప్రదేశ్‌లో ఒక ప్రధానమైన యాత్రాస్ధలం.
ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. 315 మెట్లు ఎక్కి స్వామి దర్శనం చేసుకోవచ్చు. కాని కొండమీదికి నేరుగా బస్సులు కూడా ఉన్నాయి. తిరుమల - తిరుపతి, శ్రీశైలంలలో మాదిరిగా కొండమీద అనేక సత్రాలున్నాయి. [ఇంకా... ]

Thursday, August 27

వంటలు - కాకరకాయ కూర

కావలసిన వస్తువులు:
కాకరకాయలు - 1 కిలో.
నూనె - 150 గ్రా||.
మినపప్పు - 25 గ్రా||.
శనగపప్పు - 25 గ్రా||.
ఎండుమిర్చి - 25.
ఉప్పు - తగినంత.

తయారు చేసే విధానం :
కాకరకాయ గర్భాన కాస్త లోతుగానూ, విడిగానూ గాట్లు పెట్టి వుడికించి వార్చి వుంచాలి. ఒట్టిమూకుట్లో మినప్పప్పు , శనగపప్పు, ఎండుమిర్చి వేయించి సరిపడా ఉప్పు, కారం కొట్టాలి. [ఇంకా... ]

Tuesday, April 7

ఎందుకు, ఏమిటి, ఎలా ... - చాటింగ్

సాయంకాలాలు ఏమీ ఉబుసుపోక పల్లె జనాలంతా వేపచెట్టు కిందకు చేరినట్లు, నెట్ పక్షులన్నీ చాట్‌రూమ్‌ల్లోకి చేరతాయి. దేశవిదేశాల్లోని వ్యక్తులందరితోనూ సంభాషిస్తూ, వారి మనోభావాలను పంచుకోవడానికి వీలు కల్పించే మెసెంజర్‌లు ఎంత మంచివో అంత చెడ్డవి. దూరమైపోయిన ఒకనాటి స్నేహితుడు/స్నేహితురాలితో కాస్త ఎక్కువ సేపు మనసు విప్పి మాట్లాడుకోవడానికి చాటింగ్ కంటే అనుకూలమైనది ఏదీ లేదు. కానీ చాట్‌రూంల రూటే వేరు. అపరిచిత వ్యక్తులతో పరిచయం చేసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. ఆ పరిచయాలు కొంతమందికి తమ కెరీర్‌ను మలుచుకోవడానికి పనికివచ్చాయి. మరికొంతమందికి టైంవేస్ట్ మాత్రమే చేశాయి. ఇంకొంతమందికి చేదు అనుభవాలు మిగిల్చాయి. సేఫ్‌గా చాటింగ్ చేయడానికి ఎంఎస్ఎన్, యాహూ సర్వీసుల వాళ్లు ఈ కింది టిప్స్ చెబుతున్నారు... [ఇంకా... ]

వంటలు - అరటికాయ కూర

కావలసిన వస్తువులు:
అరటి కాయలు : 4.
ఉల్లిపాయలు : 2.
పచ్చిమిర్చి : 4.
అల్లం : చిన్న ముక్క.
నూనె : 4 స్పూన్లు.
ఆవాలు : 1/2 స్పూను.
ఉప్పు, పసుపు : తగినంత.
ఎండు మిర్చి : 2.
శనగపప్పు : 1 స్పూను.
మినపప్పు : 1 స్పూను.
కొత్తిమీర : 1 కట్ట.
కరివేపాకు : 2 రెబ్బలు.
జీలకర్ర : 1 స్పూను.

తయారుచేసే విధానం:
అరటికాయలను చెక్కు తీయకుండా 3 ముక్కలుగా కోసి ఉప్పు వేసి నీళ్ళలో ఉడికించుకోవాలి. ఉడికిన తరువాత పై చెక్కు తీసి ఒక పళ్ళెంలో పొడిపొడిగా చేసి పెట్టుకోవాలి. [ఇంకా... ]

ఆహార పోషణ సూచిక - అదనపు ఆహారం

తల్లిపాలు - శిశువు పెరుగుదల, అభివృద్దికి సహజమైన, అసమానమైన ఆహారం. ఇవి ఎన్నో విశిష్టతలు కలిగినప్పటికీ శిశువుకు 4 నుండి 6 నెలల వయసు వచ్చాక వారు పెరుగుతున్న అవసరాలు తీర్చలేవు. తల్లిపాలపైననే పూర్తిగా ఆధారపడే శిశువు క్రమంగా పెద్దలు తీసుకొనే ఆహారానికి మారే దశను 'వీనింగ్' అంటారు.

మనం భుజించే ఆహారంవల్ల పిల్లల కడుపునిండినా అందులో పోషక విలువలు తక్కువ. శిశువుకు గల ప్రత్యేక అవసరాలదృష్ట్యా మన ఆహారంలోనే కొన్ని మార్పులు, చేర్పులు చేసినట్లైతే అది శిశువు అవసరాలను తీర్చగలుగుతుంది. [ఇంకా... ]

పిల్లల పాటలు - ఎంతోమంది పనివాళ్ళు...

ఎంతోమంది పనివాళ్ళు - ఎంతో మంచి పనివాళ్ళు
మడకను దున్నే మాదన్నా - కొడవలి పట్టిన కొండమ్మా
గుడ్డలు నేసే గురవయ్యా - బట్టలు ఉతికే బాలమ్మా || ఎంతోమంది ||

కుండలు చేసే కుమరయ్యా - కొలిమిని ఊదే కోనయ్యా
చెప్పులు కుట్టే చెన్నయ్యా - దుస్తులు కుట్టే మస్తానూ || ఎంతోమంది || [ఇంకా... ]

Monday, April 6

వంటలు - వాలెంటైన్ చాక్లెట్

కావలసిన వస్తువులు:
పాలపొడి - అరకప్పు.
కండెన్స్‌డ్ మిల్క్ - రెండుటేబుల్ స్పూన్లు.
ఐసింగ్ షుగర్, కోకోపొడి, తాజా వెన్న - ఒక్కోస్పూను చొప్పున.
అంజూర్(బేకరీల్లో లభిస్తాయి) తరుగు - ఒక పెద్దస్పూను.
బాదంపప్పులు - గుప్పెడు.

