Tuesday, March 17

ఆహార పోషణ సూచిక - దంత రక్షణే దేహ రక్షణ

సాధారణంగా ప్రతి మానవుడు తన ఆరోగ్యంపట్ల కాస్తో కూస్తో శ్రద్ధ వహిస్తూనే ఉంటాడు. ముఖ్యంగా సౌందర్య పోషణకు ఎక్కువ శ్రద్ధ తీసుకుంటుంటాడు. బలవర్ధకమైన ఆహారం తీసుకోవడం ద్వారా మరింత శక్తివంతంగా ఉండడానికి ప్రయత్నిస్తుంటాడు. శరీరంలోని ప్రతి భాగంపట్ల ఎంతో జాగ్రత్తలుపడుతుంటాడు. శిరోజాలకూ అంతే ప్రాధాన్యమిస్తాడు. అయితే మన దేహ అంతర్భాగాలు ఆరోగ్యం ఉండాలంటే వాటికి మించిన పరిశుభ్రంగా ఉంచుకోవాలసిన దంతాలపట్ల మాత్రం పెద్దగా శ్రద్ధ చూపడు. ఇది దాదాపు ప్రతి మనవుడి నైజం. దంత పరిరక్షణ లేకపోతే జీర్ణవ్యవస్థ పరిశుభ్రంగా ఉండదన్న కనీస జ్ఞాన్ని విస్మరిస్తుంటాడు. దంత క్షయం ద్వారా వచ్చే వ్యాధుల గురించి సరైన అవగాహన లేక వాటిపట్ల ఏమరపాటుగా ఉంటాడు. గుండె, ఊపిరితుత్తులలాగానే దంతాలను పరిరక్షించుకోవలసిన ఆవశ్యకత ఉందనే విషయాన్ని ప్రతి మనిషీ గుర్తించాలని తెలిపేందుకే ఈ వ్యాసం. [ఇంకా... ]

వంటలు - హనీ డేట్

కావలసిన వస్తువులు:
మైదాపిండి - పావుకిలో.
ఖర్జూరాలు - పావుకిలో.
తేనె - 100 గ్రాములు.
నూనె - వేయించడానకి సరిపడా.

తయారు చేసే విధానం:
మైదాపిండిని చపాతీ పిండిలా కలిపి కాసేపు నాననివ్వాలి. ఖర్జూరాల్లోని గింజలు తొలగించి మిక్సీలో మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఇప్పుడు బాణలిలో నునే వేడి చేయండి. కలిపి పెట్టుకున్న మైదాపిండిని చతురస్త్రాకారంలో కాస్త మందంగా వత్తాలి. దీనిపై సరిపడా ఖర్జూరాల ముద్దను తీసుకుని ఒక పక్కన మందంగా వేయాలి. మిగతా భాగంతో ఈ మిశ్రమాన్ని మూసేయాలి. వేలితో నొక్కి అతికించాలి. ఇప్పుడది కజ్జికాయలాగా తయారౌతుంది. [ఇంకా... ]

లాలి పాటలు - జో జో జో జో శ్రీ కృష్ణ

జో జో జో జో శ్రీ కృష్ణ

జో జో యని పాడెదాను జో జో జో జో శ్రీ కృష్ణ

పొంగుచూను లాలబోసి అంగరక్ష బెట్టి నీకు

అద్దాల తొట్టెలోన ముద్దుగా పవళింపజేతూ ||జో||

ముంగురులు దువ్వి నీకు ముత్యాల హారమేసి

మొలకును గజ్జాలు కట్టి మురళినీ చేతికిత్తు ||జో|| [ఇంకా... ]

భరతమాత బిడ్డలు - మధర్ థెరిసా

పేరు : మదర్ థెరిసా.
తండ్రి పేరు : నికలస్ బొజాక్సియొ.
తల్లి పేరు : డ్రానా ఫైల్ బెర్నయ్.
పుట్టిన తేది : 27-8-1910.
పుట్టిన ప్రదేశం : యుగోస్లేవియా.
చదివిన ప్రదేశం : యుగోస్లేవియా.
గొప్పదనం : దరిద్రులకు, రోగులకు, కుష్టురోగులకు తల్లిలా ఆలనా పాలనా చూస్తూ వారి హృదయంలో చెరగని స్థానం సంపాదించినది. ముంబాయిలోని మురికి వాడలను శుభ్రపరచడానికి శ్రమించింది.
స్వర్గస్థురాలైన తేది : 5-9-1997.

'స్కోప్ జీ' పట్టణంలో అల్బేనియా దంపతులు ఉండేవారు.ఆగ్నేస్ తండ్రి పేరు 'నికలస్ బొజాక్సియొ'భవనాలు నిర్మించే కాంట్రాక్టరు. ఆయన భార్య పేరు డ్రానా ఫైల్ బెర్నయ్' వెనిస్ ఫ్రాంతానికి చెందిన స్త్రీ. ఆ దంపతులకు 1910 ఆగస్టు 27వ తేదీన మూడవ బిడ్డ జన్మించింది. [ఇంకా... ]

పుణ్య క్షేత్రాలు - హరిద్వార్

భారతదేశంలో అతి పవిత్రస్థలాల్లో ఒకటిగా పేర్కొనబడింది. శివాలిక్ పర్వత పాదాలవద్ద పావనగంగా కుడివైపు తీరంలో అమరియున్న పుణ్యస్థలం. సప్తమోక్షదాయక పురాణాల్లో ఒకటి. దీనినే మాయాపురి, గంగాద్వారం అనే నామంతరాలతో పిలుస్తారు. శైవులు హరద్వారమనీ, వైష్ణవులు హరిద్వారమనీ, వైష్ణవులు హరిద్వారమనీ, భక్తిమేర పిలుచుకొంటూ ఉంటారు. మొత్తం మీద హిందువులకు అతి పవిత్రస్థలం-ముఖ్య యాత్రాస్థలం. సముద్ర మట్టానికి 1000 అడుగుల ఎత్తు జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో గొప్ప సుందర నగరంగా ప్రశస్తిని పొందింది. మహామహుడైన కపిలస్థాన్ పురాతన ప్రసిద్ది. ఒకప్పుడు ఎంతో విశాలమై మైళ్ళ పొడవున వ్యాపించియున్న మహా పట్టణంగా కీర్తించబడి ఉన్నది. ఈ విషయ అబుల్‌ఫజల్ తన గ్రంధములో వ్రాసారు. ఈయన అక్బరు కాలంలో ఈ పట్టణ సందర్శనం చేశారు. [ఇంకా... ]

Monday, March 16

ఎందుకు, ఏమిటి, ఎలా ... - హిప్నాటిజం

హిప్నాటిజం అంటే ఏమిటి, దీనిని ఎవరు కల్పించారు, ఎలా పని చేస్తుంది, ఎందుకు ఉపయోగిస్తారు అనేది మనం తెలుసుకుందాం.

హిప్నాటిజం అంటే సమ్మోహనపరిచే విద్య. ఇంగ్లాండ్ దేశపు డాక్టర్ జేమ్స్ బ్రెయిడ్ దీనికి శాస్త్రీయస్థాయిని కల్పించాడు. మాటల ద్వారా, కంఠస్వరం ద్వారా, ఎదుటివారి మనస్సుపై ప్రభావాన్ని కలుగజేసి, వారి మనస్సులపైన శరీరంపైన వారికి ఆధీనం తప్పింపజేయడమే హిప్నాటిజం అంటే. అలా ఆదీనం తప్పిన వ్యక్తులు నిద్రావస్థలోకి వెళ్ళి తమకు తెలియకుండానే హిప్నాటిస్ట్ ఏం చేయమంటే అది చేస్తారు. హిప్నాటిజం ద్వారా వ్యాధులను నయం చేసే పద్దతిని జర్మన్ దేశస్తుడైన 'ఫెడరిక్ ఆంటోన్ మెస్మర్' కనిపెట్టాడు. దీన్నే 'మెస్మరిజం' అంటారు. శారీరక, మానసిక వ్యాధులను నయం చేయడానికి 'హిప్నోథెరఫీ' ఎక్కువగా వాడుకలోకి వచ్చింది. [ఇంకా... ]

భక్తి గీతాలు - శివాదుర్గ కాళి ప్రియ చంద్ర మౌళి

శివాదుర్గ కాళి ప్రియ చంద్ర మౌళి
సరోజాలతోనే పూజచేతు ఆ...
గులాబీలతోనే పూజసేతు "శి"

