Monday, February 2

ఎందుకు, ఏమిటి, ఎలా ... - కార్టూన్

ఇప్పుడు మన దేశంలో ఎన్నో కార్టూన్లు చూస్తున్నాం కానీ అసలు ఈ కళ మనది కాదు. యూరప్ వారిది. అందుకే మన లలిత కళల్లో దీనికి చోటు లేదు. అయినప్పటికీ మిగతా కళలన్నిటికంటే భిన్నమైనది కనుక అందరినీ రంజింప చేసే కళగా ఈ ప్రక్రియ ఎదిగింది. రంగులు, కుంచెలు, కాన్వాస్‌లతో రోజుల తరబడి వేసిన పెద్ద పెయింటింగ్ కంటే ఇండియన్ ఇంక్‌తో పేపర్ పై నాలుగు గీతల్లో వేసిన కార్టూన్‌కి అందరూ స్పందిస్తారు. అందుకే ప్రపంచదేశాలన్నీ దీనిని ఆదరిస్తున్నాయి రాజకీయనాయకులపై వ్యంగ్యచిత్రాలు గీసే సంప్రదాయం బ్రిటీషు కార్టూనిస్ట్ డేవిడ్‌లో మొదలుపెట్టాడు. మనదేశంలో తొలి కార్టూనిస్ట్ కేరళకు చెందిన శంకర్ పిళ్లై. ఈయన 'శంకర్స్ వీక్లీ' అనే కార్టూన్ పత్రిక చాలా కాలం నిర్వహించారు. చిన్నారులకోసం ఢిల్లీలో ఓ కార్టూన్ గ్యాలరీ కూడా ఏర్పాటు చేశారు. శంకర్ తర్వాత ఎందరో కార్టూనిస్టులు ఇప్పుడు పత్రికల్లో కనిపిస్తున్నారు. [ఇంకా... ]