తయారుచేసేవిధానం:
ఓ వెడల్పాటి గాజు బౌల్ తీసుకుని అందులో పాలపొడి, కోకోపౌడర్, వెన్న, ఐసింగ్ షుగర్ అన్నీవేసి పాలుపోసి చక్కగా గట్టిగా చపాతీల పిండిలా కలపండి. ఆ మిశ్రమానికి అంజూర్ తరుగును చేర్చండి. ఇప్పుడు వెడల్పాటి గాజుట్రే తీసుకుని దానికి కాస్త వెన్నరాసి... అందులో ఈ మిశ్రమాన్ని సమంగా సర్ధండి. [ఇంకా... ]

అవీ, ఇవీ కొనుక్కొనేటప్పుడు - టీవి (టెలివిజను)

టీవి కొంటే కారు బహుమతి అంటూ షోరూములు తాయిలాలతో ఊరిస్తుంటాయ్. శబ్ధం ఎక్కువైతే దృశ్య నాణ్యత తక్కువ అవుతుందనీ, పిక్చర్ ఫర్వాలేదంటే సౌండ్ నాసిరకంగా ఉంటుందన్న అపోహలు సరైన నిర్ణయం తీసుకోనివ్వవు. ఫీచర్లతో పాటే కొండెక్కే ధరలు. అయోమయంలో ముంచెత్తే సేల్స్‌మెన్‌ల మాటలు కలర్ టీవీ కొనాలని షోరూములకెళ్లే సగటు మధ్య తరగతి వ్యక్తి పరిస్ధితి ఇదే.

అయోమయాల నుంచి బయటపడి సరసమైన ధరకు సరైన టీవీని ఎంచుకోవాలంటే ఈ సూచనలు పాటించాల్సిందే. కలర్ టీవీలు అయిదు విభిన్న రకాల్లో లభ్యం అవుతున్నాయి. ప్రాధమిక మోడల్, ఫ్లాట్ స్క్రీన్, ప్రొజెక్షన్, ప్లాస్మా, ఎల్‌సీడీ. నిన్న మొన్నటి వరకూ పద్నాలుగు అంగుళాల కలర్ టీవీలదే రాజ్యం. ఆ తర్వాత 20 అంగుళాల టీవీలను కొనేవారి సంఖ్య పెరిగింది. [ఇంకా... ]

భరతమాత బిడ్డలు - లాల్ బహదూర్ శాస్త్రి

పేరు : లాల్ బహదూర్ శాస్త్రి.
తండ్రి పేరు : శారదాప్రసాద్ రాయ్.
పుట్టిన తేది : 2-10-1904.
పుట్టిన ప్రదేశం : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొగల్ సరాయ్ గ్రామంలో జన్మించారు.
చదివిన ప్రదేశం : మొగల్ సరాయ్.
గొప్పదనం : బ్రిటీషు వారిని ఎదిరించి, దేశ స్వాతంత్ర్యం కోసం ఎన్నో సత్యాగ్రహలు చేశాడు.
స్వర్గస్థుడైన తేది : 1966 వ సంవత్సరంలో స్వర్గస్థుడైనారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొగల్ సరాయ్ గ్రామంలో లాల్ బహదూర్ 1904 అక్టోబర్ 2న జన్మించారు. తండ్రి శారదాప్రసాద్ రాయ్ ఒక నిరుపేద. బతకలేక బడిపంతులు అని అనుకుంటున్న ఆ రోజుల్లో ఆయన బడిపంతులు వృత్తిని చేపట్టి అతికష్టంగా తన కుటుంబాన్ని పోషిస్తూ కాలం గడిపేవాడు. ఇద్దరు ఆడపిల్లల తరువాత జన్మించిన లాల్ బహదూర్ ను చూసుకొని ఆ తల్లిదండ్రులెంతో మురిసిపోయారు. [ఇంకా... ]

సౌందర్య పోషణ - పాదాలకు

. అర టీస్పూన్ పసుపు, తాజా కొబ్బరి తురుము అరకప్పు తీసుకోవాలి. ఈ రెండింటినీ బాగా కలిపి పాదాలకు పట్టించి మర్దనా చేయాలి. తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి.

. అరి కాళ్ళు మృదువుగా ఉండాలంటే తరచూ వాటిని కొబ్బరినూనెతో మర్దనా చేస్తుండాలి.

. కాలేజీలకు స్కర్టులు వేసుకునే వారికి మోకాళ్లు నల్లగా ఉంటే బాగుండదు. అందుకు కమలాపండు ముద్దలా చేసి కొబ్బరినూనెలో అరగంట పాటు నానబెట్టి ఆ మిశ్రమాన్ని ప్యాక్ లా వేయాలి. తర్వాత శనగపిండి, పాలు, తేనె ఒక్కో చెంచాడు చొప్పున కలపాలి. ఈ మిశ్రమాన్ని మోకాళ్ల కు పట్టించి ఆరాక కడిగేయాలి. [ఇంకా... ]

పిల్లల ఆటలు - ఖాళీల పూరింపు 

చిన్న పిల్లకు ఖాళీలను పూరించటమంటే చాలా ఇష్టం అందుకని చిన్న పిల్లల ఆటలో ఈ ఖాళీల పూరింపును కూడా చేర్చాము. ఈ ఆటలో కనీసం నలుగురు పిల్లలు పాల్గొనవచ్చు. పిల్లల్లో ఒక్కొక్కరికి ఒక అక్షరానికి సంబంధించిన పదాలు ఇవ్వాలి. ఆటగాళ్ళు ఎ, బి, సి, డి లనుకుంటే వాళ్ళకు ఇచ్చిన ఖాళీల పూరింపు ఇట్లా ఉంటుంది.