శంభుని రాణి చల్లని చూపు
భక్తావాళి భాధలు బాపు

ప్రార్ధింతుము రేపూ మాపు
గ్రహ బాధలు రూపు మాపు

స్తుతింతును రోజు రోజు
వెన్నెల కాంతులు మాపై నిలుపు [ఇంకా... ]

నీతి కథలు - లంచగొండికి శిక్ష తప్పదు

హేలాపురికి రాజు నవనీత వర్మ. ఆయన జనరంజకంగా పరిపాలన చేసేవాడు. ఆయన పేదలకు ఎంతో సహాయం చేసేవాడు. ఒక రోజున ఒక పేద బ్రాహ్మణుడు ఆయన దగ్గరకు వచ్చాడు. అతని పేరు పుండరీక శర్మ. 'బ్రాహ్మణుడా! నీవు ఏ పని మీద వచ్చావు?' అని అడిగాడు రాజు. అందుకు బ్రాహ్మణుడు ఎంతో వినయంగా చెప్పాడు. 'మహారాజా! నేను కటిక బీదవాడిని. ఆ బాధ భరించలేకుండా ఉన్నాను. దయతో నాకు సహాయం చేయండి' అని వేడుకున్నాడు. రాజుగారు అతని బాధ తెలుసుకున్నారు. అతని వంక పరిశీలనగా చూశారు. అతని బట్టలు చిరిగి ఉన్నాయి. అతని శరీరం సన్నగా ఎముకలు కనిపించేలా ఉంది. రాజు కొంతసేపు ఆలోచించాడు. 'ఇక మీద మీరు రోజూ ఉదయం రండి. నన్ను కలవండి' అని చెప్పాడు మహారాజు. రాజు వద్ద సెలవు తీసుకుని వెళ్ళాడు శర్మ. మరుసటి రోజు ఉదయం మహారాజును కలిశాడు శర్మ. 'ఈ ఉత్తరం తీసుకువెళ్ళండి. మా కోశాధికారికి యివ్వండి' అన్నాడు మహారాజు. శర్మ ఆ ఉత్తరం తీసుకుని కోశాధికారి దగ్గరకు వెళ్ళాడు. ఆ ఉత్తరం చూసుకొని కోశాధికారి రెండు వరహాలు శర్మకు ఇచ్చాడు. శర్మకు ఎంతో ఆనందం కలిగింది. [ఇంకా... ]

వంటలు - క్యాప్సికంతో కచోరీలు

కావలసిన వస్తువులు:
కాప్సికమ్ మధ్య సైజువి - అర కేజి.
పుట్నాల పప్పు - 100 గ్రా.
ఎండుమిర్చి - నాలుగు.
ఎండు కొబ్బరి - 25 గ్రా.
ఉప్పు - తగినంత.
వెల్లుల్లి - నాలుగు రెబ్బలు.
నూనె - తగినంత.

తయారు చేసే విధానం :
మొదట పుట్నాలు శుభ్రం చేసుకుని ఎండుమిర్చి కొబ్బరి, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు అన్నీ కలిపి మిక్సీలో పొడిచేసి ఉంచుకోవాలి. కాప్సికమ్ కడిగి తొడిమల దగ్గర చాకుతో గుండ్రంగా కోసి తొడిమను తీసేసి గింజలన్నిటినీ విదిలించేయాలి. [ఇంకా... ]

పిల్లల ఆటలు - క్విజ్

ఈ పోటీలో కనీసం అయిదుగురు పిల్లలు పాల్గొనవచ్చు. తేలికగా అర్ధం చేసుకోగలిగే తేలికపాటి ప్రశ్నలు వేయాలి. వాటి ఉపయోగం చెప్పాలి. లేదా కాగితం పై రాయాలి. అందరికి పలక బలపం లేదా పుస్తకం - పెన్సిల్ ఇవ్వాలి..

ఉదా :ప్రశ్న - సమాధానం
అన్నం - తింటారు
రామ్మా చిలకమ్మ - చూడాలని వుందిలో పాట
పాలు - తాగుతాం
కొబ్బరి నూనె - రాసుకుంటాం
టీ.వీ - చూస్తాం

ఈ ప్రశ్నలకు ఎవరు ఎక్కువ సమాధానాలు చెప్పగలరో వారు విజేత. [ఇంకా... ]

Monday, March 9

పండుగలు - దత్తాత్రేయ స్వామి జయంతి

ఒకసారి లోకకళ్యాణార్థం నారదుడు ఆడిన చతురోక్తికిలోనైన లక్ష్మీ, సర్వస్వతి, పార్వతిమాతలు, మహాపతివ్రత అయిన అనసూయపై ఈర్ష్య అసూయ ద్వేషాలను పెంచుతున్నారు. ఈ ఈర్ష్య అసూయ ద్వేషమనే దుర్గుణలకు లోనయితే! దేవతలకైనా అనేక దుఃఖాలు కలుగుతాయని స్వరులకు తెలియచెప్పుటకో: లేక శ్రీదత్తుని అవతారానికి నాంది పలుకుటకో! మరి నారదుని ఆంతర్యమేమిటో?

ఏది అయితేనేమి! ఈ గుణాలూ వారి మనస్సునిండా దావానలంలా వ్యాపించి ముగ్గురమ్మల గుండెలు భగ్గుమన్నాయి. వారి వారి పత్నులను తక్షణం ఆ అనసూయ ఆశ్రమానికి వెళ్ళి ఆమె పాతివ్రత్యాన్ని భగ్నం చేయమని ప్రార్థించారు. త్రిమూర్తూలు ఎంతవారించినా, పెడచెవిని పెట్టారు ససేమిరా! అన్నారు. దానికి తోడు ఆ ముగ్గురమ్మలకు ఇంద్రాది దేవతల భార్యలు కూడా వంతపాడారు. [ఇంకా... ]

వంటలు - సోయాబాల్స్

కావలసిన వస్తువులు:
మీల్ మేకర్(సోయా బాల్స్)ఉడికించినవి - ఒక కప్పు .
కార్న్‌ఫ్లోర్ - ఒక టేబుల్ స్పూన్‌ .
అల్లం వెల్లుల్లి ముద్ద - ఒక టీ స్పూన్‌.
గరం మసాలా - ఒక టీ స్పూన్‌.
సోయాసాస్ - రెండు టీ స్పూన్లు.
మిర్చి - రెండు.
అల్లం, వెల్లుల్లి ముక్కలు - తగినంత .
నూనె - వేయించడానికి తగినంత.
పుదీన, జీడిపప్పు, కొత్తిమీర - తగినంత.

తయారు చేసే విధానం:
మూకుడులో నూనె కాగిన తరువాత చీల్చిన పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేసి వేగించాలి. అందులోనే పుదీనా కూడా వేసి కొద్దిగ వేగిన తరువాత మీల్‌ మేకరు వేయాలి. [ఇంకా... ]

కథలు - మనసు మూలాల్లోకి...

'ఎం.జె.ధన్' అది అక్కడి పేరు. మనకు మేడిచర్ల జగన్నాధం భారతదేశంలో అందులోనూ సంస్కృతికి పట్టుకొమ్మ అయిన ఆంధ్రదేశంలో ఓ పల్లెటూరిలో పుట్టి, డాక్టరుగా ఎదిగిన జగన్నాధం... ముప్పై సంవత్సరాలకు పైబడి మక్కువతో అక్కున చేర్చుకున్న వైద్యవృత్తి కోసం దేశాన్ని, ఊరును వదిలి, తన వైద్య ప్రస్థానంలో జిల్లా రాజధాని నుండి రాష్ట్ర రాజధాని మీదుగా దేశ రాజధానికి ఎదిగి.. ఇంతింతై ఎదిగిన వాడు జగన్నాధం. పేరొందిన డాక్టరై అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, స్విట్జర్లాండ్, ఇంగ్లండ్‌లను సందర్శించి చివరకు డాక్టర్ ఎం.జె.ధన్ గా లండన్‌లో స్థిరపడ్డాడు.

