Monday, November 3

సంగీతం - మన సంగీతం

"శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం పణి:" అని ఆర్యోక్తి. అనగా గాన రసాన్ని శిశువులు పశువులతో పాటు పాములు కూడా విని ఆనందిస్తాయని అర్థం.

మన పురాణ కాలంలో శ్రీ కృష్ణుడు అద్భుతంగా వేణునాదం ఆలపించేవాడని దానికి గోవులు, గోపికలు, మునులు సైతం తాదాత్మ్యం పొదేవారిని చెబుతారు.అంతే కాదు నారద తుంబురులు, హనుమంతుడు గొప్ప నాదోపాసకులుగా కీర్తి పొందారు. రాజస్థాన్ ఎడారి మరు భూమిలో మిరాబాయి కృష్ణ భక్తి గాగాన ప్రవాహాన్ని ప్రవహింప చేశారు.ఆమె గానాన్ని అక్బర్ చక్రవర్తి సైతం మారువేషంలో వచ్చి వినేవాడని చెబుతూ ఉంటారు. నాదబ్రహ్మను ఉపాసించి ఇహపరాలను సాధించిన మహానీయులు ఎంతో మంది ఉన్నారు. సంగీతం వల్ల వ్యాధులు త్వరగా నయమవుతాయని, పశువులు పాలు ఎక్కువుగా ఇవ్వగల్గుతాయని, పంటలు ఎక్కువుగా పండుతాయని ఆధునిక పరిశోధకుల భావన. [ఇంకా... ]