ఉదా: Team A వారు గ (అక్షరం) మీదపూరించవలెను.
ప్రశ్న: - డి - రం.
జవాబు: గడియారం.

ఎవరు సరిగ్గా ఖాళీలు పూరిస్తే వారు విజేత. [ఇంకా... ]

Friday, April 3

వ్యాయామ శిక్షణ - సమూహ (గ్రూప్) వ్యాయామం

మనలో చాలా మందికి పనులు వాయిదా వేయడం అలవాటే. తమకు తాము ప్రేరణ కలిగించుకుని తీసుకున్న నిర్ణయాన్ని చివర వరకు కొనసాగించగల శక్తి అందరికీ ఉండదు. వ్యాయామం చేయడంలోనూ మీది అదే తీరైతే గ్రూప్ వ్యాయామమే మీకు తగినది.

. పరస్పరం మాట్లాడుకుంటూ ఉండటంవల్ల ఒకరి నుంచి మరొకరు ప్రేరణ పొందుతారు. అందరూ కలిసి వ్యాయామానికి సంబంధించిన ఒక్కో అంశం గురించి చర్చించుకుంటూ ఉండటం వల్ల తేలికగా అనుసరించగలుగుతారు.

. రోజూ వ్యాయామం చేసేటప్పుడు పోటీపడి అందరితో సమానంగా చేయగలుగుతారు. త్వరగా నేర్చుకొనే అవకాశమూ ఉంది. మనకు తెలియకుండానే పక్కవారి కన్నా బాగా చేయాలన్న పట్టుదల వచ్చేస్తుంది. [ఇంకా... ]

వంటలు - గుమ్మడి వరుగు (చిప్స్)

కావలసిన వస్తువులు:

బూడిద గుమ్మడికాయ, పసుపు, ఉప్పు.

తయారుచేసే విధానం:

మొదట బూడిదగుమ్మడికాయను చెక్కుతో పాటే బాగా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. ఈ తరిగిన ముక్కలన్నిటినీ ఉప్పు, పసుపు వేసి జాడిలో పెట్టుకుని ఒక రోజంతా నాననివ్వాలి. మరుసటి రోజు గట్టిగా మూతపెట్టి కావలసినప్పుడు నూనెలో దోరగా వేగించుకొని కొద్దిగా ఉప్పు కారం చల్లుకోవాలి. [ఇంకా... ]

భక్తి గీతాలు - శివాదుర్గ కాళి ప్రియ చంద్ర మౌళి

శివాదుర్గ కాళి ప్రియ చంద్ర మౌళి
సరోజాలతోనే పూజచేతు ఆ...

గులాబీలతోనే పూజసేతు "శి"
శంభుని రాణి చల్లని చూపు

భక్తావాళి భాధలు బాపు
ప్రార్ధింతుము రేపూ మాపు

గ్రహ బాధలు రూపు మాపు
స్తుతింతును రోజు రోజు

వెన్నెల కాంతులు మాపై నిలుపు
వికసించే నీ ముఖ బింబం [ఇంకా... ]

పుణ్య క్షేత్రాలు - శ్రీ కాళ హస్తి

తిరుపతికి తూర్పున సువర్ణముఖి నది ఒడ్డున గల కొండల మధ్య అమరివున్నది శ్రీ కాళహస్తీశ్వర దేవాలయం.
నామ సార్ధకత:
శ్రీ అనగా సాలెపురుగు, కాళము అనగా పాము, హస్తి అనగా ఏనుగు. ఈ ప్రాంతంలో స్వయం భూలింగముగా వెలసిన శివలింగం పై మూడున్నూ అర్చించి భక్తి నిరూపణలో పోటాపోటీగా సంచరించి చివరికి మోక్షమును పొందాయని ఒక కథ. కనుకనే ఈ స్వామి శ్రీ కాళ హస్తీశ్వరుడనేది సార్ధకనామంగా వున్నదని ప్రతీతి. మరో విశేషం ఏమిటంటే భక్తకన్నప్ప చరిత్ర కూడా ఇచ్చోటనే జరిగి భక్తిలోని గొప్పదనాన్ని చాటిన దివ్య ప్రదేశంగా పేరొందింది. ఈ స్వామి మహత్యాన్ని ఉగ్గడిస్తూ శ్రీ కృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలలో ఒకరైన మధురకవి దూర్జటి శ్రీ కాళ హస్తీశ్వర శతకంగా రూపొందించి ధన్యతను పొందాడు, చిరస్మరణీయుడైనాడు. [ఇంకా... ]

నీతి కథలు - దురాశే దుఃఖమునకు మూలము

గోవిందయ్య అనే వ్యాపారస్తుడు అతి పిసినారి. ఏదయినా సరే బేరమాడటంలో అవతలి వ్యక్తికి విసుగు తెప్పించి తను లాభపడాలని కోరుకునే మస్తత్వము గల వ్యక్తి. ఒక దినమున అరణ్యమార్గము గుండా పట్నము వెళ్తున్నాడు. తనతోపాటు ఎవరూ లేరు. అతనిని చూస్తే వర్తకులుగాని, సాటివారుగానీ, హడలెత్తేవారు. అరణ్యమార్గములో పోతూవుండగా చెట్టు పొద సమీపములో బక్కచిక్కిన శరీరముతో వున్న ఋషి పడి వున్నాడు. అతను 'దాహం... దాహం' అని వినీ వినపడనట్లుగ అంటుంటే గోవిందయ్య వెళ్ళి తన వద్దగల మంచినీళ్ళు మునీశ్వరుని నోట్లో పోశాడు. కళ్ళు తెరిచి ముని "చివరి ఘడియల్లో నాకు దాహార్తిని తీర్చినావు. నీ మేలు మరవను. నాకు ఇది చివరి నిమిషం. నిమిషంలో మృత్యువు నన్ను సమీపించనుంది. వెంటనే అదైనా వరము కోరుకో... నేను ప్రసాదించగలను" అన్నాడు.[ఇంకా... ]

Thursday, April 2

లాలి పాటలు - చందమామ రావే - జాబిల్లి రావే!