ఓ రకమైన వేగవంతమైన జీవితానికి అలవాటు పడ్డ జగన్నాధం, అక్కడి సంస్కృతిలోని వాడినీ, వేగాన్నీ బాగానే ఒంట పట్టించుకున్నాడని చెప్పొచ్చు. డాక్టర్‌గా ఓ విధమైన యాంత్రిక జీవితంలో బాగానే ఒదిగిపోయాడు. జనరల్ సర్జన్‌గా రోగులకు తన వంతు సేవ చేస్తూ మంచి డాక్టరుగా పేరు సంపాదించాడు. చొచ్చుకుపోయే నైజం గల జగన్నాధం, లండన్‌లో ఈనాడు ఓ పేరు మోసిన సర్జన్. [ఇంకా... ]

పిల్లల ఆటలు - న్యూస్ పేపర్ క్విజ్

ఎంతమంది ఆడవచ్చు : 8మంది (నలుగురు ఒక బ్యాచ్ చొప్పున).
ఆడే స్థలం : గదిలో గాని, ఆరుబయట గాని.
కావలసిన వస్తువులు : న్యూస్ పేపర్లు 2.
ఆటగాళ్ల వయస్సు : 7 నుండి 8 సం||రాలు మధ్య.

ఈ ఆటలో రెండు టీమ్‌లను ఎంపికచేయాలి. రెండు ఒక దిన పత్రికలను (ఒకే రోజున) రెండు టీమ్‌ల ఆటగాళ్ళతో చదివించాలి. అనంతరం ఆ పేపర్లలో ఆ రోజు వచ్చిన వార్తలపై ప్రశ్నలు వేయాలి. ఏ టీమ్ సరైన సమాధానం చెపితే వారికి మార్కు వస్తుంది. [ఇంకా... ]

అవీ, ఇవీ కొనుక్కొనేటప్పుడు - హ్యాండ్ బ్యాగ్

నేటి ఆధునిక కాలంలో మహిళల హ్యండ్ బ్యాగ్ వాడకం చాలా పెరిగింది. అన్నిరకాల స్ధాయిల వారికి, చిన్న వారి దగ్గర నుంచి పెద్ద వారి వరకు అందరికీ హ్యండ్ బ్యాగ్ కానీ, పర్సు కానీ వుండాలి. చేతిలో అవి వుంటే వారికి ఇక నిశ్చింత. హ్యాండ్ బ్యాగ్ చేతిలో వుంటే ఒక తోడు వుందన్న అనుభూతి కలుగుతుంది. మహిళల అన్నిటా ఉపయొగపడుతూ నిత్య జీవన వ్యవహారాలలో ప్రముఖ స్ధానంలో నిలుస్తుంది.హ్యండ్ బ్యాగ్, మహిళల వ్యక్తిత్వాన్ని ఇనుమడించే హ్యాండ్ బ్యాగ్ కొనుగోలు గురించి కొన్ని సూచనలు.

. మార్కెట్‌లో రకరకాల మెటీరియల్స్ తో తయారైన వివిధ మోడల్స్‌లో వుండే అందమైన బ్యాగ్‌లు అనేకం లభిస్తున్నాయి. వాటిలో మీ పర్సనాలిటీకి సరిపడే బ్యాగ్‌ను ఎంచుకోవాలి.

. కొంచెం ధర ఎక్కువైనా మంచి మెటీరియల్‌తో తయారైన బ్యాగ్‌లు కొనడం మంచిది. నిత్యవాడకానికి మంచి లెదర్‌బ్యాగ్‌లు అయితే ఎక్కువ కాలం మన్నుతాయి. [ఇంకా... ]

Wednesday, March 4

వ్యాయామ శిక్షణ - నాజూగ్గా ఉండడంకోసం

బాపు బొమ్మలాంటి సన్నని నడుము, తీరైన అవయవ సౌష్టవం ఇప్పుడు అపురూపమైపోయాయి. మారిన పరిస్థితులు, ఆహారపు అలవాట్లలో వచ్చిన పెను మార్పులు నాజూకు శరీరాన్ని దూరం చేస్తున్నాయి. సన్నబడాలంటే తినడం తగ్గించాలి కానీ, కడుపునిండా తినమంటున్నారేమిటి? అని ఆశ్చర్యపోతున్నారా! నచ్చింది తిన్నా నాజూగ్గా ఎలా ఉండవచ్చో చూద్దామా.

సన్నగా కనబడడానికి, సన్నపడడానికి చాలా మంది టీనేజర్స్ పడరాని పాట్లు పడుతున్నారు. జిమ్‌ల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. బ్యూటీషియన్లకు వేలకు వేలు సమర్పించుకుంటున్నారు. ఇన్ని తిప్పలు పడినా ఫలితం ఆవగింజలో అరభాగం కూడా వుండడంలేదు. వీరి ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. కొన్ని రోజుల పాటు కొన్ని రకాల జబ్బులు కూడా వచ్చి పడుతున్నాయి. రోజుల తరబడి కడుపు మాడ్చుకోవడం వలన జీవప్రక్రియ దెబ్బతింటుంది. [ఇంకా... ]

ఆధ్యాత్మికం - భక్తులను సదా రక్షించే శ్రీ సాయినాధుడు

ఈ భూమిపై ధర్మాచరణకు తీవ్ర విఘాతం కలిగినప్పుడు, ఆధర్మం అవధులు దాటి చెలరేగినప్పుడు, దుష్టశిక్షణ శిష్టరక్షణ, ధర్మసంస్థాపనలను తన సంకల్పంగా చేసుకొని ప్రతీయుగంలోను అవతరిస్తానని శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీతలో వివరించాడు. ఆప్రకారంగానే వివిధ యుగాలలో, వివిధ అవతారాలలో, రూపాలలో ఆ పరమాత్మ దివి నుండి భువికి తిరిగివచ్చి తన అవతార కార్యం చేసాడు. అట్లా అవతరించిన పుణ్యపురుషులు, సాధుసత్పురుషులలోకెల్లా అగ్రగణ్యుడు, మహిమాన్విత శక్తివంతుడు, రాజాధిరాజా, యోగులందరికీ సామ్రాట్ వంటివారు. మన సమర్ధ సద్గురువు శ్రీసాయినాధులు. ఈ పవిత్ర భారతావనిలో పంతొమ్మిదవ శతాబ్ధంలో అవతరించి, ఒక పాడుబడిన మశీదును తన నివాసంగా చేసుకోని అనేక లీలలను గావించి, లక్షలాది మందికి జ్ఞానమార్గం చూపించి వారికి చివరికంతా తోడు నీడగా నిలిచిన పరిశుద్ధ పరబ్రహ్మ అవతారం శ్రీసాయి. మనసా, వాచా, కర్మణా తనకు సర్వస్వం శరణాగతి ఒనరించిన భక్తుల లలాట లిఖితాన్ని సైతం తిరగ వ్రాసి వారికి ఇహపరాలను ప్రసాదించిన విశిష్ట గురుదేవులు శ్రీసాయినాధులు. అటువంటి శ్రీసాయి చేసిన కొన్ని లీలలను ఇప్పుడు స్మరించుకుందాం! [ఇంకా... ]

లాలి పాటలు - లాలి పాట

లాలనుచు నూచేరు లలనలిరుగడల
బాల గండవర గోపాల నినుజాల లాలీ లాలీ
ఉదుటు గుబ్బల సరము లుయ్యాలలూగ
పదరి కంకణరవము బహుగతుల మ్రోగ

ఒదిగి చెంపలకొప్పు లొక్కింత వీగ
ముదురు చెమటల నళికములు తొప్పదోగ ||లాలీ||

మలయ మారుతగతులు మాటికి చెలంగ
పలుకు కపురపుతావి పైపై మెలంగ ||లాలీ|| [ఇంకా... ]

పుణ్య క్షేత్రాలు - కాశి

పావన గంగాతీరంలో గంగకు ఉపనదులైన వరుణ - అసి నదుల మధ్య ఒద్దికగా అమరియున్న, అమరధామమే బెనారస్, లేక వారణాశి లేక కాశి. "అంతర్ నేత్రాలు తెరిచే వారణాశి 4000 సంవత్సరాల నాటిది". హైందవ సంస్కృతి ప్రచారంలో, వైజ్ఞానికంగాను, చారిత్రకంగాను అనాది నుండి పేరెన్నిక గన్న పట్టణం, కాశీ మహా పుణ్యక్షేత్రము. ఉత్తరప్రదశ్‌లో ఉన్నది. గంగానదికి ఆవలివైపు బెనారస్, వారణాశి అని, ఈవలివైపు కాశి అని పిలువబడుచున్నది. వరుణ ఘట్టమునకు వాసి ఘట్టమునకు మధ్యనున్నది గనుక, దానికి వారణాశి అని పేరు వచ్చినది.

