Monday, January 5

పిల్లల ఆటలు - ద్రాక్షాపండు తియ్యానా? పుల్లనా? నాకేం తెలుసు

ఎంతమందికావాలి : 10మంది.
ఆటగాళ్ళ వయస్సు : 7సంవత్సరాల వయస్సు పై ఉండాలి.
ఆడేస్థలం : ఆరుబయట.

ముందుగా ఇద్దరు బాలురు / బాలికలు తమ పేర్లు ఏదైనా పండ్ల పేరు పెట్టుకోవాలి.

ఉదా: ఒకరు ఆపిల్ పండు, ఇంకొకరు దానిమ్మ పండు అని పేరు పెట్టుకోవాలి. తర్వాత ఇద్దరూ చేతులు పైకెత్తి పట్టుకొని ఇంటి టాప్ లా చేసి నిలబడి ఈ ఇద్దరి చేతుల కింద నుంచి నడుస్తారు. ఆపిల్ పండు బాలుడు, దానిమ్మ పండు బాలుడు ఇద్దరూ ఇలా పాట పాడుతారు. "ద్రాక్షా తియ్యనా? పుల్లనా ? నాకేం తెలుసు! నీకేం తెలుసు!! ఇద్దరికి తెలియదు. అందుకు ఆఖరున వచ్చే పిల్లను పట్టుకొని అడుగుదాం" అని చివర వచ్చే వారిని పట్టుకోవాలి. అతన్ని పక్కకు తీసుకెళ్ళి దానిమ్మ కావాలా? ఆపిల్ కావాలా? రెండిటిలో ఏమికావాలి? అని అడగాలి. [ఇంకా... ]