చందమామ రావే - జాబిల్లి రావే!
బండిమీద రావే - బంతి పూలు తేవే
పల్లకిలో రావే - పంచదార తేవే
సైకిలెక్కిరావే - చాక్లెట్లు తేవే

పడవమీద రావే - పట్టు తేనె తేవే
మారుతిలో రావే - మంచి బుక్సు తేవే
పెందలాడే రావే - పాలు పెరుగు తేవే [ఇంకా... ]

వంటలు - చిక్కుళ్ళ వేపుడు

కావలసిన వస్తువులు:
పెద్దగింజలుండే చిక్కుళ్ళు - 250.
నూనె - 50.
కారం - అరచెంచాడు.
లవంగపొడి - చిటికెడు.
కర్వేపాకు - 2 రెబ్బలు.
ఎండుమిర్చి - 1.
ఉప్పు - తగినంత.

తయారు చేసే విధానం :
చిక్కుళ్ళు వుడకేసి, ఒక పొంగురాగానే దింపి వార్చేయాలి. [ఇంకా... ]

పండుగలు - శ్రీరామనవమి

దుష్టశిక్షణ శిష్టరక్షణార్ధమై చైత్రశుద్ద దశమినాడు ఐదుగ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్నకాలమందు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యాపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనం 'శ్రీరామనవమి' గా విశేషంగా జరుపుకుంటాం.

'రామ' యనగా రమించుట అని అర్ధం. కావున మనము ఎల్లప్పుడు మన హృదయకమలమందు వెలుగొందుచున్న 'ఆ శ్రీరాముని' కనుగొనుచుండవలెను.

ఒకసారి పార్వతీదేవి పరమశివుని 'కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం' అని, విష్ణు సహస్రనామ స్తోత్రంనకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరుతుంది. [ఇంకా... ]

అవీ, ఇవీ కొనుక్కొనేటప్పుడు - చెప్పులు

చెప్పులే కదా! అనో లేకపోతే స్టయిల్ గా కనిపించాయనో ఎలాపడితే అలా పాదరక్షలను కొనకూడదు. వాటిని కొనడానికి ఒక టైం ఉంటుందని తెలుసా మీకు. అలాగే చెప్పులు కొనేటప్పుడు తీసుకోవాల్సిన, గుర్తుంచుకోవాల్సిన జాగ్రత్తలు కూడా కొన్ని ఉన్నాయి. అవేమిటంటే -

రెండు పాదాలు ఒకే సైజులో ఉండవనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కొత్త చెప్పులు, షూ, శాండల్ ఏవి కొంటున్నా రెండు పాదాలకు వేసుకుని సైజు చూసుకోవాలి. వేసుకున్నప్పుడు కొంచెం అసౌకర్యంగా అనిపిస్తే కొన్నాళ్లు వేసుకుంటే సాగుతాయిలే అని తీసుకోవద్దు. బ్రాండ్ సైజుల బట్టి కొనొద్దు. స్టయిల్ ను బట్టి సైజులు మారుతుంటాయి. అందుకని పాదరక్షలు కొనే ప్రతిసారి రెండు పాదాలకు వేసుకుని గమనించి కొనుక్కోవాలి. కాలి వెనుక భాగం షూలో సరిగా కూర్చోవాలి. అలా ఉంటే కాలి వేళ్లను సులువుగా కదిలించొచ్చు. [ఇంకా... ]

పిల్లల ఆటలు - తాబేలు రేసు

ఎంతమంది ఆడవచ్చు : ఎంతమందైనా.
ఆడే స్థలం : గదిలో, ఆరుబయట ఆడవచ్చు.
కావలసిన వస్తువులు : చాక్ పీస్ , ప్లాస్టిక్ తాడు.
ఆటగాళ్ల వయస్సు : 7 సం|| రాల నుండి.

ఆటగాళ్ళందర్ని మోకాళ్ళు, అరచేతులమీద నించోబెట్టాలి. 'స్టార్ట్' చెప్పగానే అంతా ఫినిషింగ్ లైన్ దగ్గరకి (ఇది చాక్ పీస్ తో గీయవచ్చు, లేదా నేలమీద ప్లాస్టిక్ తాడు ఉంచవచ్చు.) ఎంత నెమ్మదిగా సాధ్యం అయితే అంత నెమ్మదిగా వెళ్ళాలి. [ఇంకా... ]

Tuesday, March 31

ఆహార పోషణ సూచిక - గుప్పెడన్నం గొప్పమేలు

అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు మన పెద్దలు. వారన్నందుకే కాదు నిజానికి పోషకాల విషయంలోనూ అన్నం ప్రత్యేకతే వేరు. అందుకే ఎన్ని వెరైటీలు తిన్నా చివరికి ఒక ముద్ద పెరుగన్నం తినందే తృప్తిగా ఉండదు చాలా మందికి. నిజానికి అది మంచి అలవాటు కూడా ఎందుకంటే బియ్యంలో అధికంగా ఉండే గంజిశరీరానికి చలువచేస్తుంది. చలికాలంలో ఎక్కువగా సూప్స్ తాగడానికి ఇష్టపడే వాళ్ళు ఎండాకాలంలో గంజిలో మజ్జిగ కలుపుకొని తాగుతుంటారు.

గోధుమలు ఇతర ధాన్యాలతో పోలిస్తే బియ్యంలో ఎక్కువ ప్రొటీన్లు దాదాపు 7 శాతం ఉంటాయి. విటమిన్ బి, (ధయామిన్) ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ పాలిష్ చేసిన, కడిగిన బియ్యాన్ని వండేటప్పుడు దాదాపు 75 శాతం ధయామిన్ తగ్గిపోతుంది. దీనివల్ల శరీరంలో విటమిన్ బి లోపిస్తుంది. [ఇంకా... ]

వంటలు - కో కో సిరప్

కావలసిన వస్తువులు:

కో కో - 1 కప్పు.