కాశ్యాంతు మరణాన్ముక్తి అను ఆర్యోక్తి ఉన్నది. కాశీలో మరణిస్తే ముక్తి తప్పక లభిస్తుంది అని దీని అర్ధము. ఎటు చూచినా అయిదు క్రోసులున్న ఈ పట్టణంలో, ఏజీవి మరణించినా ఆ సమయమున కుడిచెవి పైకి ఉంటుంది. ఈశ్వరుడు తారక మంత్రోపదేశము చేసి మోక్షము ప్రసాదిస్తాడు. [ఇంకా... ]

భరతమాత బిడ్డలు - బాబూ రాజేంద్రప్రసాద్

పేరు : బాబూ రాజేంద్రప్రసాద్.
తండ్రి పేరు : మహదేవ్ సహాయ.
పుట్టిన తేది : 3-12-1884.
పుట్టిన ప్రదేశం : బీహార్.
చదివిన ప్రదేశం : బీహార్.
చదువు : న్యాయశాస్త్రం.
గొప్పదనం : రైతుల రక్షణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయించటానికి పాటు పడ్డారు.

రాజేంద్రప్రసాద్ 1884 డిసెంబరు 3న జన్మించారు. తండ్రి మహదేవ్ సహాయ ఆయుర్వేద వైద్యం చేస్తుండేవాడు. రాజేంద్రప్రసాద్ తాతగారు బీహార్ జిల్లాలోని హధువా సంస్థానంలో దివానుగా ఉండేవారు. వారి పూర్వికులు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారు. ఉద్యోగాల అన్వేషణలో తలోకవైపు చెదిరిపోయారు. రాజేంద్రప్రసాద్‌కి చిన్నతనము నుంచి బీదల యెడల ఎంతో సానుభూతి ఉండేది. అతని తండ్రి వైద్యం చేస్తున్నప్పుడు ఆయన ఒళ్ళో కూర్చోని రోగులను పరిశీలిస్తూ ఉండేవాడు. [ఇంకా... ]

Saturday, February 21

వంటలు - పన్నీర్‌బ్రెడ్‌

కావలసిన వస్తువులు:
శాండ్‌విచ్ బ్రెడ్ ముక్కలు - ఎనిమిది.
పన్నీర్ - 100గ్రాములు.
ఉల్లిపాయ - ఒకటి.
కారం - టీస్పూను.
అల్లంవెల్లుల్లి - అరటీస్పూను.
సెనగపిండి - 100గ్రాములు.
ఉప్పు - తగినంత.
మంచినీళ్లు - కప్పు.
నూనె - వేయించడానికి సరిపడా.

తయారు చేసే విధానం:
ఉల్లిపాయ సన్నగా తరగాలి. పన్నీర్‌ సన్నగా తురమాలి. బాణలిలో టేబుల్ స్పూన్ నూనె వేసి అల్లం వెల్లుల్లి, ఉల్లిముక్కలు వేయించాలి. తరువాత పన్నీర్, ఉప్పు, కారం, గరం మసాలా కూడా వేసి ఓ ఐదు నిమిషాలు వేయించి దించి పక్కన ఉంచాలి. [ఇంకా... ]

భక్తి గీతాలు - మంగళగౌరి మాహేశ్వరీ

మంగళగౌరి మాహేశ్వరీ మముగన్న తల్లి పరమేశ్వరీ
కరుణామయి నీ కంటిపాపలో
చల్లన పెరుగును ముల్లోకాలు ||క||

తల్లి నీపేరు తలచిన చాలును
కలిగెను శతకోటి కళ్యాణాలు ||మ||

అమ్మలగన్న అమ్మవునీవే
శుభములనోసగే శుభమూర్తి నీవే
వెండికొండపై వెలసింది నీవే
ఇంటింట నెలకొన్న ఇలవేల్పునీవే
మా ఇలవేల్పు నీవే ||మ|| [ఇంకా... ]

మీకు తెలుసా - మహిళలకు ఋణాలు అందించే సంస్ధలు

మహిళలకు ఋణాలు అందించే సంస్ధలు - అభివృద్ధి పధకాలు

అన్ని రంగాలలోను స్త్రీలు ముందంజ వేస్తున్న రోజులివి. ఒకప్పుడయితే స్త్రీలకు వంటిల్లే చాలుననుకునేవారు. వారిని చదవనిచ్చి, ఆలోచించగలిగేలా చేస్తే పురుషులతో సమానంగా అభివృద్ధిపధం వైపు పయనించగలరని గుర్తించారు. స్త్రీ, పురుష అసమానతలను పక్కనపెట్టి వారిని ప్రొత్సహిస్తే రాష్ట్రాభివృద్ధికి తమ వంతు కర్తవ్యాన్ని చక్కగా నిర్వహించగల నేర్పరితనం వారిలో ఉంది. అందుకే పట్టణ ప్రాంత మహిళలకే కాకుండా, చదువురాని గ్రామీణ స్త్రీలు సైతం కుటీర పరిశ్రమలు, చిన్నతరహా పరిశ్రమల ద్వారా స్వావలంబన సాధిస్తారని వారికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అనేక పధకాలను అమలు చేస్తున్నాయి.

జాతీయబ్యాంకులు, గ్రామీణ సహకార బ్యాంకులు, స్టేట్ పైనాన్స్ కార్పొరేషన్, రాష్ట్ర మహిళా కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ వంటి ఆర్ధిక సంస్ధలు ఋణాలు మంజూరు చేస్తున్నాయి. [ఇంకా... ]

ఆహార పోషణ సూచిక - పొషక విలువల తోటకూర

ఉపయోగాలు:

గుండె జబ్బులు ఉన్నవారు తోటకూరను ఉడకబెట్టి తినడం ద్వారా గుండెజబ్బుల నుండి దూరంగా ఉండవచ్చు. కాల్షియం లోపం ఉన్నప్పుడు ఎవరికైనా గోర్లు పెరగవు. పళ్లమీద పచ్చని పొరలు ఏర్పడుతుంటాయి. కాబట్టి నిత్యం ఆహారంలో తోటకూరను తీసుకోవడం వలన వీటన్నింటిని నివారించుకోవచ్చు, రక్తంలోని హిమోగ్లోబిన్‌లో ఐరన్ లోపించిన వారు రక్తహీనతలకు లోనవుతూ ఉంటారు. ఇటువంటి వారు ఎక్కువగా పెసరపప్పు, తోటకూర కలిపి వండినటువంటి కూరలను తినడం ద్వారా ఎంతోమంచి జరుగుతుంది. తోటకూరలో ఉండేటటువంటి కాల్షియం, ఐరన్‌లు బాలింతలకు, గర్భవతులకు, పిల్లలకు పోషక విలువలు అందజేస్తాయని వైద్యశాస్త్రం సూచిస్తుంది. [ఇంకా... ]

పిల్లల ఆటలు - చెప్పింది చెయ్యి

ఎంతమంది ఆడవచ్చు : ఎంతమందైనా ఆడవచ్చు.

