Monday, February 2

మీకు తెలుసా - ప్రకాశం జిల్లా ఆవిర్భావ దినోత్సవం

ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు పేరిట మూడు జిల్లాల్లో వెనుకబడిన ప్రాంతాలను కలుపుకొని 1970 ఫిబ్రవరి 2వ తేదీన ప్రకాశం జిల్లాగా ఏర్పాటుచేశారు. స్వాతంత్రోద్యమ కాలంలో పోరాటాల గడ్డగా పేరొందిన ఈ ప్రాంతానికి దేశ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. ' ఆంధ్రరత్న ' దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు వంటి నాయకులు మరెందరో యువ ప్రకాశాలతో, స్వాతంత్ర్య ఉద్యమం ప్రకాశించింది. అందుకే ఈ జిల్లాకు ' ప్రకాశం' గా నామకరణం చేశారు. జిల్లా ఆవిర్భావ సందర్భంగా ఉద్యమాల గడ్డ గురించి స్మరించుకుందాం.

దుగ్గిరాలగోపాలకృష్ణయ్య:

1889 జూన్ 2 జన్మించిన దుగ్గిరాలగోపాలకృష్ణయ్య అర్థశాస్త్రంలో ఎం.ఏ పట్టాపొంది దేశభక్తితో 1854 నుంచి సహాయ సమీకరణ, శాసనోల్లంఘన, విదేశీవస్తు బహిష్కరణ తదితర ఉద్యమాలలో ప్రధానపాత్ర పోషించారు. 1920లో చీరాల - పేరాల ఉద్యమం ప్రారంభించారు.1921లో మార్చి 28న విజయవాడలో జరిగిన అఖిలభారత కాంగ్రేస్ మహసభ అనంతరం 1921 ఏప్రియల్ 21న మహాత్మాగాంధీ చీరాల వచ్చి 'దుగ్గిరాల ఉద్యమాన్ని కొనియాడారు. [ఇంకా... ]