పంచదార - 2 కప్పులు.

చన్నీళ్ళు - 3 కప్పులు.

తయారు చేసే విధానం:

ముందుగా కోకో, పంచదార, చన్నీళ్ళు కలిపి 20 నిమిషాల పాటు ఉడికించి గట్టి పాకం పట్టాలి. సన్నని సెగ పై ఆపకుండా కలియబెడుతూ ఉండాలి. పాకం తయారు అవ్వగానే చల్లార్చి పొడి సీసాలో పోసుకోవాలి. [ఇంకా... ]

పిల్లల ఆటలు - చుక్కలాట

ఈ ఆట ఇద్దరు ఆడవచ్చు. ముందుగా అడ్డంగా నిలువుగా కలిపి పైన చూపినట్టు 100 చుక్కలు పెట్టుకోవాలి. తరువాత ఒక ఆటగాడు ఒక చుక్క నుండి ఇంకొక చుక్కకు ఒక గీతను గీయాలి. తరువాత మరొక ఆటగాడు తన ఇష్టమొచ్చిన దగ్గర గీత గీస్తాడు. ఇవి నిలువుగానైనా, అడ్డంగానైనా ఎలా అయినా గీయవచ్చు. అయితే ఏ ఆటగాడు వాటిని (స్క్వేర్) చతురస్త్రంలాగా గీస్తాడో, ఆ చతురస్త్రం (బాక్స్)లో అతని పేరు మొదటి అక్షరాన్ని వేయాలి. [ఇంకా... ]

జానపద గీతాలు - కోడలా కోడలా కొడుకు పెళ్ళామా

"కోడలా కోడలా కొడుకు పెళ్ళామా
పచ్చిపాల మీద మీగడలేవి?
వేడిపాల మీద వెన్నల్లు యేవి?
నూనెముంతల మీద నురగల్లుయేవు?"

"అత్తరో ఓయత్త ఆరళ్ళయత్త
పచ్చిపాలమీద మీగడుంటుందా?
వేడిపాల మీద వెన్నలుంటాయా?
నూనె ముంతల మీద నురగలుంటాయా?"

"ఇరుగు పొరుగులార! ఓ చెలియలార
అత్తగారి ఆరళ్ళు చిత్తగించరా? [ఇంకా... ]

పుణ్య క్షేత్రాలు - శ్రీరంగపట్నం

మైసూరుకు 12 కి.మీ దూరంలో ఉన్న ప్రదేశం టిప్పుసుల్తాను ప్రాసాదంలో అత్యంత చారిత్రక ప్రాధాన్యత సంతరించుకున్నది. కావేరినది రెండు పాయల మధ్యన ఉన్న దివిలాంటి దానిలో అమరియున్నది. మహిమాన్విత కావేరి పట్టణం చుట్టూ ప్రవహిస్తున్నది. టిప్పుసుల్తాన్ వారి కోట వేసవి మకాము యిక్కడ వున్నదంటారు. గౌతమ మహర్షి ఇక్కడ తపస్సు చేసినట్లుగా పురాణ ప్రశస్తి వుంది. క్రీ.శ 894 సంవత్సరంలో శ్రీ తిరుమలనాయుడు రంగనాధుని ఆలయం నిర్మించి రంగపురంగా వెలయింపచేశాడు. శ్రీరంగపట్నం 1120లో విష్ణువర్ణనుని సోదరులు ఉదయాదిత్యుడు కట్టించాడని ప్రతీతి. 1495 శ్రీరంగపట్నం విజయనగర రాజుల ఆధీనంలోకి వచ్చి, 1610లో మైసూరు రాజు ఒడయారు చేసుకున్నారు. తరువాత మహమ్మదీయులైన హైదర్ ఆలీ, టిప్పు సుల్తానుల కాలంలో వారి ఆధీనంలో ఉండి తరువాత 1799 లో బ్రిటీషు వారి హస్తగతమయింది. ఇక్కడ మూఖ్యంగా చూడదగినవి- 'టిప్పుసుల్తాన్ వారి వేసవి విశ్రాంతి భవనం, చిత్రకళ అందంగా పొందుపరచబడి వుంది. హైదర్ ఆలీ, ఆయన్ భార్య సమాధులున్నాయి. [ఇంకా... ]

Thursday, March 26

లాలి పాటలు - ఊయలూగుమా కృష్ణ

ఊయలూగుమా కృష్ణ ఊయలూగుమా
హాయిగా వినిపింతు జోల ఊయలూగుమా ||ఊ||

లాలీ గోపాలకృష్ణ లాలీ గోవింద కృష్ణ
లాలీ మా పాలి దైవమ లాలీ లాలీ
రేపల్లియే ఊయలై వూగగా

గోపెమ్మ యెద జోలలే పాడగా
ఆనందమూ నందునీ యింట విరిసే
జగమందు కనువిందగు లీల వెలిసే ||లా|| [ఇంకా... ]

పండుగలు - మంగళగౌరీ వ్రతం

మన భారతీయ సంస్కృతిలో మహోన్నతమైనది వివాహసంస్కారం. అన్ని ఆశ్రమాలలోను గృహస్థాశ్రమము చాలా శ్రేష్ఠమైనదని మన వేదములు, స్మృతులు ఘోషిస్తున్నాయి. ఇందు భార్య, భర్త ఇరువురు ఒకరిపై నొకరు ప్రేమానురాగాలతో జీవించుటతోపాటుగా భర్థ ఏకపత్నీవ్రతుడుగా భార్య ప్రతివ్రతామ తల్లిగా వెలుగొందుతుంటారు. అట్టి గృహము ఎల్లప్పుడు నిత్యకళ్యాణము - పచ్చతోరణముతో విరాజిల్లుతూ ఉంటుంది. ఈ గృహస్థాశ్రమ నిర్వహణకు మన మహర్షులు మంచి సంస్కారాలను ఏర్పరిచారు. అలా ఈ గృహస్థాశ్రమ నిర్వహణ ఆచరించుటకూడ ా ఒక మహాయజ్ఞముతో సమానమైనది అని ' మను ' మహర్షియొక్క అభిప్రాయం. అటువంటి గృహస్థాశ్రమమున సౌశీల్యవతియైన స్త్రీ గృహకృత్యములు, గృహస్థధర్మములు నిర్వహించుకుంటూ అనేక రూపాలలో ఇలా గృహస్థునకు తోడ్పడుతూ ఉంటుంది. [ఇంకా... ]