ఈ ఆటలో లీడర్ ఉండాలి. లీడర్ ముందుగా చిన్న చిన్న తెల్ల కాగితాలపై రకరకాల పనులు రాసి మడత పెట్టాలి. అంటే ఒక దాంట్లో పాట పాడాలి, రెండవ దాంట్లో పకపకానవ్వాలి, వరుసగా కుంటుకుంటూ రావాలి, బ్రహ్మానందం లాగా మాట్లాడాలి., బాలకృష్ణ లాగా డైలాగ్ లు చెప్పాలి అని రాయాలన్నమాట. కూర్చున్న పిల్లలందరికి తలొకటి ఇచ్చి అవి విప్పి లోపల ఉన్నది చెప్పి వరుసగా అవి చేయ్యాలని చెప్పాలి. ఒక అమ్మాయికి మగాడిలా షేవింగ్ చేసుకోవాలి అని అందులో ఉంటే షేవింగ్ చేస్తున్నట్లు నటించాలి. మగపిల్లాడికి వంట చేయమని వస్తే వంట చేస్తున్నట్లు నటించాలి. భలే సందడిగా నవ్వులతో హోరెత్తిపోతుంది. ఒక సారి ప్రయత్నం చేసి చూద్దామా! [ఇంకా... ]

Friday, February 20

ముఖ్యమైన ఘట్టాలు - పెళ్ళి చేయటం

వ్యక్తి తానే కేంద్రబిందువుగా ఉండే స్థితినుంచి మరో వ్యక్తి కేంద్రబిందువుగా ఉండే స్థితికి ఎదిగే నిజమైన జీవిత యాత్ర వివాహంతోనే ఆరంభమవుతుంది. వ్యక్తి తానే కేంద్రబిందువుగా ఉండే స్థితినుంచి మరో వ్యక్తి కేంద్రబిందువుగా ఉండే స్థితికి ఎదిగే నిజమైన జీవిత యాత్ర వివాహంతోనే ఆరంభమవుతుంది. నైతిక సూత్రాలనే బీజాలు వివాహం తరువాతనే మొలకెత్తి వేగంగా పెరగనారంభిస్తాయి. ప్రేమ, తన్మయత, త్యాగం, భక్తి, ఓరిమి మొదలైన సద్గుణాలు పూర్తిగా ఎదిగేందుకు వివాహ జీవితం ఎన్నో అవకాశాలను ఇస్తుంది. కుటుంబ జీవనంలో ఎదగడానికి వివాహ వ్యవస్థ అవసరం. ఈ భావాన్ని పెండ్లి కుమారునికి కలిగించడానికే వేదాలు ఇలా ప్రకటించమని అతనికి సలహా ఇస్తుంది. ప్రియా! ఆవాహనం చేయబడిన దేవతల సన్నిధిలో, మన జీవితంలోని పవిత్ర సందర్భంలో, నీ పాణిగ్రహణం చేస్తున్నాను. ఆశీర్వదించబడిన ఓ స్త్ర్రీ రత్నమా! దీర్ఘకాలం నా జీవిత భాగస్వామిగా ఉండు. నా కుటుంబ బాధ్యతలను నీ కప్పగిస్తున్నాను. సంతోషముగా నీ బాధ్యతను నెరవేర్చు. పవిత్రమైన ఈ ప్రమాణం దైవసన్నిధిలో పెండ్లి కుమారుడు చేసే ఆ క్షణం నిజానికి ఎంతో ఆనందకరమైనది. [ఇంకా... ]

వంటలు - గుమ్మడికాయ బజ్జీలు

కావలసిన వస్తువులు:
గుమ్మడికాయ - 250 గ్రా.
శనగపిండి - 1 కప్పు.
పచ్చిమిరపకాయ ముక్కలు (చిన్నవిగా తరగాలి) - 2 టేబుల్ స్పూన్లు.
తురిమిన అల్లం - 1 టేబుల్ స్పూను.
కారం - చెంచా సగం.
తినే సోడా - చిటికెడు.
తురిమిన చీజ్ - ఒక టేబుల్ స్పూను.
ఉప్పు - తగినంత.
నూనె - సరిపడినంత.

తయారు చేసే విధానం:
మొదట గుమ్మడికాయ చిన్న చిన్న ముక్కలుగా, సన్నని స్లైసుల్లా కట్ చేసుకోవాలి. [ఇంకా... ]

పిల్లల పాటలు - బాలలం - బాలలం - 1

బాలలం, బాలలం మేమంత బాలలం

కన్న తల్లిదండ్రులకు - కదలాడే బొమ్మలం

భరతమాత పెంచుతున్న - భావి మావి కొమ్మలం

చదువుకునే దీపాలం - సమత నాత రూపాలం

నవ భారత మందిరాన - నవ జీవన శిల్పాలం [ఇంకా... ]

ఆహార పోషణ సూచిక - హిమోగ్లోబిన్ పెరగాలంటే!

ఆహార లోపం, ఆహారంలోని పోషకాల్ని శరీరం శోషించుకోలేకపోవడం, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు, పొట్టలో పురుగులు ఊండడం, ఎముకల మూలుగులో రక్తకణాలు తగిన పరిమాణంలో ఉత్పత్తి కాకపోవడం వంటివి ప్రధాన కారణాలు.

ఆహారంలో చేసుకోవాల్సిన మార్పులు :

1. పొద్దున టిఫిన్ తో పాటు ఒక గ్లాసు పాలు, ఒక పండు, నాలుగైదు ఖర్జూరాలు చేర్చాలి.
2. సాయంత్రం నాలుగు గంటలకు రాగిజావ, ఒక అరటిపండు తీసుకోవాలి.
3. భోజనంలో ప్రతిరోజూ పప్పు, ఆకుకూర (రెండూ కలిపి కాదు) ఉండేట్లు చూసుకోండి.
4. పడుకునే ముందు ఒక గుప్పెడు వెరుశనగలు, కాస్తబెల్లం,నాలుగైదు ఖర్జూరాలు తీసుకోండి. [ఇంకా... ]

భరతమాత బిడ్డలు - టంగుటూరి ప్రకాశం

పేరు : టంగుటూరి ప్రకాశం పంతులు.
తండ్రి పేరు : శ్రీ గోపాలకృష్ణయ్య.
తల్లి పేరు : శ్రీమతి సుబ్బమ్మ.
పుట్టిన తేది : 1872.
పుట్టిన ప్రదేశం : ఒంగోలు తాలూకాలోని కనుపర్తి గ్రామంలో (ఇప్పుడు ప్రకాశం జిల్లా) జన్మించాడు.
చదివిన ప్రదేశం : ఇంగ్లాండ్.
చదువు : ప్లీడరు (న్యాయవాది).
గొప్పదనం : ఆంధ్రరాష్ట్ర అభివృద్దికై పాటుపడినారు. స్వాతంత్ర్య సమరంలో పాల్గొని దేశానికి స్వాతంత్ర్యం తెచ్చాడు. స్వరాజ్య అనే పత్రికను స్థాపించాడు.
స్వర్గస్తుడైన తేది : 25-5-1957.

శ్రీ ప్రకాశం 1872 లో అప్పటి గుంటూరు జిల్లా, ఒంగోలు తాలూకాలోని కనుపర్తి గ్రామంలో (ఇప్పుడు ప్రకాశం జిల్లా) జన్మించాడు. తండ్రి శ్రీ గోపాలకృష్ణయ్య, తల్లి శ్రీమతి సుబ్బమ్మ. ఆ దంపతులకు ఆరుగురు సంతానం. వారిలో ప్రకాశం మూడవవాడు. [ఇంకా... ]

Thursday, February 19

పుణ్య క్షేత్రాలు - పెదకాకాని

కాకానిలో సాంబశివాలయము మహా మహిమాన్వితమై యున్నది. ఈ స్వామి వారి ప్రతిభ అనేక రకాలు. ప్రతి ఆదివారం భక్తులు తండోపతండాలుగా వచ్చి మొక్కుబడులు చెల్లించుకొంటూ ఉంటారు. ఇక్కడ సత్రాలున్నాయి. అన్ని వస్తువులూ దొరకుతాయి ప్రభలు, బండ్లు గట్టుకొనివచ్చి మొక్కుబడులు చెల్లించుకుంటూ ఉంటారు. వివాహ ఉపనయనాదులు నిర్వహించుకుంటూ స్వామి దయకు పాత్రులవుతారు. వ్యాధిగ్రస్తులు, సంతానహీనులు అక్కడనే వుండి ఆలయంచుట్టూ ప్రదక్షిణలు చేసి వారికోర్కెలను సాఫల్యం చేసికొంటూ ఉంటారు. ఇక్కడకు దగ్గరలోనే నంబూరు స్టేషన్ కెదురుగా రేడియో బ్రాడ్ కాస్టింగ్ స్టేషను, హేమలతా టెక్స్‌టైల్సు మిల్లు ఉన్నాయి. [ఇంకా... ]

వంటలు - క్వీన్స్ కేక్స్

కావలసిన వస్తువులు:
వెన్న - 30 గ్రా.
పంచదార పొడి - 50 గ్రా.
గుడ్డు - 1.
పాలు - 15 మి.లీ.
మైదాపిండి - 50 గ్రా.
బేకింగ్ పౌడర్ - 1/4 చెంచా.
ఎండు ద్రాక్ష - 30 గ్రా.
వెనిల్లా ఎస్సెన్స్ - కొన్ని చుక్కలు.

