Wednesday, October 29

వ్రతములు - నందికేశ్వర వ్రతము

ఈ వ్రతము చేయాలనుకునే వారు ఈ కథను చదువుకోవాలి.

ఒకనాడు పార్వతి శివుని పాదములు పట్టుచుండగా నతడామె చేతులు కఠినముగ నున్నందున తన పాదములను పట్టవలదనెను. పార్వతి తన చేతులెందుకు కఠినముగ నున్నవో తెలుపవలసినదని యడుగగా హరుడామె పరోపకారము చేయకపోవుటచే నట్టి కాఠిన్యము హస్తములకు వచ్చెననియు, అవి మృదుత్వమునందుటకు నీళ్ళాటిరేవున వేడి నీళ్ళతో వచ్చుపోవువారికి తలంటి నీళ్ళు పోయవలయుననియు చెప్పెను. పార్వతి భర్త ఆఙ్ఞతో అట్లు చేయుచుండగా నొక పేదరాలు వచ్చి, ఆమెతో తలంటినీళ్ళు పోయించుకొని వెల్లుచుండగా ఆమెపై దయ తలచి పార్వతి సంపదనిచ్చెను. నాటి నుండి ఆ పేదరాలు ధనవంతురాలయి గుమ్మం లోకి వచ్చువారికి పని చెప్పుచుండెను. ఆ సంగతి పార్వతికి తెలిసి గర్విష్టురాలగు ఆమె భాగ్యమును తీసివేయుటకు విఘ్నేశ్వరుని పంపగా అతనికామె ఉండ్రాళ్ళ నైవేద్యము పెట్టెను. [ఇంకా... ]