Monday, May 7

పుణ్యక్షేత్రాలు - మంగళ గిరి

ఇటు విజయవాడ నుండి సిటీ బస్సులు, అటు కాకాని నుండి విజయవాడ వచ్చే బస్సులలోను మంగళగిరి రావచ్చు. మంగళగిరి ఎన్నో శతాబ్దాలుగా పేరొందిన పుణ్యక్షేత్రం. ఇక్కడ ముగ్గురు నరసింహస్వాములు భక్తుల పూజలందుకుంటున్నారు. ఒకరు ఎగువ సన్నిధి పానకాల నరసింహస్వామి, రెండవ వారు దిగువ సన్నిధి లక్ష్మీనరసింహస్వామి కాగా, కొండ శిఖరాగ్రాన గండాల నరసింహస్వామి మూడవవారు. కృష్ణానదికి అతి దగ్గరలో యీ వైష్ణవక్షేత్రం నెలకొని వుంది. [ఇంకా...]