తయారు చేసే విధానం:
ఎండుద్రాక్ష తొడిమలు తీసి, నీళ్ళతో శుభ్రం చేయాలి. తర్వాత ఒక ఉతికిన, శుభ్రమైనబట్టతో తడి లేకుండా తుడవాలి. మైదాను, బేకింగ్ పౌడర్‌ను జల్లించాలి. వెన్నను, పంచదార పొడిని బాగా క్రీమింగ్ చేయాలి. [ఇంకా... ]

అవీ, ఇవీ కొనుక్కొనేటప్పుడు - సోఫా సెట్

ఫర్నీచరు కొనేటప్పుడు చాలామంది చేసే పొరపాటు పైపై మెరుగులు చూసి కొనేయడం. డబ్బు పెట్టి కొనే వస్తువు అందం ఎంత ముఖ్యమో నాణ్యతా అంతే ముఖ్యం. అందుకని నచ్చిన మోడల్ ఎంచుకున్నాక వెంటనే డబ్బు చెల్లించకండి. ముందుగా దాని నాణ్యతా ప్రమాణాలపై దృష్టిపెట్టండి. సోఫా ఈ రోజుల్లో అందరి డ్రాయింగ్ రూముల్లో తప్పనిసరి ఫర్నీచరు అయ్యింది. కాబట్టి అది కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో చూద్దాం.

1. ఎంచుకున్న సోఫా మీద కనీసం పదినిమిషాలు కూర్చోండి. సౌకర్యంగా ఉందీ లేనిదీ తెలుస్తుంది.
2. చేతులు పెట్టుకునే చోట, కింద, వెనక వైపున అంతా సమంగా మెత్తగా ఉందా లేక ఎక్కడైనా గట్టిగా ఫ్రేమ్ తగుల్తుందా గమనించండి.
3. దాని మీద కూర్చొని అటూ ఇటూ కదలండి. కీచుమని ధ్వని రాకుండా ఉంటేనే సరిగా ఉన్నట్లు. [ఇంకా... ]

నీతి కథలు - దొంగ దొరికాడు

అక్బర్ చక్రవర్తి కాలంలో ఒక ముసలావిడ ఉండేది. పాపం ఆవిడకు నా అన్న వాళ్ళు ఎవ్వరూ లేరు. ఒక్కత్తీ వంటరిగా ఉండేది. ఇలా రోజులు గడుస్తుండగా ఒకరోజున ఆవిడకు హజ్ యాత్రకు వెళ్ళాలన్న కోరిక కలిగింది. ఆ సమయంలోనే ఊళ్ళో మరికొందరు కలిసి హజ్ యాత్రకు వెడుతున్నారని ఆవిడకు తెలిసింది. ఇంకేముంది వాళ్ళతో కలిసి యాత్రకు వెడితే బావుంటుందని ఆవిడకు అనిపించింది. సరే వాళ్ళను కలిసి ఇలా తను కూడా యాత్రకు రావాలని అనుకుంటన్నట్టుగా వారితో చెప్పింది. వాళ్ళు సరేనని అన్నారు.

మరి యాత్రకు వెళ్ళాలంటే డబ్బులు కావాలి కదా! అందుకని తన దగ్గర వున్న బంగారు నగలన్నింటిని అమ్మేసింది. నగలు అమ్మగా వచ్చిన డబ్బులో కొంత తన దారి ఖర్చులకు ఉంచుకుంది. మిగిలిన డబ్బులను ఒక సంచిలో వేసి మూట కట్టింది. ఆ సంచిని మైనంతో అతికించేసింది.
[ఇంకా... ]

చిట్కాలు - వంటల తయారికి సంబంధించినవి

1. అన్నం వండుతున్న సమయంలో పాత్రలో నీరు మరగడం ప్రారంభించగానే మంటను బాగా తగ్గించండి. ఒక సారి మరిగిన నీరు అలా మరుగుతూనే ఉండేందుకు పెద్ద మంట అనవసరం. పెద్ద మంటలో వంటకు పట్టే సమయం తగ్గుతున్నది అపోహ మాత్రమే.
2. అప్పడాల్ని నిల్వ చేసేటప్పుడు వాటి మీద కొద్దిగా కారం, ఇంగువ చల్లితే పురుగులు, చీమలు దరిచేరవు
3. అల్లం తడి గుడ్డలో చుట్టి నీళ్ళ కుండ పైన ఉంచితే వారం, పది రోజుల వరకూ తాజాగానే ఉంటుంది.
4. ఆకుకూరలను ఒకటి, రెండు రోజుల కంటే ఎక్కువ రోజులు ఉంచకండి.
5. ఆయిల్ పలుసార్లు వండడం వలన మడ్డిగా తయారయిందా? దాంట్లో ఒక చిన్న బంగాళదుంప స్లయిస్ వేసి ఒక రోజంతా అలా ఉంచండి. ఆ ఆయిల్ మరల ఉపయోగించుకునేందుకు సిద్దం.
6. ఇంట్లో పార్టీ ఏదైనా జరిగి, గాజు పింగాణీ వస్తువులు ఎక్కువగా కడగాల్సి వచ్చినప్పుడు సింక్ లో రెండూ మందపాటి పాత టవల్స్‌ని పరిస్తే ఒకవేళ చేయిజారినా పగలకుండా ఉంటాయి. [ఇంకా... ]

Wednesday, February 18

పెద్దల ఆటలు - బెలూన్ పగలగొట్టే ఆట

ఈ ఆట చాలా సరదాగా ఉంటుంది. దీనికి కావలసిందల్లా బూరలు, దారం మాత్రమే.

పాల్గొనే వారందర్నీ రెండు గ్రూపులుగా విడదీయాలి. ఇప్పుడు మొదటి గ్రూపువారికి బూరని ఊది గట్టిగా ముడివేసి ఒక మూర దారం వదిలి తెంపి కాలిబొటనవేలికి కట్టుకోమనండి. అలా మొదటి గ్రూపు వారందరూ చేసిన తరువాత హాలు మధ్యలో రౌండ్ గీయండి. గీసిన రౌండ్ లో బూర కట్టుకొన్న వారిని ఒకరిని నుంచోమనండి. తరువాత రెండో గ్రూపు వారి నుంచి ఒకరిని వచ్చి నుంచోమనండి. ఆట ఏమిటంటే రౌండు లోనే ఇద్దరూ ఉండాలి. బూరకట్టుకొని ఉన్నవారు బెలూనును కింద ఆనించి తీస్తూ ఉండాలి. [ఇంకా... ]

జానపద గీతాలు - చీరల్ కావలెనా

చీరెల్ కావలెనా రవికల్ కావలెనా
నీకేమి కావలెనే పొద్దుటూరి సంతలోనా

చీరల్ నా కొద్దురో రవికల్ నా కొద్దురో
నీవే నీవే నీవే కావాలిరో రంగమ్మత్త కొడుకా

డావుల్ కావలెనా ఆరం కావలెనా
నీకేం కావలెనే పులివెందుల సంతలోనా

డావుల్ నాకొద్దురో ఆరం నాకొద్దురో
నీవే నీవే నీవే కావాలిరో రంగమ్మత్త కొడుకా [ఇంకా... ]

నీతి కథలు - మోసం చేసిన మోసం

ఒక పిల్లల కోడి, తన చిట్టి పొట్టి కోడి పిల్లలను వెంట బెట్టుకొని చెత్తకుప్పల మీద తిరుగుతూ పురుగులను ఏరుకొని తింటూ వుంది. కోడిని, కోడిపిల్లలను చూడగానే, ఆ పక్కనే కలుగులో వున్న పాముకు నోరూరింది. ఎలాగైనా ఓ కోడి పిల్లను మింగాలనుకుంది. తల్లి కోడి చూస్తూ వుండగా, పిల్ల కోడిని పట్టుకుంటే, తల్లి కోడి వాడి ముక్కుతో తన కళ్ళు పొడిచేస్తుందని పాముకు తెలుసు!

