Monday, August 13

వ్రతములు - సంపద శుక్రవారపు వ్రతము

ఒక బ్రాహ్మణునకు ఏడుగురు కొడుకులు గలరు. వారందరకు వివాహములయి భార్యలు కాపురమునకు వచ్చుటచే, వేరింట కాపురములు చేయుచుండిరి. ఒకనాడు ప్రొద్దుట శుక్రవారము మహాలక్ష్మీ సంచారముచేయుచు ఆ బ్రాహ్మణుని కోడండ్ర యిళ్ళకు వెళ్లెను. ఒక కోడలు ప్రొద్దుటనే పిల్లలకు భోజనముపెట్టి తానుగూడ తినుచుండెను.ఇంకొక ఆమె పాచి వాకిలో పేడవేసుకొనుచుండెను. వేరొక కోడలు పాతగుడ్డలను కుట్టుచుండెను. మరొక కోడలు పాచి వాకిలిలో వడ్లు దంపుచుండెను. ఇంకనొక్కకోడలు కటికచీకటియందే తలదువ్వుకొనుచుండెను. [ ఇంకా... ]