Friday, October 31

వ్యక్తిత్వ వికాసం - ఏకాగ్రత

"వింటే భారతం వినాలి. తింటే గారెలే తినాల". అనే సామెత మీరు ఎప్పుడైనా విన్నారా? తినటానికి గారెలు ఎంత రుచిగా ఉంటాయో, వినటానికి భారతం అంత బాగా ఉంటుందని దాని భావం. భారతంలో కౌరవులు, పాండవుల కథ ఉన్నది.

ధృతరాష్ట్రుడు పుట్టడమే గుడ్దివాడుగా పుట్టాడు. ఆయనకు నూరుగురు కొడుకులు. వాళ్ళందరినీ కలిపి "కౌరవులు" అంటారు. పాండు రాజుకు అయిదుగురు కొడుకులు. వాళ్ళందరిని కలిపి "పాండవులు" అంటారు. పాండవులలో పెద్దవాడు ధర్మరాజు. మిగిలిన వాళ్ల పేర్లు వరుసగా భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. పాండవులు చిన్నవాళ్లగా ఉన్నప్పుడే వాళ్ల తండ్రి చనిపోయినాడు. అందువల్ల వాళ్ళు కూడ కౌరవులతో కలసి ధృతరాష్ట్రుని వద్దనే పెరుగుతున్నారు. ద్రోణాచార్యుడు అనే అయన వాళ్లకు విలువిద్యను నేర్పుతున్నాడు. విలువిద్య అంటే బాణాలు ఎట్లా వేయాలో నేర్పే విద్య. [ఇంకా... ]