అందు కోసం ఏదైనా ఎత్తు వేయాలని అనుకొని, చచ్చిన దానిలాగ ఓ పక్కగా పడుకుంది. పాము! పాము అంటే ఇంకా భయం ఎరుగని కోడి పిల్లలు ఇటూ అటూ తిరుగుతూ, ఆ పాము మీద నుంచి ఈ పక్కకూ, ఆ పక్కకూ గెంతుతూ వున్నా పాము కదలకుండా, మెదలకుండా పడుకునే వుంది. [ఇంకా... ]

ఇతిహాసాలు - శుక్రాచార్యుని జన్మవృతాంతం

శుసనుడనే ముని ఒకసారి కుబేరుని సంపదను దోచుకుపోతాడు. అప్పుడు కుబేరుడు లబోదిబోమని మొత్తుకుంటూ వెళ్ళి శివుని దగ్గర మొరపెట్టుకొన్నాడు అతడి మొరను ఆలకించిన శివుడు కుబేరునికి అభయహస్తమిచ్చి, శుశనుడి కోసం గాలిస్తాడు. విషయం అర్ధం చేసుకొన్న శుసనుడు సరాశరి ఈశ్వరుని శూలం మీదనే కూర్చున్నాడు. అది గమనించిన గరళకంఠుడు తన శూలాన్ని కిందకు వంచుతాడు. అలా వంగిన శూలమే 'పినాకి ' అయినది. [ఇంకా... ]

ఆహార పోషణ సూచిక - ఆరోగ్యానికి మేలుచేసే బాక్టీరియా

ప్రోబయోటిక్స్ అంటే
మనిషి ఆరోగ్యాన్నిచ్చే సజీవ బాక్టీరియాలో సాక్రోమైటిక్స్ అని ఎఫ్ఎఒ నిర్వచనం చెప్పింది. ఈ కోవకు చెందిన బాక్టీరియాలో సాక్రోమైసస్ బౌలార్డ్, లాక్టో బాసిల్లన్ లేదా బైఫిడో బాక్టీరియం వగైరాలున్నాయి.

వీటి ఉపయోగం:
1. కొలోన్ (పెద్దపేగు లో పిహెచ్ స్థాయిని తగ్గించి హానికర బాక్టీరియాను నాశనం అయ్యేటట్లు చేస్తాయి.
2. వ్యాధినిరోధక వ్యవస్థను బలపరచి, పాధీజెనిక్ బాక్టీరియాకు నిరోధకశక్తిని అభివృద్ది చేస్తాయి. మాక్రోఫేగస్, లింఫోసైట్‌ల చర్యలను పెంచుతాయి. ఇమ్యునోగ్లోబులిన్స్ కారకాలను వృద్ధిచేస్తాయి. దీనివల్ల వ్యాధినిరోధక వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.
3. ఇంఫెక్షన్లను తగ్గిస్తుంది. ముఖ్యంగా వెజినోసిస్ ( మహిళల్లో వచ్చే ఈస్ట్ ఇన్ ఫెక్షన్లు ) వంటి వాటిని తగ్గిస్తుంది. [ఇంకా... ]

Tuesday, February 17

ఆధ్యాత్మికం - శ్రీ సాయి నీళ్లతో దీపాలను వెలిగించుట

గోదావరీ నదీ పరీవాహక ప్రాంతమైన అహమద్ నగర్ జిల్లాలో ఒక కుగ్రామమైన షిరిడీలో ఒక పాడుబడ్ద మశీదులో స్థిర నివాసమేర్పరుచుకున్న శ్రీ నిత్యం తన మశీదులో రాత్రిళ్ళు దీపాలను వెలిగించే వారు. దీపాలని వెలిగించేందుకు అవసరమయిన నూనెను ఆ ఊరులోని షావుకార్ల వద్ద నుండి యాచించి తెచ్చేవారు. మానవుని హృదయంలో జన్మాంతరాలుగా పేరుకొనిపోయి వున్న అజ్ఞానపు చీకట్లను పటాపంచలు చేసి, వారికి సన్మార్గం చూపేందుకే ఈ దీపాలను వెలిగిస్తున్నానని శ్రీ సాయి తన భక్తులతో తరచుగా చెప్పేవారు. ఆ గ్రామంలో బాలా భాటే అనే ఒక ఆసామికి శ్రీ సాయి యొక్క పద్ధతులు నచ్చేవి కావు, శ్రీ సాయి ఒక పిచ్చి ఫకీరని, చిన్నపాటి క్షుద్ర విద్యలను నేర్చుకొని ప్రజలను మోసం చేస్తున్నాడని భాటే ఆ ఊరి ప్రజలకు చేప్పేవాడు. పైగా మహ్మదీయుడైన సాయి మశీదులో హిందువుల ఆచార పద్ధతిలో దీపాలను వెలిగించడం హిందువుల మత విశ్వాసాలను మంటగలపడమేనని అందరినీ రెచ్చగొట్టసాగాడు. [ఇంకా... ]

ఎందుకు, ఏమిటి, ఎలా ... - చెట్టు నీడ చల్లనేల

గోడనీడ వేడిగా ఉంటుంది. కానీ చేట్టు నీడ చల్లగా ఉంటుంది. ఈ తేడా ఏమిటి. ఎందువల్ల ఇలా జరుగుతుంది అనేది తెలుసుకుందామా!

గోడ ఓ నిర్జీవ ఘన పదార్థం. దృశ్యకాంతి ఏమాత్రం గోడలోంచి దూసుకుపోదు. కాబట్టి గోడకు ఇవతల వైపు నీడ ఏర్పడుతుంది. అయితే సూర్యకాంతిలో దృశ్యకాంతితో పాటు, అధిక శక్తిమంతమైన అతినీల లోహిత కాంతి, తక్కువ శక్తిమంతమైనదే అయినా ఉష్ణభాగం అధికంగా ఉన్న పరారుణ కాంతి కూడా ఉంటాయి. గోడ మీద పడిన కాంతిలో కొంత భాగం ఆవలి వైపున పరానవర్తనం చెందినా, మిగతా కాంతిని గోడ పదార్థం శోషించుకుంటుంది. ఇలా కాంతిశక్తి గోడలో ఉష్ణశక్తిగా మారి గోడస్ నుంచి అన్ని వైపులకు ఉష్ణవాహనం ద్వారా ప్రసరిస్తుంది. అందులో కొంత భాగం గోడకు ఇవతలివైపు కూడా వస్తుంది. [ఇంకా... ]

వంటలు - మ్యాంగో స్క్వాష్

కావలసిన వస్తువులు:
మామిడిపండ్లు గుజ్జు - 3 కప్పులు.
సిట్రిక్ ఆసిడ్ - 15 గ్రా.
పొటాషియం మెటాబైసుల్ఫేట్ - 1/2 స్పూను.
పంచదార - 750 గ్రా.
నీరు - 4.5 కప్పులు.

తయారు చేసే విధానం:
ముందుగా మామిడి పండ్ల గుజ్జు తీసి, పంచదార, నీరు పోసి చక్కగా ఉడికించాలి. ఉడికిన గుజ్జు దించి చల్లార్చి సిట్రిక్ ఆసిడ్ పొడిచేసి పొటాషియం మెటాబైసల్ఫేట్ వేడినీళ్ళలో కలిపి గుజ్జులో కలపాలి. మరల గుజ్జును పల్చగా చేసి 5 నిమిషాలు ఉడికించాలి. [ఇంకా... ]

పిల్లల పాటలు - చిన్నోడమ్మా చిన్నోడు

చిన్నోడమ్మా చిన్నోడు
చిన్ని సైకిలు కొన్నాడు

రాళ్ళ మీద తిప్పాడు
కాలు జారి పడ్డాడు

ఆసుపత్రిలో చేరాడు
మందు బిళ్ళలు మింగాడు

మళ్ళీ ఇంటికి వచ్చాడు
మంచం ఎక్కి పన్నాడు [ఇంకా... ]

పుణ్య క్షేత్రాలు - శ్రీకూర్మం

శ్రీకాకుళంకి దగ్గరలోనే శ్రీ కూర్మనాధస్వామి ఆలయం దర్శించదగినది. ఇందుకు తోడు శ్రీ రామానుజాచార్యులు, శ్రీ వరదరాజస్వామి, శ్రీ మధ్వాచార్యులు, శ్రీ కోదండరామస్వామి ఆలయాలు కూడా ఉన్నాయి. అయితే శ్రీ కూర్మవతారము విష్ణ్వంశదశావతారాల్లో ఒకటయి మొదటి ఇది శివక్షేత్రంగా వెలసిఉన్నా శ్రీరామానునాజాచార్యులు వారివలన ఇదివైష్ణవక్షేత్రంగాను, దివ్యప్రదేశంగాను మలచారని చెప్తున్నారు. ఆలయం అతి ప్రాచీనమయినది. చుట్టూ మండపాదుల స్తంభాలమీది శిల్ప చాతుర్యం వేనోళ్ళకొనియాడ దగినది. గోపురాలమీద కూడ విశాలమైన స్ధలమున్నది. ఇక్కడ అనేక పుష్కరిణిలు కూడా వున్నాయి. [ఇంకా... ]