తెలుగు బిడ్డలు - కందుకూరి వీరేశలింగం

పేరు : కందుకూరి వీరేశలింగం.
పుట్టిన తేది : 16-4-1848.
పుట్టిన ప్రదేశం : రాజమండ్రి.
చదివిన ప్రదేశం : రాజమండ్రి.
గొప్పదనం : బాల్యవివాహాలను అరికట్టి, వితంతువుల పునర్వివాహలను ప్రోత్సహించారు.
స్వర్గస్తుడైన తేది : 27-5-1919.

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ సాంఘీక సంస్కర్త కందుకూరి వీరేశలింగం. 1848 ఏప్రిల్ 16 న రాజమండ్రిలో ఒక సంపన్న కుటుంబంలో ఇతడు జన్మించెను. పాఠశాలలో చాలా చురుకుగా ఉండేవాడు. ఇతడు నాలుగోతరగతి చదువుతుండగా, ఉత్తమ విద్యార్ధి ఎవరు ఆనే ప్రస్తావన వచ్చినప్పుడు, విద్యార్ధుల్లో చాలా మంది ఇతని పేరును సూచించారు.
[ఇంకా... ]

నీతి కథలు - తెలివిగల బాలుడు

ఒక నగరంలో ఒక నవాబు ఉన్నాడు. అతడు గొప్ప ధనవంతుడు. అతనికి పెద్ద భవనం ఉంది. చాలామంది పనివారున్నారు. కాని చాలా క్రూరుడు. ఇతరులను హింసించడం, ఇతరులను బాధించడం అతనికి ఆనందం. అలా చాలామందిని బాధపెట్టాడు. ఒక రోజున ఆ భవనం వద్దకు పేద బాలుడు వచ్చాడు. సలాం చేశాడు. ఆకలిగా ఉంది. తినటానికి ఏమన్నా పెట్టించమన్నాడు. వెంటనే నవాబు లేచి ఆ బాలుణ్ణి పెద్ద హాల్లో కూర్చోబెట్టాడు. తను ఎదురుగా కూర్చున్నాడు. పనివాళ్ళను పిలిచాడు. నీళ్ళు, పళ్ళు తెమ్మన్నాడు. భోజనం వడ్డించమన్నాడు. పనివారు లోపలికి వెళ్ళారు. ఉత్త చేతులతో వచ్చారు. ఇద్దరికి వడ్డించినట్లు నటించారు. ఆ నవాబు తిన్నట్లు నటించాడు. పేద బాలుడిని తినమన్నాడు. కాని ఎదురుగా తినడానికి ఏమిలేదు. బాలుడికి అర్థం కాలేదు. నవాబు చేతులు కడిగినట్లు నటించాడు. పనివారితో మిఠాయిలు తెమ్మన్నాడు. వారు తెచ్చినట్లు నటించారు. నవాబు తిన్నట్లు నటించాడు. మధు పానీయాలు తెమ్మన్నాడు. పనివారు తెచ్చినట్లు నటించారు. నవాబు తాగుతున్నట్లు నటించాడు. [ఇంకా... ]

వంటలు - కోవా కేసర్ ఖైన్

కావలసిన వస్తువులు:
పాలు - 5 లీటర్లు.
చక్కెర - 600 గ్రా.
కేసరి (కుంకుమపువ్వు) - 3 గ్రా.
బాదంపప్పు - 100 గ్రా.


తయారు చేసే విధానం :
పాలు బాగా చిక్కబడేంతవరకు సన్నని సెగపై మరిగించి, ఆపై ట్రేలో పోయాలి. ఫ్యాను గాలికింద ఆరబెట్టి కోవ సిద్ధంచేసుకోవాలి. కోవా గట్టిపడ్డ తర్వాత కొద్దిగా తీసుకుని దానిలో కుంకుమపువ్వు వేసి కొంచెం వేడిపాలు పోయాలి. పది నిముషాలసేపు నాననివ్వాలి. [ఇంకా... ]

Tuesday, March 24

ఎందుకు, ఏమిటి, ఎలా ... - ఐస్ క్రీం

వేసవి కాలం వచ్చిందంటే మనం అంతా లొట్టలు వేస్తూ ఎగబడి తినేది ఐస్ క్రీంనే. అవునా? ఈ ఐస్ క్రీం ఎప్పుడు పుట్టిందో ఎలా పుట్టిందో తెలుసా? ఐస్ క్రీం తినడమే మనకు తెలుసు. కాని దానిని ఎవరు కనిపెట్టారు అనే ప్రశ్న వేసుకున్నా అది మనకు తెలియదు కాబట్టి దానిని గురించి వదిలేసి మన ముందున్న ఐస్ క్రీంను ఓ పట్టుపడతాం. ఐస్ క్రీం ఎలా పుట్టిందో ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్వం చైనా వంటవాళ్ళు రకరకాల పండ్ల నుంచి గుజ్జును, రసాన్ని తీసి చల్లగా ఉండటం కోసమని దానిలో మంచు ముక్కలు కలిపి నిల్వచేసేవారట. అది ఐస్‌క్రీం తొలి రూపం అన్నమాట. నాలుగువేల ఏళ్ళ క్రితం ఒక చైనా చక్రవర్తి ఇంట్లో పని చేసే వంటవాడు చక్రవర్తిని మెప్పించడానికి పండ్ల గుజ్జులో మంచు ముక్కలు కలిపి వడ్డించాడు. అది చక్రవర్తికి బాగా నచ్చింది. రోజూ ఈ వంటకమే వడ్డించమన్నాడు. అలా ఐస్‌క్రీం క్రమంగా ఆదరణ పొందింది. నీరో చక్రవర్తి పండ్లను తేనెతో కలిపి మంచు ముక్కలతో పాటు తినేవాడట. అదీ ఒక ఐస్‌క్రీం లాంటిదే. [ఇంకా... ]