Monday, February 9

భరతమాత బిడ్డలు - మోక్షగుండం విశ్వేశ్వరాయ

పేరు : మోక్షగుండం విశ్వేశ్వరాయ (మోక్షగుండం విశ్వేశ్వరయ్య కాదు).
తండ్రి పేరు : శ్రీ శ్రీనివాసశాస్త్రి.
తల్లి పేరు : వెంకాయమ్మ.
పుట్టిన తేది : 1816 వ సంవత్సరంలో పుట్టారు.
పుట్టిన ప్రదేశం : ముద్దినేహళ్ళి.
చదివిన ప్రదేశం : చిక్ బల్లాపూర్ , బెంగుళూరులో సెంట్రల్ కాలేజీ.
చదువు : ఇంజనీరింగు.
గొప్పదనం : ఆయన మైసూరు రాష్ట్రప్రగతిలో మరపురాని పాత్ర వహించారు. కృష్ణరాజసాగర్ డాం నిర్మాణం, మైసూరు యూనివర్శిటీ స్థాపన, మైసూరు బ్యాంకు స్థాపన, ఆయన కృషివల్లనే జరిగాయి.
స్వర్గస్తుడైన తేది : 14 - 4 -1962.

మోక్షగుండం విశ్వేశ్వరాయ 1816 లో బెంగుళూరు దగ్గర్లో ఉన్న ముద్దినేహళ్ళి అనే గ్రామంలో ఒక పేద కుటుంబంలో పుట్టారు. మోక్షగుండం అనే గ్రామం కర్నూలు జిల్లాలో ఉంది. దాదాపు మూడు వందల సంవత్సరాల క్రితం వారి పూర్వికులు మైసూరు ప్రాంతం వలసపోవటం జరిగింది. [ఇంకా... ]

ఎందుకు, ఏమిటి, ఎలా ... - మైక్రోవేవ్‌ ఓవెన్

వంటలో సమయాన్ని, ఇంధనాన్ని, ఖర్చును ఆదాచేసే మైక్రోవవ్‌ను ఆధునిక సాధనంగా చెప్పవచ్చు. మైక్రోవేవ్ మీద వంట వండుకోవడమో, లేక మైక్రోవేవ్ మీద వంటను చేసుకుంటే బాగుండును అనుకోవడం తప్ప దాని గురించి మరేమీ తెలియకపోవచ్చు. మైక్రోవేవ్ ఓవెన్ ప్రయోజనాలు, సాంకేతిక వివరాలు ఇవి.

మైక్రోవేవ్ ఓవెన్‌లో ముఖ్యంగా వాట్‌ల వ్యవస్థ, నియంత్రణ ప్యానెల్, పవర్ లెవల్స్ ఉంటాయి. 350 ఆపైన వాట్‌లను ఉపయోగించి వీటిని తయారుచేస్తారు. అయితే చాలా వరకు ప్రామాణికంగా 700 వాట్‌లను ఉపయోగిస్తారు. అలాగే చాలా వరకు టి.విల్లో వచ్చే వంట కార్యక్రమాలు, పత్రికలు, మ్యాగజైన్లలో రాసే ప్రత్యేక వంటకాలను ఎక్కువగా ఈ 700 వాట్‌ల ఓవెన్ లోనే ప్రయోగించి చేసి చూస్తారు. మార్కెట్‌లో 700 వాట్‌ల ఓవెన్‌ను కొన్నవారికి వంటల పుస్తకాన్ని బహుమతిగా కూడా ఇస్తుంటారు. ఎవరైనా 700 వాట్‌లకు పైన ఉన్న ఓవెన్ ఎంచుకోవడం దూరదృష్టితో చేసే పని. లేదా చాలా తక్కువ వంట చేసే వారు మాత్రం తమకు తగ్గ వ్యాట్‌తో ఓవెన్‌ను ఎంపికచేసుకోవచ్చు. [ఇంకా... ]

వంటలు - మామిడికాయ తురుం పచ్చడి

కావలసిన వస్తువులు:
మామిడికాయ - 1(చెక్కు తీసి తురమాలి).
వేయించిన ఆవాలు - 1 చెంచా.
మెంతులు - 1 చెంచా.
కారం - 2 లేక 3 చెంచాలు.
ఇంగువ - తగినంత.
ఉప్పు, పసుపు - తగినంత.
నూనె - 2 గరిటెలు.

తయారు చేసే విధానం :
అవాలు, మెంతులు వేయించి పొడిచేసుకోవాలి. మూకుడులో నూనె వేడి చేసి అందులో ఆవాలు, ఇంగువ పోపు వేసి దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుని కారం, మెంతులు, ఆవాల పొడి వేసి పెట్టుకోవాలి. అదే మూకుడులో మరికాస్త నూనె వేసి మామిడి తురుము, పసుపు, ఉప్పు, వేసి మగ్గనివ్వాలి. [ఇంకా... ]

పిల్లల ఆటలు - టమోటా రేసు

ఎంతమంది ఆడవచ్చు : ఎంతమందైనా.

ఆడే స్థలం : గదిలో, ఆరుబయట ఆడవచ్చు.

కావలసిన వస్తువులు : "టమోటా" లేదా "బంగాళదుంప" లేదా "కోడిగుడ్డు" లేదా "బంతి".

ఆటగాళ్ల వయస్సు : 3 సం|| రాల నుండి.


A) పిల్లలు ఎక్కువ మంది వుంటే ఈ ఆట రక్తి కడుతుంది. పిల్లలని నేల మీద ఒకరి పక్కన మరొకర్ని కూర్చోమనాలి .వాళ్ళకి పోటీ టీంగా అదే సంఖ్య గల పిల్లల్ని వాళ్ళకి ఎదురుగా అదే పద్దతిలో కూర్చోమనాలి. అలా కూర్చున్న రెండు వరుసల్లోని పిల్లల్లో మొదట చెరో టమోటా ఇవ్వాలి. స్టార్ట్ చెప్పగానే పిల్లలు కుడినించి ఎడమకి ఆ టమోటా మారుతూ చివరకి ఆఖరిలో కూర్చున్న పిల్ల చేతికి చేరుతుంది. [ఇంకా... ]

పండుగలు - ఏరువాక పూర్ణిమ

ఇది రైతు సోదరులకు అత్యంత ప్రియమైన పండుగ. ఈ "ఏరువాక పూర్ణిమ"ను రైతులు ప్రతి సంవత్సరం 'జ్యేష్ఠ శుద్ద పూర్ణిమ ' నాడు తమపొలలాలలో దుక్కు దున్ని ఎంతో వైభవంగా దీనిని ఆచరించెదరు. ఈదినమందు మరో ముఖ్య విషయం, వార్కి అను నిత్యము వ్యవసాయ పనులలోను వ్యవసాయ అభివృద్దికి చేదోడు వాదోడుగా ఉంటూ, కాలి అందియలు ఘల్లు ఘల్లుమని గంటలు మ్రొగించుకుంటూ "ధాన్యలక్ష్మిని" ఇంటికి తోడ్కొని వచ్చే, వాటి మెడలో కొత్త గంటలు, పలురంగుల పూసలు, పూలతో నిండిన దిష్టితాళ్ళతో వాటిని అలంకరించి, పిదప మంగళవాద్యములతో పొలమునకు తోడ్కొని పోయి అచ్చట నాగలిని, ఈ బసవన్నలను ధూపదీపనైవేద్యములతో పూజించి అనంతరము భూమిని దుక్కిదున్ని "ఏరువాక " ప్రారంభించే శుభదినము 'అన్నదాతలకు '. అలా ఆచరించటవలన వార్కి చక్కని సిరులపంట పండుతుందని వారు విశ్వాసముగా భావిస్తారు. అది కేవలం వారి విశ్వాసమేకాదు వాస్తవము కూడా! అటువంటి వేడుకలు తిలకించాలి అంటే, ప్రకృతి రమణీయ డృశ్యాలతో పచ్చని పైరులతో పాడిపంటలతో నిండి ఉండే పల్లెసీమలే పట్టుగొమ్మలు. [ఇంకా... ]