పిల్లల పాటలు - అంతా ఒక్కటే

అంతా ఒక్కటే మనమంతా ఒక్కటే
ఆంధ్రులమైన తమిళులమైనా
ఉత్కళులైనా కన్నడులైనా
మరాఠి అయినా గుజరాత్ అయినా
పంజాబ్ అయినా బంగ్లా అయినా || అంతా ||

వందనమండీ వందనం (తెలుగు)
వణక్కమమ్మా వణక్కం (తమిళం)
నమస్కార్ నమస్కార్ (హిందీ)
ఇస్సలాం ఇస్సలాం (అస్సామీ) [ఇంకా... ]

భరతమాత బిడ్డలు - బాబూ రాజేంద్రప్రసాద్

పేరు : బాబూ రాజేంద్రప్రసాద్.
తండ్రి పేరు : మహదేవ్ సహాయ.
పుట్టిన తేది : 3-12-1884.
పుట్టిన ప్రదేశం : బీహార్.
చదివిన ప్రదేశం : బీహార్.
చదువు : న్యాయశాస్త్రం.
గొప్పదనం : రైతుల రక్షణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయించటానికి పాటు పడ్డారు.

రాజేంద్రప్రసాద్ 1884 డిసెంబరు 3న జన్మించారు. తండ్రి మహదేవ్ సహాయ ఆయుర్వేద వైద్యం చేస్తుండేవాడు. రాజేంద్రప్రసాద్ తాతగారు బీహార్ జిల్లాలోని హధువా సంస్థానంలో దివానుగా ఉండేవారు. వారి పూర్వికులు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారు. ఉద్యోగాల అన్వేషణలో తలోకవైపు చెదిరిపోయారు. రాజేంద్రప్రసాద్‌కి చిన్నతనము నుంచి బీదల యెడల ఎంతో సానుభూతి ఉండేది. అతని తండ్రి వైద్యం చేస్తున్నప్పుడు ఆయన ఒళ్ళో కూర్చోని రోగులను పరిశీలిస్తూ ఉండేవాడు. [ఇంకా... ]

పెద్దల ఆటలు - దాడి

ఈ ఆటను ఇద్దరు ఆడతారు. ఒకరు 11 చింతపిక్కలు, మరొకరు 11 చిన్న గులకరాళ్ళు లేదా పుల్లతో ఈ ఆట ఆడాలి. ఎలాగైనా 3 జంక్క్షన్లలో గులకరాళ్ళు గానీ చింతపిక్కెలుగానీ పెట్టగలిగితే అతనికి ఒక 'దాడీ అవుతుంది. ఎదుటఆటగాడికి చెందిన పిక్కలను ఇతను తీసేయవచ్చు. ఇలా ఎన్ని 'దాడీ లైతే వారికి ఎడ్వాంటేజ్ ఉంటుంది'. జంట దాడిలు కనక పెట్టుకోగలిగితే అవతల ఆటగాడు తన పిక్కలను కోల్పోయినట్టే. [ఇంకా... ]

పుణ్య క్షేత్రాలు - ద్వారకా తిరుమల

పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరుకు 42 కిలోమీటర్ల దూరంలో ఉందీ దివ్యక్షేత్రం. విజయవాడ నుండి ఏలూరు బస్సులోగాని, రైలులోగాని వెళ్ళవచ్చును. మద్రాసు, హౌరా రైలు మార్గంలో ఏలూరు ఎక్స్‌ప్రెస్ రైళ్ళకు మొదటి స్టాపింగు అవుతుంది. నిరంతరం ఏలూరుకు విజయవాడ నుండి నాన్ స్టాపు బస్సులు గలవు. ఏలూరు నుండి భీమడోలు, తడికలపూడి ద్వారా ద్వారకా తిరుమల చేరవచ్చును.

ఇక్కడ ఒక చిన్న గుట్ట మీద శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. గుట్ట కింద గ్రామాన్ని తిరుపతి అంటారు. తిరుమల తిరుపతి వేంకటేశ్వరునికి చెల్లించాలనుకున్న మొక్కుబడులు కూడా ఒక్కో సమయంలో అంతదూరం వెళ్ళలేని భక్తులు ఇక్కడనే స్వామివారికి మొక్కుబడులు తీర్చుకొంటూంటారు. భక్తులు విశేషంగా వస్తారు. దీనినే చిన్న తిరుపతి అని కూడా అంటుంటారు. ఇక్కడ వివాహ, ఉపనయనాది కార్యక్రమములు, అన్న ప్రాశనలు, వగైరాలు, తలనీలాల మొక్కుబడులు చెల్లించుకుంటుంటారు. [ఇంకా... ]

Friday, March 20

మీకు తెలుసా - పిల్లల్లో ఊబకాయం

ఇటీవల కాలంలో పిల్లల్లో ఊబకాయ సమస్య బాగా కనిపిస్తోంది. మారిన ఆహారపు అలవాట్లు ముఖ్యంగా ఫాస్ట్‌ఫుడ్ సంస్కృతి, శీతలపానీయాలు బాగా తీసుకవడం వంటివి లావెక్కడానికి ప్రధాన కారణాలు. భారీ శరీరం వల్ల పిల్లలు వారి వయసుకు మించి కనిపిస్తారు. ఆరోగ్యానికి కూడా ఊబకాయం మంచిది కాదు. పిల్లల్లోని ఈ భారీకాయ సమస్యని ఒక్కసారి తగ్గించడం సాధ్యమయ్యే విషయం కాదు. కింద పేర్కొన్న అంశాలను పరిగణనలో పెట్టుకుని, ఇచ్చిన వ్యాయామాలను క్రమం తప్పకుండా పిల్లల చేత చేయించాలి.

1. పిల్లలు తమ ఫాస్ట్‌ఫుడ్ జీవనశైలిని మార్చుకునేలా ప్రోత్సహించాలి. శారీరకంగా ఉస్తాహంగా ఉండేట్టు వారిని తీర్చిదిద్దాలి. ఆరోగ్యకరమైన అహారాన్ని వాళ్లకి అలవాటు చేయాలి.
2. టీవి ముందర గంటల తరబడి కూర్చోనివ్వద్దు. ఈ అలవాటు వల్లే పిల్లల్లో ఊబకాయ సమస్య ఎక్కువవుతోంది. [ఇంకా... ]

వంటలు - పల్లీ పకోడీలు

కావలసిన వస్తువులు:
వేరుశనగపప్పు(పల్లీలు) - 2 కప్పులు.
శనగ పిండి - 2 కప్పులు.
బియ్యపు పిండి - 1/2 కప్పు.
అల్లంవెల్లుల్లి పేస్టు - 1 స్పూను.
పచ్చిమిర్చి - 1/4 కప్పు (తరిగినవి).
వనస్పతి - 1/4 కప్పు.
కారం - 1/2 స్పూను.
ఉప్పు - తగినంత.
పసుపు - చిటికెడు.
నూనె - సరిపడినంత.

తయారు చేసే విధానం:
ఓ గిన్నెలోకి శనగపిండి, బియ్యపు పిండిలను తీసుకోవాలి. వనస్పతి కరిగించి దీనిలో వేయాలి. తరువాత నూనె తప్ప మిగిలిన పదార్ధాలన్నీ వేయాలి. తగినంత నీటితో పకోడీ పిండిలా కలుపుకోవాలి. [ఇంకా... ]

ఎందుకు, ఏమిటి, ఎలా ... - యాసిడ్

మలినాలను తొలగించే శక్తి యాసిడ్‌కు ఎలా వచ్చిందో, ఎందుకు దానిని ఉపయోగిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా జిడ్డులాగా పేరుకునే మురికికి కారణం ప్రొటీన్లు లేదా కార్బోహైడ్రేటు మలినాలే. చాలా బండలు, నేల మీద పై పొరలో ఉండే రసాయనిక పదార్థం కాల్షియం కార్బనేటు మనం మురికిని వదిలించడానికి వాడే యాసిడ్ హైడ్రోక్లోరిక్ ఆమ్లంకు కాల్షియం కార్బనేట్‌తో చర్య జరిపి కార్బన్‌డయాక్సైడును, కాల్షియం క్లోరైడును, నీటిని ఇచ్చే ధర్మం ఉంది. కొద్దిగా పొరలాగా ఆసిడ్ ను వేసినప్పుడు అది వెంటనే పై పొరతో రసాయనిక చర్య జరిపి ఆ పొరను తొలగిస్తుంది. ఆ పొరతో పాటే దానికి అంటుకొనివున్న మలినాలు కూడా తొలగిపోతాయి. [ఇంకా... ]

పండుగలు - బుద్ధ జయంతి

నేటికి రెండున్నర వేల సంవత్సరములకు పూర్వము భూమిపై ధర్మము పేరుతో పశువులను వధించు చుండిరి. అప్పుడు జీవ హత్య నిలుపుటకు మాయాదేవి గర్భమున భగవానుడు బుద్ధునిగా అవతరించెను. ఇతని తండ్రి శుద్ధోదనుడు. వీని రాజధాని కపిల వస్తు నగరము. బాల్యమున బుద్ధుని నామము సిద్ధార్ధుడు. జ్యోతిష్కులు "ఈ బాలుడు రాజగును. కాని విరక్తుడై లోకకళ్యాణ కారుడగు"నని చెప్పిరి. అప్పుడు శుద్ధోదన రాజు పెద్ద భవనము నిర్మించి రాకుమారుని అందులో ఉంచెను. రోగములు, దుఃఖములు, మృత్యువులు యేమి తెలియ నివ్వక పెంచెను. ఇతనికి యశోధరతో వివాహము జరిగెను. వీరికొక పుత్రుడు కలిగెను. వారి పేరు రాహులుడు. సిద్ధార్ధుడు ఒకమారు నగరము చూచుటకై తండ్రి ఆజ్ఞ తీసికొని వెలుపలకు వచ్చెను. నగరము నందు తిరుగు సమయమున ఒక వృద్ధుడు కనిపించెను. మరొక మారు నగరము సందర్శించునప్పుడు ఒకరోగి కనిపించెను. మూడవమారు దర్శించునప్పుడు చనిపోయినవాడు కనిపించెను. [ఇంకా... ]

పిల్లల ఆటలు - కాళ్ళ గజ్జా కంకాళమ్మ

ఎంత మంది పాల్గొనవచ్చు : నలుగురు.

ఎక్కువగా ఆడపిల్లలు ఈ ఆటను ఆడతారు. ముందుగా పిల్లలు కింద కూర్చుని తమ కాళ్ళను బారచాపాలి. అనంతరం గ్రూప్ లీడర్ మొదట కూర్చున్న ఆటగాడు ఆటగత్తెల మోకాళ్ళ మీద చెయ్యి వేసి దాన్ని వరుసగా అందరి కాళ్ళ మీదకు జరుపుతూ ఇలా పాట పాడతారు. కాళ్ళ గజ్జ కంకాళమ్మ, వేకువ చుక్క వెలగ మొగ్గ, కాళ్ళూ తీసి పక్కన పెట్టు" ఇలా చివరి పదం ఏ కాలు వద్ద ఆగిందో ఆ కాలుని ఆ ఆటగాడు మడిచేయాలి. మరలా పాట ప్రారంభించి పైన చెప్పినట్టు పాడాలి. చివరి పదం ఏ కాలి వద్ద ఆగితే ఆ కాలుని మడిచేయాలి. [ఇంకా... ]